breaking news
pre quarters finals
-
Wimbledon 2022: కార్నెట్ సంచలనం
లండన్: వింబుల్డన్ గ్రాండ్స్లామ్ టెన్నిస్లో ఫ్రాన్స్ అన్సీడెడ్ ప్లేయర్ అలైజ్ కార్నెట్ మహిళల సింగిల్స్లో పెను సంచలనం సృష్టించింది. ఫ్రెంచ్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ నంబర్వన్ ఇగా స్వియాటెక్ (పోలండ్)ను మూడో రౌండ్లోనే కంగు తినిపించింది. వరుసగా 37 మ్యాచ్ల్లో ఓటమి ఎరుగని టాప్సీడ్, టోర్నీ హాట్ ఫేవరెట్ జైత్రయాత్రకు ప్రపంచ 37వ ర్యాంకర్ కార్నెట్ బ్రేకులేసింది. శనివారం జరిగిన పోరులో ఆమె 6–4, 6–2తో అలవోక విజయం సాధించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. 2005 నుంచి గ్రాండ్స్లామ్ కెరీర్ను కొనసాగిస్తున్న ఫ్రాన్స్ వెటరన్ స్టార్ 2014లో కూడా ఇలాదే సెరెనా విలియమ్స్కు షాక్ ఇచ్చింది. అప్పటికే 17 గ్రాండ్స్లామ్ టైటిల్స్ నెగ్గిన టాప్సీడ్ సెరెనాను కార్నెట్ మూడో రౌండ్లో ఓడించింది. తాజా సంచలనంపై ఆమె మాట్లాడుతూ సెరెనా మ్యాచే గుర్తుకొచ్చిందని పేర్కొంది. మిగతా మ్యాచ్ల్లో 2018 వింబుల్డన్ చాంపియన్, 15వ సీడ్ కెర్బర్ (జర్మనీ) 4–6, 5–7తో ఎలిస్ మెర్టెన్స్ (బెల్జియం) చేతిలో ఓడగా, నాలుగో సీడ్ బడొసా (స్పెయిన్) 7–5, 7–6 (7/4)తో 25వ సీడ్ క్విటోవా (చెక్ రిపబ్లిక్)పై గెలిచింది. 11వ సీడ్ కొకొ గాఫ్ (అమెరికా)కు 6–7 (4/7), 6–2, 6–1తో 20వ సీడ్ అనిసిమోవా (అమెరికా) చేతిలో చుక్కెదురైంది. 16వ సీడ్ హలెప్ (రొమేనియా) 6–4, 6–1తో మగ్దలిన ఫ్రెచ్ (పోలండ్)పై నెగ్గింది. సెరెనాకు తొలిరౌండ్లోనే ఇంటిదారి చూపించిన హర్మొని టన్ (ఫ్రాన్స్) 6–1, 6–1తో బౌల్టర్ (ఇంగ్లండ్)పై గెలిచి ప్రిక్వార్టర్స్ చేరింది. -
క్వార్టర్ ఫైనల్లో అజరెంకా
న్యూయార్క్: గత ఏడాది రన్నరప్, రెండో సీడ్ విక్టోరియా అజరెంకా (బెలారస్) యూఎస్ ఓపెన్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. మంగళవారం జరిగిన మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో అజరెంకా 4-6, 6-3, 6-4తో 13వ సీడ్ అనా ఇవనోవిచ్ (సెర్బియా)పై విజయం సాధించి హంతుచోవాతో క్వార్టర్ ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో హంతుచోవా (స్లొవేకియా) 6-3, 5-7, 6-2తో అలీసన్ రిస్కీ (అమెరికా)పై, పెనెట్టా (ఇటలీ) 6-2, 7-6 (7/3)తో 21వ సీడ్ సిమోనా హలెప్ (రుమేనియా)పై నెగ్గారు. ఎదురులేని నాదల్ పురుషుల సింగిల్స్ విభాగంలో తన జోరు కొనసాగిస్తూ రెండో సీడ్ రాఫెల్ నాదల్ క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో నాదల్ 6-7 (4/7), 6-4, 6-3, 6-1తో 22వ సీడ్ కోల్ష్రైబర్ (జర్మనీ)పై గెలిచాడు. మరోవైపు రొబ్రెడో చేతిలో ఫెడరర్ ఓడిపోవడంతో యూఎస్ ఓపెన్లో నాదల్, ఫెడరర్ల మధ్య తొలిసారి ముఖాముఖి పోరు చూడాలనుకున్న వారికి నిరాశే ఎదురైంది. ఫెడరర్, నాదల్ ఇప్పటిదాకా కెరీర్లో 31 సార్లు తలపడ్డారు. యాదృచ్ఛికంగా వీరిద్దరికీ ఒక్కసారి కూడా యూఎస్ ఓపెన్లో ఎదురెదురుగా ఆడే పరిస్థితి రాలేదు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్లో డేవిడ్ ఫెరర్ (స్పెయిన్) 7-6 (7/2), 3-6, 7-5, 7-6(7/3)తో టిప్సరెవిచ్ (సెర్బియా)పై; రిచర్డ్ గాస్కే (ఫ్రాన్స్) 6-7 (4/7), 7-6 (7/4), 2-6, 6-7 (9/11), 7-5తో రావ్నిక్ (కెనడా)పై గెలిచారు. ఇక్కడా మూడో రౌండ్లోపే స్వదేశంలో జరుగుతున్న గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లోని పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా నుంచి ఒక్కరు కూడా కనీసం నాలుగో రౌండ్కు చేరుకోలేకపోయారు. బరిలో నిలిచిన చివరి క్రీడాకారుడు టిమ్ స్మీజెక్ (అమెరికా) మూడో రౌండ్లో 4-6, 6-4, 6-0, 3-6, 5-7తో గ్రానోలెర్స్ (స్పెయిన్) చేతిలో ఓడిపోవడంతో అమెరికా కథ ముగిసింది. ఫలితంగా ఈ ఏడాది జరిగిన నాలుగు గ్రాండ్స్లామ్ టోర్నమెంట్లలోనూ పురుషుల సింగిల్స్ విభాగంలో అమెరికా నుంచి ఒక్కరు కూడా నాలుగో రౌండ్కు చేరుకోలేకపోయారు. దివిజ్ జోడి ఓటమి పురుషుల డబుల్స్లో దివిజ్ శరణ్ (భారత్)-యెన్ సున్ లూ (చైనీస్ తైపీ) జోడి మూడో రౌండ్లో ఓడిపోయింది. ఐదో సీడ్ ఐజామ్ ఖురేషీ (పాకిస్థాన్) -రోజర్ (నెదర్లాండ్స్) ద్వయం 7-6 (10/8), 3-6, 6-3తో దివిజ్- సున్ లూ జంటపై నెగ్గింది.