breaking news
pre-2005 currency
-
మిగిలింది ఇక ఎనిమిది రోజులే...
న్యూఢిల్లీ: 2005 సంవత్సరానికి ముందు ముద్రించిన 500, 1000 రూపాయల నోట్లను మార్చుకోవడానికి ఇక 8 రోజులు మాత్రమే మిగిలి ఉంది. కొన్ని భద్రతా కారణాల రీత్యా 2005కు ముందు ఉన్నఈ కరెన్సీ నోట్లను ఉపసంహరించుకోనున్నట్లు గతంలో రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) ప్రకటించింది. ఆయా నోట్లను బ్యాంకుల్లో మార్చుకునేందుకు వీలుగా 13 నెలల గడువు విధించింది. అయితే జనవరి 1 ముగిసిన ఈ గడువున జూన్ 30 వరకు పొడిగించారు. ఈ నెలాఖరు లోపు తమ సమీప బ్రాంచీల్లో మార్చుకోవాలని సూచించింది. ఎవరి దగ్గరైనా అలాంటి నోట్లు ఉంటే దేశవ్యాప్తంగా ఉండే ఏ ప్రభుత్వం బ్యాంకులోనైనా సమర్పించి, దానికి సమానమైన నోట్లను పొందవచ్చని తెలిపింది. వినియోగదారులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, ఇక సదరు నోట్లు చెల్లవని స్పష్టం చేసింది. కాగా విచ్చలవిడిగా చెలామణి అవుతున్న నకిలీ నోట్లను నిరోధించేందుకు రిజర్వు బ్యాంకు ఈ నిబంధన ప్రవేశపెట్టింది. 2005కు ముందు ముద్రించిన నోట్లను సునాయాసంగా గుర్తించవచ్చునని పేర్కొంది. వాటి వెనుకవైపు నోటు ముద్రించిన సంవత్సరం ఉండదని, ఇక ముందు ముద్రించే నోట్లకు కింద సంవత్సరం ఉంటుందని ఆర్బీఐ తెలిపింది. -
ఆ నోట్లు మార్చుకునేందుకు పది రోజులే ఉంది
న్యూఢిల్లీ: కరెన్సీ మార్చుకునేందుకు రిజర్వు బ్యాంకు ఇచ్చిన గడువుదగ్గరకొచ్చింది. మరో పది రోజుల్లోగా ప్రజలు తమ వద్ద ఉన్న 2005కు పూర్వంనాటి రూ.500, రూ.1000 నోట్లను వెంటనే బ్యాంకుల్లో ఇచ్చేసి కొత్త నోట్లు తీసుకోవాల్సి ఉంటుంది. 2005కంటే ముందునాటి రూ.500, రూ.1000 నోట్లను వెంటనే ఆయా బ్యాంకుల్లో ఇచ్చేసి వినియోగదారులు మార్చుకోవాలని ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. గతంలోనే ఈ నిర్ణయాన్ని వెలువరించినా కొన్ని కారణాలవల్ల గడువును రెండుసార్లు పొడిగించారు. జూన్ 30లోగా రిజర్వు బ్యాంకు ఆదేశాలు పాటించాలని చెప్పారు. దీంతో గడువు దగ్గరికొచ్చింది. కొన్ని అంశాల్లో ఇబ్బందులు తలెత్తడంతోపాటు నకిలీ నోట్లు కూడా చెలామణి అవుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ ప్రమాణాల దృష్ట్యా గత నోట్లను తిరిగి బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలని ఆర్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. వాస్తవానికి, నల్లధనం బయటకు రప్పించాలనే ఉద్దేశంతో కూడా దీనిని ప్రధానంగా తెరముందుకు తీసుకొచ్చారు.