-
ప్రతిభకు మారు పేరు ఆ ఊరు
అది ఆదివాసీ గ్రామం. ఆ ఊరికి సర్పంచ్ ఓ మహిళ. అక్కడ రాజకీయాల్లేవు. ఉన్నదంతా జనంలో ఐకమత్యమే. ఊరిలో అవినీతికి తావు లేదు. అభివృద్ధికి చిరునామాగా మారింది. ఊరంతా సస్యశ్యామలంగా ఉంది. జీవవైవిధ్యతకు ప్రతీకగా నిలిచింది. సర్పంచ్ ప్రతిభకు మారుపేరయింది. తెలంగాణ, కుమ్రుం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా, మార్లవాయి గ్రామం. ఆ గ్రామ సర్పంచ్ ప్రతిభ మంగళవారం నాడు (మే, 23వ తేదీ) ఇంటర్నేషనల్ బయో డైవర్సిటీ డే సందర్భంగా ‘తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ’ అవార్డు అందుకున్నారు కనక ప్రతిభ. తన ప్రతిభతో గ్రామాన్ని నందనవనంగా మార్చిన ఆమె సాక్షితో పంచుకున్న విశేషాలివి. ‘‘మహిళా రిజర్వేషన్లో భాగంగా మా పంచాయితీని మహిళలకు కేటాయించారు. చదువుకున్న వాళ్లయితే బాగుంటుందని మా ఊరి వాళ్లందరూ 2019లో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగని నేను ఎక్కువేమీ చదువుకోలేదు. డిగ్రీ మొదటి సంవత్సరంలో ఉండగా పెళ్లయింది. ఊరిని బాగు చేయాలనే సంకల్పం ఉంటే ఈ చదువైనా చాలు. మా ఊరి జనాభా 708, మొత్తం కుటుంబాలు 130. ప్రాథమిక పాఠశాల, ఆశ్రమ పాఠశాల కూడా ఉంది. ఇక అంగన్వాడీ కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, కమ్యూనిటీ భవనం ఉన్నాయి. నేను వచ్చిన తర్వాత 26 మంది మహిళలకు చేతన ఫౌండేషన్ ద్వారా టైలరింగ్లో శిక్షణ ఇప్పించి, ఎస్బీఐ– ఆర్ఎస్ఈటీ సహకారంతో కుట్టు మిషన్లు ఇప్పించాను. వాళ్లకు చేతిలో పని ఉండడానికి ఆశ్రమ పాఠశాల విద్యార్థుల యూనిఫామ్ కుట్టే ఏర్పాటు చేశాం. డ్వాక్రా గ్రూపులు పదకొండున్నాయి. డ్వాక్రా డబ్బుతో కొంతమంది కిరాణా దుకాణాలు పెట్టుకున్నారు. వీథి వీథీ తెలుసు! మా ఊరిలో ప్రతి వీథీ, ప్రతి కుటుంబమూ తెలుసు. బడి వయసు పిల్లలందరినీ బడికి పంపించాలని ఇంటింటికీ వెళ్లి చెబుతుంటాను. అలాగే పదేళ్లలోపు ఆడపిల్లలందరికీ ‘సుకన్య సమృద్ధి యోజన’ పథకం కింద బ్యాంకు ఖాతాలు తెరిపించాను. పంచాయితీలకు కేంద్ర ప్రభుత్వ సహకారం బాగుంది. వీథులన్నీ సిమెంట్ రోడ్లు వచ్చాయి. అన్ని ఇళ్లకూ టాయిలెట్లున్నాయి. కిరోసిన్ దీపం వెలిగించాల్సిన అవసరం లేదు, అన్ని ఇళ్లకూ కరెంట్ ఉంది. వందకు పైగా ఇళ్లలో దీపం పథకం గ్యాస్ సిలిండర్లున్నాయి. చదువుకున్న వాళ్ల కోసం చిన్నపాటి వీథి గ్రంథాలయం కూడా పెట్టాం. అలాగే హరితహారంలో భాగంగా మొక్కలు నాటాం. గ్రామంలో ఏ మూలకెళ్లినా పచ్చదనం పరిఢవిల్లుతోంది. మంచినీటి సౌకర్యం, పరిశుభ్రతలో భాగంగా ఎప్పటికప్పుడు డ్రైనేజీ శుభ్రం చేయించడం, ప్లాస్టిక్ వాడకంలో విచక్షణ, తడిచెత్త– పొడి చెత్త పట్ల అవగాహన వంటివన్నీ జీవవైవిధ్య పురస్కారం ఎంపికకు ప్రమాణాలయ్యాయి. అందరూ ఇంటిపన్ను కడతారు మా ఊరిలో అంతా క్రమశిక్షణతో నడుచుకుంటారు. అందరూ ఇంటి పన్ను కడతారు. అంతకుముందెప్పుడో ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయి. ఎక్కువమందికి మంచి ఇళ్లున్నాయి. కొంతమంది పెంకుటిళ్లలో ఉంటే, ఇప్పటికీ కొంతమంది మట్టికప్పు ఇళ్లలోనే ఉన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు మాత్రం రాలేదు. మా ఊరి వాళ్ల గొప్పమనసు ఏమిటంటే... ఊరి బాగు కోసం ఏ పని చేపట్టినా అంతా కలసి వస్తారు. అందరూ ఇంకుడు గుంతలు తవ్వుకున్నారు. జీవవైవిధ్యత నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి కార్యక్రమాల్లో మొక్కలు నాటడం, వాటిని పరిరక్షించడంలో సంతోషంగా ముందుకు వస్తారు. వీథులకు రెండువైపులా రకరకాల మొక్కలు నాటాం. గిరి వికాస్ పథకం ద్వారా వ్యవసాయానికి 30 బావులు తవ్వించాం. అంతకు ముందు ఇరవై బావులుండేవి. ఊరిలో ఎక్కువమంది వ్యవసాయం చేస్తారు. ఒక్కొక్కరికి పదెకరాలకు తక్కువ లేకుండా భూమి ఉంది. అసలే భూమి లేని వాళ్లు కూడా ఉన్నారు. వాళ్లకు ఉపాధి హామీ పనుల కార్డు ఉంది. పొలాలకు గట్లు, చెరువు పూడిక తీయడం, పొలాల్లోకి వెళ్లడానికి మట్టిరోడ్లు వేయడం వంటి పనులు ఉపాధి హామీలో చేయిస్తాం. ఆకలి, పేదరికం మా ఊరి పొలిమేరలకు కూడా రావు. వ్యవసాయంతోపాటు ఆవులు, గేదెలు, మేకలు, కోళ్లు పెంచుకుంటారు. ప్రతి ఒక్కరూ పని చేస్తారు. సంతోషంగా జీవిస్తారు. ► ఉత్తమ గ్రామ పంచాయితీ 2021 అక్టోబర్ ► ఉత్తమ మహిళా సర్పంచ్ 2021 మార్చి 8 ► జాతీయ స్థాయిలో సంసద్ ఆదర్శ గ్రామీణ యోజనలో ఉత్తమ గ్రామ పంచాయితీ ► పేదరికరహిత, ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనలో మొదటి స్థానం ► బెస్ట్ బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ అవార్డు 2023 మా ఊరికి సర్పంచ్గా నేను తొలి మహిళను. మహిళ అయిన కారణంగా నన్ను తక్కువ చేసి చూడడం మా దగ్గర ఉండదు. అంతా అభిమానంగా ఉంటారు. ఊరందరూ ఒక మాట మీద ఉంటారు కాబట్టి నేను ఇన్ని పనులు చేయగలుగుతున్నాను’’ అని గ్రామ తొలి మహిళగా తన అనుభవాలను వివరించారు ప్రతిభ. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
ప్రతిభా శిక్షణ
‘జనాభాతో పాటు దేశంలో నిరుద్యోగ సమస్య పెరుగుతూనే ఉంది..’ఈ వాక్యం మనం తరచూ వింటున్నాం. చదువుతున్నాం. తిరిగి మన పనుల్లో మనం పడిపోతున్నాం. ప్రతిభ పులిజాల అందరిలా ఆ వాక్యాన్ని వదిలేయలేదు. నిరుద్యోగ సమస్యనే తన ఉద్యోగంగా మలుచుకుంది. ఖాళీగా ఉన్నవారు ఏ పని చేయాలనుకుంటున్నారో ఆ రంగంలో తగు శిక్షణ ఇస్తుంటుంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు కార్డు ఇప్పిస్తుంది. చదువులేనివారికి, ప్రభుత్వ పథకాలపై అవగాహన లేనివారి దగ్గరకు వెళ్లి వాటి గురించి వివరిస్తుంటుంది. అవకాశాలు అందిపుచ్చుకొని మెరుగైన జీవనం పొందేలా సహాయం చేస్తుంటుంది. ఇరవై ఏళ్లుగా దాదాపు డెబ్భై ఐదు వేల మందికి పైగా వారెంచుకున్న రంగంలో నైపుణ్యం పెంచి, శిక్షణ అందించి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ప్రతిభ. తన మొదటి అడుగు నుంచీ ఇప్పటి వరకు సాగించిన పయనం గురించి ఇలా వివరించారు... ‘‘నిన్న ఉదయం రిసీవ్ చేసుకున్న ఓ ఫోన్ కాల్ గురించి చెబుతాను. ‘మేడమ్.. బాగున్నారా! ఏడాది క్రితం నేను మీ ఇంట్లో పనిచేసిన అనితను’ అంటూ పలకరించింది ఓ అమ్మాయి. ఇప్పుడు తను జూబ్లీ హిల్స్లోని ఓ పేరున్న బ్యూటీ స్పాలో మేనేజర్గా విధులు నిర్వర్తిస్తు్తన్నానని చెప్పింది. ఆర్థిక పరిస్థితులు సరిగా లేనికారణంగా ఏడవ తరగతితో చదువు ఆపేసిన అనిత తన తల్లితో కలిసి ఇళ్లలో పనులు చేసేది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగామ్లో చేరి, బ్యుటీషియన్గా పనులు నేర్చుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది. ఇలా జీవితాన్ని మెరుగుపరుచుకున్నవారి గురించి తెలిసినప్పుడల్లా చాలా ఆనందపడుతుంటాను. చదువు లేని వారే కాదు చదువున్నవారు కూడా తమ కెరియర్ను బిల్డ్ చేసుకునే క్రమంలో ఇబ్బందులు పడుతుంటారు. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చదువు తర్వాత సాఫ్ట్వేర్లోనో.. మరేదైనా కంపెనీలోనో విద్యార్హతతో జాబ్లో చేరుతారు. ఆ తర్వాత సరైన నైపుణ్యం లేదని ఆ కంపెనీలు ‘రిజక్ట్’ చేసే పరిస్థితులు ఎదురవుతుంటాయి. అక్కణ్ణుంచి వెనక్కి వచ్చేస్తే జీవితంలో ఇంకా వెనకబాటుకు లోనవుతారు. ఇలాంటి పరిస్థితి నుంచి యువతను తప్పించడానికే ఈ రంగాన్ని ఎంచుకున్నాను. సికింద్రాబాద్లోని తిరుమలగిరిలో మా ఆఫీస్ ఉంది. హైదరాబాద్లో ఏయే ప్రాంతాల్లో స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి కౌన్సెలింగ్ ఇవ్వాలో ముందే నిర్ణయించుకుంటాను. వారంలో అన్ని రోజులూ శిక్షణాకార్యక్రమాల కోసం తిరుగుతూ ఉంటాను. చిన్న చిన్న బస్తీలు మొదలుకొని కాలేజీ క్యాంపస్ల వరకు నా ప్రోగ్రామ్స్ ఉంటాయి. మన దేశంలో చదువు ఉంది. కానీ, వ్యక్తిత్వ వికాసానికి సంబంధించిన సమస్యలే అధికంగా ఉన్నాయి. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతిభ ఆధ్వర్యంలో జరిగిన వర్క్షాప్లో శిక్షణ పొందిన వారికి సర్టిఫికెట్లు ఇస్తున్న దృశ్యం ఇరవై ఏళ్లుగా.. ఉస్మానియా యూనివర్శిటీలో ఇంగ్లిష్ లిటరేచర్లో పీజీ పూర్తి చేశాను. రెండేళ్లు లెక్చరర్గా ఉద్యోగం చేశాను. అప్పుడే అర్ధమైంది చదువుకు కొదవ లేదు, నైపుణ్యాలకు సంబంధించిన లోటు అంతటా ఉందని. అప్పుడే ‘కెరియర్ హైట్స్’పేరుతో కౌన్సెలింగ్ సెంటర్ను ఏర్పాటు చేశాను. ఇక్కడ నుంచే విద్యార్థులకు జాబ్ ప్లేస్మెంట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. అక్కణ్ణుంచి ఆలోచనా విస్తృతి పెరిగింది. కొన్ని ఫార్మా కంపెనీలు, జీడిమెట్ల ప్రాంతంలో ఉండే ఫ్యాక్టరీలకు వెళ్లినప్పుడు అక్కడి యాజమాన్యం పనివాళ్లను వేరే రాష్ట్రాల నుంచి తీసుకురావడం గమనించాను. దాంతో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఉన్న జనాభా గురించి వాకబు చేశాను. పనిలేకుండా ఖాళీగా ఉండేవారి సంఖ్యను బేరీజు వేసుకున్నాను. వారిని కలిసి, సమావేశాలు ఏర్పాటు చేసి, వారికి శిక్షణ ఇచ్చాను. ఫలితంగా అక్కడి కంపెనీలలో ఆ ప్రాంతంలో నివాసం ఉన్నవారికే పని అవకాశాలు పెరిగాయి. గతంలో ఇళ్లలో పనులు చేసుకునేవారు సైతం ఇప్పుడు పేరున్న కంపెనీలలో పనిచేసే స్థాయికి చేరినవారున్నారు. ఇలాగే మెదక్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలలోని గ్రామీణ ప్రాంతాల్లోనూ శిక్షణా కార్యక్రమాలను ఏర్పాటు చేశాను. ప్రభుత్వంతో కలిసికట్టుగా.. ప్రపంచంలో మన దేశాన్ని స్కిల్ క్యాపిటల్గా మార్చాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఉంది. స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు అన్ని రంగాలకు అవసరమే. ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచి నిరుద్యోగ యువతకు సరైన పని కల్పించాలన్న లక్ష్యంతో స్కిల్డ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ను ప్రభుత్వమూ నిర్వహిస్తుంది. అయితే వాటి గురించిన అవగాహన ప్రజల్లో లేకపోవడంతో సరైన ఫలితాలు రావడం లేదు. దీంతో ఇప్పుడు స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించి సౌత్ రీజియన్ అడ్వైజర్గా ప్రభుత్వంతో కలిసి వర్క్ చేస్తున్నాను. మీడియా, సినిమా, ఫొటోగ్రఫీ, బ్యూటీ, ఫ్యాషన్ డిజైనింగ్.. ఇలా 14 రంగాలలో స్కిల్ డెవలప్మెంట్కు సంబంధించిన కౌన్సెలింగ్ చేస్తున్నాను. కుటుంబ ప్రోత్సాహం పుట్టి పెరిగింది, చదువుకున్నది హైదరాబాద్లోనే. నాన్న లింగయ్య వైమానిక దళ ఉద్యోగి. అమ్మ ఫణిబాయి. ఇద్దరు అన్నయ్యలు. మా పెంపకంలో ఎక్కడా వివక్ష లేదు. తాతయ్య పోలీస్ డిపార్ట్మెంట్లోనూ, నాన్న ఎయిర్ఫోర్స్లోనూ పనిచేయడంతో స్వీయ క్రమశిక్షణతోపాటు సమాజం పట్ల బాధ్యత కూడా చిన్నతనం నుంచే అలవడింది. మా వారు దినేశ్ డెంటిస్ట్. అత్తింటివారూ బాగా చదువుకున్నవారు కావడంతో నా తపనకు ఎక్కడా ఆంక్షలూ, అడ్డంకులూ లేవు. మనం చేసే పని పదిమందికి ఉపయోగపడాలన్నదే మా కుటుంబం నుంచి వచ్చిన మాట. అదే నన్ను ఎంతోమందిని కలిసేలా, ఎన్నో విషయాలు నేర్చుకునేలా, మరెన్నో విషయాలు నలుగురికి తెలియజేప్పే అవకాశాన్ని ఇచ్చింది. స్వచ్ఛత – శుభ్రత స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కోసం మురికివాడలకు వెళ్లినప్పుడు అక్కడి వాతావరణం, పరిస్థితులు చాలా బాధ కలిగించాయి. స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లైనా.. ఈ టెక్నాలజీ యుగంలోనూ కనీస వసతులు లేకుండా జీవిస్తున్న దుర్భరమైన జీవితాలను చూసినప్పుడు ఇదేనా మనం సాధించిన ప్రగతి అన్న ఆవేదన కలిగింది. స్వచ్ఛభారత్ అంటున్న కేంద్రప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికుల సంక్షేమం గురించి, వారి ఆరోగ్యం గురించి పట్టించుకోవడం లేదని గమనించాను. పారిశుద్ధ్య కార్మికుల్లోనూ వృత్తి నైపుణ్యాలు పెంచడంతో పాటు వారి సంక్షేమం గురించీ ఆలోచించాను. వారికీ శిక్షణ ఇవ్వాలని, ఆరోగ్యంపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నాను. అందుకోసం ముందుగా నేను ట్రెయిన్ కావాలని ‘సఫాయి కర్మచారి’ సర్టిఫికెట్ కోర్సు చేశాను. ఫండ్స్ కోసం 5కె, 10 కె రన్స్ నిర్వహించినా ఫలితం లేకపోయింది. అప్పుడు జీహెచ్ఎంసి కమిషనర్ను కలిసి నా ఆలోచన చెప్పాను. వారి సహకారంతో కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటిగా ‘కర్తవ్య ఫౌండేషన్’ ఏర్పాటు చేసి చందానగర్ ఏరియాలో మూడువందల మందికి శిక్షణ ఇచ్చాం. వారికి నా పనితీరు, నిబద్ధత నచ్చడంతో ఆ తర్వాత ‘సాఫ్ హైదరాబాద్ – షాన్దాన్ హైదరాబాద్’, ‘వాటర్ లీడర్షిప్ కన్జర్వేషన్’లో భాగస్వామిగా పనిచేసే అవకాశం ఇచ్చారు. దేశం మారాలంటూ పథకాలు రూపొందిస్తే ఫలితం ఉండదు ఆయా పథకాల ద్వారా దేశం ప్రగతి పథంలో పయనించాలంటే మార్పు అనేది అట్టడుగు స్థాయి నుంచి మొదలు కావాలి’ అని వివరించారు ప్రతిభ పులిజాల. ఒకవైపు స్కిల్ డెవలప్మెంట్ దిశగా సాగుతున్న శిక్షణాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మరోవైపు మురికివాడల్లో పరిశుభ్రమైన జీవనం కోసం, స్వచ్ఛమైన పరిసరాల కోసం కృషి చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.– నిర్మలారెడ్డిఫొటోలు: అనీల్కుమార్ -
ప్రతిభకు అవధిలేని అవకాశాలు
‘గైట్’ గ్రాడ్యుయేష¯ŒS వేడుకలో డాక్టర్ మోహనరెడ్డి 166 మంది ఎంబీఏ, ఎంటెక్ ఉత్తీర్ణులకు పట్టాలు వెలుగుబంద (రాజానగరం) : భారతదేశంలో ప్రతిభ ఉన్న వారి అవకాశాలకు హద్దులు లేవని సైంట్ వ్యవస్థాపకుడు, నాస్కామ్ పూర్వపు చైర్మ¯ŒS పద్మశ్రీ డాక్టర్ బీవీఆర్ మోహనరెడ్డి అన్నారు. ఆధునిక ఆలోచనలతో యువత నూతన ఒరవడికి నాంది పలుకుతూ మంచి పారిశ్రామికవేత్తలుగా తయారుకావాలన్నారు. స్థానిక గైట్ అటానమస్ కళాశాలలో శుక్రవారం సాయంత్రం నిర్వహించిన గ్రాడ్యుయేష¯ŒS ఉత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడుతూ రానున్న దశాబ్ద కాలంలో రానున్న సుమారు 10 కోట్ల మంది గ్రాడ్యుయేట్లకు ఉద్యోగాలు సాధ్యం కాదుకాబట్టి ఆసక్తి ఉన్న యువత పారిశ్రామికవేత్తలుగా తయారై తమతోపాటు మరో పది మందికి ఉపాధి చూపాలన్నారు. నేటి సమాజంలో ఆధునికతకే అగ్రస్థానం లభిస్తున్న విషయాన్ని దష్టిలో పెట్టుకుని నూతనావిష్కరణలతో అభివృద్ధి వైపు పయనించాలన్నారు. అధ్యక్షత వహించిన జేఎ¯ŒSటీయూకే వీసీ డాక్టర్ వీవీఎస్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు గుణాత్మక విద్యను అందించేందుకు ప్రతి అధ్యాపకుడూ కృషి చేయాలన్నారు. గైట్ కళాశాల ఎండీ కె. శశికిరణ్వర్మ మాట్లాడుతూ తమ కళాశాల అధ్యాపకులు ఐఐటీలో నూతన బోధనా విధానాలపై శిక్షణ పొందారన్నారు. ఈ కార్యక్రమంలో 166 మంది ఎంబీఏ, ఎంటెక్ పట్టభద్రులకు సర్టిఫికెట్లు, బంగారు పతకాలు అందజేశారు. చైతన్య విద్యాసంస్థల సీఈఓ డాక్టర్ డీఎల్ఎ¯ŒS రాజు, ప్రిన్సిపాల్ డాక్టర్ డీవీ రామ్మూర్తి, వైస్ ప్రిన్సిపాల్ పీవీజీకే జగన్నాథరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేష¯Œ్స డాక్టర్ రాజ¯ŒS మాథ్యూస్, డైరెక్టర్లు డాక్టర్ పీఆర్కే రాజు, డాక్టర్ టీవీ ప్రసాద్, జీఎం డాక్టర్ పి.సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఒకే కాన్పులో ఐదుగురికి జన్మనిచ్చిన తల్లి!
హైదరాబాద్ లో బీర్లు కరువు
ఒంటరిగా ఉన్నపుడే మరింత బాగుంటుందంటున్న సానియా.. చిరునవ్వే ఆభరణం(ఫొటోలు)
బాబు, లోకేష్ కు నోటీసులు..?
స్టార్ ప్రొడ్యూసర్ పరువు తీసిన కామెడీ షో.. ఇన్ స్టా పోస్ట్ వైరల్
చిరంజీవి గురించి నేను ఏనాడూ మాట్లాడలేదు: ముద్రగడ
అప్పుడు భాషాలా.. ఇప్పుడు దావూద్ ఇబ్రహీంలా..
ప్రచారంలో దూసుకుపోతున్న జగన్
‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
తప్పక చదవండి
- MI Vs SRH: ఐపీఎల్లో నేడు (మే 6) మరో బిగ్ మ్యాచ్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- ట్రాక్టర్ అదుపు తప్పి..కాలువలోకి దూసుకెళ్లి..
- శ్రీలీలకి తెలుగులో ఛాన్సులు నిల్.. దీంతో ఏకంగా
- Cable Bridge: కేబుల్ బ్రిడ్జిపై పోలీసుల బర్త్ డే వేడుక
- అఖండ మెజార్టీతో గెలిపించండి: సీఎం వైఎస్ జగన్ సతీమణి భారతమ్మ
- గుండె ఘోష విన్నారు..
- ఏ1 చంద్రబాబు, ఏ2 లోకేశ్
- మంచి మాట: నోరు మంచిదైతే...
- జ్వరంతో బాధపడుతున్నారు.. అయినా అదరగొట్టారు: రుతురాజ్
Advertisement