breaking news
pranahitha - chevella project
-
‘ప్రాణహితా’స్త్రం
ప్రాణహిత–చేవెళ్ల... దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు. మహారాష్ట్ర సరిహద్దుల్లో ప్రాణహిత నదిపైన తుమ్మిడిహెట్టి వద్ద ఆనకట్ట నిర్మించి, ఎత్తిపోతల ద్వారా చేవెళ్ల వరకు నీరు అందించాలని ఆయన ఆశించారు. ఈ ప్రక్రియలో ఎల్లంపల్లి ప్రాజెక్టుతో పాటు నదులు, చెరువులు నింపుతూ ప్రాణహిత నీరు చేవెళ్ల వరకు చేరాలి. అయితే 2009 ఎన్నికల తరువాత మళ్లీ గద్దెనెక్కిన వైఎస్ఆర్ హెలీకాప్టర్ ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ప్రాజెక్టు ముందుకు పడలేదు. 2014లో తెలంగాణ ఆవిర్భావ ప్రకటన తరువాత జరిగిన ఎన్నికల్లో ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు ప్రధానాంశమైంది. తాము అధికారంలోకి వస్తే ప్రాజెక్టుకు జాతీయ హోదా తీసుకొస్తామని, ఐదేళ్లలో సాగునీరు, తాగునీరు అందిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తరువాత పరిస్థితి మారింది. ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరుతో రూపు మార్చుకుంది. గోదావరినదిపై కాళేశ్వరం ప్రాజెక్టుగా అవతరించింది. అయితే ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు మాత్రం మాసిపోలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు కూడా ఉమ్మడి జిల్లాలో ఇదే ప్రధానాంశంగా మారుతోంది. సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్: అధికార టీఆర్ఎస్ పార్టీ సాగిస్తున్న ఎన్నికల ప్రచారానికి కౌంటర్గా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది. జిల్లాల పర్యటనల్లో స్థానిక అంశాలను ఫోకస్ చేస్తూ టీఆర్ఎస్కు కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించింది. కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క నేతృత్వంలో కో చైర్పర్సన్ డీకే.అరుణ, స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి నవంబర్ ఒకటో తేదీ నుంచి ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్న విషయం తెలిసిందే. నాలుగురోజులు సాగే ఈ పర్యటనలో ఆదిలాబాద్కు నాలుగేళ్లలో జరిగిన అన్యాయంపైనే ప్రధానంగా దృష్టి సారించి ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు డిజై¯ను మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు రూపొందించడంపై ప్రజలను చైతన్య పరిచాలని నిర్ణయించారు. కమీషన్ల కోసమే డిజైన్లు మార్చి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారని గత కొంతకాలంగా ధ్వజమెత్తుతున్న కాంగ్రెస్ నాయకులు ఇటీవల రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుతో ప్రభుత్వాన్ని తూర్పార పట్టడం ప్రారంభించారు. ‘డాక్టర్ బీఆర్.అంబేద్కర్ ప్రాణహిత–చేవెళ్ల ఎత్తిపోతల పథకం’గా శంకుస్థాపన జరిగిన ఈ ప్రాజెక్టు డిజైన్తో పాటు పేరు కూడా మార్చారని ధ్వజమెత్తారు. భైంసాలో రాహుల్గాంధీ నోట ప్రాణహిత మాట చేవెళ్ల–ప్రాణహిత డిజైన్ మార్చి కాళేశ్వరం నిర్మించడం వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందన్న విషయాన్ని ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయం సాధించారు. కొన్ని నెలల క్రితం బస్సు యాత్ర ద్వారా మంచిర్యాల, కుమురం భీం జిల్లాల్లో పర్యటించిన సమయంలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్క ఇతర నాయకులు ఇదే అంశంపై బహిరంగ సభల్లో ప్రసంగించిన నేతలు తుమ్మిడిహెట్టి వద్ద ప్రతిపాదిత ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించారు. చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు సాకరమైతే ఉమ్మడి ఆదిలాబాద్లోని 2లక్షల ఎకరాలకు గ్రావిటీ ద్వారానే పుష్కలంగా నీరందేదని, కాళేశ్వరం వల్ల అదనంగా ఒక్క ఎకరాకు కూడా నీరందదని తమ ప్రచారంలో వివరించారు. ఈ మేరకు ఈనెల 20న భైంసాకు వచ్చిన రాహుల్గాంధీకి తెలియజేసి, ప్రాణహిత ప్రాజెక్టును నిర్మించకపోవడం వల్ల ఆదిలాబాద్ జిల్లాకు అన్యాయం జరిగిందనే విషయాన్ని చెప్పించారు. అదే సభలో రాహుల్ ‘అంబేద్కర్ అంటే కేసీఆర్కు నచ్చదు. అందుకే కాంగ్రెస్ హయాంలో బాబాసాహెబ్ పేరిట చేపట్టిన ప్రాజెక్టును లేకుండా చేసి, కాళేశ్వరం పేరిట కొత్త ప్రాజెక్టు చేపట్టారని, కేసీఆర్ కుటుంబానికి లబ్ధి జరిగింద’ని ఆరోపణలు చేయించారు. రాహుల్ మాటలు రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీయడంతో నవంబర్ ఒకటి నుంచి ప్రారంభమయ్యే పర్యటనలో కూడా ఇదే అంశాన్ని ప్రధానంగా జనం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు . ప్రచారంలో తుమ్మిడిహెట్టి పర్యటన పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో రాష్ట్ర, జిల్లా నేతలు నవంబర్ 1న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గం నుంచి ప్రచారాన్ని ప్రారంభిస్తున్నారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 2గంటలకు ఇచ్చోడలో రోడ్షో నిర్వహించి, బహిరంగ సభలో పాల్గొంటారు. సాయంత్రం ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూరులో ప్రచారం నిర్వహిస్తారు. 2వ తేదీన జైనూరు, ఆసిఫాబాద్, కాగజ్నగర్లలో ప్రచారం నిర్వహిస్తారు. 3వ తేదీన ఉదయం 8 గంటలకే కాగజ్నగర్ నుంచి తుమ్మిడిహెట్టికి హెలికాప్టర్లో ప్రయాణించి అక్కడే అల్పాహారం చేసి 10 గంటలకు బెల్లంపల్లి తిరుగు ప్రయాణం కానున్నారు. అనంతరం బెల్లంపల్లిలో ప్రచారం జరిపి హైదరాబాద్ వెళ్తారు. 4వ తేదీన చెన్నూరు, మంచిర్యాల నియోజకవర్గాల్లో పర్యటన సాగనుంది. ఈ నాలుగు రోజుల పర్యటనలో తుమ్మిడిహెట్టిని హైలైట్ చేయడం ద్వారా అధికార టీఆర్ఎస్ను ఉమ్మడి జిల్లాలో ఇరుకాటంలో పెట్టాలనేది కాంగ్రెస్ నేతల ప్లాన్. తుమ్మిడిహెట్టి నుంచి వార్ధాకు మారిన ప్రతిపాదన తుమ్మిడిహెట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత–చేవెళ్ల ప్రాజెక్టు బ్యారేజీని కాళేశ్వరానికి తరలించడం వల్ల భూ సేకరణ కోసం వెచ్చించిన మొత్తంతో పాటు అప్పటికే నిర్మాణాలు పూర్తయిన కాలువల వల్ల సుమారు రూ.10వేల కోట్లు వృథా అయ్యాయనేది కాంగ్రెస్ వాదన. ప్రాణహిత నుంచి ఎల్లంపల్లికి గ్రావిటీతో నీరందడంతో పాటు చేవెళ్ల వరకు రూ.38వేల కోట్లతో నీటి సరఫరా జరిగేదని నేతల విమర్శ. వీటన్నింటికన్నా... తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు పూర్తయితే పాత ఆదిలాబాద్ జిల్లాలోని 2లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందే అవకాశం ఉండేదన్న అంశాన్ని ప్రధానంగా ఫోకస్ చేయబోతుంది. ఇదే కాళేశ్వరం వల్ల ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో ఇప్పుడున్న ఆయకట్టు కన్నా ఎకరా అదనంగా రాదని ప్రచారం చేయబోతోంది. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో ప్రాణహిత–చేవెళ్ల మరోసారి ఎన్నికల ప్రచారాస్త్రంగా మారనుంది. కాగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు నీరందించేందుకు ఉద్దేశించిన ప్రాణహిత బ్యారేజీ ప్రతిపాదిత స్థలాన్ని ప్రభుత్వం ఇటీవలనే తుమ్మిడిహెట్టి నుంచి దానికి ఎగువన గల వార్ధా నదిపైకి మార్చడం తెలిసిందే. -
'అసెంబ్లీలో చర్చించిన తర్వాతే సర్కార్ ముందుకెళ్లాలి'
హైదరాబాద్ : అసెంబ్లీలో ప్రాజెక్టులపై చర్చించిన తర్వాతే టీఆర్ఎస్ సర్కార్ వాటి విషయంలో ముందుకెళ్లాలని సీఎల్పీ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ సీఎల్పీ భేటీ ముగిసింది. అసెంబ్లీ కమిటీ హాలులో జరిగిన ఈ భేటీలో నేతలు పలు నిర్ణయాలు తీసుకున్నారు. తక్షణం అసెంబ్లీని సమావేశపరిచి కరువు, రైతుల ఆత్మహత్యల అంశాలను చర్చించాలి ప్రాణహిత - చేవేళ్ల సహా ఇతర ప్రాజెక్టులపై అసెంబ్లీలో చర్చించిన తర్వాతే తెలంగాణ సర్కార్ వాటిపై ముందుకెళ్లాలి ప్రాణహిత - చేవేళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్పును వ్యతిరేకించి ప్రభుత్వాన్ని ఎండగట్టాలని సీఎల్పీ నిర్ణయించింది ఈ ప్రాజెక్టు డిజైన్ అంశంలో సాంకేతిక అంశాలపై లోతుగా వెళ్లకుండా.. రాజకీయంగానే అధికార టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాలని నిర్ణయం పార్టీ ఫిరాయింపుల అంశంపై అసెంబ్లీ స్పీకర్ పై ఒత్తిడి పెంచాలని ఈ భేటీలో కాంగ్రెస్ నేతల బృందం నిర్ణయం తీసుకుంది -
ప్రాణ‘హితం’ ఎలా?
-
ప్రాణ‘హితం’ ఎలా?
ప్రత్యామ్నాయాలపై కేసీఆర్ సుదీర్ఘ సమీక్ష హైదరాబాద్: ‘ప్రాణహిత-చేవెళ్ల’కు జాతీయ హోదా ఇవ్వాలని కేంద్రానికి మరోసారి విజ్ఞప్తి చేసిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం సాయంత్రం ఢిల్లీ నుంచి తిరిగొచ్చిన వెంటనే ఆ ప్రాజెక్టుపై సుదీర్ఘ సమీక్ష జరిపారు. క్యాంపు కార్యాలయంలో రాత్రి 11.30 గంటల వరకు దాదాపు ఆరున్నర గంటల పాటు ఇది కొనసాగింది. నీటి పారుదల మంత్రి టి.హరీశ్రావు, ఢిల్లీ నుంచి వచ్చిన సర్వే సంస్థ వ్యాప్కోస్ చైర్మన్ సహా ఇతర ప్రతినిధులు, రాష్ట్ర అధికారులతో కేసీఆర్ చర్చించారు. ప్రత్యామ్నాయ ప్రాజెక్టు సర్వే నివేదికను వీలైనంత త్వరగా అందజేయాలని కేంద్ర జలవనరుల మంత్రి ఉమాభారతి కోరిన మీదట ముఖ్యమంత్రి ఈ సమావేశాన్ని నిర్వహించినట్లు తెలుస్తోంది. ముంపు ప్రాంతాల సాకుతో ప్రాజెక్టు పాత డిజైన్పై పొరుగున ఉన్న మహారాష్ట్ర అభ్యంతరం తెలుపుతున్న దృష్ట్యా కొత్త ప్రతిపాదనలపై రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఆదిలాబాద్ జిల్లాలో గోదావరిపై తుమ్మిడిహెట్టి బ్యారేజీ నుంచి 116 కిలోమీటర్ల దూరాన ఉన్న ఎల్లంపల్లికి కాకుండా, 110 కిలోమీటర్ల దూరాన ఉన్న కాళేశ్వరం దిగువన మేటిగడ్డకు నీటిని మళ్లించాలని భావిస్తోంది. ఈ మేరకు కొత్త డిజైన్పై సమగ్ర నివేదిక తయారీ బాధ్యతను వ్యాప్కోస్ సంస్థకు కట్టబెట్టింది. ఈ సంస్థ ఇంజనీర్లు 20 రోజులుగా మేటిగడ్డ ప్రాంతం లో నీటి లభ్యత, ప్రవాహ పరిమాణం, పర్యావరణ అనుకూలతలు తదితరాలపై సర్వే చేస్తున్నారు. ఈ నివేదిక రావడానికి మూడు నెలల సమయం పడుతుందని గతంలోనే సర్వే సంస్థ వెల్లడించింది. అయితే శుక్రవారం ఢిల్లీలో సీఎంతో భేటీ సందర్భంగా ప్రత్యామ్నాయ ప్రతిపాదనల నివేదికను తమకు త్వరగా సమర్పించాలని కేంద్ర మంత్రి ఉమాభారతి సూచించారు. దీంతో ముఖ్యమంత్రి హైదరాబాద్కు రాగానే అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసి పనుల పురోగతిపై ఆరా తీశారు. సమావేశ వివరాలు బయటకు తెలియరాకున్నా, వీలైనంత త్వరగా నివేదికను అందజేయాలని సీఎం సూచించిన ట్లు సమాచారం. అయితే తమ కు కనీసం రెండు నెలల సమయం కావాలని వ్యాప్కోస్ ప్రతినిధులు స్పష్టం చేసినట్లు తెలిసింది. జాతీయ హోదా ప్లీజ్ న్యూఢిల్లీ: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతికి రాష్ర్ట ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్రావు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా శుక్రవారం ఉదయం 11 గంటలకు శ్రమశక్తి భవన్లో ఆయన కేంద్ర మంత్రితో భేటీ అయ్యారు. పార్టీ ఎంపీ కవిత, రాష్ర్ట నీటిపారుదల శాఖ సలహాదారుడు విద్యాసాగర్రావు, కేంద్ర జల వనరుల శాఖ సలహాదారుడు వెదిరె శ్రీరాం, ఢిల్లీలో రాష్ర్ట ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు తేజావత్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్శర్మ, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో పోలవరం ప్రాజెక్టు మాదిరిగా తెలంగాణలోనూ ప్రాణహిత -చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించి, త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మిషన్ కాకతీయ పథకం అమలు, దానిప్రయోజనాలను కేసీఆర్ వివరించారు. వరంగల్లో నిర్మించిన మిషన్ కాకతీయ స్తూపం ఆవిష్కరణ కార్యక్రమానికి రావాల్సిందిగా ఉమాభారతిని ఈ సందర్భంగా ఆహ్వానించారు. అలాగే దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు రావాల్సిన రూ. 297 కోట్లను విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు ఏఐబీపీ(ఆక్సిలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రాం) కింద రావాల్సిన పెండింగ్ నిధుల విడుదలకు చర్యలు తీసుకోవాలని కోరారు. అన్ని అంశాలను కేంద్ర మంత్రి సానుకూలంగా విన్నారని ఈ సమావేశం అనంతరం ఎంపీ కవిత మీడియాకు తెలిపారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని కాంక్షించిన వ్యక్తిగా, తెలంగాణలోనూ ఒక ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలన్న ఆకాంక్షతో ఉన్నట్లు ఉమాభారతి చెప్పారన్నారు. పెండింగ్లో ఉన్న ఏఐబీపీ నిధుల విడుదలకు మంత్రి సుముఖత వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు. రాష్ర్టంలో ఓ జాతీయ ప్రాజెక్టు ఇవ్వాలన్న ఆకాంక్షతో కేంద్రం ఉందని, దానికి అనుగుణంగా ప్రాణహిత-చేవెళ్ల లే దా మరేదైనా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రతిపాదనలను రాష్ర్టం తరఫున పంపిస్తామన్నారు. ఏ అంశంలోనైనా పక్క రాష్ట్రాలతో వివాదాలు పెట్టుకోవడం తమకు ఇష్టం లేదని కవిత వ్యాఖ్యానించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణంలోనూ భ విష్యత్తులో మహారాష్ట్రతో ఇబ్బందులు రాకుండా చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు. కాగా, కేసీఆర్ తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనను ముగించుకుని శుక్రవారం మధ్యాహ్నం హైదరాబాద్కు తిరిగివెళ్లారు.