-
జాతీయ విద్యావిధానం అమలు చేయాలి
గన్ఫౌండ్రీ (హైదరాబాద్): జాతీయ విద్యావిధానాన్ని అన్ని విశ్వవిద్యాలయాల్లో అమలు చేయాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం 15వ స్నాతకోత్సవాలను రవీంద్రభారతిలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జాతీయ విద్యావిధానం అమలు చేయడం వల్ల విద్యార్థుల్లో స్వయం ఉపాధి పెంపొందించడంతో పాటు పోటీ ప్రపంచంలో తట్టుకునే శక్తి కలుగుతోందన్నారు. వివిధ అంశాలపై పరిశోధనలు పూర్తి చేసి డాక్టరేట్ పట్టా పొందిన విద్యార్థులను అభినందించారు. తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య మాట్లాడుతూ.. పాశ్చాత్య భాషలు భారతీయ సమాజాన్ని ప్రభావితం చేస్తూ ప్రాంతీయ భాషలను క్షీణింపజేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ ప్రొఫెసర్ టి.కిషన్రావు, రిజిస్ట్రార్ భట్టు రమేశ్లతో పాటు వివిధ రంగాలకు చెందిన సభ్యులు పాల్గొన్నారు. బంగారు పతకాల ప్రదానం కరోనా కారణంగా రెండేళ్లుగా పట్టాల ప్రదానం నిలిచిపోవడంతో గత విద్యార్థులకు కూడా ఈ ఏడాదే పట్టాలను ప్రదానం చేశారు. జస్టిస్ చంద్రయ్య, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, భాషా సాంస్కృతిక శాఖ సంచాలకుడు మామిడి హరి కృష్ణలతో పాటు పలువురు ప్రముఖులు డాక్టరేట్ పట్టాను అందుకున్నారు. తెలుగు విశ్వవిద్యాలయంలో ఎంఫిల్ పూర్తి చేసిన 21 మంది, పీహెచ్డీ పూర్తిచేసిన 73 మంది విద్యార్థులకు బంగారు పతకాలను ప్రదానం చేశారు. పీజీ, డిగ్రీ, డిప్లొమా కోర్సులను పూర్తి చేసిన విద్యార్థులకు పట్టాలను అందజేశారు. జస్టిస్ చంద్రయ్యకు డాక్టరేట్ ప్రదానం చేస్తున్న గవర్నర్ తమిళిసై -
12 మందికి తెలుగు వర్సిటీ ప్రతిభా పురస్కారాలు
నాంపల్లి (హైదరాబాద్): వివిధ రంగాల్లో విశేషంగా కృషి చేసిన 12 మందికి పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ 2018 ఏడాదికి ప్రతిభా పురస్కారాలను ప్రకటించింది. రామకవచం వెంకటేశ్వర్లు (కవిత), ఆచార్య వెలుదండ నిత్యానందరావు (విమర్శ), డి.అనంతయ్య (చిత్రలేఖనం), ఆర్.గంగాధర్ (శిల్పం), ఓలేటి రంగమణి (నృత్యం), డాక్టర్ ఎస్.కె.వెంకటాచార్యులు (సంగీతం), కల్లూరి భాస్కరం (పత్రికారంగం), రావుల వెంకట్రాజం గౌడ్ (నాటకం), కౌళ్ళ తలారి బాలయ్య (జానపద కళారంగం), డాక్టర్ మలుగ అంజయ్య (అవధానం), ఎన్.అరుణ (ఉత్తమ రచయిత్రి), పి.చంద్రశేఖర ఆజాద్ (నవల) పురస్కారాలకు ఎంపికయ్యారు. (చదవండి: జోనల్ సర్దుబాటు తర్వాత కొత్త ఉద్యోగాలు) డిసెంబరులో హైదరాబాదులోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవంలో ఈ పురస్కారాలు ప్రదానం చేస్తామని రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ తెలిపారు. (చదవండి: ఉద్యోగుల కేటాయింపులో ఆప్షన్లు) -
మంచి బతుకునిచ్చే.. బతుకమ్మ
నాంపల్లి(హైదరాబాద్)/సాక్షి, హైదరాబాద్: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో శుక్రవారం బతుకమ్మ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలను రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కలసి బతుకమ్మను ఆడారు. అం తకు ముందు ఎన్టీఆర్ కళామందిరంలో పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ ఉపాధ్యక్షుడు ఆచార్య తంగెడు కిషన్రావు అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సభలో గవర్నర్ ‘అందరికి నమస్కారం’అంటూ ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలుగు ప్రజలకు నవరాత్రి, బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేశారు. మంచి బతుకును ఇచ్చే దేవత బతుకమ్మ అని అభివర్ణించారు. బతుకమ్మ పాటల్లో పదాలపై పరిశోధన జరగాలని, జాగృతి సంస్థ ఇలాంటి ప్రయో గం చేస్తున్నట్లు ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ఆచా ర్య భట్టు రమేష్, విస్తరణల సేవా విభా గం ఇన్చార్జీ రింగు రామ్మూర్తి పాల్గొన్నారు. రాజ్భవన్లోనూ... రాజ్భవన్లోని దర్బార్హాల్లో శుక్రవారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బతుకమ్మ ఆడారు. ఇందులో జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మితో పాటు పలు రంగాల్లోని మహిళలు పాల్గొన్నారు. -
తెలుగులోనే కథా రచయితలు అధికం
ఈ కథల్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలి: కొలకలూరి ఇనాక్ ‘పాతికేళ్ల కథ’ సంకలనాన్ని ఆవిష్కరించిన కా.రా, జంపాల చౌదరి హైదరాబాద్: తెలుగు సాహిత్యంలో ఉన్నంతమంది గొప్ప కథా రచయితలు ఏ భారతీయ భాషలో లేరని, ఆ అదృష్టం తెలుగు వారికే ఉందని పద్మశ్రీ కొలకలూరి ఇనాక్ అన్నారు. మనసు ఫౌండేషన్, కథా సాహితి నిర్వహణలో వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్లు సంపాదకులుగా 155 మంది రచయితల 336 కథల ‘‘పాతికేళ్ల కథ’’ (1990-2014) సంకలనం ఆవిష్కరణ సభ ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్లోని పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ నందమూరి తారక రామారావు కళా మందిరంలో జరిగింది. ప్రముఖ కవి కె.శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సభకు ప్రముఖ కథా రచయిత కాళీపట్నం రామారావు హాజరై సంకలనాన్ని ఆవిష్కరించారు. తొలి ప్రతిని ముఖ్య అతిథిగా హాజరైన తానా అధ్యక్షులు జంపాల చౌదరి స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇనాక్ మాట్లాడుతూ ఇంత పెద్ద గ్రంథం ముద్రించి, అందరిని చదవగలిగేటట్టు చేసిన వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్లను అభినందించారు. ఇన్ని మంచి కథల్లో కొన్నైనా లేకపోతే అన్నైనా అన్ని భారతీయ భాషల్లోకి అనువాదం చేయాలని, తప్పనిసరిగా ఆంగ్లంలోకి అనువాదం చేయించాలని జంపాల చౌదరిని కోరారు. ఇవన్నీ ఆంగ్లంలోకి వస్తే తెలుగులో ఎంతటి గొప్ప రచయితలు ఉన్నారో ప్రపంచానికి తెలుస్తుందని అన్నారు. ఉద్యమాలను గురించి తెలుసుకుని సాహిత్యాన్ని రాసేవారు కొందరైతే.. కొంత జీవితాన్ని, కొంత చదువును రెంటినీ సమన్వయం చేసుకుంటూ రాసేవారు మరికొందరు ఉంటారని అన్నారు. రకరకాల ప్రభావాలతో సాహిత్యాన్ని సృష్టిస్తున్నవారు ఉన్నప్పటికీ.. ప్రభావాలతో సాహిత్యాన్ని సృష్టించే వారికి పరిమితులుంటాయి కానీ సమాజాన్ని చూసి సాహిత్యాన్ని సృష్టించే వారికి పరిమితులు ఉండవని అన్నారు. తానా అధ్యక్షులు జంపాల చౌదరి మాట్లాడుతూ కథల పుస్తకాల ప్రచురణకు పాతికేళ్ల పాటు ఆర్థిక సహాయం చేస్తూ వస్తున్నానని అన్నారు. భవిష్యత్తులోనూ కథల ప్రచురణకు సహాయాన్ని అందజేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ కథా రచయితలు వివినమూర్తి, కేతు విశ్వనాథరెడ్డి, ఆంధ్రజ్యోతి సంపాదకులు కె.శ్రీనివాస్, వీక్షణం సంపాదకులు ఎన్.వే ణుగోపాల్ హాజరై ప్రసంగించారు. మధ్యాహ్నం జరిగిన పాతికేళ్ల కథాసాహితి జ్ఞాపకాల కలబోత ‘అవలోకనం’ పేరుతో నిర్వహించిన సదస్సుకు వాసిరెడ్డి నవీన్ అధ్యక్షత వహించారు. రచయితల పక్షాన మధురాంతకం నరేంద్ర, పెద్దింటి అశోక్కుమార్, కుప్పిలి పద్మ, మహ్మద్ ఖదీర్ బాబు, సభా నిర్వాహకుల పక్షాన నాగళ్ల వెంకట దుర్గాప్రసాద్, చిత్రకారుల పక్షాన శీలా వీర్రాజు, అనువాదకుల పక్షాన ఎం.శ్రీధర్, పాఠకుల పక్షాన కుర్ర జితేంద్రబాబు, అంబటి మురళీకృష్ణ, వర్మ, పుస్తక విక్రేతల పక్షాన నవోదయ సాంబశివరావు, పత్రికల పక్షాన ఆర్.ఎం.ఉమా మహేశ్వర రావు, ముద్రాపకుల పక్షాన పొన్నపల్లి సీత హాజరై తమ అభిప్రాయాలను, అనుభవాలను సదస్సు ద్వారా వ్యక్తీకరించారు. ఈ సదస్సుకు ఎ.కె.ప్రభాకర్ స్వాగతోపన్యాసం చేయగా మనసు ఫౌండేషన్ ప్రతినిధి ఎం.రాయుడు వందన సమర్పణ చేశారు. -
‘చాన్స్’ కోసం ప్రొఫెసర్ల పోటీ
9 వైస్ చాన్స్లర్ పోస్టుల కోసం 450కి పైగా దరఖాస్తులు సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల వైస్చాన్స్లర్(వీసీ) పోస్టుల కోసం పోటీ తీవ్రమైంది. వైస్ చాన్స్లర్ పోస్టు కోసం దరఖాస్తు చేసుకునే ప్రొఫెసర్ల సీనియారిటీ అర్హతను 10 నుంచి 5 ఏళ్లకు తగ్గించడంతో ఆశావహులు పెరిగారు. ప్రొఫెసర్లే కాకుండా ఏదేని పరిశోధనా సంస్థలో ఐదేళ్లు పనిచేసి ఉన్నా, పరిపాలనా రంగంలో పనిచేసి, ఐదేళ్లపాటు పాలన అనుభవం కలిగి ఉన్నావారు కూడా అర్హులేనని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో రాష్ట్రంలోని 9 వర్సిటీలు- ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు వర్సిటీ, అంబేడ్కర్ ఓపెన్ వర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వ విద్యాలయాల వీసీ పోస్టుల కోసం ఇప్పటివరకు ఆఫ్లైన్ 53 మంది, ఆన్లైన్లో 400 మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తు గడువు ఈ నెల 8వ తేదీ వరకు ఉంది. దీంతో మరో 200కుపైగా దరఖాస్తులు వచ్చే అవకాశముందని ఉన్నత విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. వీసీలుగా ఐఏఎస్, ఐపీఎస్లకు అవకాశం? వైస్చాన్స్లర్లుగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను నియమించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. కొన్ని విశ్వ విద్యాలయాలకు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కూడా వైస్చాన్స్లర్లుగా నియమించే అంశాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం వచ్చే దరఖాస్తులను ప్రొసీజర్ ప్రకారం ఒక్కో యూనివర్సిటీకి వీసీ పోస్టు కోసం వచ్చిన దరఖాస్తుల్లో అర్హతలను బ ట్టి ముగ్గురి పేర్లను సర్చ్ కమిటీ ప్రభుత్వానికి సూచిస్తుంది. ఆ సర్చ్ కమిటీలో యూజీసీ నామినీ, యూనివర్సిటీ నామినీతోపాటు విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి కూడా సభ్యులుగా ఉంటారు. దీంతో దరఖాస్తు చేసుకోకపోయినా ప్రభుత్వం సూచించే పేరును కూడా ముగ్గురి పేర్లలో ఒకరిగా చేర్చే అవకాశముంది. ఇందులో ప్రభుత్వం తరఫున రిటైర్డ్, పనిచేస్తున్న ఐఏఎస్, ఐపీఎస్ల పేర్లను ప్రతిపాదించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీలకు రిటైర్డ్ లేదా ప్రస్తుతం పనిచేస్తున్న జూనియర్ ఐపీఎస్ అధికారులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలిసింది. వచ్చే నెల 8 వరకు దరఖాస్తులను స్వీకరించనున్న నేపథ్యంలో ఆ తరువాతే ఏయే యూనివర్సిటీకి ఎవరిని వైస్ చాన్స్లర్గా నియమిస్తారన్నది తేలనుంది. మొత్తానికి జనవరి నెలాఖరుకల్లా వీసీలను నియమించే అవకాశముంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
ప్రిసైడింగ్ అధికారులదే కీలకపాత్ర
తప్పక చదవండి
- RRR రీ-రిలీజ్ ప్రకటన.. స్పెషల్ ఏంటో తెలుసా..?
- 34 ఏళ్లుగా బీజేపీకి కంచుకోట.. శేషన్, రాజేష్ ఖన్నా బలాదూర్!
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- భారత్ సేవల రంగం నెమ్మది
- ఈసారి ఉల్లంఘిస్తే జైలే: ట్రంప్కు కోర్టు హెచ్చరిక
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- అక్రమాలు కో‘కొల్లు’లు
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement