-
కన్నెపల్లిలో వెట్రన్కు సన్నాహాలు
కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులోని కన్నెపల్లి పంపుహౌస్లో మోటార్లకు పరీక్షలు (వెట్రన్) నిర్వహించేందుకు ఇంజనీరింగ్, కాంట్రాక్టు సంస్థ ప్రతినిధులు సన్నాహాలు చేస్తున్నారు. మొదట ఈ నెల 8, ఆ తర్వాత 15, 25 తేదీల్లో వెట్రన్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేసినా సాంకేతిక పరమైన కారణాల వల్ల వాయిదా పడింది. ఆదివారం కన్నెపల్లి సమీపంలోని గోదావరి నుంచి అప్రోచ్ కెనాల్ ద్వారా నీటిని హెడ్ రెగ్యులేటరీలోని మూడు గేట్ల ద్వారా ఫోర్బేలోకి వదిలారు. అక్కడి నుంచి నీరు పంపుల కింద భాగంలోకి చేరుతుంది. ప్రస్తుతం పంపుహౌస్ వద్ద హడావుడి మొదలైంది. వెట్రన్ నిర్వహించే తేదీని మాత్రం అధికారులు వెల్లడించడంలేదు. నీటి స్థాయిలను ఎప్పటికప్పుడు ఈఎన్సీ వెంకటేశ్వర్లు, ఎస్ఈ సుధాకర్రెడ్డి, డీఈఈ సూర్యప్రకాశ్, మెఘా కంపెనీ ప్రతినిధులు సీజీఎం వేణుమాధవ్, పీఎం వినోద్ పర్యవేక్షిస్తున్నారు. -
మేడిగడ్డ పంపుహౌజ్కు భూములివ్వం
అధికారుల వైఖరిపై రైతుల ఆగ్రహం రసాభాసగా సమీక్ష సమావేశం పనుల అడ్డగింత రామగుండం : మేడిగడ్డ పంప్హౌజ్ నిర్మాణానికి భూములివ్వబోమని రామగుండం మండలం గోలివాడ రైతులు అధికారులకు తేల్చిచెప్పారు. మంగళవారం రెవెన్యూ, నీటిపారుదలశాఖ అధికారులు రైతులతో ఏర్పాటు చేసిన రెండో దశ సమావేశం రసాభాసగా మారింది. సర్పంచ్ దబ్బెట రమ్య, ఎంపీటీసీ ధర్ని హైమావతి, కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ సుధాకర్రెడ్డి, ఈఈ బి.విష్ణుప్రసాద్, డీఈ నరేశ్, ఏఈ మురళికృష్ణ, ఆర్ఐ ఖాజామొహినొద్దీన్ తదితరులు పాల్గొన్న సమావేశంలో.. పంప్హౌస్లో భూములు కోల్పోతున్న రైతులు, భూముల్లోని ఇతర ఆస్తుల వివరాలు సర్వే నెంబర్ల ఆధారంగా తహసీల్దార్ శ్రీనివాసరావు సమావేశంలో వెల్లడించారు. సర్వేపై రైతుల అభ్యంతరం, సమావేశం బహిష్కరణ సర్వే అంతా తప్పుల తడకగా ఉందని పలువురు రైతులు ఆరోపించారు. తన భూమిలో ఉన్న బోర్వెల్ వివరాలు జాబితాలో రాలేదని ఒకరు, విస్తీర్ణాన్ని తగ్గించి చూపారని మరోరైతు ఆరోపించారు. స్పందించిన ఆర్డీవో సర్వేయర్తో మాట్లాడించారు. సాంకేతిక సమస్యలతో కొన్ని సర్వేనెంబర్లలో దొర్లిన తప్పులపై క్షేత్రస్థాయిలో పరిశీలించి మళ్లీ నివేదికలు రూపొందిస్తామని చెప్పారు. అయితే ఇప్పటికే ఎల్లంపల్లి ప్రాజెక్టులో పూర్తి వ్యవసాయభూమిని కోల్పోయానని, పంపుహౌజ్లో ఇప్పుడు గుంట భూమికూడా మిగలకుండా కోల్పోతున్నానంటూ ఓ రైతు సహనం కోల్పోయాడు. దీంతో ఆగ్రహించిన తహసీల్దార్ అసభ్యకరంగా మాట్లాడొద్దని, నష్టం వివరాలను తమదృష్టికి తెస్తే న్యాయం చేస్తామని అన్నారు. శృతిమించి మాట్లాడితే సుంకరులతో గెంటేయించాల్సి వస్తుందని హెచ్చరించడంతో రైతులు తీవ్రంగా ఆగ్రహించారు. ఉన్నతాధికారుల మెప్పు కోసం తహసీల్దార్ రైతులను చిన్నచూపు చూస్తున్నారంటూ రైతులు సమావేశాన్ని బహిష్కరించారు. పంపుహౌజ్ ప్రదేశంలో కొనసాగుతున్న సైటాఫీస్ పనులను అడ్డుకున్నారు. పంపుహౌజ్ కోసం గోదావరి ఒడ్డున సమ్మక్క, సారలమ్మ గద్దెల నుంచి మరో సర్వే చేపడుతున్నారని, భూసేకరణ, నిర్మించాల్సిన ప్రదేశాలపై అధికారులు స్పష్టమైన వైఖరి వెల్లడించాలని సమావేశంలో రైతులు కోరారు. స్పందించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఎస్ఈ సుధాకర్రెడ్డి మాట్లాడుతూ.. సుందిళ్ళలో నిర్మించే బ్యారేజితో సమ్మక్క, సారలమ్మ గద్దెల వరకు బ్యాక్ వాటర్ నిలిచి ఉంటుందని, గ్రామ రక్షణ కోసం రెండువైపులా కరకట్ట నిర్మాణానికి సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సమావేశం వాయిదాకే కొందరు రైతుల ప్రయత్నం – అశోక్కుమార్, పెద్దపల్లి ఆర్డీవో సమావేశాన్ని వాయిదా వేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేలా ధరపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేశాం. అసభ్యకరమైన వ్యాఖ్యలతో తహసీల్దార్ ఆగ్రహం వ్యక్తంచేశారే తప్ప ఉద్దేశపూర్వకంగా చేయలేదు. శుక్రవారం మరో సమావేశం నిర్వహిస్తాం. 2013 చట్టం ప్రకారం, లేదా జీవో 123 ప్రకారం పరిహారం చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నాం.
ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
కమలోత్సాహం..
పోలింగ్ సజావుగా జరిగేలా చూడాలి
కమలోత్సాహం..
కమలోత్సాహం..
సీఎం సభతో కాంగ్రెస్లో జోష్..
కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
48 గంటల పాటు సైలెన్స్ పీరియడ్
బీజేపీ గెలుపునకు హిందువులు ఏకం కావాలి
Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
దేశాభివృద్ధిలో వ్యవసాయ రంగం పాత్ర ఎనలేనిది
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఓటింగ్ శాతం తగ్గినా.. ఓట్లు పెరిగాయ్!
- Lok Sabha Election 2024: నాలుగో విడతలోనూ... మహా వార్!
- Lok Sabha Election 2024: మాజీ దంపతుల దంగల్!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కు వ్యతిరేకంగా యాడ్ .. బీజేపీ నేత సీరియస్
- ఐపీఎల్ మధ్యలోనే దుబాయ్ వెళ్లిన సన్రైజర్స్ కెప్టెన్..
- మేనిఫెస్టోకు, విశ్వసనీయతకు అర్థం చెప్పింది మీ బిడ్డే: సీఎం జగన్
- ‘ కృష్ణమ్మ’ మూవీ రివ్యూ
- టీడీపీ అడ్డంగా బుక్కైంది: సజ్జల కీలక వ్యాఖ్యలు
- వివేకా కేసు: సునీత దంపతులకు ఎదురుదెబ్బ
- ఆ బీప్ సౌండ్ వస్తేనే.. మీ ఓటు వేసినట్టు
Advertisement