-
ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ బెర్త్ సొంతం
హిరోషిమా: ఒలింపిక్స్ క్వాలిఫయర్స్ టోర్నీకి భారత మహిళల హాకీ జట్టు అర్హత సాధించింది. హిరోషిమాలో జరుగుతోన్న మహిళల హాకీ సిరీస్ ఫైనల్స్ టోర్నీలో చిలీపై విజయం సాధించి క్వాలిఫయర్స్ బెర్త్ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన సెమీఫైనల్ మ్యాచ్లో భారత్ 4–2 గోల్స్ తేడాతో విజ యం సాధించింది. భారత్ తరపున గుర్జిత్ కౌర్(22, 37వ నిమిషంలో), నవ్నీత్ కౌర్(31వ నిమిషంలో), రాణి రాంపాల్(57వ నిమిషంలో)లు గోల్స్ సాధించగా... చిలీ తరపున కరోలినా గార్సియా(18వ నిమి షంలో), మాన్యుల ఉరోజ్ (43వ నిమిషంలో) చెరో గోల్ చేశారు. ఆట 18వ నిమిషంలో కరోలినా గార్సియా గోల్తో చిలీ ఖాతా తెరిచింది. అయితే షాక్ నుంచి త్వరగానే తేరుకున్న భారత్ 22వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను గోల్ పోస్ట్లోకి నెట్టి గుర్జిత్ కౌర్ స్కోరును సమం చేసింది. తర్వాత మరింత దూకుడును పెంచిన భారత్ ప్రత్యర్థి గోల్ పోస్టుపైకి దాడులను ముమ్మరం చేసింది. ఆట 31వ నిమిషంలో ఫీల్డ్ గోల్ చేసిన నవ్నీత్ కౌర్ భారత్కు 2–1 ఆధిక్యాన్నిచ్చింది. 37వ నిమిషంలో మరో గోల్ సాధించిన గుర్జీత్ కౌర్ భారత్ స్కోర్ను 3–1కు తీసుకెళ్లింది. చిలీ తరపున మాన్యుల ఉరోజ్ 43వ నిమిషంలో గోల్ సాధించి భారత్ ఆధిక్యాన్ని 3–2కు తగ్గించింది. 4వ క్వార్టర్లో భారత్ తరపున గోల్ సాధించిన రాణి రాంపాల్ భారత విజయాన్ని ఖాయం చేసింది. మ్యాచ్లో భారత్ 2 గ్రీన్ కార్డులను పొందగా, చిలీ 1 గ్రీన్ కార్డును పొందింది. మరో సెమీఫైనల్ మ్యాచ్లో ఆతిథ్య జపాన్ 3–1తో పెనాల్టీ షూటౌట్లో రష్యాపై విజయం సాధించి ఫైనల్లో ప్రవేశించింది. నిర్ణీత సమయంలో ఇరుజట్లు ఒక్కో గోల్ చేయడంతో షూటౌట్ అనివార్యమైంది. ఆదివారం భారత్, జపాన్ల మధ్య టైటిల్ పోరు జరగనుంది. -
ప్రొ బాక్సింగ్ బౌట్ బరిలో భారత బాక్సర్ వికాస్
న్యూఢిల్లీ: భారత్లో ప్రొఫెషనల్ బాక్సింగ్కు రంగం సిద్ధమైంది. ఇందులో భాగంగా న్యూఢిల్లీలో ఈనెల 11న ప్రపంచ చాంపియన్షిప్ కాంస్య పతక విజేత వికాస్ క్రిషన్.... నిక్సన్ అబాకా (కెన్యా)తో తలపడనున్నాడు. ప్రపంచ మిలటరీ గేమ్స్లో కాంస్యం సాధించిన నిక్సన్ ప్రస్తుతం ఏపీబీ పోటీల్లో పాల్గొంటున్నాడు. ఆరు రౌండ్ల పాటు జరిగే ఈ బౌట్లో పాల్గొనడం వల్ల... వచ్చే నెలలో వెనిజులాలో జరిగే ఒలింపిక్స్ ఫైనల్ క్వాలిఫయర్స్కు తనకు అర్హత లభిస్తుందని వికాస్ తెలిపాడు. మరోవైపు ఈ బౌట్ పూర్తయిన వెంటనే వికాస్తో పాటు మరో ఎనిమిది మంది భారత బాక్సర్లు రియో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీల కోసం అజర్బైజాన్కు బయలుదేరి వెళ్లనున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement