breaking news
nris in america
-
తానా సభల్లో తన్నులాట.. బండ్ల గణేష్ సీరియస్ రియాక్షన్
అమెరికాలో జరిగిన ఉత్తర అమెరికా తెలుగు సంఘం Telugu Association of North america (TANA, తానా) సభల్లో తెలుగు తమ్ముళ్లు తన్నుకున్నారు. తరని పరుచూరి, సతీష్ వేమన వర్గాలు చొక్కాలు పట్టుకుని మరీ కొట్టుకున్నారు. రెండుగా చీలిపోయిన టీడీపీ ఎన్నారై సభ్యులు పిడి గుద్దులు గుద్దుకున్నారు. టీడీపీ ఎన్నారై అధక్షుడు కోమటి జయరాం సమక్షంలోనే ఈ కొట్లాట జరిగింది. ఇక, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఇక, ఈ ఘటనపై టాలీవుడ్ నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. ఈ క్రమంలో టీడీపీ లీడర్లపై ఫుల్ సీరియస్ అయ్యారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన బండ్ల గణేష్.. ‘తానా పరువు తీస్తున్నారు కదా దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పడ్డ కష్టాన్ని గంగలో కలిపారు నీచుల్లారా.. సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తానా పరువు తీస్తున్నారు కదా దాని నిర్మించడానికి ఎంతోమంది మన జాతి పెద్దలు పట్టా కష్టాన్ని గంగలో కలిపారు నిచుల్లారా 😡 https://t.co/R06P8Gq7bK — BANDLA GANESH. (@ganeshbandla) July 9, 2023 సిగ్గు లేదా మీకు జీవితంలో బుద్ధి రాదు మీ బతుకులు చెడ 😡😡 https://t.co/R06P8Gq7bK — BANDLA GANESH. (@ganeshbandla) July 9, 2023 చదవండి: US : ఇదెక్కడి ప్రకోపం, అమెరికాలో ఎందుకీ తెలుగు ప్రతాపం? తానా సభల్లో తన్నుకున్న 'తెలుగు' తమ్ముళ్లు అమెరికాలో బాలయ్య ఫ్యాన్స్ వర్సెస్ పవన్ ఫ్యాన్స్.. -
అమెరికా ప్రభుత్వంతో మాట్లాడండి
- భారతీయులపై జరుగుతున్న దాడులపై ప్రధానికి సీఎం లేఖ హైదరాబాద్: అమెరికాలో నివసిస్తున్న ప్రవాస భారతీయుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని, అమెరికా ప్రభుత్వంతో ఈ విషయంపై మాట్లాడాలని తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు.. ప్రధాని నరేంద్ర మోదీని కోరారు. కేసీఆర్ ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాశారు. అమెరికాలో ఇటీవల వరుసగా భారతీయులపై దాడులు జరగడం దురదృష్టకరమని కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రవాస భారతీయుల బంధువులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. భారతీయుల భద్రత విషయంపై అమెరికా ప్రభుత్వంతో మాట్లాడాలని ప్రధాని మోదీని కోరారు. అమెరికాలో పరిస్థితులు త్వరలో చక్కదిద్దుకుంటాయని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్కు చెందిన ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ ఇటీవల అమెరికాలోని కాన్సాస్లో హత్యకు గురైన సంగతి తెలిసిందే. శ్వేతజాతి దుండగుడు జాతివివక్షతో ఆయనపై కాల్పులు జరిపాడు. ఈ విషాదాన్ని మరచిపోకముందే అమెరికాలో ఓ గుర్తు తెలియని దుండగుడు గుజరాత్కు చెందిన హర్నీష్ పటేల్ అనే వ్యాపారవేత్తను ఆయన ఇంటి బయటే కాల్చిచంపాడు. మరికొందరు భారతీయులపైనా దాడులు జరిగాయి.