breaking news
no arrest
-
పులివెందుల పోలీసులకు హైకోర్టులో చుక్కెదురు
సాక్షి, అమరావతి: పులివెందుల పోలీసులకు ఏపీ హైకోర్టులో చుక్కెదురైంది. జెడ్పీటీసీ ఉప ఎన్నిక వేళ.. వైఎస్సార్సీపీ నేతలపై నమోదైన కేసుల్లో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారంలో తొందరపాటు చర్యలు వద్దంటూ సోమవారం కోర్టు పోలీసులకు స్పష్టం చేసింది.పులివెందుల ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ నేతలపై టీడీపీ గూండాలు బరితెగించి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని ఖండిస్తూ ఈ నెల 6వ తేదీన వైఎస్సార్సీపీ నేతలు ర్యాలీ నిర్వహించారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించి ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి సహా 150 మందిపై పోలీసులు కేసు పెట్టారు. పోలీసుల దాష్టీకంపై వైఎస్సార్సీపీ నేతల హైకోర్టుకు ఆశ్రయించారు. ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు.. తొందరపాటు చర్యలు వద్దని, ఎవ్వరినీ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. ఇదిలా ఉంటే.. పులివెందులలో అధికార పార్టీ టీడీపీకి తొత్తులుగా పోలీసులు వ్యవహరిస్తున్నారని, దాడులకు పాల్పడిన వాళ్లను వదిలేసి గాయపడ్డ వాళ్లపైనే కేసులు కడుతున్నారంటూ వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
వీఆర్లో ఉన్న ఎస్సైపై విచారణ
ఏలూరు (సెంట్రల్): ఇప్పటికే వీఆర్లో ఉన్న ఎస్సై సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేసి కేసు నమోదు చేయకపోవడంపై జిల్లా ఎస్సీ విచారణకు ఆదేశించారు. విధుల్లో అలసత్వంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల జరిగిన సమీక్షలో పెదపాడు ఎస్సైను ఎస్పీ భాస్కర్భూషణ్ వీఆర్లో పెట్టారు. నాలుగు రోజు క్రితం జిల్లా సరిహద్దులోని అప్పనవీడులోని ఓ ఇంట్లో కొందరు నేతలు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆ ఇంటినే పేకాట స్థావరంగా మార్చేశారు. విషయం తెలుసుకున్న పెదపాడు ఎస్సై నలుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డుతో కలిసి దాడి చేసినట్టు సమాచారం. అయితే పేకాటలో పట్టుబడిన వారిని పోలీస్స్టేçÙ¯ŒSలో అప్పగించకుం డా స్వాధీనం చేసుకున్న సుమారు రూ.2 లక్షల నగదు తీసుకుని వెళ్లినట్టు ఎస్పీకి తెలియడంతో ఎస్బీ అధికారులతో విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తెలితే పెదపాడు ఎస్సైను సస్పెండ్ చేస్తామని ఎస్పీ తెలిపారు.