breaking news
New prepaid pack
-
ఆదివారం ఉచిత కాలింగ్ ఆఫర్ పొడిగింపు
ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎన్ఎన్ఎల్) తన సబ్స్క్రైబర్లకు ఆదివారం ఉచిత వాయిస్ కాలింగ్ ఆఫర్ను పొడిగించింది. ల్యాండ్లైన్కు, కోంబోకు, ఎఫ్టీటీహెచ్ బ్రాడ్బ్యాండ్ సబ్స్క్రైబర్లకు 2016 నుంచి అందిస్తున్న ఈ ప్రయోజనాలను మరోసారి పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అయితే ఈ సండే కాల్స్ ఆఫర్ను క్లోజ్ చేయాలని గత జనవరిలో బీఎస్ఎన్ఎల్ నిర్ణయించింది. కానీ ఫిబ్రవరిలో తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, మరో మూడు నెలల పాటు ఈ ప్రయోజనాలను పొడిగిస్తున్నట్టు పేర్కొంది. అంటే ఏప్రిల్ 30తో ఈ ఆఫర్ ప్రయోజనాల గడువు పూర్తి కాబోతోంది. ప్రస్తుతం మరోసారి ఈ ఆఫర్ను మే 1 నుంచి పొడిగించనున్నామని బీఎస్ఎన్ఎల్ ప్రకటించింది. అయితే ఎంతకాలం పాటు ఈ ప్రయోజనాలను అందించనున్నదో తెలుపలేదు. తదుపరి నోటీసులు వచ్చేంత వరకు ఈ ఉచిత కాలింగ్ ప్రయోజనాలను బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లు పొందవచ్చు. ఈ ఆఫర్ కింద బీఎస్ఎన్ఎల్ సబ్స్క్రైబర్లు ఆదివారం రోజు ఉచితం దేశవ్యాప్తంగా ఉన్న ఏ నెట్వర్క్కైనా అపరిమిత కాల్స్ చేసుకోవచ్చు. ఆదివారం ఉచిత కాలింగ్ ఆఫర్ను పొడిగించడమే కాకుండా.. రాత్రి పూట అందించే వాయిస్ కాలింగ్ సమయాలను మార్చింది. అంతకముందు రాత్రి 9 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు అందించే వాయిస్ కాలింగ్ సౌకర్యాన్ని ప్రస్తుతం రాత్రి 10.30 గంటల నుంచి ఉదయం 6 గంటలకు మార్చింది. అయితే బీఎస్ఎన్ఎల్ తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి గల కారణాన్ని తెలుపలేదు. ఇటీవల ప్రైవేట్ టెలికాం కంపెనీల నుంచి తీవ్ర పోటీ నెలకొనడంతో బీఎస్ఎన్ఎల్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ నెల ప్రారంభంలో కూడా రూ.349తో డేటా, వాయిస్ కాలింగ్తో కొత్త ప్రీపెయిడ్ మొబైల్ ప్యాక్ను లాంచ్ చేసింది. అదనంగా అపరిమిత వాయిస్ కాలింగ్ ప్రయోజనాలతో రూ.99, రూ.319 ప్లాన్లను ప్రవేశపెట్టింది. -
జియోకు పోటీ: ఎయిర్సెల్ బంపర్ ఆఫర్
రెండు రోజుల క్రితమే రిలయన్స్ జియో తన కొత్త ప్లాన్లను ప్రకటించింది. అప్పుడే ప్రత్యర్థుల నుంచి కౌంటర్ అటాక్ ప్రారంభమైంది. తమ కస్టమర్లను కాపాడుకోవడానికి జియో కొత్త ప్లాన్ రూ.399కు పోటీగా తమ ప్రీపెయిడ్ ప్యాక్లను ప్రకటిస్తున్నాయి. తాజాగా ఎయిర్సెల్ తమ ప్రీపెయిడ్ కస్టమర్లకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. కొత్త ప్రీపెయిడ్ ప్యాక్ రూ.348ను తమ యూజర్లకు అందిస్తున్నట్టు పేర్కొంది. దీని కింద రోజుకు 1జీబీ డేటాను, అపరిమిత కాలింగ్ సౌకర్యాన్ని 84రోజుల పాటు అందిస్తున్నట్టు తెలిపింది. ఎయిర్ సెల్ తాజాగా ప్రకటించిన ఈ ప్యాక్, ధన్ ధనా ధన్ ఆఫర్ కింద జియో ప్రకటించిన రూ.399 ప్లాన్కు గట్టిపోటీ ఇవ్వనుంది. జియో యూజర్లు కూడా తమ కొత్త ప్లాన్ కింద 84 రోజుల పాటు రోజుకు 1జీబీ డేటా, అపరిమిత కాలింగ్, ఎస్ఎంఎస్లు వాడుకోవడానికి వీలుంది. ఎయిర్సెల్ కొత్త రీఛార్జ్ ప్యాక్ ఎఫ్ఆర్సీ 348 ప్రస్తుతం ఉత్తర యూపీలో మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలిసింది. ఈ ప్యాక్ కింద యూజర్లు ఏ నెట్వర్క్కైనా 84 రోజుల పాటు అపరిమిత కాల్స్(లోకల్, ఎస్టీడీ) చేసుకోవచ్చు. ఎలాంటి డైలీ లేదా వీక్లి పరిమితులు లేవు. అయితే ఇంటర్నెట్ స్పీడు 3జీ మాత్రమే. అదే రిలయన్స్ జియో నెట్వర్క్పై అయితే 4జీ స్పీడును పొందవచ్చు. ఈ ప్యాక్ గురించి యూపీ(ఈస్ట్) సర్కిల్ బిజినెస్ హెడ్ రాజీవ్ గుప్తా మాట్లాడుతూ.. ''ఎఫ్ఆర్సీ 348 మార్కెట్లో ఇప్పటివరకున్న ఉత్తమమైన విలువ. 2జీ, 3జీ, 4జీ హ్యాండ్సెట్ ఉన్న కస్టమర్లందరికీ ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. బ్యాలెన్స్ అయిపోతుందనే బాధ అవసరం లేకుండా వీడియో చాటింగ్, సోషల్ నెట్వర్కింగ్, వీడియోల స్ట్రీమింగ్, వాయిస్ కాల్స్ చేసుకునే కస్టమర్ల కోసం ప్రత్యేకంగా ఈ ప్యాక్ను డిజైన్ చేసినట్టు చెప్పారు. కాగ, రిలయన్స్ జియో ఉచిత ఆఫర్ల నుంచి టారిఫ్ ప్లాన్లు అమలు చేయడం, ఆ తర్వాత ప్లాన్ల రేట్లను పెంచడం టెలికాం ఇండస్ట్రీకి సానుకూలంగా మారుతుందని విశ్లేషకులంటున్నారు. ప్రత్యర్థులు కూడా జియో రేట్లకు అనుగుణంగా తమ టారిఫ్ ప్లాన్లను పెంచుకోవడానికి వెసులుబాటు కలుగుతోందని చెప్పారు.. ఇన్నిరోజులు జియో దెబ్బకు ప్రత్యర్థులు హడలిపోయిన సంగతి తెలిసిందే.