breaking news
National Action Plan
-
12 మంది తీవ్రవాదులు హతం!
ఇస్లామాబాద్: పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో 12 మంది తీవ్రవాదులు హతమయ్యారు. ఇద్దరు కీలక కమాండర్లు సహా తీవ్రవాదులు కలిసి పాకిస్తాన్ భద్రతా దళంపై కాల్పులకు తెగబడ్డారు. ఈ నేపథ్యంలో కోహ్లి జిల్లా నాసౌ ప్రాంతంలో పాకిస్తాన్ భద్రతా దళాలకు తీవ్రవాదులకు మధ్య భీకర కాల్పులు కొనసాగాయి. తీవ్రవాదుల నుంచి భారీగా మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్టు భద్రతా దళం వెల్లడించింది. పాకిస్తాన్లో తీవ్రవాదాన్ని రూపుమాపేందుకు ద్వంద్వ పోరాటం చేయాలంటూ డిసెంబర్ 2014 లో నేషనల్ యాక్షన్ ప్లాన్ ప్రకటన చేసింది. ఈ ప్రకటన అనంతరం పాకిస్తాన్లోని బాలోఛిస్తాన్లో భద్రతా దళాలు తీవ్రవాదుల దాడులపై చర్యలను తీవ్రతరం చేశాయి. -
ఉగ్రవాదం అంతానికి
జాతీయ ప్రణాళిక: షరీఫ్ పెషావర్: పెషావర్ ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్రంగా స్పందించారు. ఉగ్రవాదాన్ని సమర్థంగా ఎదుర్కొనేందుకు వారంలోగా జాతీయ ప్రణాళికను రూపొందిస్తామని, కార్యాచరణ ప్రారంభిస్తామని ప్రకటించారు. అన్ని పార్టీల నేతలు షరీఫ్ అధ్యక్షతన బుధవారమిక్కడ సమావేశమై ఉగ్రవాద నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. జాతీయ కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని తామంతా నిర్ణయించినట్లు షరీఫ్ చెప్పారు. విలేకరుల భేటీలో షరీఫ్కు ఇరువైపులా.. తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ అధినేత ఇమ్రాన్ ఖాన్, పాక్ జాతీయ అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఖుర్షీద్ షా ఉన్నారు. ఉగ్రవాద సంబంధిత కేసుల్లో మరణశిక్ష విధించడాన్ని అడ్డుకునే మారటోరియంను పాక్ ప్రభుత్వం ఎత్తేసింది. పాక్ ఆర్మీ చీఫ్ రహీల్ షరీఫ్ అఫ్ఘానిస్తాన్ వెళ్లారు. ఈ దాడికి కారణమని ప్రకటించుకున్న తెహ్రీక్ ఇ తాలిబాన్ పాక్ నేత ఫజ్లుల్లాను పాకిస్తాన్కు అప్పగించాలనే డిమాండ్తో ఆయన అక్కడి అధికారులతో సమావేశమయ్యారు.