breaking news
naac afiliated
-
వైఎన్ కళాశాలకు అరుదైన గుర్తింపు
సాక్షి, పశ్చిమగోదావరి(నరసాపురం) : రాష్ట్రంలోనే గుర్తింపు కలిగిన నరసాపురం వైఎన్ కళాశాల స్థాయి పెరిగింది. మెంటారు కళాశాలగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దీనిని గుర్తించింది. యూజీసీ దేశంలో ప్రతిష్టాత్మకంగా అమలు చేయడానికి రూపొందించిన పరామర్ష్ పథకానికి వైఎన్ కళాశాలను ఎంపిక చేసింది. దేశంలో మొత్తం 167 కళాశాలలను ఈ పథకానికి యూజీసీ ఎంపిక చేసింది. రాష్ట్రంలో 10 కళాశాలలు, తెలంగాణలో 4 కళాశాలలు ఈ కార్యక్రమానికి ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని 10 కళాశాలల్లో జిల్లాకు సంబంధించి ఒకటి వైఎన్ కశాశాల కాగా, రెండోవది ఏలూరు సెయింట్ థెరిస్సా కళాశాల. కొన్ని జిల్లాల్లో కళాశాలలకు, యూనివర్సటీలకు ఈ అవకాశం దక్కకపోవడం గమనార్హం. కళాశాలలోని మౌలిక వసతులు, బోధనా పద్ధతులు, ప్రొఫెసర్ల సామర్థ్యం, గత చరిత్ర తది తర అంశాలను పరిగణలోకి తీసుకుని వైఎన్ కళాశాలను ఎంపిక చేశారు. ఇప్పటికే వైఎన్ కళాశాల నాక్ ఏ గ్రేడ్ను మూడుసార్లు సాధించింది. డీమ్డ్ యూనివర్సిటీకి మార్గం సుగమం వైఎన్ కళాశాలను డీమ్డ్ యూనివర్సిటీగా అభివృద్ధి చేయాలనే ప్రయత్నం సాగుతోంది. మెంటారు కళాశాలగా గుర్తింపు దక్కడం ద్వారా దీనికి మార్గం సుగమం అయ్యిందని కళాశాల ఇన్చార్జ్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ పోలిశెట్టి రఘురామ్, ప్రిన్సిపాల్ కె.వెంకటేశ్వర్లు, వైస్ ప్రిన్సిపాల్ ఎస్ఎం మహేశ్వరి, ఐ క్యూఏసీ కో–ఆర్డినేటర్లు డాక్టర్ కె.నాగేశ్వరరా వు, డాక్టర్ గంధం రామకృష్ణ ఆదివారం కళాశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. తాజా గుర్తింపుతో రూ.30 లక్షలు గ్రాంట్ వస్తుందన్నారు. తమ కళాశాల ఉభయగోదావరి జిల్లాల్లోని ఐదు కళాశాలలను ఎంపిక చేసుకుని వాటికి నేక్ గుర్తింపు వచ్చేలా కృషిచేయాలన్నారు. దీనికి బ్రాండ్ అంబాసిడర్గా కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ చినిమిల్లి సత్యనారాయణ వ్యవహరిస్తారని చెప్పారు. తాము భీమవరం వబిలిశెట్టి సత్యనారాయణ, కృష్ణమూర్తి కళాశాల, తాళ్లపూడి కలిదిండి సుబ్బారావు మెమోరియల్ డిగ్రీ కళాశాల, తూర్పుగోదావరి జిల్లా మామిడికుదురు దీప్తి కళాశాల, అమలాపురం వెంకటేశ్వర డిగ్రీ కళాశాల, లక్కవరం అల్లూరి వరలక్ష్మి కళాశాలను ఎంచుకున్నామని చెప్పారు. డాక్టర్ చినిమిల్లి శ్రీనివాస్, ట్రెజరర్ పొన్నపల్లి శ్రీరామారావు పాల్గొన్నారు. -
అగ్రశ్రేణి వర్శిటీగా ‘గీతం’
అనంతపురం సప్తగిరిసర్కిల్ : నేషనల్ అసెస్మెంట్ అండ్ అడ్రికేషన్ కౌన్సిల్ (ఎన్ఏఏసీ–నాక్) తాజాగా వెలువరించిన ఫలితాల్లో గీతం యూనివర్శిటీకి అగ్రస్థానం లభించినట్లు వర్శిటీ ఉపకులపతి ఆచార్య ఎంఎస్ ప్రసాదరావు మంగళవారం తెలిపారు. ఈ నెల 28న జరిగిన నాక్ 23వ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఏ+ గ్రేడు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. నాక్ నూతన గ్రేడింగ్ విధానంలో ఏ+ స్థానాన్ని అందుకున్న దేశంలోని డీమ్డ్ విశ్వవిద్యాలయాల్లో గీతం అగ్రస్థానంలో ఉందని ఆయన తెలిపారు. దక్షిణ భారతదేశంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, ఆర్కిటెక్చర్, లా, సైన్స్, మేనేజ్మెంట్, అంతర్జాతీయ వాణిజ్య విద్య, వైద్య విద్యా కోర్సులతో నాక్ ఏ+ గ్రేడింగ్ సాధించిన ఏకైక విశ్వవిద్యాలయంగా గీతం ఖ్యాతి గడించిందన్నారు. అదేవిధంగా 138 యూజీ, పీజీ, డాక్టరల్ కోర్సులతో దక్షిణ భారతంలోని అతి పెద్ద విశ్వవిద్యాలయంగా స్థానం సంపాదించుకుందన్నారు. నాక్ ఏ+ సాధించి అత్యుత్తమ యూనివర్శిటీగా గుర్తింపును పునరుద్ధరించుకోవడంపై వర్శిటీ చాన్సలర్ రామకృష్ణారావు, రిజిస్ట్రార్ పోతరాజు, యూజీసీ వ్యవహారాల డైరెక్టర్ సీహెచ్ రామకృష్ణ విశ్వవిద్యాలయ వర్గాలకు అభినందనలు తెలిపారు.