breaking news
Mussolini
-
ఇటలీ ప్రధానిగా ముస్సోలినీ
ఆ నేడు 30 అక్టోబర్,1922 ఇటలీలో ప్రముఖ రాజకీయ నాయకుడు, జర్నలిస్టు, ఫాసిజం సృష్టికర్త, జాతీయ ఫాసిస్ట్ పార్టీ వ్యవస్థాపకుడు బెనిటో ముస్సోలినీ ప్రధానిగా ఇటలీ ప్రభుత్వ పగ్గాలు చేపట్టాడు. మొదట ప్రజలచేత ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికై, రాజ్యాంగబద్ధంగా పాలించిన ముస్సోలినీ, 1925లో నియంతగా మారి, 1943లో జరిగిన తిరుగుబాటుతో పదవీచ్యుతి పొందేవరకు సుదీర్ఘకాలం ఇటలీని పాలించాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో కీలకపాత్ర పోషించిన ముస్సోలినీ, ఫ్రాన్స్, జర్మనీలతో కలిసి అక్షరాజ్యాలను ఏర్పాటు చేశాడు. ఇటలీ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలోనే ముస్సోలినీ పేరు ఫాసిస్టుగా, నియంతగా శాశ్వతంగా నిలిచి పోయింది. -
ముస్సోలిని ఇక్కడే దాక్కోవాలనుకున్నాడు!
చరిత్ర రెండవ ప్రపంచ యుద్ధకాలంలో ఇటాలియన్ నియంత ముస్సోలి నిర్మించిన రహస్య బంకరును తొలిసారిగా ప్రజల సందర్శనకు అవకాశం కల్పిస్తుంది ఇటలీ ప్రభుత్వం. ఇటలీలోని ‘విల్ల తొర్లోనియ’ పార్క్ ప్రస్తుతం విందు, వినోదాలు, కాలక్షేపాలకు ప్రసిద్ధి చెంది ఉండొచ్చుగానీ దానికున్న చరిత్ర తక్కువేమీ కాదు. ఒకప్పుడు ఈ ప్రదేశంలో ముస్సోలిని తన భార్యాపిల్లలతో కలిసి జీవించాడు. వైమానిక, విషయ వాయువుల దాడుల నుంచి తనను, కుటుంబాన్ని రక్షించుకోవడానికి అండర్ గ్రౌండ్ ఛాంబర్ను నిర్మించాడు. అత్యంత రహస్యంగా నిర్మించిన ఈ యాంటి-గ్యాస్ ఛాంబర్లో ఎనిమిది గదులు, మెట్లు ఉన్నాయి. గ్యాస్మాస్క్లు, హెల్మెట్లు ఎప్పుడూ బంకర్లో సిద్ధంగా ఉండేవి. పదిహేనుమంది వరకు దీనిలో తలదాచుకోవచ్చు.బంకర్ నుంచి తప్పించుకోవడానికి రెండు మార్గాలు(ఎస్కేప్ రూట్స్) ఉన్నాయి. ‘‘బాంబులు నా బాల్కనీలో పడినా నేను బెదిరేది లేదు. బంకర్లో దాక్కొనేది లేదు’ అనేవాడట ముస్సోలిని. ‘‘నిజానికి బంకర్లు నిర్మించడానికి, అందులో తలదాచుకోవడానికి ముస్సోలిని వ్యతిరేకం. ఒకరిని చూసి ఒకరు బంకర్లు నిర్మించుకుంటున్న కాలంలో కూడా ఎప్పుడూ ఆ పని చేయలేదు. తన ప్రాణాలకు ముప్పు ఏర్పడింది అనుకున్న అనివార్య పరిస్థితిలో మాత్రమే బంకర్ నిర్మించుకున్నాడు’’ అంటున్నాడు లారా లొంబర్డీ అనే చరిత్రకారుడు. ప్రత్యేక పరిస్థితులలో, ప్రత్యేక శ్రద్ధతో ముస్సోలిని ఈ బంకర్ని నిర్మించినప్పటికీ అందులో ఎప్పుడూ ఉండలేదు. పనిలో పురోగతి గురించి మాత్రం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండేవాడు. గత సంవత్సరం ఈ బంకర్ తాలూకు ఫొటోలను తొలిసారిగా విడుదల చేశారు. 2011 వరకు గానీ దీన్ని కనుగొనలేదు. ‘‘చిన్న చిన్న మరమ్మతులు మినహా బంకర్ ఇప్పటికీ చెక్క చెదరకుండా ఉంది. కితాబు ఇవ్వాల్సిన రహస్య ప్రదేశం ఇది’’ అంటున్నాడు క్లారో సెరఫిని అనే ఆర్కిటెక్ట్. -
సైన్యానికి నిధుల వరద, శాంతికి బెడద
2012లో అమెరికా 682 బిలియన్ డాలర్లు సైనిక వ్యయం చేసింది. ఇది ఆ సంవత్సరంలో చైనా, రష్యా, బ్రిటన్, జపాన్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఇండియా, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్ దేశాల మొత్తం సైనిక వ్యయం కంటె కూడా ఎక్కువ. ‘శాశ్వతమైన శాంతి మీద నాకు నమ్మకం లేదు’ అంటాడు బెనిటో ముస్సోలినీ. భూమండలాన్ని రణభూమిగా మార్చిన రెండు ప్రపంచ యుద్ధాలలోనూ పాల్గొన్న ముస్సోలినీ ప్రపంచం మీదకు సంధించిన సిద్ధాంతం ఫాసిజం. ఫాసిజానికి ఆద్యుడైన ముస్సోలినీ నోట మరో మాటను ఆశించనక్కరలేదు. కానీ అతడు మరణించిన కొన్ని దశాబ్దాల తరువాత కూడా ఆయన ప్రవచనాలు ప్రపంచంలో చలామణి అవుతున్నాయి. శాంతి అంటే పిచ్చివాడి కల అన్న భావననే ఇప్పుడు అగ్రరాజ్యాలు ప్రగాఢంగా నమ్ముతున్నాయని చెప్పడానికి ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఏవేవో కారణాలతో అగ్రరాజ్యాలు, అభివృద్ధి చెందిన దేశాలు సైనిక వ్యయాన్ని అంచనాలకు అందనంతగా పెంచుతున్నాయి. సైనిక వ్యయం ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థలో అంతర్భాగమైపోయింది. సరిగ్గా నూరేళ్ల క్రితం జరిగిన మొదటి ప్రపంచ యుద్ధం ఉద్దేశం - సమస్త యుద్ధాలను నిరోధించడమే. కానీ రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తరువాత మరెన్నో యుద్ధాలకు మొదటి ప్రపంచ యుద్ధం బీజాలు వేసింది. దేశాలు ఏదో ఒక పేరుతో సైనిక వ్యయాన్ని పెంచుతూనే ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధం తరువాత నానా జాతి సమితి, రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐక్య రాజ్య సమితి ఆవిర్భవించాయి. అయినా యుద్ధాలు లేని ప్రపంచం ఒక ఊహగానే మిగిలి ఉంది. శాశ్వతమైన శాంతిని ఎవరూ విశ్వసించడంలేదన్నమాటే. అగ్రరాజ్యమైన అమెరికా, అభివృద్ధికి నమూనాగా చెప్పుకుంటున్న చైనా సైనిక వ్యయాన్ని విచ్చలవిడిగా పెంచుతున్నాయి. జపాన్తో సంబంధాలు, ఆసియా పరిస్థితులను బట్టి చైనా తన సైనిక సంపత్తిని పెంచుకుంటోందని ఒక వాదన ఉంది. కానీ చాలా ప్రపంచ దేశాలు కూడా ఏదో కారణంతో సైనిక వ్యయాన్ని ఇతోధికంగా పెంచుతున్నాయి. స్థూల జాతీయోత్పత్తి ఆధారంగా చైనా రెండంకెల శాతంతో సైనిక వ్యయాన్ని పెంచుతోంది. అమెరికా అయితే నలభై శాతం వరకు రక్షణ కేటాయింపులు పెంచుకుంటోంది. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసిన తరువాత జరిగిన సైనిక వ్యయంలో 2011 సంవత్సరానికి ప్రత్యేకత ఉంది. రెండో ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాత అత్యధిక సైనిక వ్యయం ఆ సంవత్సరంలోనే జరిగింది. అసలు ప్రపంచ దేశాల మధ్య ఆర్థిక పోటీ అంటే అది ఏటా ట్రిలియన్ డాలర్ల మేర సైనిక వ్యయంగా ఎందుకు మారిపోవాలో సమాధానం సాధించవలసి ఉంది. అమెరికా బడ్జెట్లో రక్షణ కేటాయింపులలో కోత విధించడానికీ, దళాల కుదింపునకూ కాంగ్రెస్ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. అయినా 2012లో అమెరికా 682 బిలియన్ డాలర్లు సైనిక వ్యయం చేసిం ది. ఇది ఆ సంవత్సరంలో చైనా, రష్యా, బ్రిట న్, జపాన్, ఫ్రాన్స్, సౌదీ అరేబియా, ఇండి యా, జర్మనీ, ఇటలీ, బ్రెజిల్ దేశాల మొత్తం సైనిక వ్యయం కంటె కూడా ఎక్కువ. ఈ అన్ని దేశాల సైనిక వ్యయం 652 బిలియన్ డాలర్లు. చైనా చేసిన సైనిక వ్యయం గురించి ఆ దేశం రహస్యంగా ఉంచడం లేదు. ఈ సంవత్సరం తమ రక్షణ బడ్జెట్ 12.2 శాతం పెరిగిందని చైనా ప్రకటించింది. హైటెక్ ఆయుధాల కోసం; తీర, గగన రక్షణల విస్తరణలో భాగంగా ఈ పెంపు అవసరమైందని ఆ దేశం వివరణ ఇచ్చింది. అమెరికా తరువాత రెండంకెల స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు పెంచుకున్న దేశం చైనా కావడం విశేషం. దీని మీద జపాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. సైనికీకరణ ఇప్పుడు పెట్టుబడిదారీ విధానంలో అంతర్భాగంగా చూడవచ్చునని నిపుణుల అభిప్రాయం. సరిహ ద్దులతో సంబంధం లేకుండా పెట్టుబడిదారీ విధానం ప్రపంచ దేశాలతో ముడిపడి ఉంది. ఇరవయ్యో శతాబ్దంలో కని పించే సామ్రాజ్యవాదానికి భిన్నంగా కనిపించినా, అదే అడుగుజాడలలో ఉండే ఆర్థిక గుత్తాధిపత్యం సాధించడానికి సైన్యం పెంపు ఆయుధంలా పనిచేస్తున్నదంటే వాస్తవదూరం కాదు. కల్హణ