-
ఇంటర్నెట్లో..ఒక్క నిమిషంలో.. ఏం జరుగుతుందో తెలుసా?
గెలుపైనా, ఓటమైనా, చావైనా, బతుకైనా అన్నీ ఆ నిమిషంలోనే జరుగుతాయి. అందుకే ప్రతి నిమిషాన్ని ఒడిసిపట్టుకోవాలి. అనుకున్న లక్ష్యం వైపు అడుగులు వేయాలి. అదే నిమిషయంలో ప్రపంచ వ్యాప్తంగా ఇంటర్నెట్లో 60 సెకన్ల(ఒకనిమిషం) లో చాలా పనులు జరుగుతున్నాయని, ఇటీవల వరల్డ్ ఎకనమిక్ ఫోరం ఓ రిపోర్ట్ను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం... ♦ ట్విట్టర్లో యూజర్లు నిమిషానికి 575,000 ట్వీట్లను పోస్ట్ చేస్తున్నారు. ♦ టిక్టాక్లో 67 మిలియన్ క్లిప్లను వీక్షిస్తున్నారు. ♦ ప్రతి నిమిషానికి గూగుల్లో 5.7 మిలియన్ల మంది ఇన్ఫర్మేషన్ కోసం సెర్చ్ చేస్తున్నారు. ♦ యాపిల్ గాడ్జెట్స్ (ఐఫోన్, ఐపాడ్)లో 12 మిలియన్ల మంది మెసేజ్లను సెండ్ చేస్తున్నారు. ♦ ఇన్స్టాగ్రామ్లో దాదాపు 65,000 ఫోటోల్ని షేర్ చేస్తున్నారు. ♦ ఫేస్బుక్ లో ప్రతి నిమిషానికి 240,000 ఫోటోలను షేర్ చేస్తున్నారు. ఫేస్బుక్ లైవ్ను ప్రతి నిమిషం 44 మిలియన్ల వీక్షిస్తున్నారు. ♦ కొనుగోలు దారులు ప్రతినిమిషానికి అమెజాన్లో $283,000 ఖర్చు చేస్తున్నారు. ♦ ఇంటర్నెట్లో ప్రతి నిమిషం 6 మిలియన్ల మంది ఆన్లైన్లో షాపింగ్ చేస్తారు. ♦ ఓటీటీ నెట్ ఫ్లిక్స్లో నిమిషానికి 452.000 గంటల వీడియోల్ని వీక్షిస్తున్నారు. ♦ యూట్యూబ్లో ప్రతినిమిషానికి 694.000 గంటల వీడియోల్ని చూస్తున్నారు. ♦ స్నాప్ చాట్లో యూజర్లు ప్రతి నిమిషానికి 2 మిలియన్ స్నాప్లను పంపుతున్నారు. ♦ జూమ్ ప్రతి నిమిషానికి 856 నిమిషాల వెబ్నార్లను హోస్ట్ చేస్తుంది ♦ మైక్రోసాఫ్ట్ బృందాలు ప్రతి నిమిషం 100,000 మంది వినియోగదారులను కనెక్ట్ చేస్తుంది. ఇంటర్నెట్ వినియోగం పెరిగింది 1990ల నుంచి ఇంటర్నెట్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఒక చిన్న ప్రయోగంగా ప్రారంభమైన ఇంటర్నెట్ ఇప్పుడు ప్రపంచ దేశాల్ని ఏకం చేస్తుంది. డబ్ల్యూఎఫ్ అంచనాల ప్రకారం 2020లో ఇంటర్నెట్ వినియోగదారులు 4.5 బిలియన్ల నుండి 2021లో 11 శాతం పెరిగారు. ♦ ప్రతి నిమిషానికి 950 మంది కొత్త యూజర్లు ఇంటర్నెట్కు పరిచయం అవుతున్నారు. ♦ ప్రస్తుతం, ఇంటర్నెట్ను దాదాపు 5 బిలియన్ల మంది వినియోగదారులు ఉపయోగిస్తున్నారు. చదవండి: ఎవడి డప్పు వాడు కొట్టుకున్నా.. వందల కోట్లు కట్టాల్సిందే...! -
ఆ సమయంలో ఏం చేయగలను చెప్పు?
ఈ రోజుల్లో సర్వసాధారణంగా వినిపిస్తున్న పదం లైంగిక వేధింపులు (సెక్సువల్ హెరాస్మెంట్). ఈ వేధింపులు ఒక ప్రదేశానికో, ఒక వయసులో ఉన్న మహిళలకే పరిమితమై ఉన్నాయనుకుంటే పొరపడ్డట్లే. ఎందుకంటే ఇప్పుడు లైంగిక వేధింపులనేవి ప్రతి చోట జరుగుతునే ఉన్నాయి. ఇది భౌతిక రూపంలోనూ మానసిక రూపంలోనూ వెంటాడుతున్నాయి. బుడిబుడి నడకలు వేస్తున్న చిన్నారి, స్కూల్ కి వెళ్లే పాప, కాలేజీకి వెళ్లే యువతి, కార్యాలయాల్లో పనిచేసే మహిళా ఉద్యోగుల నుంచి చెప్పడానికే అసహ్యమనిపించేలా ముసలి అవ్వలపై కూడా లైంగిక వేధింపులు జరుగుతున్నాయి. అయితే, ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ముందుగా తమ పిల్లలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని పలువురు చెప్తున్నారు. భారత్ వంటి దేశాల్లో లైంగికపరమైన అంశాలను చర్చించుకోవడం తప్పుగా భావిస్తారని, ఇక తండ్రి కొడుకులు, తల్లి కొడుకుల మధ్య ఇలాంటి సంభాషణ ఎంతో పాపంగా భావిస్తారని కానీ జరగాల్సిన పద్ధతిలో వారి మధ్య జరిగితే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని చెప్తున్నారు. ఇందుకోసం బ్రేక్ త్రో ఇండియా అనే సంస్థ ఒక నిమిషం లోపు వీడియోలోనే తమ పిల్లలు లైంగిక వేధింపుల చర్యలు పాల్పడకుండా ఓ తల్లి ఎలా పాఠం బోధించవచ్చో వివరించారు. ఆ వీడియోలో ఏముందంటే 'ఓ విద్యార్థిని స్కూల్ బ్యాగుతో పొద్దున్నే సిద్ధమై స్కూల్ కి బయలు దేరుతుంది. ఇంటి బయట కాలుపెట్టగానే వారి ఇంటిపైన మరో ఇంట్లో ఉంటున్న ఓ కుర్రాడు బంతిపూలు ఆ అమ్మాయి తలపై జల్లుతాడు. కోపంతో ఆ అమ్మాయి.. వాటిని దులిపేసుకుని వెళ్లిపోతుంది. ఆ తర్వాత మరో ఆంటీపై అలాగే చేయబోతాడు. అప్పుడే వాళ్ల అమ్మ బట్టలు ఆరవేసేందుకు బయటకు వచ్చి ఆ విషయం గమనిస్తుంది. దాంతో ఆ బాలుడు వెంటనే ఆంటీపై పూలు చల్లకుండా ఆగిపోతాడు. ఆ సమయంలో తల్లికి ఆ కుమారుడికి మధ్య అర్ధమంతమైన సంభాషణ జరుగుతుంది. ఆ సంభాషణ ఏమిటంటే.. తల్లి: నిన్న నేను ఆఫీసుకు వెళుతుంటే ఏం జరిగిందో చెప్పనా.. కొడుకు: చెప్పు తల్లి: కొందరు కుర్రాళ్లు పాప్ కార్న్ను నాపైకి విసిరారు కొడుకు: అప్పుడేం జరిగింది తల్లి: నేను వెనుకకు తిరిగి చూశాను. వారు బైక్స్ పై కూర్చుని ఉన్నారు. దగ్గరగా వచ్చి మేడమ్.. మీ తలలో మా పాప్ కార్న్ చిక్కుకుపోయింది.. తీసుకోమంటారా అన్నారు. అ సమయంలో వాళ్లను ఏం చేయగలను చెప్పు? కొడుకు: (ఏం మాట్లాడకుండా.. తప్పు చేస్తున్నవాడిలా మౌనంలోకి జారుకున్నాడు). తల్లి: అందుకే ఎవరి విషయంలోనూ అతి తెలివితో ప్రవర్తించకూడదు.. అని చెప్పి వెళ్లిపోతుంది. -
గూగుల్ డాట్ కామ్ అమ్మేశారు!
ప్రపంచంలోనే అత్యధిక వినియోగదారులున్న గూగుల్ డాట్ కామ్ అమ్మేశారట... అదేమిటీ గూగుల్ అమ్మేయడం అనుకుంటున్నారా? ఇది నిజమే... కానీ అదీ.. ఒక్క నిమిషానికి... కేవలం పన్నెండు డాలర్లకు. సన్మయ్ వేద్ అనే వ్యక్తి సొంతం చేసుకున్నాడు. ఎక్కడ తప్పు జరిగిందో తెలియదు కానీ.. డొమైన్ నేమ్ అమ్మకానికి పెట్టారు. వెంటనే గమనించిన సన్మయ్... తన అదృష్టాన్ని పరీక్షించుకునాడు. ఒక్క నిమిషం.. గూగుల్ కు ఓనర్ అనిపించుకున్నాడు. ఇంతలోనే తమ ఎర్రర్ ను గమనించిన గూగుల్ నాలుక్కరచుకొని అమ్మకానికి ఫుల్ స్టాప్ పెట్టింది. ఓ మాజీ గూగుల్ ఉద్యోగి గూగుల్ కు ఓ నిమిషం పాటు యజమాని అయిపోయాడు. అయితే ఆ ఒక్క నిమిషంలోనే తమ తప్పును తెలుసుకున్న గూగుల్... వెంటనే అమ్మకాన్ని నిలిపివేస్తూ ప్రకటన చేసింది. ఇడ్లీ డొమైన్ ద్వారా పేర్లు అమ్మకాలు జరుగుతాయని తెలిసిన గూగుల్ మాజీ ఉద్యోగి (డిస్ ప్లే స్పెషలిస్ట్) సన్మయ్... స్క్రోల్ చేస్తుండగా లిస్టులో గూగుల్ కనిపించింది. ఒక్క సెకన్ కూడ ఆలస్యం చేయకుండా సన్మయ్ గూగుల్ ను 12 డాలర్లకు కొనేశాడు. ఏకంగా కన్ఫర్మేషన్ మెసేజ్ కూడ వచ్చేసింది. ఇంతలోనే తేరుకున్న గూగుల్ తమ అమ్మకాలను నిలిపివేసింది. నిజంగా నేను షాక్ అయ్యాను. నా కార్డు నుంచి పన్నెండు డాలర్లు కట్ అవ్వడం నాకు ఆశ్చర్యం కలిగించింది అంటూ లింక్ డెత్ లో సన్మయ్ తన అనుభవాన్ని రాసుకున్నాడు. నిజానికి డొమైన్ తన కార్ట్ లో కూడ గ్రీన్ చెక్ బాక్స్ లో యాడ్ అయ్యి ఉండటం గమనించానని, అది చూసి ఆశ్చర్యపోయానని బోస్టన్ కు చెందిన ఓ ఆన్ లైన్ రిటైల్ ఎక్స్ పర్ట్ కూడా తన అనుభవాన్ని వివరించాడు.నిజానికి ఆ సమయంలో గూగుల్ డొమైన్స్ ఆర్డర్ లిస్టులో కూడ డొమైన ఆర్డర్ హిస్టరీ మెసేజ్ లు అప్ డేట్ అయ్యి ఉన్నాయట. అయితే అనుభవజ్ఞుడు కావడంతో సన్మయ్ తనకు వచ్చిన కన్ఫర్మేషన్ ను చూసి వెంటనే తన ఓనర్ షిష్పును మెసేజ్ ద్వారా ప్రకటించుకున్నాడు. అటువంటి ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ గూగుల్ లోని వెబ్ మాస్టర్స్ కు మాత్రమే తెలుస్తుంది. సన్మయ్ కూడ మాజీ డిస్ ప్లే స్పెషలిస్టు కావడంతో ఆ అవకాశాన్ని అతడు అంత త్వరగా గుర్తించగలిగాడు. ''నా ఆర్డర్ విజయవంతమైంది. చాలా స్పష్టంగా యాజమాన్యం నాకు గూగుల్ మంజూరు చేసింది'' నాకు వెంటనే నోటిఫికేషన్లు రావడం మొదలయ్యాయి. కానీ లావాదేవీలు జరిగిన ఒక్క నిమిషం లోపే గూగుల్ తన తప్పును గ్రహించి డొమైన్లనుంచి ఓ క్రమ పద్ధతిలో నాకు ఈ మెయిల్ పంపారు. దాంతో నా ఓనర్ షిప్ రద్దయింది'' అంటూ తన్మయ్ తన అనుభవాన్ని ఎంతో ఆనందంగా చెప్తున్నాడు. ఏది ఏమైనా కేవలం ఒక్కనిమిషమైనా నేను గూగుల్ డాట్ కామ్ కు యజమాని కాగలిగానని గర్వంగా చెప్తున్నాడు తన్మయ్. ఇటీవల గూగుల్ సంస్థ అధీనంలో అనేక అనుబంధ సంస్థలను ఏబీసీడీ పద్ధతిలో తీసుకువచ్చింది. ఆయా వెబ్ సైట్ల డొమైన్లను కొన్ని ప్రముఖ కంపెనీలు తమ స్వంతం చేసుకున్నాయి. ప్రముఖ కార్ల కంపెనీ బీఎమ్ డబ్ల్యూ... ఆల్ఫాబీట్ డాట్ కామ్ ను, జెర్మనీకి చెందిన కార్లు తయారీ కంపెనీ.. ఫ్లీట్ సర్వీసెస్ ఆల్ఫాబీట్స్ నుంచి వెరీ యాక్టివ్ వెబ్ సైట్ ను కొనుగోలు చేసింది. అలాగే ప్రపంచంలోని గూగుల్ అధీనంలో పనిచేస్తున్న మరెన్నో సంస్థలు తమ డొమైన్లను అమ్మకానికి పెడుతుంటాయి. ప్రస్తుతానికి గూగుల్ ఓనర్ షిప్ డొమైన్.. బహిరంగ మార్కెట్లో అమ్మకానికి ఎలా పెట్టిందో తెలీదు కానీ సన్మయ్ కి ఒక్క నిమిషం ఓనర్ అయ్యే అవకాశం కలిగింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- బాబుకు బొమ్మ కనిపిస్తోంది: విజయసాయిరెడ్డి సెటైర్లు
- ఓటమి భయంలో కొడుకు.. డబ్బు మూటలతో తండ్రి!
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- ఐపీఎల్లో ఇవాళ (మే 5) డబుల్ ధమాకా
- వరుస ఫ్లాప్స్.. పూజా హెగ్డేకు మరో ఛాన్స్
- నిజ్జర్ కేసులో అరెస్ట్.. భారత్కు సంబంధంలేదన్న జయశంకర్
- తోడేళ్ళను తరిమే రోజు!
Advertisement