mercy petitions
-
రేపిస్ట్లపై రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు
జైపూర్: దిశ అత్యాచార ఘటన అనంతరం దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మహిళలపై లైంగిక దాడులకు పాల్పడిన వ్యక్తులకు కఠిన శిక్షలు పడాలని యావత్ దేశం డిమాండ్ చేసింది. ప్రస్తుతం దేశంలో అమలు అవుతున్న చట్టాలన్నీ వెంటనే సవరించాలని, మరింత కఠినంగా మార్చాలని ప్రతిఒక్కరు గలమెత్తి నినదించారు. తాజాగా దిశ అత్యాచార నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడం ఆ డిమాండ్కు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలోనే అత్యాచార నిందితులపై రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. రేపిస్ట్లకు క్షమాభిక్ష అవసరం లేదని స్పష్టం చేశారు. ‘దేశంలో మహిళలపై దాడులు పెరిగిపోతున్నాయి. వాటిని అరికట్టాలంటే ప్రస్తుతం ఉన్న చట్టాలను మరోసారి సమీక్షించాలి. అత్యాచార నిందితులను క్షమించాల్సి అవసరం లేదు. క్షమాభిక్ష పిటిషన్పై కేంద్ర ప్రభుత్వం దృష్టిసారించాలి. వాటిపై రివ్యూ జరగాలి. మహిళల రక్షణకు పౌరులు కోరుకునే చట్టం రూపొందించాల్సిన సమయం ఆసన్నమైంది’ అని వ్యాఖ్యానించారు. రాజస్తాన్లో ఓ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన కోవింద్ ఈ మేరకు కీలక ప్రసంగం చేశారు. దేశమంతా కఠిన చట్టాలను డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్రపతి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. కాగా నిర్భయ దోషి ఇటీవల రాష్ట్రపతికి పెట్టుకున్న క్షమాభిక్ష పిటిషన్ను కోవింద్ తిరస్కరించిన విషయ తెలిసిందే. -
ఉరిశిక్షకు వ్యతిరేకం
న్యూఢిల్లీ: రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చాలంటూ కలాం ముందుకు 21 క్షమాభిక్ష పిటిషన్లు రాగా ఆయన ఒకదానిపైనే నిర్ణయం వెలువరించారు. దీనిపై విమర్శలొచ్చినా లెక్కచేయలేదు. ఆయన ఉరిశిక్షకు వ్యతిరేకం. ఉరిపై లా కమిషన్ తన అభిప్రాయం కోరగా ఆయన మరణదండనను ఎత్తేయాలన్నారు. రాష్ట్రపతిగా క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడం క్షోభకు గురిచేసిందన్నారు. పెండింగ్లోని న్ని కేసులూ సామాజిక, ఆర్థిక పక్షపాతంతో కూడుకున్నవే తప్పితే, దోషులకు ప్రతీకారేచ్ఛ ఉన్నట్లు కనపడలేదన్నారు. ఉద్దేశపూర్వకంగా నేరం చేయని వారిని ఎక్కిస్తున్నామనే భావన కలిగిందన్నారు. 1990లో ఓ యువతిని బెంగాల్లో అపార్ట్మెంట్లోని లిఫ్ట్బాయ్ ధనుంజయ్ ఛటర్జీ రేప్ చేసి హత్య చేశాడు. ఈ కేసులో మాత్రం ఆయన ఛటర్జీ క్షమాభిక్ష పిటిషన్ను తోసిపుచ్చారు. -
క్షమాభిక్ష పిటిషన్లపై జాప్యం వద్దు
సుప్రీంకోర్టు తీర్పునకు సీజేఐ సమర్థన ముంబై: క్షమాభిక్ష పిటిషన్లను సుదీర్ఘకాలం పెండింగ్లో ఉంచకూడదని భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ) జస్టిస్ పి.సదాశివం పేర్కొన్నారు. క్షమాభిక్ష పిటిషన్లపై నిర్ణయం తీసుకోవడంలో అనుచిత, అసాధారణ జాప్యం జరిగితే మరణశిక్షను జీవితఖైదుగా మార్చవచ్చన్నారు. ఈ మేరకు ఇటీవల సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఆయన సమర్థించారు. అయితే దీన్ని హేయమైన నేరాలకు పాల్పడిన వారిపై కోర్టు కనికరం చూపుతున్నట్లు అర్థం చేసుకోకూడదన్నారు. శనివారమిక్కడ ‘నేర దర్యాప్తు మెరుగుదల’పై నిర్వహించిన సదస్సులో జస్టిస్ సదాశివం మాట్లాడారు. మరోపక్క.. దేశంలో వివిధ కోర్టుల్లో 3.1 కోట్ల కేసులు పెండింగ్లో ఉండడం తనకు తీవ్రఆందోళన కలిగిస్తోందని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ముంబైలో జరిగిన మరో కార్యక్రమంలో అన్నారు.