breaking news
massage centers
-
Hyderabad: మసాజ్ సెంటర్ పేరుతో చీకటి బాగోతాలు
సాక్షి, కుషాయిగూడ: అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఓ మసాజ్ సెంటర్పై బుధవారం పోలీసులు, రెవెన్యూ అధికారులు ఆకస్మిక దాడులు చేసి సెంటర్ను సీజ్ చేశారు. ఏఎస్రావునగర్లో గ్లోవిష్ బ్యూటీ కేర్ పేరుతో కొంత కాలంగా మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. ఇందులో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు బుధవారం దాడి చేశారు. ఈ సందర్భంగా మాదిపల్లి మహేశ్ అనే వ్యక్తితో పాటు, మరో ఐదుగురు మహిళలను అదుపులోకి తీసుకుని రిమాండ్కు తరలించినట్లు ఇన్స్పెక్టర్ మన్మోహన్ తెలిపారు. చదవండి: (మూడేళ్లు సహజీవనం.. ఇపుడు దూరంగా ఉంటోందని..) -
మసాజ్ సెంటర్ ముసుగులో వ్యభిచారం
అడ్డగుట్ట: మసాజ్ సెంటర్ ముసుగులో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాకు తుకారాంగేట్ పోలీసులు చెక్ పెట్టారు. నిర్వాహకులతో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు. ఇన్స్పెక్టర్ అశోక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఈస్ట్ మారేడుపల్లిలోని రాజేష్ కుమార్ అనే వ్యక్తి ‘ట్రాంక్విల్ యూని సెక్స్ సెలూన్ అండ్ స్పా’ పేరుతో మసాజ్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. మన్నపు శ్రావన్కుమార్, ఎల్క విద్యా సాగర్తో కలిసి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో బుధవారం రాత్రి తుకారాంగేట్ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు శ్రావణ్కుమార్, విద్యాసాగర్, విటులు విద్యానగర్కు చెందిన పులుగుర్త సురేష్, నాచారం ప్రాంతానికి చెందిన మేడల రాజ్ కుమార్తో పాటు ఐదుగురు యువతులను అదుపులోకి తీసుకున్నారు.నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించిన పోలీసులు యువతులను బేగంపేట మహిళా పోలీస్స్టేషన్కు తరలించారు. వారి నుంచి 8 సెల్ ఫోన్లు, రూ. 13,040 నగదు స్వాధీనం చేసుకొని గురువారం రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
బ్యూటీ పార్లర్ పేరుతో క్రాస్ మసాజ్
గోల్కొండ: బ్యూటీ పార్లర్ ముసుగులో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్న వారిని టాస్క్ఫోర్స్ సెంట్రల్ జోన్ టీం పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అబిడ్స్ చిరాక్ గల్లీలో రాధమ్మ అలియాస్ జ్యోతి అనే మహిళ ఎస్ఎస్ న్యాచురల్ ఫ్యామిలీ స్పా అండ్ సెలూన్ పేరుతో బ్యూటీ పార్లర్ నిర్వహిస్తోంది. ఈ బ్యూటీ పార్లర్కు మహ్మద్ ఆరిఫ్ మేనేజర్గా వ్యవహరిస్తున్నాడు. బ్యూటీ పార్లర్ ముసుగులో క్రాస్ మసాజ్ నిర్వహిస్తున్నట్లు సమా చారం అందడంతో ఆదివారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించి నిర్వాహకురాలు రాధమ్మతో పాటు ఇద్దరు బ్యూటీషియన్లు, మేనేజర్ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాగా రాధమ్మ గతంలో నారాయణగూడలో స్లా్పష్ బ్యూటీ సెలూన్ స్పా ముగుసులో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తుండటంతో 2015లో పోలీసులు ఆమెను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. నిందితులను రిమాండ్కు తరలించారు. -
మసాజ్ ముసుగులో.. గుట్టురట్టు!
సాక్షి, గుంటూరు : నగరంలో మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ మసాజ్ సెంటర్ గుట్టును పోలీసులు రట్టు చేశారు. లక్ష్మీపురంలోని బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్పై తర్వాత దాడులు నిర్వహించారు. ఇక్కడ మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు ఒక్కసారిగా దాడులు చేశారు. ఈ దాడుల్లో నలుగురు మహిళలు, నిర్వాహకుడు రామచంద్రరావుతోపాటు అతని అసిస్టెంట్, ఒక విటుడ్ని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 18వేల రూపాయల నగదుతోపాటు, 11సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. బౌన్స్ బ్యూటీ అండ్ మసాజ్ సెంటర్ను నాలుగేళ్ల నుంచి రామచంద్రరావు అనే వ్యక్తి నిర్వహిస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి యువతులను బ్యూటీ పార్లర్లో వర్కర్లుగా పనిచేయిస్తున్నాడు. అయితే నష్టాలు రావడంతో నిర్వాహకుడు రామచంద్రరావు ఈ మార్గాన్ని ఎంచుకున్నాడు. మహిళలతో పురుషులకు మసాజ్ చేయించడమే కాకుండా వ్యభిచారం కూడా చేయిస్తున్నాడు. అర్బన్ ఎస్పీకి వచ్చిన సమాచారం మేరకు మసాజ్ సెంటర్పై నిఘా పెట్టిన పోలీసులు దాడులు నిర్వహించారు. -
మసాజ్ సెంటర్లపై పోలీసుల దాడులు
-
చియాంగ్ మాయ్ : ప్రతిరోజూ పర్వదినమే!
టూర్దర్శన్ ప్రకృతికాంత సోయగం... సాగర అలల నిశ్శబ్ద భాషణం... మలయ సమీరపు శీతలం... పచ్చపచ్చగా మెరిసిపోయే భూతలం... ఇవన్నీ కలగలసిన స్వర్గం చియాంగ్ మాయ్. అక్కడ గడపడం అంటే నిజంగా ఓ సంబరం. చియాంగ్ మాయ్లో చెప్పలేనన్ని విశేషాలు, చూసే కొద్దీ చూడాలనిపించే అందాలు ఎన్నో ఉన్నాయి. మనల్ని కట్టి పడేస్తాయి. చూసే కనులుంటే... ఆస్వాదించే మనసుంటే... ఒక్కసారైనా చియాంగ్ మాయ్కు వెళ్లాల్సిందే! థాయ్ల్యాండ్ని ఒక్క మాటలో నిర్వచించమంటే ఎవరైనా ఏం చెబుతారు? బహుశా ఒక పెద్ద రిలీఫ్ సెంటర్ అంటారేమో! సినిమాల ప్రభావమో ఏమో కానీ... విశ్రాంతి తీసుకోడానికి, ఒత్తిడిని వదిలించుకోవడానికి థాయ్ల్యాండ్ ఓ చక్కని ప్రదేశం అన్న ముద్ర అందరి మనసుల్లోనూ పడిపోయింది. ఒక రకంగా అది నిజమే. కానీ థాయ్ల్యాండ్ అంటే కేవలం విశ్రాంతికి విడిది కాదు. సంప్రదాయ సంగీత సాహిత్యాలకు కూడా విడిదే. అది కేవలం మసాజుల కేంద్రం కాదు. మనసును శాంతి వైపునకు మళ్లించే ఆధ్యాత్మిక కేంద్రం కూడా. సరదాలు తీర్చుకునే ఆధునిక లోకం మాత్రమే కాదు. సంతోషానికి అసలైన అర్థం తెలుసుకునేందుకు పనికొచ్చే సరికొత్త ప్రపంచం కూడా. ఈ వాస్తవం... ఒక్కసారి చియాంగ్ మాయ్ నగరానికి వెళ్తే మనకు బోధపడుతుంది. థాయ్ల్యాండ్లోని అతి పెద్ద నగరాల్లో ఐదవది చియాంగ్ మాయ్. ఆ పేరుకు కొత్త నగరం అని అర్థం. ఒకప్పుడు లానా అనే రాజ్యానికి రాజధాని ఈ నగరం. అప్పట్లో దీన్ని చియాంగ్ రాయ్ అనేవారు. థాయ్ల్యాండ్కు ఉత్తరాన ఉండే ఈ నగరం చుట్టూ ఓ పెద్ద ప్రహారీ గోడ కూడా ఉండేది. కాలక్రమంలో రాజరికం అంతరించింది. జీవన విధానంతో పాటు నగర రూపురేఖలు కూడా బాగా మారిపోయాయి. మెల్లగా ఆ గోడ శిధిలమయ్యి అవశేషాలు మాత్రం మిగిలాయి. చివరికి నగరం పేరు కూడా చియాంగ్ మాయ్గా మారింది. సంద్రపు అలలూ ఇసుక తిన్నెలూ... మలయ పవనాలూ మత్తెక్కించే పూల పరిమళాలూ... పర్వత సానువులూ పుడమి కాగితంపై ప్రకృతి గీసిన పచ్చని చిత్రాలూ... ఆధ్మాత్మిక కేంద్రాలూ అంబరాన్నంటే సంబరాలూ... చియాంగ్ మాయ్లో ప్రతిదీ ప్రత్యేకమే. ప్రతిచోటా అందమే. ప్రతి క్షణమూ ఆనందమే. ఎటు చూసినా బుద్ధుని జాడలే.... చియాంగ్ మాయ్లో ముఖ్యంగా చెప్పుకోవా ల్సింది అక్కడి ఆలయాల గురించి. ఎన్నో ప్రముఖ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ముఖ్యంగా బౌద్ధాలయాలు. ఏడు వందల యేళ్ల పురాతనమైన బౌద్ధాలయం నుంచి, అత్యాధునికంగా నిర్మించిన ఆలయాల వరకూ ఎన్నో ఉన్నాయక్కడ. వాటిలో బౌద్ధ సన్యాసులు నిత్యం ప్రార్థనలు చేస్తూ ఉంటారు. కాషాయపు వస్త్రాలు ధరించిన ఆ సాధువులు దారంట నడిచివెళ్తూ ఉంటే... బుద్ధుడే కనుల ముందు నడయాడుతున్నట్టుగా అనిపిస్తుంది. గుండెల నిండా ఆధ్యాత్మికత నిండిపోతుంది. ఏదో చెప్పలేని ప్రశాంతత మనసంతా పరచుకుంటుంది. ఏడాదంతా పండుగే పండుగ... ప్రతి దేశంలోనూ ప్రతి ప్రాంతంలోనూ పండుగలు ఉంటాయి. కానీ చియాంగ్ మాయ్లో ఉండేటన్ని పండుగలు మరెక్కడా ఉండవు. సంవత్సరం పొడవునా అక్కడ ఏదో ఒక పండుగ జరుగుతూనే ఉంటుంది. అంబ్రెల్లా ఫెస్టివల్, ఫుడ్ ఫెస్టివల్, ఎలిఫెంట్ ఫెస్టివల్, ల్యాటర్న ఫెస్టివల్, ఫ్లవర్ ఫెస్టివల్, బెలూన్ ఫెస్టివల్ అంటూ ప్రతి విషయాన్నీ ఓ పండుగలా చేసుకోవడం చియాంగ్ మాయ్ వారికే చెల్లింది. ఫ్లవర్ ఫెస్టివల్ నాడు థాయ్ల్యాండ్లో పూచే ప్రతి రకమైన పువ్వూ చియాంగ్మాయ్కి చేరుకుంటుంది. వాటితో రకరకాల ఆకృతులు తయారు చేశారు. అలంకారాలు చేస్తారు. మనుషులు సైతం పూలతో అలంకరించుకుంటారు. కొందరైతే పూలతో చేసిన దుస్తులనే వేసుకుంటారు. ఆ రోజంతా చియాంగ్ మాయ్లో పూల పరిమళం గుప్పుమంటుంది. ఇక యేటా ఫుడ్ ఫెస్టివల్కి తప్పకుండా హాజరై తీరాల్సిందే. స్థానిక వంటకాలతో పాటు చైనీస్, జపనీస్ వంటకాలు కూడా అందులో ఉంటాయి. విభిన్నమైన రుచులు, వైవిధ్యభరితమైన వంటకాలను ఆరగించడానికి భోజన ప్రియులకు అంతకంటే మంచి అవకాశం దొరకదు. అంబ్రెల్లా ఫెస్టివల్ నాడు నగరమంతా ఎక్కడ చూసినా గొడుగులే కనిపిస్తాయి. వీధుల్లో వెదురు బొంగులు పాతి, కరెంటు తీగలు వేసినట్టుగా వీధులన్నిటిలో అంత ఎత్తున తీగలు కడతారు. వాటికి రంగురంగుల గొడుగులను వేళ్లాడదీస్తారు. ప్రతి ఒక్కరూ గొడుగు చేతబట్టే బయటికి వెళ్తారు. రంగు రంగుల గొడుగులను అందరూ చేతబూని తిరగడం చూస్తుంటే... ఇలపై వేల ఇంద్రధనుస్సులుఒక్కసారే వెలిశాయా అనిపిస్తుంది. ఇక ల్యాటర్న ఫెస్టివల్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఈ పండుగను ఇ-పెంగ్ అంటారు. ‘ఇ’ అంటే రెండు, ‘పెంగ్’ అంటే నెల అని అర్థం. రెండో నెలలో వచ్చే పండుగ కనుక ఆ పేరుతో పిలుస్తారన్నమాట. ఆ పండుగ రోజున నగరమంతా దీపాలతో అలంకరిస్తారు. చీకటి పడగానే ప్రతి ఇల్లూ దీపాలతో వెలిగిపోతుంది. అందరూ ల్యాటర్న్స (గాలిలో ఎగిరే విధంగా తయారు చేసిన లాంతర్లు) పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వస్తారు. ఒక్కచోట చేరి, ప్రార్థనలు చేసి, ఆపైన ఆ లాంతర్లను గాల్లోకి ఎగరేస్తారు. ఆ లాంతర్లు ఆకాశానికి ఎగసి, చుక్కలతో పోటీపడుతూ మెరుస్తుంటే చూడటానికి రెండు కళ్లూ చాలవు. ఇలా చేయడం వల్ల కీడు మొత్తం పోయి శుభం జరుగుతుందని అక్కడివారి విశ్వాసం. అలాగే బెలూన్ ఫెస్టివల్, ఎలిఫెంట్ ఫెస్టివల్ తదితర ఎన్నో పండుగలు ఇక్కడ ఎంతో ఘనంగా జరుగుతాయి. వీటన్నిటినీ చూడటానికి విదేశాల నుంచి సైతం సందర్శకులు వస్తూ ఉంటారు. చియాంగ్ మాయ్ టూరిజం అత్యంత వేగంగా అభివృద్ధి చెందడానికి, థాయ్ల్యాండ్లోని ప్రముఖ టూరిస్టు ప్రాంతాల్లో ప్రముఖమైనదిగా చియాంగ్ మాయ్ మారడానికి ఈ పండుగలే కారణం అంటుంది అక్కడి ప్రభుత్వం. నగరం నిద్రపోదు... సాధారణంగా ప్రపంచం పగలు మేలుకుంటుంది. రాత్రిపూట నిద్రలోకి జారుకుంటుంది. కానీ చియాంగ్ మాయ్లో అలా కాదు. పగలు ప్రజలు పనుల్లో నిమగ్నమై పోతారు. రాతిరైతే షాపింగ్లు, విందులు, వినోదాలు, సరదాలు సంతోషాలంటూ బిజీ అయిపోతారు. ముఖ్యంగా షాపింగ్ అంతా చాలావరకూ రాత్రి పూటే చేస్తుంటారు. అందుకే చియాంగ్ మాయ్ నైట్ బజార్ చాలా ఫేమస్. ఈ బజార్లో షాపింగ్ చేయడం కోసం విదేశీ సందర్శకులు పని గట్టుకుని వస్తుంటారు కూడా. ఈ విశేషాలన్నీ ఒకెత్తయితే అక్కడి ప్రకృతి సౌందర్యం ఒకెత్తు. ఎప్పుడూ చల్లగా వీచే గాలి హాయిపరుస్తుంది. వృక్ష సంపద కన్నులవిందు చేస్తూ ఉంటుంది. దానికితోడు యోగా, మసాజ్ సెంటర్లు కూడా ఉండటంతో మనసుతో పాటు శరీరానికి కూడా ఆహ్లాదమే! * చియాంగ్ మాయ్లో ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది. హైదరాబాద్ నుంచి అక్కడికి నేరుగా వెళ్లవచ్చు. సీజన్ను బట్టి మనిషికి ఇరవై నుంచి ముప్ఫై వేల వరకూ ఉంటుంది టిక్కెట్ వెల. వెళ్లేటప్పుడే రిటర్న్ టిక్కెట్ కూడా చేయించుకుంటే కాస్త తక్కువకు వచ్చే అవకాశం ఉంటుంది! * థాయ్ల్యాండ్ కరెన్సీని థాయి భట్ అంటారు. మన వంద రూపాయలు యాభై మూడు థాయి భట్స్కి సమానం! * చియాంగ్ మాయ్లో అతి పెద్ద జూ ఒకటి ఉంది. దీనిలో విస్తారమైన జంతు సంపద ఉంది. దాంతో జంతు ప్రేమికులకు మంచి టైమ్పాస్. దానికి తోడు ప్రత్యేకంగా ఎలిఫెంట్ నేచర్ పార్క ఒకటుంది. ఇక్కడ ఏనుగులను సంరక్షించడమే కాదు... మావటి కావాలనుకునే వారికి ట్రెయినింగ్ కూడా ఇస్తుంటారు. వైల్డ్ లైఫ్ టూర్ ప్యాకేజీలు ఉంటాయి. బుక్ చేసుకుంటే మొత్తం అన్నిటినీ ఒకేసారి చూసేయొచ్చు. * బో సంగ్ అనే ప్రాంతం హస్త కళలకు ప్రసిద్ధి. ఇక్కడ తొంభై తొమ్మిది శాతం మంది గొడుగుల తయారీదారులే. వీరు ఓ ప్రత్యేక పద్ధతిలో తయారుచేసే గొడుగులు విదేశాలకూ ఎగుమతి అవుతుంటాయి! -
‘మసాజ్’పై కొరడా
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో పుట్టగొడుగుల్లా మసాజ్ సెంటర్లు వెలుస్తున్నాయి. కొన్ని సెంటర్లు కేవలం మసాజ్ వరకే పరిమితమైనా, మరికొన్ని సెంటర్లు అసాంఘిక కార్యక్రమాలకు వేదికగా మారాయి. విదేశాల నుంచి, ఉత్తరాది రాష్ట్రాల నుంచి యువతుల్ని రంగంలోకి దించి మసాజ్ ముసుగులో వ్యభిచారం నిర్వహించే సంస్థలు కూడా ఉన్నారుు. ఇటీవల పోలీసుల దాడుల్లో ఈ వ్యభిచార గుట్టు రట్టవుతోంది. అదే సమయంలో న్యాయబద్ధంగా వ్యవహరించే మసాజ్ సెంటర్లలోనూ దాడులు జరుగుతుండడం ఆయా యాజమాన్యాల్ని కలవరంలో పడేస్తున్నాయి. తమ సెంటర్లపై తరచూ పోలీసులు దాడులు చేస్తుండడాన్ని తీవ్రంగా పరిగణించి ఆ సంస్థలు మద్రాసు హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషన్ : చెన్నైలోని మసాజ్ సెంటర్ల యాజమాన్యాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారుు. తరచూ తమసెంటర్లపై పోలీసులు దాడులు చేస్తుండడం తీవ్ర నష్టా న్ని కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసుల దాడుల కట్టడికి చర్యలు తీసుకోవాలని విన్నవించారు. ఈ పిటిషన్ను న్యాయమూర్తి సుబ్రమణియన్ నేతృత్వంలోని బెంచ్ విచారించింది. వాదనల అనంతరం న్యాయమూర్తి కొన్ని అభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. థాయ్లాండ్, మలేషియా వంటి దేశాల్లో మసాజ్ సెంటర్ల నిర్వహణకు కొన్ని రకాల నిబంధనలు, ఆంక్షలు ఉన్నాయని వివరించారు. ఈ సెంటర్ల కోసం ప్రత్యేక చట్టాలు చేశారని పేర్కొన్నారు. అలాంటి చట్టాలు భారత్లో ఎందుకు లేవని ప్రశ్న లేవదీశారు. మసాజ్ సెంటర్ల క్రమబద్ధీకరణ లక్ష్యంగా ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆదిశగా చర్యలు చేపట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని పేర్కొన్నారు. మసాజ్ సెంటర్లపై కొరడా ఝుళిపించడం, క్రమబద్ధీకరణ దిశగా ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ చట్టం తీసుకురావడంతో సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదికను సమర్పించాలని ఉత్తర్వులు జారీ చేశారు. తదుపరి విచారణను ఈనెల 31కు వాయిదా వేస్తూ, ఆ రోజున నివేదికను సమర్పించాలని ఆదేశించారు.