-
వర్షార్పణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలు అన్నదాతకు కన్నీళ్లు మిగిల్చాయి. కళ్లాల్లో, మార్కెట్ యార్డుల్లోని పంట ఉత్పత్తులు ధ్వంసమయ్యాయి. మిర్చి, సోయాబీన్, కందులు, వేరుశనగ వర్షానికి తడిసిపోయాయి. కరీంనగర్, పెద్దపల్లి, వనపర్తి, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో 14 మండలాల్లోని 104 గ్రామాల్లో వేసిన పంటలకు నష్టం వాటిల్లిందని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి నివేదించింది. ఆయా జిల్లాల్లో 3,845 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు తెలిపింది. 2,077 మంది రైతులు నష్టపోయినట్లు నివేదిక వెల్లడించింది. ప్రధానంగా 2,708 ఎకరాల్లో వేరుశనగ పంట దెబ్బతిన్నది. మొక్కజొన్న పంటకు 679 ఎకరాల్లో నష్టం వాటిల్లింది. 220 ఎకరాల్లో వరి నీట మునిగింది. అయితే వ్యవసాయశాఖ నష్టాన్ని అంచనా వేయడానికి అంతగా ఆసక్తి చూపించడంలేదు. ఈ కొద్దిపాటి దానికి ఎందుకు హంగామా అన్న ధోరణి ప్రదర్శిస్తుందన్న ఆరోపణలున్నాయి. అనధికారిక అంచనా ప్రకారం.. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 వేల ఎకరాలకు పైనే పంట నష్టం జరిగి నట్లు సమాచారం. సిద్దిపేట జిల్లాలో అకాల వర్షాలతో 200 ఎకరాల సోయాబీన్, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న.. 100 ఎకరాల్లో కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. ఫలితంగా రైతులకు రూ.15 లక్షల నష్టం వాటిల్లింది. వరంగల్ రూరల్ జిల్లాలో 2,250 ఎకరాల్లో, భూపాలపల్లి జిల్లాలో వందలాది ఎకరాల్లో మిర్చి పంటకు నష్టం వాటిల్లింది. భారీ వర్షాలతో మొక్కజొన్న పంట దెబ్బతిన్నది. లేత కంకులు విరిగిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఏరిన మిర్చిని కళ్లాల్లో పెట్టిన రైతులకు మాత్రం ఈ వర్షాలు కడగండ్లు మిగిల్చాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో కొన్నిచోట్ల కళ్లాల్లోని మిర్చి వర్షం నీటిలో కొట్టుకుపోయింది. అలాగే మార్కెట్ యార్డుల్లో విక్రయానికి తీసుకువచ్చిన కందులు, వేరుశనగ కూడా తడిసిపోయాయి. కొన్నిచోట్ల కంది చేలు దెబ్బతిన్నట్లు, వర్షానికి కాయ రాలిపోయినట్లు అధికారులు చెబుతున్నారు. చివరితీతలో ఉన్న పత్తి కూడా ఈ వర్షానికి దెబ్బతిన్నది. నేడూరేపు పొడి వాతావరణం... హిందూ మహాసముద్రం దాన్ని ఆనుకుని ఉన్న అండమాన్, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. మరోవైపు ఈశాన్య దిశ నుంచి గాలులు వీస్తున్నాయి. అయితే మంగళ, బుధవారాల్లో మాత్రం పొడి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఇదిలా ఉండగా గత 24 గంటల్లో రాష్ట్రంలో అనేకచోట్ల మోస్తరు వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా కొణిజర్లలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చండ్రుగొండలో 6 సెంటీమీటర్లు, ఆర్మూరు, డోర్నకల్, తల్లాడ, నల్లగొండ, దేవరకొండ, సూర్యాపేటలో 5 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మంచిర్యాల జిల్లాలో పత్తి పూర్తిగా తడిసిపోయింది. మరోవైపు పగటి ఉష్ణోగ్రతలు రాష్ట్రవ్యాప్తంగా గణనీయంగా పడిపోయాయి. సాధారణం కంటే రెండు నుంచి తొమ్మిది డిగ్రీల వరకు తగ్గిపోయాయి. రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణానికి అటుఇటుగా నమోదయ్యాయి. మెదక్లో కనిష్ట ఉష్ణోగ్రత 12 డిగ్రీలు నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పలుచోట్ల జనం చలితో ఇబ్బందిపడ్డారు. నగరంపై పొగమంచు పంజా... రాజధానిపై మరో రెండురోజులపాటు పొగమంచు దుప్పటి కమ్మేసే అవకాశాలున్నట్లు బేగం పేటలోని వాతావరణ శాఖ ప్రకటించింది. అల్పపీడన ద్రోణి ప్రభావంతో నగరంలో గత మూడు రోజులుగా ఆకాశం మేఘావృతమై తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం నమోదైన విషయం విదితమే. అయితే ప్రస్తుతానికి అల్పపీడన ద్రోణి బలహీనపడినప్పటికీ మంగళ, బుధ వారాల్లో ఆగ్నే య, దక్షిణ దిశ నుంచి వీస్తున్న తేమ, వేడి గాలులతో తెల్లవారుజామున ఆకాశం మేఘావృతమై పొగమంచు దుప్పటి కమ్ముకునే అవకాశాలున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ సమయంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రయాణికులు, ఉబ్బసం వ్యాధిగ్రస్తులు, చిన్నారులు, వృద్ధులు బయటికి వెళ్లేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశాలున్నాయన్నా రు. కాగా సోమవారం నగరంలో గరిష్టంగా 21.2, కనిష్టంగా 17.1 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గాలిలో తేమ 94 శాతం గా నమోదైంది. సాధారణం కంటే 9 డిగ్రీల మేర తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవడం, గాలిలో తేమ అనూహ్యంగా పెరగడంతో ప్రజలు చలితో ఇబ్బందిపడ్డారు. -
మార్కెట్యార్డు బడ్జెట్పై సమీక్ష
అనంతపురం అగ్రికల్చర్: మార్కెట్యార్డుల ఆదాయ, వ్యయాలకు సంబంధించి 2017–18 బడ్జెట్ రూపకల్పనపై అనంతపురం, కర్నూలు జిల్లాలకు చెందిన మార్కెట్యార్డుల సెక్రటరీలతో మార్కెటింగ్శాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్ (ఆర్జేడీ), కమిషనరేట్ డిప్యూటీ డైరెక్టర్ అనసూయమ్మ సమీక్షా సమావేశం నిర్వహించారు. సోమవారం స్థానిక మార్కెటింగ్శాఖ ఏడీ బి.హిమశైల కార్యాలయంలో అంతర్గత సమావేశంలో కర్నూలు ఏడీ, 25 మంది సెక్రటరీలు హాజరయ్యారు. గతేడాది రెండు జిల్లాల్లోనూ వసూళ్లు గణనీయంగా తగ్గిపోవడంతో ఈసారి పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్లాలని ఆదేశించారు. త్వరలోనే మరోసారి కమిషనరేట్ బృందం జిల్లాలో పర్యటించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి యార్డుల వారిగా లక్ష్య నిర్ధేశన చేయనున్నారని ఏడీఎం హిమశైల తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Watch Live: హిందూపురంలో సీఎం జగన్ ప్రచార సభ
డీబీటీ చివరిదశ చెల్లింపులకు మోకాలడ్డుతోన్న టీడీపీ.
కూలి పనికి పోతున్న కిన్నెర వాయిద్య కారుడు.. మాటలు చెబుతున్న సర్కారు
జగన్ మాటిచ్చాడంటే చేస్తాడు అనే నమ్మకమే నా వెంట ఇంత జనాన్ని నిలబెట్టింది
నా తొలి సంతకం వాళ్ళ కోసమే.. కూటమి మరో కుట్ర..!
శోభిత పోస్ట్.. సమంత స్టైలిష్ట్ రిప్లై
ముంబై ఎయిర్పోర్టులో 12 కోట్ల విలువైన బంగారం, ఐఫోన్లు సీజ్
ఎన్నికల వేళ కలకలం.. బీజేపీ మంత్రిని చంపేస్తామని బెదిరింపులు!
సంజయ్లీలా భన్సాలీ 'హీరామండి' వెబ్ సిరీస్ ఎలా ఉంది..?
నాడు మోదీకి వంట వండిన దీపక్.. ఇప్పుడేం చేస్తున్నారు?
తప్పక చదవండి
- కెనడాలో మనవడిని చూడ్డానికి వెళ్లి...మనవడితో సహా దుర్మరణం
- Banjara Hills: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం.. నిండు ప్రాణం బలి
- తెలంగాణలో భానుడి భగభగలు..!
- అందుకే ఓడిపోయాం.. అయినా సరే: హార్దిక్ పాండ్యా
- తాతా.. నీకు టాటా..
- రోహిత్ వేముల ఆత్మహత్య కేసు మళ్లీ దర్యాప్తు చేస్తాం
- స్విమ్మింగ్ పూల్ ఒడ్డున ఎమ్మెల్యే వినూత్న నిరసన!
- తిరుమలలో వడగళ్ల వర్షం (ఫొటోలు)
- కందికుంట అడ్డంగా దొరికినా..
- నిందితుడిని హంతకుడని ఎలా ముద్ర వేస్తారు?
Advertisement