-
2000 కి.మీ చేరుకోనున్న వైఎస్ జగన్ పాదయాత్ర
-
ఆలయాల భూ పత్రాలన్నీ ఆయన ఇంట్లోనే!
సాక్షి, అమరావతి/విజయవాడ లీగల్: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో బుధవారం దొరికిపోయిన దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ మేడేపల్లి విజయరాజు వ్యవహారంలో తవ్వేకొద్దీ విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఏపీ, తెలంగాణాల్లోని ఆరు ప్రాంతాల్లో బుధవారం దాడులు నిర్వహించిన ఏసీబీ అధికారులు గురువారం కూడా సోదాలు కొనసాగించారు. తన ఇంటినే అడ్డాగా చేసుకుని సాగించిన అక్రమాలు చూసి అధికారులు కంగుతింటున్నారు. అన్నవరం, సింహాచలం, పెనుగంచిప్రోలు, హైదరాబాద్లోని ఎల్లమ్మ దేవాలయాలతో పాటు ఏపీలోని 13 జిల్లాల్లోని దేవాలయ భూముల పత్రాలను ఏసీబీ అధికారులు ఆయన ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నారు. కాగా, దేవాలయ భూములను ఆక్రమించకున్న వారు, ఇతర అవసరాలకు వాడుకుంటున్న వారు, వివాదాలలో చిక్కుకున్న వాటి విషయంలో విజయరాజును ఆశ్రయిస్తే.. కోర్టుకు వెళ్లాలని ఆయనే సలహా ఇస్తాడని ఏసీబీ దృష్టికి వచ్చింది. కోర్టు ఎలా స్పందించినా దాన్ని అవకాశంగా తీసుకుని అవినీతికి పాల్పడుతున్నట్టు ఏసీబీ విచారణలో తేలింది. కోర్టు పరిధిలోకి వెళ్లే పలు కేసుల్లో ‘వెరిఫై ఇట్’ అని చేసే సూచనలను కూడా విజయరాజు అడ్డుపెట్టుకుని, దేవాలయ భూములను వాడుకుంటున్న వారి నుంచి పెద్ద మొత్తాలు తీసుకున్నట్టు ఏసీబీ గుర్తించింది. ఈ వ్యవహారాల్లో శాఖాపరంగా కొందరికి లబ్ది చేకూర్చి పెద్దఎత్తున అక్రమార్జనకు పాల్పడినట్టు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. విజయరాజు ఇంట్లో దొరికిన పత్రాలు, జిరాక్స్ కాపీలు, తెలంగాణాకు చెందిన రెండు ఫైళ్లు, ఏపీకి చెందిన ఒక ఫైలును అధికారులు దేవాదాయ శాఖకు అప్పగించారు. కాగా, విజయరాజుకు ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తూ ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎం.వెంగయ్య గురువారం ఉత్తర్వులు జారీచేశారు. -
నకిలీ పోలీసుల అరెస్ట్
ఏలూరు(ఆర్ఆర్ పేట) : మాదేపల్లి గ్రామానికి చెందిన ఒక మహిళను పోలీసులమని చెప్పి బెదిరించిన కేసులో నిందితులను రూరల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. రూరల్ ఎస్ఐ ఎం.వి.సుభాష్ కథనం ప్రకారం.. మూడు రోజుల క్రితం మాదేపల్లి గ్రామానికి చెందిన ఈడా బుజ్జి స్థానిక ఆశ్రం ఆస్పత్రి వద్ద నిలుచుని ఉండగా నగరంలోని సుంకరవారి తోటకు చెందిన అన్నంరెడ్డి మురళీకష్ణ, వైఎస్సార్ కాలనీకి చెందిన పిల్లా హేమంత్, ఇందిరమ్మ కాలనీకి చెందిన కూనిశెట్టి దుర్గా ఆదిత్య తాము పోలీసులమని చెప్పి ఆమె వద్ద నుంచి రూ.1500తో పాటు ఒక సెల్ఫోన్ లాక్కున్నారు. దీంతో ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నిందితుల వివరాలు తెలిశాయని, సోమవారం వారిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ తెలిపారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement