breaking news
Laps Policy
-
ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ ఆఫర్
హైదరాబాద్: వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ మరో విడత కల్పించింది. కరోనాతో జీవిత బీమా కవరేజీకి ప్రాధాన్యం పెరిగిన క్రమంలో పాలసీదారుల ప్రయోజనాల కోణంలో ఎల్ఐసీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకు పాలసీ పునరుద్ధరణ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. లేట్ఫీజులో తగ్గింపును ఇస్తున్నట్టు తెలిపింది. వైద్య పరీక్షలకు సంబంధించి ఎటువంటి రాయితీలు ఉండవు. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపైనా లేట్ ఫీజులో రాయితీ ఇస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పాలసీదారులు చివరిగా ప్రీమియం కట్టిన తేదీ నుంచి ఐదేళ్లకు మించకుండా ఉంటే పునరుద్ధరించుకునేందుకు అర్హత ఉంటుంది. రూ.లక్ష వరకు బీమాతో కూడిన ప్లాన్ల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంలో 20 శాతం (గరిష్టంగా రూ.2,000) తగ్గింపు పొందొచ్చు. రూ.1– 3 లక్షల మధ్య పాలసీలకు ఆలస్యపు రుసుంలో 25 శాతం (గరిష్టంగా రూ.2,500), రూ.3లక్షలకు పైన రిస్క్ కవర్తో కూడిన పాలసీలకు ఆలస్యపు రుసుంలో 30 శాతం (గరిష్టంగా రూ.3,000) తగ్గింపునిస్తోంది. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు అయితే ఆలస్యపు రుసుంలో పూర్తి రాయితీ ఇస్తోంది. అధిక రిస్క్ కవర్తో ఉంటే టర్మ్ ప్లాన ఆలస్యపు రుసుంలో తగ్గింపు ఉండదు. -
ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణకు అవకాశం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి సమయంలోనూ పాలసీదారులు తమ రిస్క్ కవర్ను కొనసాగించుకునేందుకు వీలుగా ఎల్ఐసీ మరోసారి పెద్ద మనసు చేసుకుంది. ల్యాప్స్ అయిన పాలసీలను పునరుద్ధరించుకోవచ్చంటూ ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. మార్చి 6 వరకు ఇది కొనసాగనుంది. కొన్ని షరతుల మేరకు పాలసీదారులు తమ ల్యాప్స్ అయిన పాలసీలను మార్చి 6 వరకు పునరుద్ధరించుకోవచ్చు. పాలసీదారులు నిర్దేశిత గడువులోపు పాలసీ ప్రీమియం చెల్లించకపోతే అవి ల్యాప్స్ (రద్దు) అవుతాయి. ఇలా ల్యాప్స్ అయిన పాలసీలను ఇప్పుడు పునరుద్ధరించుకోవడం ద్వారా బీమా కవరేజీ కొనసాగేలా చూసుకోవచ్చు. దేశవ్యాప్తంగా ఎల్ఐసీకి చెందిన 1,526 శాటిలైట్ కార్యాలయాల నుంచి సైతం పాలసీదారులు తమ ల్యాప్స్డ్ పాలసీలను పునరుద్ధరించుకోవచ్చని ఎల్ఐసీ తెలిపింది. ప్రీమియం చెల్లించని ఏడాది నుంచి గరిష్టంగా ఐదేళ్లలోపు ల్యాప్స్ అయిన వాటికి ఈ అవకాశం ఉంటుందని ఎల్ఐసీ స్పష్టం చేసింది. కోవిడ్–19 ప్రశ్నావళికితోడు, తమ ఆరోగ్య స్థితి మంచిగానే ఉందన్న స్వీయ ధ్రువీకరణ తీసుకోవడం ద్వారా పాలసీలను పునరుద్ధరించనున్నట్టు తెలిపింది. ఆలస్యపు ఫీజులో 20 శాతం రాయితీ ఇస్తున్నట్టు.. లేదా పునరుద్ధరణకు రూ.2,000 చార్జీ తీసుకోనున్నట్టు పేర్కొంది. -
పాలసీదారులకు ఎల్ఐసీ ఆఫర్
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ జీవిత బీమా దిగ్గజం ఎల్ఐసీ తాజాగా రెండేళ్ల పైబడి ల్యాప్స్ అయిన పాలసీలను కూడా పునరుద్ధరించుకునే వెసులుబాటు ప్రకటించింది. 2014 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చిన బీమా రంగ నియంత్రణ సంస్థ ఐఆర్డీఏఐ నిబంధనల ప్రకారం సాధారణంగా ప్రీమియం చెల్లింపులు ఆపేసిన నాటి నుంచి రెండేళ్ల లోపు మాత్రమే రివైవల్కి అవకాశం ఉంది. 2014 జనవరి 1 తర్వాత తీసుకున్న పాలసీలు ల్యాప్స్ అయి రెండేళ్లు దాటిపోతే.. పునరుద్ధరణకు వెసులుబాటు లేదు. అయితే, పాలసీదారులకు జీవిత బీమా కవరేజీ ప్రయోజనాలు లభించేలా వీటిని కూడా రివైవ్ చేసే అవకాశం కల్పించాలంటూ ఐఆర్డీఏఐని ఎల్ఐసీ కోరింది. దానికి అనుగుణంగానే తాజా మార్పులు చేసింది. వీటి ప్రకారం.. 2014 జనవరి 1 తర్వాత పాలసీలు తీసుకున్న వారు నాన్–లింక్డ్ పాలసీలను అయిదేళ్ల లోపు, యూనిట్ లింక్డ్ పాలసీలను మూడేళ్ల లోపు పునరుద్ధరించుకోవచ్చు. -
‘ల్యాప్స్ పాలసీ’ల ఆధారంగా లూటీ
* బీమా మొత్తం ఇప్పిస్తామంటూ మోసాలు * ఢిల్లీ కేంద్రంగా కథ నడిపిన గ్యాంగ్ * పది మందిని అరెస్టు చేసిన సైబర్ క్రైమ్ కాప్స్ * రూ.7.3 లక్షలు స్వాధీనం. రూ.1.5 కోట్ల ఫ్రీజ్ సాక్షి, హైదరాబాద్: ల్యాప్స్ అయిన ఇన్సూరెన్స్ పాలసీ డేటానే ఆధారం... ఢిల్లీలోని మీట్నగర్లోని కాల్సెంటర్ కేంద్రం... ఆరుగురు సూత్రధారులు... సీన్ కట్ చేస్తే దేశవ్యాప్తంగా కోట్ల రూపాయలు కోల్పోయిన బాధితులు... ఈ ఘరానా గ్యాంగ్ గుట్టును రట్టు చేసిన సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్) అధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు పది మంది నిందితుల్ని అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.7.3 లక్షలు స్వాధీనం చేసుకున్నామని, వివిధ బ్యాంక్ ఖాతాల్లోని ఉన్న రూ.1.54 కోట్లు ఫ్రీజ్ చేశామని సంయుక్త పోలీసు కమిషనర్ టి.ప్రభాకరరావు వెల్లడించారు. సైబర్ క్రైమ్ ఏసీపీ ఎస్ఎంకే ఇస్మాయిల్తో కలసి బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. సేల్స్ ప్రమోషన్తో షురూ: ఢిల్లీలోని మీట్నగర్ ప్రాంతానికి చెందిన ఆరుగురు సూత్రధారులు రెండు నెలల క్రితం ఎమరిక్ కన్జూమర్ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, యునిక్ యాంబిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లతో కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. వివిధ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఖాతాదారులను వెతికే సేల్స్ ప్రమోషన్ ఈ కాల్సెంటర్ల ఉద్దేశం. ఇందుకు 200 మంది టెలీకాలర్స్ను నియమించారు. ఈ వ్యాపారం లాభసాటిగా లేకపోవడంతో మోసాలకు తెరలేపారు. గతంలో వివిధ ఇన్సూరెన్స్ కంపెనీల్లో పనిచేసి, వాటి కస్టమర్స్ డేటాను సంపాదించగలిగే ఏడుగుర్ని పాత్రధారులుగా చేశారు. వీరి ద్వారా ఆయా కంపెనీల్లో ‘ల్యాప్స్ పాలసీదారుల’ వివరాలు సేకరించారు. వివిధ ‘పేర్ల’తో టోకరా... ఈ డేటాబేస్ ఆధారంగా టెలీకాలర్స్ ల్యాప్స్ అయిన పాలసీ వివరాలు చెప్తూ ఖాతాదారులకు ఫోన్ చేసి నమ్మకం కలిగిస్తారు. బీమా మెచ్యూరిటీ మొత్తాన్ని ఇప్పిస్తామంటూ వల వేస్తారు. ఆకర్షితులైన వారికి దాని నిమిత్తం తమ సంస్థల్లో కొంత మొత్తం పెట్టుబడి పెట్టాలని షరతు విధిస్తారు. ఇండియా వాల్యూ కార్డ్ సహా 14 స్కీములు, సంస్థల పేరు చెప్పి డబ్బు డిపాజిట్ చేయించుకుంటారు. ఇలా నగదు డిపాజిట్ చేయడానికి అవసరమైన 45 బ్యాంకు ఖాతాలను లక్నోకు చెందిన ముగ్గురు నిందితులు తెరిచారు. డబ్బు డిపాజిట్ అయిన తరువాత వారి నెంబర్లు బ్లాక్ చేసేస్తారు. ఈ పంథాలో హైదరాబాద్కు చెందిన మాజీ పోలీసు అధికారి మహ్మద్ లియాఖత్ అలీఖాన్కు కూడా టోకరా వేశారు. రూ.8.15 లక్షలు మోసపోయిన ఆయన గత నెల 24న సీసీఎస్లో ఫిర్యాదు చేశారు. పది మంది అరెస్టు: సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేశారు. బ్యాంకు ఖాతాలతో సాంకేతిక ఆధారాలను బట్టి ముందుకు వెళ్లిన ప్రత్యేక బృందం ఢిల్లీలో ఏడుగురు పాత్రధారులు, లక్నోలో ముగ్గురు బ్యాంకు ఖాతాలు సమకూర్చిన వారిని అరెస్టు చేసింది. వీరి నుంచి పోలీసులు రూ.7.3 లక్షలు, మూడు ల్యాప్టాప్లు, 11 హార్డ్డిస్క్లు, 37 సెల్ఫోన్లు, 11 రిజిస్టర్లు స్వాధీనం చేసుకున్నారు. సూత్రధారులు ఢిల్లీకి చెందిన ప్రశాంత్ అరోరా, దీపక్ అరోరా, రాహుల్ విర్మానీ, జ్ఞానేశ్వర్, సమ్రత్ గుప్తా, పియూష్లు పరారీలో ఉన్నారు. దేశ వ్యాప్తంగా మోసపోయిన వారి వివరాలు హార్డ్డిస్క్లు విశ్లేషించడం ద్వారా తెలుస్తాయని ప్రభాకరరావు తెలిపారు. బాధితులు ఎవరైనా ఉంటే స్థానిక పోలీసు స్టేషన్లు లేదంటే సైబర్ క్రైమ్ పోలీసులకు 9490616648 (ఇన్స్పెక్టర్ ప్రసాద్), 9490616622 (ఏసీపీ ఇస్మాయిల్)కు ఫిర్యాదు చేయాలని కోరారు. చిక్కింది వీరే:ఢిల్లీకి చెందిన రాకేష్ కుమార్ మిశ్రా, ఉదయ్ మహాజన్, సర్దుల్ సిద్ధు, రాజీవ్సింగ్, రాజీవ్ వర్మ, దిల్బార్ కైంతురా, సరోజ్ కుమార్, లక్నో వాసులు అలోక్ శుక్లా, రమేష్ యాదవ్, ఇఫ్తెకారుద్దీన్. ఈ కంపెనీల పేర్లతోనే మోసాలు: ఇండియన్ వాల్యూ కార్డ్స్, ఇండియన్ సొల్యూషన్స్, యునిక్ సొల్యూషన్స్, స్టార్ క్లబ్, క్యాపిటల్ వాల్యూ, సిటీ వాల్యూ కార్డ్స్, స్టాండర్డ్ వాల్యూ, స్టాండర్డ్ సొల్యూషన్స్, ద అవెన్యూ, ఆమ్రో సొల్యూషన్స్, ఫ్యూచర్ సొల్యూషన్స్, యునిక్ యాంబిష్ ప్రైవేట్ లిమిటెడ్, సావరిన్ ఇన్సూరెన్స్ కంపెనీ, నాలెడ్జ్ యాంబిషన్స్.