-
న్యాయ నిర్ణయంలో అన్యాయం
రాజమండ్రి/ రాజమండ్రి కల్చరల్ : నంది నాటకోత్సవాల అనంతరం కొన్ని సమాజాల కళాకారులు న్యాయనిర్ణేతలపై రౌద్రరసాన్ని ప్రదర్శించారు. పక్షపాత ధోరణితో తమ ప్రదర్శనలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ఆనం కళాకేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. కళాకేంద్రంలో గత 15 రోజులుగా జరుగుతున్న నంది నాటకోత్సవాల బహుమతులను రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ చివరిరోజైన శనివారం ప్రకటించారు. అయితే కొన్ని నాటకాలకు అసలు బహుమతులే రాకపోవడం, ఒక్కో నాటకానికి మూడేసి బహుమతులు రావడాన్ని కొన్ని సమాజాల వారు నిరసించారు. న్యాయ నిర్ణయంలోప్రాంతీయ వివక్ష చూపారని ఆరోపించారు. ‘కొమరం భీం, పడగనీడ, ఖుర్బాని, వికసించిన మందారాలు’ ప్రదర్శనలపై పక్షపాత ం చూపారని, తమకు న్యాయం చేయూలని డిమాండ్ చేశారు. ‘కొమరం భీం’కు గతంలో మంచి అవార్డులొచ్చాయని, ఈసారి ఏమీ తెలియనివారిని న్యాయనిర్ణేతలుగా నియమించడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని ఆరోపించారు. ‘పడగ నీడ’ సాంఘిక నాటికకు అసలు బహుమతులే రాకపోవడం దారుణమని ఆ కళాకారులు ఆవేదన చెందారు. తెలంగాణ కు చెందిన సమాజం ప్రదర్శన కావడంతోనే ‘కొమరం భీం’పై పక్షపాతం చూపారని కొందరు ఆరోపించారు. ‘ఖుర్బాని’ సాంఘిక నాటకం అందరి ప్రశంసలు పొందిందని, దేశభక్తిని చాటి చెప్పిన ఆ నాటకానికి తృతీయ బహుమతి ప్రకటించడం సమంజసం కాదన్నారు. ప్రేక్షకులను ఇందులో భాగస్వాముల్ని చేసి ఉంటే అందరికీ న్యాయం జరుగుతుందన్నారు. కళాకేంద్రం వద్ద ఆందోళన జరుగుతున్న విషయం తెలిసిన పోలీసు బలగాలు అక్కడకు చేరుకున్నారుు. ముఖ్యమంత్రి పాల్గొంటున్న బహుమతీ ప్రదానోత్సవ సభావేదిక వద్దకు వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారు హాలు బయట గేటువద్దే కూర్చుని ఆందోళన కొనసాగించారు. కాగా తమకు ఏ విభాగంలోనూ కనీసం ఒక్క బహుమతి కూడా రాలేదని ‘వికసించిన మందారాలు’ కళాకారులు ఆవేదన చెందారు. ఒకే సమాజానికి, ఒకే ప్రదర్శనకు రెండేళ్లూ నందులా? ఒకే సంస్థ, ఒకే దర్శకుడి ఆధ్వర్యంలో ప్రదర్శించిన రెండు బాలల సాంఘిక నాటికలను వరుసగా 2013, 2014 సంవత్సరాలకు బంగారు నందులకు ఎంపిక చేయడాన్ని కొందరు తప్పుపట్టారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎందరో బాల కళాకారులు ఉత్సాహభరితంగా బాలల సాంఘిక నాటికలలో పాల్గొన్నారు. అరుుతే వైఎస్సార్ జిల్లా, రాజంపల్లి జిల్లా పరిషత్ పాఠశాల ప్రదర్శించిన ‘మేము సైతం’ 2013 సంవత్సరానికి, అదే సమాజం ప్రదర్శించిన ‘మనో వైకల్యం’ 2014 సంవత్సరానికి ఉత్తమ బాలల సాంఘిక నాటికలుగా ఎంపికయ్యాయి. రెండింటికీ కె.వి.రంగారావు దర్శకుడు. ఒకే సంస్థకు ఇలా గుత్తగా ఇవ్వడం కాక ఇతర సంస్థలను కూడా ప్రోత్సహించి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రాజమహేంద్రికి కళ తెస్తాం
రాజమండ్రి / రాజమండ్రి రూరల్: కళాకారులకు పుట్టిల్లు అయిన రాజమండ్రిని కళాపరంగా తెలుగుదేశంప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. నంది నాటక బహుమతీ ప్రదానోత్సవం రంగరంగ వైభవంగా శనివారం రాత్రి రాజమండ్రి సుబ్రహ్మణ్య మైదానంలో జరిగింది. ఏపీ చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుక ముగింపు అనంతరం జరిగిన ఈ కార్యక్రమంలో చంద్రబాబు మాట్లాడుతూ 15 రోజులుగా నందినాటకోత్సవాలను కన్నులపండుగగా నిర్వహించారని అభినందించారు. రాజమండ్రిని బ్రహ్మాండమైన నగరంగా తీర్చిదిద్దేలా ప్రణాళికతో ముందుకు వెళతామని చెప్పారు. ప్రతిష్టాత్మకమైన గోదావరి పుష్కరాలకు రూ.1400 కోట్లు ఖర్చు చేస్తున్నామని చెప్పారు. గత పుష్కరాలను ఎంతో వైభవంగా నిర్వహించామని, ఇప్పుడు అంతకు రెట్టింపు స్థాయిలో నిర్వహిస్తామన్నారు. ధవళేశ్వరంలో రూ.10 కోట్లతో కాటన్ మ్యూజియంను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. రాజమండ్రి, కోనసీమ ప్రాంతాలతో పాటు పాపికొండలు టూరిజానికి అనువైన ప్రాంతాలుగా ఉన్నాయన్నారు. తొలుత చంద్రబాబు వేదికపై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ వెబ్సైట్, నందినాటకోత్సవాల సావనీర్ను సీఎం ఆవిష్కరించారు. 2013 సంవత్సరానికి ఎన్టీఆర్ రంగస్థల పురస్కారాన్ని జిల్లాకు చెందిన ప్రముఖనటుడు, అభినవ ఆంజనేయ బిరుదాంకితుడు పేపకాయల లక్ష్మణరావుకు అందజేశారు. నందినాటకోత్సవాల్లో పాల్గొని వడదెబ్బతో మృతి చెందిన నటి వాణీబాల తల్లి బడుగు సీతమ్మకు నిర్వాహకులు సమకూర్చిన రూ.లక్షను అందచేశారు. రాజమండ్రి ఎంపీ మురళీమోహన్ మాట్లాడుతూ విభజన అనంతరం తొలిసారి నందినాటకోత్సవాలు రాజమండ్రిలో నిర్వహించడం ఈ ప్రాంతానికి ఇచ్చిన గౌరవమన్నారు. అద్భుతంగా జరిగిన నాటకాలకు జనం కూడా అత్యధిక సంఖ్యలో హాజరై నాటకరంగానికి ఊపిరి పోశారన్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ ఎప్పుడో బ్రిటిష్ వారు పెట్టిన రాజమండ్రి అనే పేరును రాజమహేంద్రవరంగా మార్పు చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజమండ్రి మేయర్ పంతం రజనీశేషసాయి, రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే డాక్టర్ ఆకుల సత్యనారాయణలు మాట్లాడారు. ఎఫ్డీసీ ఎండీ రమణారెడ్డి మాట్లాడుతూ అందరి సహకారంతో నంది నాటకోత్సవాలు విజయవంతంగా పూర్తి చేశామన్నారు. ఆనం కళాకేంద్రం ఆధునికీకరణకు సహకరించిన రిలయన్స్, ఓఎన్జీసీ, గెయిల్, ఆనం ఎలక్ట్రికల్స్, రాజమండ్రి నగరపాలక సంస్థకు చెందిన ప్రతినిధులకు, నంది నాటకోత్సవాలు నిర్వహించిన కమిటీ సభ్యులను సీఎం చంద్రబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, మంత్రులు యనమల, దేవినేని ఉమ, నారాయణ, పల్లె రఘునాథరెడ్డి, పి.పుల్లారావు, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ నామన రాంబాబు, ఆప్కాబ్ వైస్ చైర్మన్ వరుపుల రాజా, ప్రముఖ హాస్యనటుడు ఆలీ, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ హెచ్.అరుణ్కుమార్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పర్వత చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు. తొలుత వేదికపై ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహూతులను అలరించాయి. గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ఆలపించిన సినీ పాటలు కళాకారులతో పాటు జనాన్ని ఉర్రూతలూగించాయి. ఇదిలా ఉండగా నాటకోత్సవాలకు వచ్చిన బాలనటి లక్కీ లక్ష్మి తల్లి భవానీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను హుటాహుటిన అంబులెన్స్లో స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
T20 World Cup 2024: చరిత్ర సృష్టించనున్న రోహిత్ శర్మ
మరికొన్ని గంటల్లో యాపిల్ ‘లెట్ లూస్ ఈవెంట్’
ముస్లిం సమాజం మారాలి: ప్రధాని మోదీ విజ్ఞప్తి
వైఎస్సార్సీపీ మహిళా కార్యకర్తలపై బోండా ఉమా కొడుకు దాడి
కేజ్రీవాల్కు జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
నేను నిన్ను ప్రేమిస్తున్నాను.. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ప్రేమ లేఖ!
ధోని గురించి నిజాలు ఇవే! మాజీ క్రికెటర్లకు కౌంటర్
వ్యవస్థలను మేనేజ్ చేసేది చంద్రబాబే: ఎమ్మెల్సీ లేళ్ల
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement