breaking news
kodanda ramireddy
-
స్వయంవద ట్రైలర్ లాంచ్ చేసిన కోదండ రామిరెడ్డి
ఆదిత్య అల్లూరి, అనికా రావు జంటగా తెరకెక్కిన సినిమా ‘స్వయంవద’. ఈ సినిమాను లక్ష్మి చలన చిత్ర పతాకంపై వివేక్ వర్మ దర్శకత్వంలో రాజా దూర్వాసుల నిర్మిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ట్రైలర్ను ప్రముఖ దర్శకులు A. కోదండరామిరెడ్డి విడుదల చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ‘ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ముఖ్యంగా హీరోయిన్ క్యారెక్టర్ ఆకట్టుకునేలా ఉంది. పెద్ద ఆర్టిస్టులు కలసి నటించిన ఈ సినిమా ఏప్రిల్ 26న రిలీజ్ అవుతోంది. వివేక్ మొదటి సినిమానే అయినా ఎంతో బాగా తెరకెక్కించారు’ అన్నారు. దర్శకులు వివేక్ వర్మ మాట్లాడుతూ ‘మా స్వయంవధ సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను కోదండరామిరెడ్డి గారు ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయినాయి.U A సర్టిఫికెట్ వచ్చింది. సినిమా చూసి సెన్సార్ సభ్యులు మంచి సినిమా తీశారు అని ప్రశంసించారు’ అని తెలిపారు. నిర్మాత రాజా దుర్వాసుల మాట్లాడుతూ.. ‘మా ట్రైలర్ ను ఆవిష్కరించి మా యూనిట్ ని ఆశీర్వదించిన దర్శకులు కోదండరామిరెడ్డి గారికి ధన్యవాదము. ఏప్రిల్ 26న దాదాపు 200లకు పైగా థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నాము మా తొలి ప్రయత్నాన్ని ప్రేక్షకులు తప్పకుండా ఆశీర్వదిస్తారని ఆశిస్తున్నాం’ అన్నారు. -
పవన్ పై మండిపడ్డ కోదండరామి రెడ్డి
ప.గో:జనసేన పార్టీ అధినేత, నటుడు పవన్ కల్యాణ్ పై ప్రముఖ సినీ దర్శకుడు కోదండరామి రెడ్డి మండిపడ్డారు. బీజేపీ-టీడీపీల కూటమికి ఎన్నికల ప్రచారం చేపట్టిన పవన్.. ఏం మాట్లాడుతున్నాడో అసలు అర్థం కావడం లేదని ఎద్దేవా చేశారు. పవన్ ప్రసంగించేటప్పుడు ఆలోచించి మాట్లాడుతున్నాడా?లేక ఏదో ఆకర్షణ కోసం ఆవేశంగా మాట్లాడుతున్నాడో అంతుచిక్కని విధంగా ఉందని విమర్శించారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విమర్శించే స్థాయి పవన్ కు లేదన్నారు. జగన్ కు ధైర్యం ఉంది కాబట్టే కాంగ్రెస్ ను ఎదురించి పోరాడన్నారు. ఆ విషయాన్ని పవన్ ముందుగా తెలుసుకుని మాట్లాడాలని కోదండరామి రెడ్డి సూచించారు. రాష్ట్ర సమైక్యత కోసం పోరాటం చేసింది జగన్ ఒక్కడేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. జగన్ ఒంటిరి చేసి నిందలు వేస్తుండటం ఎంతమాత్రం సరికాదని ఆయన సూచించారు. మే 7వ తేదీన జరిగే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ సత్తా ఏమిటో చూపిస్తారన్నారు.