-
ఖమ్మం: అగ్గికి ఆహుతైన 1500 పత్తి బస్తాలు
సాక్షి, ఖమ్మం: జిల్లా మార్కెట్ యార్డ్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. గోడౌన్లోని 1500 పత్తి బస్తాలు తగలబడిపోయాయి. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక దళాలు ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పే యత్నం చేశాయి. అయితే పత్తి కావడం, మంటలు ఒక్కసారిగా చెలరేగడంతో బస్తాలు నిమిషాల్లోనే ఆహుతి అయిపోయాయి. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఇదీ చదవండి: భర్త లేడు.. ఇప్పుడు చేతికందొచ్చిన బిడ్డలు కూడా! -
ధర ‘తేజం’.. రైతుకు ఉత్తేజం
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాది మిర్చి రైతులకు మంచి రోజు వచ్చి వారిలో ఆనందం వ్యక్తమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఆదరణ పొందే ‘తేజ’రకం మంచి ధర పలుకుతోంది. ఇక సాధారణ రకం కూడా ఊరటనిచ్చే విధంగా ఉండటంతో మిర్చి రైతులు సంబరపడుతున్నారు. ‘మిర్చి’ధర దారుణంగా పతనమై 2017 లో రైతులు ఖమ్మం మార్కెట్ యార్డులో చేపట్టిన ఆందోళన, ఆగ్రహం, విధ్వంసం, అరెస్టులకు గురైన సంఘటన వారిని అప్పట్లో కలచి వేసింది. ఆ సంఘటన తర్వాత అదే ఖమ్మం మార్కెట్లో ఈ ఏడాది రైతులకు ఎంతో ఉపశమనం లభించింది. సాధారణం కంటే... సాధారణ రకానికి ప్రస్తుతం మార్కెట్లో రూ. 17 వేలకు పైగా ఉండగా, తేజ రకం మిర్చికి రూ. 21,300 పలికింది. గతేడాది గరిష్టంగా రూ. 10 వేలలోపు మాత్రమే ధర ఉండేది. బుధవారం ఖమ్మం మార్కెట్లో క్వింటాలుకు రూ. 21,300 పలకడం విశేషం. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు అయ్యింది. అంతర్జాతీయ స్థాయి డిమాండ్తోనే... రాష్ట్రంలో ఖరీఫ్లో మిర్చి సాధారణ సాగు విస్తీర్ణం 1.84 లక్షల ఎకరాలు కాగా, ఈసారి 1.12 లక్షల (61%) ఎకరాల్లోనే సాగైంది. పంట సమయంలో వచి్చన భారీ వర్షాలకు అక్కడక్కడ దెబ్బతిన్నా, మొత్తంగా మంచి నాణ్యమైన పంట పండింది.దేశంలో ఇతర ప్రాంతాల్లో అధిక వర్షాలతో భారీగా దెబ్బతినిపోయింది. అలాగే మలేసియా, థాయ్లాండ్, సింగపూర్లలోనూ మిర్చి దెబ్బతిని పోయిందని వ్యాపారులు చెబుతున్నారు.దీంతో ‘తేజ’రకం మిర్చికి చైనా, సింగ పూర్, థాయ్లాండ్, అరబ్ దేశాల్లో డిమాండ్ ఉంది. ఈ నేపథ్యంలో ధర పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. 50 రోజుల్లో దాదాపు రూ. 6 వేలు అధికం... 50 రోజుల నుంచి మిర్చి పంట మార్కెట్కు వస్తోంది. నవంబర్ 18న తేజ రకం మిర్చికి రూ. 15,811 ధర పలికింది. 50 రోజుల వ్యవధిలో అది రూ. 6 వేల వరకు పెరిగి రూ. 21,300కు చేరుకుంది.గత నెల 26న ఆ రకం మిర్చి ధర రూ. 19,200 పలుకగా, 27న రూ. 400 పెరిగి రూ. 19,600కు చేరింది. అదే నెల 30 నాటికి మరో రూ. 421కు పెరిగి రూ.20,021కు చేరింది. 31వ తేదీన రూ. 20,021 పలికింది. ఈ నెల2న రూ. 21 వేలు పలికింది. ఇప్పుడు రూ. 21,300లకు చేరింది. -
పుంజుకుంది..!
ఖమ్మంవ్యవసాయం: జిల్లాలో మార్కెటింగ్ శాఖ ఆదాయం స్వల్పంగా పుంజుకుంది. గత ఏడాది ఆదాయం రూ.27.41కోట్లు కాగా.. ఈ ఏడాది 27.66కోట్లకు చేరింది. జిల్లాలో ఖమ్మం, మధిర, నేలకొండపల్లి, కల్లూరు, వైరా, ఏన్కూరు, సత్తుపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా.. వీటి పరిధిలో పంట ఉత్పత్తుల క్రయవిక్రయాలు నిర్వహించే వ్యాపారుల నుంచి మార్కెట్ ఫీజు(1 శాతం) వసూలు చేస్తారు. మార్కెటింగ్ శాఖ 2018–19 ఆర్థిక సంవత్సరంలో జిల్లా ఆదాయ లక్ష్యాన్ని రూ.33.10కోట్లుగా నిర్దేశించింది. అయితే ఈ ఏడాది జిల్లాలో పంటల సాగు విస్తీర్ణం సాధారణం కన్నా కొంత మేర తగ్గింది. తగ్గిన సాగు విస్తీర్ణం ప్రభావం మార్కెట్ల ఆదాయంపై కొంత ప్రభావం చూపింది. జిల్లాలో రైతులు ప్రధానంగా పత్తి, మిర్చి, వరి పంటలు సాగు చేస్తారు. అయితే ఈ ఏడాది అనుకూలించని వర్షాలు.. తెగుళ్ల కారణంగా పంట దిగుబడులు గణనీయంగా తగ్గాయి. ముఖ్యంగా పత్తి దిగుబడులు బాగా తగ్గాయి. ఎకరాకు 4 నుంచి 6 క్వింటాళ్లకు మించలేదు. మిర్చి కూడా ఆశించిన స్థాయిలో దిగుబడులు రాలేదు. అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే జిల్లా మార్కెటింగ్ శాఖ ఆదాయం కొంత మేరకు పుంజుకుంది. 2017–18 ఆర్థిక సంవత్సరంలో జిల్లా మార్కెటింగ్ శాఖ ఆదాయ లక్ష్యం రూ.29.49కోట్లు కాగా.. రూ.27.41కోట్లు వచ్చింది. ఈ ఏడాది ఆ ఆదాయం కొంత పుంజుకొని రూ.27.66కోట్లకు చేరింది. ఆదాయంపై ప్రభావం చూపిన సాగు జిల్లా మార్కెటింగ్ శాఖ ఆదాయంపై పంటల సాగు ప్రభావం చూపింది. ఖరీఫ్లో పంటల సాగు విస్తీర్ణ లక్ష్యం 2,32,707 హెక్టార్లు కాగా.. 2,12,729 హెక్టార్లలో సాగు చేశారు. మొత్తంగా 91.4 శాతం మాత్రమే పంటలను సాగు చేశారు. పత్తి, మిర్చి పంటలు సాగు లక్ష్యాన్ని చేరుకోలేదు. పత్తి 97,862 హెక్టార్ల సాగు లక్ష్యం కాగా.. 96,701 హెక్టార్లలో, మిర్చి 19,828 హెక్టార్లు కాగా.. 18,067 హెక్టార్లలో సాగు చేశారు. అంటే.. ఈ రెండు పంటల సాగు విస్తీర్ణం లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. మొక్కజొన్న, కంది, వేరుశనగ, చెరకు వంటి పంటల సాగు కూడా లక్ష్యాన్ని చేరుకోలేకపోయాయి. సాగు చేసిన పంటల నుంచి ఆశించిన విధంగా పంట దిగుబడులు రాలేదు. పత్తి దిగుబడులు బాగా పడిపోగా, మిర్చి దిగుబడులు కూడా తగ్గాయి. పండించిన మిర్చి సగటున రూ.8,500 ధర పలుకుతోంది. ఈ ధర రూ.10వేల మార్క్ దాటితే మార్కెట్ ఆదాయం మరింతగా పుంజుకునే అవకాశం ఉంది. ఇక రబీ పంటలకు సాగర్ నీటిని విడుదల చేయలేదు. రబీ సాగు విస్తీర్ణ లక్ష్యం 53,620 హెక్టార్లు కాగా.. కేవలం 33,590 హెక్టార్లలో మాత్రమే పంటలు సాగు చేశారు. ఈ ప్రభావం కూడా మార్కెట్ ఆదాయంపై చూపింది. పంట ఉత్పత్తులపైనే.. పంటల సాగు, దిగుబడులపైనే మార్కెట్ల ఆదాయం ఆధారపడుతుంది. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. అంతేకాక దిగుబడులు కూడా అంత ఆశాజనకంగా లేవు. ఆశించిన మేర పత్తి దిగుబడులు రాకపోవడంతో మార్కెట్ల ఆదాయంపై ప్రభావం చూపింది. అయినప్పటికీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మార్కెట్ల ఆదాయం కొంత మేర పెరిగింది. రబీ పంట ఉత్పత్తులు లేకపోవడం కూడా మార్కెట్ ఆదాయంపై ప్రభావం చూపింది. – రత్నం సంతోష్కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి -
సీసీఐ కసరత్తు..
ఖమ్మంవ్యవసాయం: ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పండించిన పత్తి కొనుగోలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జిల్లాలో మొత్తం పంటల సాగు విస్తీర్ణం 5,81,767 ఎకరాలు కాగా, ప్రధాన పంటల్లో ఒకటైన పత్తిని 2,41,752 ఎకరాల్లో సాగు చేశారు. అక్టోబర్ నెలారంభం నుంచి పంట ఉత్పత్తి ప్రారంభమవుతుంది. ఈ క్రమంలో ప్రభుత్వం నిర్ణయించిన ధరతో సీసీఐ(కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) రైతుల నుంచి పత్తి కొనుగోలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ ఏడాది మద్దతు ధర క్వింటాలుకు రూ. 5,450 చెల్లించాలని, 8 నుంచి 12 తేమ శాతం కలిగిన పత్తిని మాత్రమే కొనాలని ప్రభుత్వం నిర్ణయించింది. 8 శాతం తేమ కలిగిన పత్తికి రూ.5,450లు చెల్లించనుంది. తేమ 9 శాతం ఉంటే క్వింటాల్కు రూ. 54.50 తగ్గించి కొనుగోలు చేస్తారు. తేమ 10 శాతం ఉంటే ధర మరో రూ.54.50 తగ్గిస్తారు. తేమ శాతం 12కు మించితే పత్తిని కొనుగోలు చేయొద్దని నిబంధనలు వధించారు. గత ఏడాది ప్రభుత్వం మద్దతు ధర రూ.4,320 నిర్ణయించగా, సీసీఐ 1.26 లక్షల క్వింటాళ్ల పత్తిని కొనుగోలు చేసింది. ప్రైవేటు మార్కెట్లో అధిక ధర పలకటంతో సీసీఐ కేంద్రాల్లో తక్కువ కొనుగోళ్లు జరిగాయి. ప్రైవేటు మార్కెట్లో జిల్లా వ్యాప్తంగా దాదాపు 13 లక్షల క్వింటాళ్లు కొనుగోళ్లు చేసినట్లు మార్కెటింగ్ శాఖ లెక్కలు చెబుతున్నాయి. 5 మార్కెట్ల పరిధిలో పత్తి కొనుగోళ్లు.. జిల్లాలో సత్తుపల్లి వ్యవసాయ డివిజన్ మినహా ఖమ్మం, వైరా, మధిర, కూసుమంచి వ్యవసాయ డివిజన్లలో పత్తి పంటను సాగు చేస్తున్నారు. పంట ఉత్పత్తి ఆధారంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు రంగం సిద్ధం చేస్తోంది. ఖమ్మం, వైరా, మధిర, నేలకొండపల్లి, ఏన్కూరు.. 5 వ్యవసాయ మార్కెట్ల పరిధిలో కొనుగోళ్లు చేపట్టాలని నిర్ణయించింది. ఈ మార్కెట్ల పరిధిలో ఉన్న జిన్నింగ్ మిల్లుల్లో కూడా పత్తి కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లాలో మొత్తం 12 జిన్నింగ్ మిల్లులు ఉండగా 10 మిల్లులు నిర్వహణలో ఉన్నాయి. వాటిలో కూడా పలు మిల్లులకు తగిన అనుమతులు లేవని తెలిసింది. 6 మిల్లులు మాత్రం జిన్నింగ్కు అన్ని అనుమతులు కలిగి ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. మరో 10 రోజుల్లో కేంద్రాలు మరో 10 రోజుల్లో సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రాలను చేర్పాటు చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సంబంధిత అధికారులకు సూచించారు. ఇప్పటికే సీసీఐ అధికారులు పత్తి కొనుగోలు చేసే కేంద్రాలను పరిశీలించారు. ప్రధానంగా మార్కెటింగ్ శాఖతో పాటు అగ్నిమాపక, లీగల్ మెట్రాలజీ, వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్ శాఖలకు పంట ఉత్పత్తి కొనుగోలు అంశాలపై తగిన బాధ్యతలను అప్పగించారు. వ్యవసాయ శాఖ పంట ఉత్పత్తి విక్రయాలపై గ్రామాలకు షెడ్యూల్ను రూపొందించి, కొనుగోలు కేంద్రాలను పంపించాలని సూచించారు. కాగా గతేడాది అక్టోబర్ 10వ తేదీ నుంచి సీసీఐ కేంద్రాలను ఏర్పాటు చేసి పత్తి కొనుగోళ్లు చేపట్టారు. తేమశాతమే ప్రధాన ప్రామాణికం పత్తి కొనుగోళ్లలో ప్రధాన ప్రామాణికం తేమశాతమే. తేమ 8 నుంచి 12 శాతం వరకు తేమ కలిగిన తేమను మాత్రమే కొనుగోలు చేయాలని సీసీఐ నిబంధనలు విధించింది. ఈ తేమశాతాన్ని గ్రామాల్లోనే పరిశీలించి సమీప కేంద్రాలకు తరలించే విధంగా చర్యలు ఉండాలని కలెక్టర్ సూచించారు. వ్యవసాయ శాఖకు చెందిన గ్రామ వ్యవసాయ విస్తర్ణాధికారులకు తేమ శాతాన్ని గుర్తించే మాయిశ్చర్ మిషన్లను అందించి గ్రామాల్లోనే ఈ పరీక్షలు చేయించి పంటను విక్రయాలకు పంపించాలని నిర్ణయించారు. నూతనంగా రూపొందించిన ఈ విధానం ఏ మేరకు ఫలితాలను ఇస్తుందనేది మాత్రం ప్రశ్నార్థకంగా ఉంది. గ్రామాల్లో ఏఈవోలు తేమశాతాన్ని ధ్రువీకరించి పంపించినా సీసీఐ కేంద్రాల్లో మళ్లీ పరీక్షలు నిర్వహించి కొర్రీలు పెడతారా..? అనే సందేహాలు రైతులకు కలుగుతుంది. పత్తి జిన్నింగ్పై కుదరని ఒప్పందం సీసీఐ కొనుగోలు చేసిన పత్తిని జిల్లాలో గుర్తించిన జిన్నింగ్ మిల్లులు జిన్నింగ్ చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా పత్తి పండించే అన్ని జిల్లాల్లో సీసీఐ జిన్నింగ్ మిల్లుల యాజమానులతో ఒప్పందం(కాంట్రాక్ట్) కుదుర్చుకుంది. కానీ ఖమ్మం జిల్లాలో మాత్రం సీసీఐ నిబంధనల ప్రకారం జిన్నింగ్ చేయలేమని మిల్లుల యజమానులు వెనకడుగు వేశారు. లింట్ సైజు 30.5 మి.మీలు ఉండే విధంగా జిన్నింగ్ ఉండాలని సీసీఐ నిర్ణయించింది. ఇక్కడి జిన్నింగ్ మిల్లుల యజమానులు ఆ సైజుకు అంగీకరించటం లేదు. ఇక్కడ పండించే పత్తిలో విత్తనాలు అధికంగా ఉంటాయని, లింట్ సైజ్ 29.5 మి.మీలుగా నిర్ణయిస్తే జిన్నింగ్ చేస్తామని, లేదంటే మిల్లులను సీసీఐ లీజ్కు తీసుకొని నిర్వహించుకోవచ్చని యజమానులు చెబుతున్నారు. దీంతో సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. సీసీఐ మిల్లుల యజమానులతో చర్చలు కొనసాగిస్తూనే ఉంది. అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం జిల్లాలో సీసీఐ పత్తి కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డుల్లో, జిన్నింగ్ మిల్లుల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. పత్తి విక్రయానికి తెచ్చే రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా సౌకర్యాలను కల్పిస్తున్నాం. మరికొద్ది రోజుల్లో సీసీఐ పత్తి కొనుగోళ్లను నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. – రత్నం సంతోష్కుమార్, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి, ఖమ్మం -
మిర్చి అ‘ధర’హో!
ఖమ్మం వ్యవసాయం : మిర్చి రైతులకు శుభవార్త. శుక్రవారం ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మిర్చి క్వింటా ధర రూ. 9,950 పలకగా, సోమవారానికి ఏకంగా రూ. 450లు పెరిగి రూ. 10,400కు చేరింది. పంట సాగు తగ్గడం, ఆశించిన స్థాయిలో ఉత్పత్తి లేకపోవడంతో ధర పెరుగుతోంది. మార్చి నెల ఆరంభంలో రూ. 9,200లు పలికిన ధర క్రమంగా పెరుగుతూ 19 రోజుల వ్యవధిలో దాదాపు రూ.1,200పైకి వెళ్లడం విశేషం. ప్రతి ఏటా మార్చిలో మార్కెట్కు నిత్యం 70 వేల నుంచి లక్ష బస్తాల వరకు విక్రయానికి వస్తుంది. ఈ ఏడాది ప్రస్తుతం 20 వేల నుంచి 30 వేలకు మించి రావట్లేదు. అంతర్జాతీయంగా తేజా రకం మిర్చికి డిమాండ్ ఉండటంతో ఆ రకం ధర పెరుగుతోందని అంచనా వేస్తున్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement