breaking news
Kashmir tour
-
ప్రకృతి ప్రేమికులకు.. అల్టిమేట్ డెస్టినేషన్
కశ్మీర్ను ‘భూమిపై వెలసిన స్వర్గం’ అని పిలుస్తారు. గుల్మార్గ్ వెళ్తే మీరు కూడా అదే మాట అంటారు. సముద్ర మట్టానికి సుమారు 8,800 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతాన్ని సందర్శిస్తే మరో లోకంలోకి వచ్చామా అనే అనుభూతి కలగకమానదు. మరీ ముఖ్యంగా చలికాలంలో ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా మంచు దుప్పటి పరుచుకుని ఉన్నట్టే అనిపిస్తుంది. సాహసాలు చేయాలనుకునే ప్రయాణికులకు, ప్రశాంతత కోసం వెతికే ప్రకృతి ప్రేమికులకు ఇది ఒక అల్టిమేట్ డెస్టినేషన్.గండోలా రైడ్గుల్మార్గ్లో గండోలా అంటే రోప్వే. ఇది ఈ ప్రాంతం ప్రధాన ఆకర్షణ. ఆసియాలోనే అత్యంత ఎత్తైన గండోలా కూడా ఇదే. గండోలా ప్రయాణం రెండు దశల్లో ఉంటుంది. ఫేజ్ నెం.1 లో గుల్మార్గ్ నుంచి కాంగ్దూరి స్టేషన్ వరకు 8,530 అడుగుల ఎత్తులో గండోలాపై ప్రయాణం ఉంటుంది. ఇది పైన్ చెట్ల మధ్యలోంచి ఈ థ్రిల్లింగ్ రైడ్లా సాగుతుంది. ఫేజ్.2 లో కాంగ్దూరి స్టేషన్ నుంచి అఫర్వట్ పర్వతం వరకు 14,403 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తారు. 12 నిమిషాల రైడ్లో గతంలో ఎప్పుడూ చూడనంత మంచును, మంచు పర్వతాలను వీక్షించవచ్చు.మంచు పర్వతాల దర్శనంచలికాలానికి ముందు గుల్మార్గ్ ఒక అందమైన పువ్వుల లోయగా అలరిస్తుంది. చలికాలం వచ్చేసరికి మంచు ప్రపంచంలా మారిపోతుంది. చలికి డ్రంగ్ అనే జలపాతం గడ్డకట్టుకుపోవడం చూస్తే ప్రకృతి కాలాన్ని ఆపిందేమో, జలపాతాన్ని పాజ్ చేసిందేమో అనిపిస్తుంది. తీవ్రమైన చలిలో ఇక్కడి పర్యాటక ప్రాంతాలన్నీ మంచు ప్రేమికులతో కిటకిటలాడుతాయి. ఇక ఫొటోగ్రఫీ ఇష్టపడే వారికి గుల్మార్గ్లో ప్రతీ ఫ్రేమ్ ఒక పోస్ట్కార్డ్లా కనిపిస్తుంది.ఏమేం చూడాలంటే...గుల్మార్గ్ వెళ్లినప్పుడు మీరు వద్దన్నా మీకు ఎన్నో అందమైన లొకేషన్లు కనిపిస్తాయి. అయితే అవకాశం ఉంటే సెంట్ మేరీ చర్చ్ గోథిక్ శిల్పకళను, అఫార్వత్ పర్వతంపై మంచు మకుటాన్ని, చలికి మంచులా మారిన అల్ఫాథర్ సరస్సును, ఫ్రీజ్ అయిన డ్రంగ్ జలపాతాన్ని, దట్టమైన పైన్ చెట్ల వనాలు, స్థానిక గ్రామాలను, స్థానికుల జీవితాన్ని వెళ్లి చూసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మంచు కురిసే వేళల్లో ఆకాశం నుంచి జారిపడే మల్లెపువ్వుల్లాంటి స్నో, దూరంగా పొగమంచులోంచి కనిపించి కనిపించనట్టు ఉండే పైన్ చెట్లు, పర్యాటకులు కనిపించగానే స్థానికుల కళ్లలో కనిపించే వెలుగు, కలపతో చేసిన ఇళ్లపై పలకలపై అక్షరాల్లా చేరుకున్న మంచు.. ఇవన్నీ ఎవరికి వారు వ్యక్తిగతంగా వెళ్లి చూసి అనుభూతి చెందాల్సిందే!పొద్దున్నే కావా.. మధ్యాహ్నం ఛాయ్కశ్మీర్ అనేది ఫుడ్ లవర్స్కు కూడా స్వర్గం లాంటిదే. ఇక్కడికి వచ్చే పర్యాటకులు కశ్మీరీ కావా (kashmiri kahwa) అనే ఫేమస్ గ్రీన్ టీని అస్సలు మిస్ అవ్వరు. స్థానిక కుంకుమపువ్వు, నట్స్ను కలిపి సర్వ్ చేస్తారు. రోగన్ జోష్, యాఖ్ని, దమ్ ఆలూ ఇవి టేస్ట్ చేయకుండా పర్యాటకులు ఉండలేరు. అలాగే ఇక్కడ అడుగడుగునా చాట్, మ్యాగీ, వజ్వాన్ రుచులు అందుబాటులో ఉంటాయి. పొద్దున్నే కావా, మధ్యాహ్నం చాయ్ అనేది ఎక్కువ మంది టూరిస్టులు ట్రై చేసే కాంబినేషన్.బెస్ట్ స్కీయింగ్ పాయింట్చలికాలంలో గుల్మార్గ్లో స్కీయింగ్, స్నో బోర్డింగ్, స్నో ట్రెక్కింగ్ యాక్టివిటీస్ కోసం భారతీయులతో పాటు విదేశీ పర్యాటకులు కూడా వస్తుంటారు. ఎండాకాలంలో మౌంటెన్ బైకింగ్, ట్రెక్కింగ్ ట్రై చేయవచ్చు.వింటర్లో ఇక్కడ స్కీయింగ్, స్నో బోర్డింగ్ చేయడం అనేది ఒక లైఫ్టైమ్ ఎక్స్పీరియెన్స్. ఇక్కడి స్నో స్పోర్ట్స్ (Snow Sports) ఎంజాయ్ చేయడానికి ప్రొఫెషనల్ అవ్వాల్సిన అవసరం లేదు. మంచి ఇన్ స్ట్రక్టర్ ఉంటే సరిపోతుంది.జీవితాంతం గుర్తుండే ట్రిప్గుల్మార్గ్లో సూర్యోదయాన్ని అసలు మిస్ అవ్వొద్దు. పిర్ పంజాల్ పర్వత శ్రేణిలో ఉన్న హిమగిరులపై సూర్యకిరణాలు పడి, పర్వతాలు బంగార రంగులో మెరవడం అనేది జీవితాంతం గుర్తుంటుంది. అలాగే కేబుల్ కార్ రైడ్ సమయంలో తనువును మీటే చలిగాలి, పైన్ చెట్ల సువాసన, ఆకాశంలో విన్యాసం చేసే వివిధ రంగులు ఇవన్నీ ఎవరైనా అంత ఈజీగా మర్చిపోగలరా? మనకు తెలియకుండానే మన మనసు కోరుకునే అనుభూతులు ఎన్నో. సూర్యాస్తమయం తరువాత గుల్మార్గ్లోని గ్రామాల్లో వీధి దీపాలు ఎక్కువగా, మనుషులు తక్కువగా కనిపిస్తారు. వెచ్చని దుప్పటిలో ముడుచుకుని పడుకునే సమయంలో స్వర్గం అంటే ఇదేనేమో అనిపిస్తుంది.షాపింగ్గుల్మార్గ్లో కశ్మీరీ హ్యాండీక్రాఫ్టులు, శాలువాలు, కార్పెట్లు, కుంకుమపువ్వు, డ్రై ఫ్రూట్స్ చాలా ఫేమస్. అలాగే స్థానిక మసాలా దినుసులను కూడా ట్రై చేయవచ్చు. కశ్మీర్ యాపిల్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే మీరు డ్రై యాపిల్ (Dry Apple) గురించి ఎప్పుడైనా విన్నారా? అది కూడా మీరు ఇక్కడ ట్రై చేయవచ్చు.కశ్మీర్ టూరును (Kashmir Tour) ఒక యాత్రలా కాకుండా ఒక స్ట్రెస్ రిలీవింగ్ మాత్రలా భావించవచ్చు. గుల్మార్గ్కు కేవలం అందమైన లొకేషన్ల కోసం మాత్రమే కాకుండా ఇక్కడి వైబ్ను ఫీల్ అవ్వడానికి వెళితే స్వర్గం అంటే ఇదే అనిపించకుండా ఉండదు. కశ్మీర్ వెళ్తే స్వర్గం ఎక్కడ ఉంటుందో అనే ప్రశ్నకు సమాధానం కూడా తెలిసిపోతుంది.గుల్మార్గ్ ఎప్పుడు వెళ్లాలి?చలికాలంలో గుల్మార్గ్ మంచు ప్రపంచంలా మారిపోతుంది. అయితే మార్చి నుంచి జూన్ మధ్యలో పర్యటనకు బెస్ట్ టైమ్. ఈ సమయంలో ఎటు చూసినా పచ్చదనం, పువ్వులు, పర్యాటకుల చిరునవ్వులు కనిపిస్తాయి. దూరం నుంచి భారీ పర్వతాలను చూస్తూ చిన్న పిల్లల్లా కేరింతలు కొట్టవచ్చు. చలికాలంలో స్నో ఫాల్, వింటర్ స్పోర్ట్స్ కోసం బెస్ట్ టైమ్.ఎలా చేరుకోవాలి?గుల్మార్గ్ చేరుకోవడానికి కశ్మీర్ క్యాపిటల్ శ్రీనగర్ చేరుకోవాలి. శ్రీనగర్కు దేశంలోని అన్ని విమానాశ్రయాల నుంచి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. శ్రీనగర్ నుంచి గుల్మార్గ్ను క్యాబ్ లేదా లోకల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా చేరుకోవచ్చు. షేరింగ్లో కూడా ప్రయత్నించవచ్చు. ఈ ప్రయాణం చాలా అందమైనది. స్నో ఫాల్ (Snowfall) సమయంలో స్థానిక పరిస్థితులను బట్టి ప్లాన్ చేసుకోవాలి.చదవండి: ఇక్కడ మనుషులను తాకితే ఫైన్ వేస్తారు!ఎక్కడ ఉండాలంటే..! గుల్మార్గ్ అనేది ఒక హాట్ టూరిస్ట్ డెస్టినేషన్. వర్షాకాలం మినహా సంవత్సరం మొత్తం పర్యాటకులు దేశవిదేశాల నుంచి ఇక్కడికి వస్తుంటారు. గుల్మార్గ్లో బడ్జెట్ హోటల్స్ నుంచి లగ్జరీ రిసార్టుల వరకు అన్నీ అందుబాటులో ఉంటాయి. పీక్ సీజన్లో అడ్వాన్స్ బుకింగ్ తప్పనిసరి. రిసార్టుల్లో ఆధునిక సదుపాయాలు, వ్యాలీ వ్యూ రూములు, ఫైన్ డైనింగ్ సదుపాయాలు ఉంటాయి. బడ్జెట్ ప్రయాణికుల కోసం గెస్ట్ హౌసులు, హోమ్స్టేలు ఉన్నాయి. ఎకో–ఫ్రెండ్లీ కాటేజీలను కూడా ట్రై చేయవచ్చు.– ఎం.జి. కిశోర్, ప్రయాణికుడు.కామ్ -
క్రికెట్ దేవుడే దిగి వస్తే...
కశ్మీర్కు చెందిన పారా క్రికెటర్ అమిర్ హుసేన్ జీవితం వెలిగింది. రెండు చేతులూ లేకపోయినా మెడతో బ్యాట్ పట్టి ఆడే అమిర్ తనను ఇన్స్పయిర్ చేసిన క్రికెట్ దేవుడు సచిన్ని జీవితంలో కలుస్తాననుకోలేదు. కలిశాడు. అంతేనా? సచిన్ నుంచి ఊహించని బహుమతి అందుకున్నాడు. ఈ వివరం ఏమిటంటే... సచిన్ టెండూల్కర్ తన భార్య అంజలి, కుమార్తె సారాతో కశ్మీర్ పర్యటనలో ఉన్నాడు. ఇది అతని తొలి కశ్మీర్ పర్యటన అని భోగట్టా. అక్కడి ‘చార్సో’ అనే ఊళ్లో ఉండే బ్యాట్ల తయారీ కేంద్రాన్ని సచిన్ సందర్శించాడు. అంతే కాదు... అక్కడి ‘బిజ్బెహరా’ ్రపాంతానికి చెందిన పారా క్రికెటర్ అమిర్ హుసేన్ను తన హోటల్కు పిలిపించుకుని ప్రత్యేకంగా కలిశాడు. అమిర్ హుసేన్ ప్రస్తుతం కశ్మీర్ పారా క్రికెట్ టీమ్ కెప్టెన్గా ఉన్నాడు. పుట్టుకతో చేతులు లేని అమిర్ తన జీవితంలో పేర్కొన్న నిరాశను సచిన్ను చూసి ఇన్స్పయిర్ అయి క్రికెటర్ కావడంతో పోగొట్టుకున్నాడు. బ్యాట్ను మెడ, భుజాల మధ్య పట్టి అతను క్రికెట్ ఆడతాడు. ఈ స్ఫూర్తిమంతమైన గాధను విన్న సచిన్ తన పర్యటన సందర్భంగా అమిర్ హుసేన్ను కలిశాడు. ‘నిన్ను కలవడం సంతోషం’ అని ‘ఎక్స్’లో తానే పోస్ట్ పెట్టాడు. సచిన్ని చూడగానే ఇలాంటిది తన జీవితంలో జరిగిందా అన్నట్టుగా భావోద్వేగంతో కదిలిపోయాడు అమిర్. ‘ఇలాగే నువ్వు మమ్మల్ని ఇన్స్పయిర్ చేయి’ అని అమిర్తో సచిన్ చె΄్పాడు. అంతేనా? తను సంతకం చేసిన బ్యాట్ ఇచ్చి అమిర్ని తబ్బిబ్బు చేశాడు. -
కశ్మీర్లో ఎందుకీ అభద్రత?
శ్రీనగర్: ఉగ్రవాదులతో సుదీర్ఘంగా కొనసాగుతున్న ఎన్కౌంటర్లు, ముష్కరుల నుంచి పెరిగిపోతున్న ముప్పు, సాధారణ పౌరుల్ని కాల్చి చంపడం, సరిహద్దుల నుంచి ఉగ్రవాదుల చొరబాట్లతో కశ్మీర్లో అస్థిరత నెలకొన్న నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మూడు రోజుల కశ్మీర్ పర్యటనకు వెళ్లారు. కశ్మీర్లో భద్రతపై రాజ్భవన్లో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి లెఫ్ట్నెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఆర్మీ, సీఆర్పీఎఫ్, పోలీసు, ఇతర భద్రతా సంస్థల అధికారులు హాజరయ్యారు. ఈ సమావేశంలో అమిత్ షా అధికారులపై ప్రశ్నల వర్షం కురిపించినట్టుగా భద్రతా వర్గాలు వెల్లడించాయి. కేంద్ర బలగాలు అన్ని వైపులా మోహరించిన ఉన్నప్పటికీ ఎందుకు ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగిపోతున్నాయని షా అధికారుల్ని నిలదీశారు. ఉగ్రవాద నిర్మూలనకు తీసుకుంటున్న చర్యల్ని అడిగి తెలుసుకున్నారు. మైనార్టీలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి పరిస్థితులు అనుకూలంగా లేవని ఇటీవల కాలంలో జరిగిన ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. ఉగ్రదాడుల్లో ఐదుగురు బీహార్ కూలీలు సహా మొత్తం 11 మంది సాధారణ పౌరులు కేవలం అక్టోబర్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో అమిత్ షా పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది. 2019 ఆగస్టులో ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత అమిత్ షా కశ్మీర్కు రావడం ఇదే తొలిసారి. మంచు, భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ఆదివారం జమ్మూలో జరగాల్సిన ర్యాలీ నిర్వహణపై సందేహాలు నెలకొన్నాయి. ఇన్స్పెక్టర్ కుటుంబానికి షా పరామర్శ ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన పోలీసు ఇన్స్పెక్టర్ పర్వేజ్ అహ్మద్ కుటుంబాన్ని షా పరామర్శించారు. విమానాశ్రయం నుంచి నేరుగా అమిత్ షా వారి ఇంటికి వెళ్లారు. అహ్మద్ భార్య ఫాతిమా అక్తర్కు కారుణ్య నియామకం కింద ప్రభుత్వం ఉద్యోగానికి సంబంధించిన అపాయింట్మెంట్ లెటర్ని అమిత్ షా ఇచ్చినట్టుగా అధికారులు వెల్లడించారు. శ్రీనగర్ శివార్లలోని నౌగామ్లో నివాసం ఉండే అహ్మద్ను జూన్ 22న ఉగ్రవాదులు కాల్చి చంపిన విషయం తెలిసిందే. రాష్ట్రహోదా పునరుద్ధరిస్తాం జమ్మూ కశ్మీర్లో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని అమిత్ షా హామీ ఇచ్చారు. యూత్ క్లబ్ సభ్యులతో ఆయన ముచ్చటిస్తూ..కశ్మీర్ యువతకి స్నేహహస్తం అందించడానికే తాను వచ్చానని చెప్పారు. ‘ఆ భగవంతుడు ఈ లోయని ఒక స్వర్గంలా మార్చాడు. ప్రకృతి సౌందర్యంతో సర్వాంగ సుందరంగా వెలిగిపోతోంది. మోదీ ఈ లోయ అభివృద్ధిని, శాంతి సుస్థిరతల్ని కోరుకుంటున్నారు. ఇందుకోసం కశ్మీర్ యువత సహకరించాలి. వారి సహకారం కోసమే ఇక్కడికి వచ్చాను’’ అని అమిత్ షా వెల్లడించారు. కేంద్రం ఇచ్చే అవకాశాలను అందిపుచ్చుకోవాలని హితవు పలికారు. -
బైక్పై తల్లీకూతురు..కేరళ To కాశ్మీర్
డ్రైవింగ్ రాని ఆమెకు పెళ్లిరోజు కానుకగా భర్త బుల్లెట్ను బహుమతిగా ఇచ్చాడు. దాంతో ముచ్చటపడి డ్రైవింగ్ నేర్చుకుంది. అది మామూలుగా కాదు... లాంగ్ డ్రైవ్కు వెళ్లగలిగేంతగా. ఇక ఊరుకోలేదు. కూతురును తీసుకుని కాశ్మీర్ యాత్రకు బయల్దేరింది. తల్లీ కూతుళ్లు ఇద్దరూ ఒంటరి మహిళలు చేసే పర్యటన గురించి, ముందస్తు ప్రణాళికల గురించి, జాగ్రత్తల గురించి అందరితో పంచుకుంటూ మరీ వెళుతున్నారు. కేరళలోని మణియారాలో ఉంటున్న అనీష స్థానిక పాఠశాలలో టీచర్గా ఉద్యోగం చేస్తోంది. కొత్తగా నేర్చుకున్న బైక్పై తిరుగుతున్న రుతుపవనాల ప్రయాణాన్ని ఆస్వాదించాలనుకుంది. అనుకున్నదే ఆలస్యం... కేరళ నుంచి కాశ్మీర్ వరకు బైక్పై సాగే ప్రయాణాన్ని డిగ్రీ చదువుతున్న తన కూతురు మధురిమతో కలిసి రైడింగ్ ప్రారంభించింది. జులై 14న మొదలుపెట్టిన ఈ ప్రయాణం రోజూ 300 కిలోమీటర్లు కవర్ చేస్తోంది. మహిళల ప్రయాణం ‘ఒంటరి మహిళలు పర్యటనలను ఆనందించాలనే అభిలాష ఉండగానే సరిపోదు... అందుకు ముందస్తు యాత్రను సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి.. అనే ఆలోచనతోనే ఈ ట్రిప్ చేస్తున్నాం’ అని చెబుతుంది అనీషా. ఎవరైనా మహిళలు ఒంటరిగా పర్యటనలు చేస్తున్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, వాటి గురించి తమ అనుభవాలతో వివరిస్తుంది అనీషా. వారం దాటాకే సమాచారం రెండు వారాలకు పైగా కొనసాగిన ప్రయాణంలో తాము ఎదుర్కొన్న సంఘటనలను, ఇతరులు ఎవరైనా తమలా ప్రయాణించాలనుకునేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలను సోషల్ మీడియాలో పంచుకుంటుంది అనీష. మహిళలు తాము ఒంటరిగా పర్యటించేటప్పుడు Ðð ళ్లే మార్గం, బస చేసే స్థలం ముందే ఎంచుకోవాలి. సూర్యుడు అస్తమించే సమయానికి ఏ ప్రదేశానికి చేరుకోవాలో ముందే గమనింపు ఉండాలి. ఉండే స్థలం, హోటల్ లేదా ఇతర ప్రదేశాలు నచ్చకపోయినా రాత్రి అవడానికి ముందే ప్లానింగ్లో మార్పులు చేసుకోవచ్చు. భద్రత కోసం ఆయుధం, పెప్పర్ స్ప్రే వంటి వాటిని ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలి. అలాంటప్పుడే కష్టసమయాలను సులువుగా ఎదుర్కోవడం అవుతుంది. అంతేకాదు, వెళ్లే మార్గం, ఫొటోలు.. వివరాలేవైనా ఎప్పటికప్పుడు కాకుండా వారం రోజులు దాటాకే వాటిని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడం మంచిది. దీని వల్ల పర్యటన లో పెద్దగా ఇబ్బందులు ఎదురుకావు’ అంటూ తాము తీసుకున్న జాగ్రత్తలను, సమస్యలను ఎదుర్కొన్న విధానాన్ని వివరిస్తుంది అనీష. -
శ్రీనగర్లో ఆజాద్
శ్రీనగర్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కశ్మీర్ మాజీ సీఎం గులాం నబీ ఆజాద్ శ్రీనగర్ను సందర్శించారు. లాల్ దేడ్ ఆస్పత్రిలోని రోగులను పరామర్శించి, వారికి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మొత్తం నాలుగు రోజుల పర్యటనలో, రెండో రోజైన శనివారం ఆయన స్థానికులను కలుసుకొని ఆర్టికల్ 370 రద్దు అనంతరం ఉన్న పరిస్థితుల గురించి వాకబు చేశారు. సొంత రాష్ట్రమైన కశ్మీర్ చేరుకోవాలని ఆయన గతంలో ప్రయత్నించినప్పటికీ ప్రభుత్వం అనుమతించలేదు. దీంతో ఆయన సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకుని వచ్చారు. -
విసిరే ప్రతీ రాయితో అస్థిరత
శ్రీనగర్: దారితప్పిన కశ్మీరీ యువత విసిరే ప్రతీ రాయి, వాడే ప్రతీ ఆయుధం కశ్మీర్ రాష్ట్రంతోపాటు దేశాన్ని కూడా అస్థిరపరుస్తాయని ప్రధాని మోదీ అన్నారు. ఈ అస్థిరత్వం నుంచి రాష్ట్రాన్ని బయటకు తెచ్చేందుకు అభివృద్ధి పథంలో నడవాలని పిలుపునిచ్చారు. మోదీ శనివారం కశ్మీర్లో పర్యటించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించడంతోపాటు మరికొన్ని పూర్తయిన ప్రాజెక్టులను దేశానికి అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టుల మొత్తం విలువ 25 వేల కోట్ల రూపాయలు. పర్యటనలో భాగంగా బౌద్ధ సన్యాసి 19వ కుషోక్ బకులా రింపోచె శత జయంతి ఉత్సవాల ముగింపు సభలో మోదీ ప్రసంగించారు. రింపోచె రాష్ట్రంలో ఎమ్మెల్యేగా, మంగోలియాకు రాయబారిగా కూడా పనిచేశారు. యువత అభివృద్ధి పథంలో నడవాలి.. రాష్ట్రంలో అభివృద్ధి జరగకుండా కొన్ని విదేశీ శక్తులు అడ్డుకుంటున్నాయని మోదీ అన్నారు. యువత తమ భవిష్యత్తు కోసం, రాబోయే తరాల భవిష్యత్తు కోసం అభివృద్ధిలో భాగం కావాలని కోరారు. కశ్మీర్లోని గురేజ్లో నిర్మించిన 330 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యం కలిగిన కిషన్గంగ ప్రాజెక్టును మోదీ దేశానికి అంకితమిచ్చారు. 42 కి.మీ.ల పొడవుతో శ్రీనగర్ రింగురోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. కశ్మీర్ అభివృద్ధిలో పర్యాటక రంగానిది కీలక పాత్ర అనీ, అందుకే పర్యాటకులను ఆకర్షించేందుకు వెడల్పైన రోడ్లు, నిత్యం విద్యుత్తు సరఫరా, విమాన సేవలు తదితర సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగం కశ్మీర్ పర్యటనలో భాగంగా మోదీ జోజిలా సొరంగ మార్గం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నిర్మాణం పూర్తయితే ఇది ఆసియాలోనే అత్యంత పొడవైన సొరంగ మార్గంకానుంది. లేహ్ ప్రాంతాన్ని మిగతా దేశంతో కలిపేందుకు ఈ సొరంగం బాగా ఉపయోగపడుతుంది. కశ్మీర్లోని ఎత్తైన పర్వత కనుమల్లో ఒకటైన జోజిలా.. శ్రీనగర్–కార్గిల్–లేహ్ జాతీయ రహదారిపై, సముద్ర మట్టానికి 11,578 అడుగుల ఎత్తులో ఉంది. శీతాకాలంలో భారీగా మంచు కురుస్తుంది కాబట్టి ఈ రహదారిని మూసేస్తారు. దీంతో లడఖ్ ప్రాంతానికి రాకపోకలు సాధ్యపడవు. ఈ ఆటంకాన్ని అధిగమించేందుకు 14.15 కిలోమీటర్ల పొడవుతో, రెండు వరసల రహదారితో ఈ సొరంగాన్ని నిర్మిస్తున్నారు. దీని నిర్మాణం కారణంగా జోజిలా పర్వత ప్రాంతంలో ప్రస్తుతం ప్రయాణానికి మూడున్నర గంటలు పడుతుండగా.. సొరంగం నిర్మాణం పూర్తయ్యాక అది 15 నిమిషాల్లోనే పూర్తవుతుంది. జమ్మూలోనూ పర్యటించిన మోదీ అక్కడి వైష్ణోదేవి ఆలయానికి చేరుకునేందుకు కొత్తగా తారాకోట మార్గాన్ని ప్రారంభించారు. ఓ విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. -
మంత్రిగారికి చేదు అనుభవం
శ్రీనగర్: ఇప్పటికి 45కు చేరిన మరణాలు.. 2000 మందికిపైగా గాయాలు.. రెండు వారాలుగా కర్ఫ్యూ.. కనీస అవసరాలకు ఇబ్బందులు.. ఇదీ కశ్మీర్ లోయలో పరిస్థితి. వీటిని చక్కదిద్దే ప్రయత్నంలో భాగంగా రెండు రోజుల పర్యటన కోసం శనివరాం కశ్మీర్ కు వచ్చిన కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు చేదు అనుభవం ఎదురైంది. శనివారం మధ్యాహ్నం స్థానిక వ్యాపారులతో భేటీ కావాలనుకున్నారు. కానీ అందుకు వ్యాపారులు సుముఖత వ్యక్తం చేయలేదు. 'మేం ఆయనతో మాట్లాడబోమ'ని అధికారులకు తేల్చి చెప్పారు. దీంతో చేసేదేమి లేక రాజ్ నాథ్ మరో కార్యక్రమానికి వెళ్లిపోయారు. రెండు రోజుల కశ్మీర్ పర్యటనలో భాగంగా శనివారం లోయకు వెళ్లిన హోం మంత్రి పలువురు ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ భేటీకి పారమిలటరీ,సీఆర్పీఎఫ్, ఐటీబీపీ డీజీలు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. శనివారం సాయంత్రం లేదా ఆదివారం ఉదయం జమ్ముకశ్మీర్ గవర్నర్ నరీంద్రనాథ్ వోరా, సీఎం మొహబూబా ముఫ్తీలతో భేటీ అనంతరం ఆదివారం మధ్యాహ్నం రాజ్ నాథ్ తిరిగి ఢిల్లీ బయలుదేరతారు. చొరబాటుదారుల కాల్పుల్లో జవాన్ మృతి ఉత్తర కశ్మీర్ లోని కుప్వారా జిల్లా లైన్ ఆఫ్ కంట్రోల్ (ఎల్ వోసీ) వద్ద చొరబాటుదారులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాన్ మరణించినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ముష్కరులు చొరబాటుకు యత్నించారని, దీనిని గమనించిన పహారా బృందం ఉగ్రవాదులపై కాల్పులు జరిపిందని, ఎదురుకాల్పుల్లో జవాన్ మృతి చెందాడని ఆర్మీ వర్గాలు ఒక ప్రకటన విడుదల చేశాయి. కాల్పులు జరిపిన ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతున్నట్లు పేర్కొన్నాయి. -
కాశ్మీర్పై ఖాకీల డేగకన్ను
మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం శ్రీనగర్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాశ్మీర్లో పర్యటించడాన్ని వ్యతిరేకిస్తూ హురియత్ కాన్ఫరెన్స్లోని రెండు వర్గాలు గురువారం బంద్కు పిలుపునివ్వటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ చోటుచేసుకోకుండా నగరంలో భద్రతను మరింత పెంచారు. అనుమానాస్పద వాహనాలను తనిఖీ చేసేందుకు నగరంలో డజను ప్రాంతాల్లో చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ పోలీసులు, పారామిలిటరీ బలగాలను మోహరించారు. నగరంలోకి వచ్చిపోవడానికి ఉండే పలు మార్గాల్లో ప్రత్యేక చెకింగ్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. దీపావళి రోజున శ్రీనగర్లో పర్యటించనున్నట్లు మోదీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు మేం రెడీ: బీజేపీ జమ్మూ కాశ్మీర్లో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించినా తమకు ఓకేనని, తాము పోటీకి సిద్ధంగా ఉన్నామని బీజేపీ ప్రకటించింది. ‘‘ఎన్నికలు ఎప్పుడు నిర్వహించినా మేం పోటీ చేయడానికి సిద్ధమే’’ అని బీజేపీ నాయకుడు జితేందర్ సింగ్ బుధవారమిక్కడ చెప్పారు.


