-
వృద్ధి అవుట్లుక్కు భౌగోళిక ఉద్రిక్తతలే అవరోధం
న్యూఢిల్లీ: భారతదేశ వృద్ధి అవుట్లుక్కు భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడమే అతిపెద్ద ప్రమాదకరంగా తయారయ్యిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) సభ్యులు జయంత్ ఆర్ వర్మ ఉద్ఘాటించారు. ప్రత్యేకించి ఈ ఉద్రిక్తతలు ఆసియా ప్రాంతానికి వ్యాపిస్తే దేశ ఎకానమీకి మరింత సమస్యలు వచ్చిపడతాయని ఆయన అన్నారు. ఈ మేరకు ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ద్రవ్యోల్బణం, ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గుముఖం పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. ఇది ఎకానమీకి మేలు చేకూర్చే అంశం. దేశంలో ఈ ఖచ్చితంగా దీర్ఘకాలికంగా ఈ సమస్య కొనసాగదని భావిస్తున్నా. రిటైల్ ద్రవ్యోల్బణాన్ని నిర్దేశిత 6 స్థాయిలోపునకు తీసుకురావడానికి ఆర్బీఐ ద్రవ్యపరపతి విధానం కట్టుబడి ఉంది. ► ఎకానమీ పట్ల ఆశావహ పరిస్థితే ఉంది. పలు రంగాలు, పరిశ్రమలలో రికవరీ అసమానంగా ఉన్నప్పటికీ, వినియోగ డిమాండ్ కోలుకోవడం ప్రారంభమైంది. ఇది హర్షణీయ పరిణామం. ► పరిశ్రమ, వివిధ రంగాల సామర్థ్య వినియోగం పెరుగుతోంది. ఇప్పుడు వ్యాపార విస్తరణ కోసం మూలధన వ్యయాల పెంపుపై పలు రంగాలు వ్యూహ రచన చేస్తున్న సంకేతాలు ఉన్నాయి. ► పలు కీలక అంశాలు దేశీయ మారకపు రేటు కదలికలకు కారణాలుగా ఉంటాయి. అందులో ద్రవ్యోల్బణం ఒక కారణం. ప్రస్తుత రూపాయి పతనంపై ఆందోళన చెందాల్సిన పనిలేదు. -
ఫైనల్లో భారత్
కొలంబో: ఎమర్జింగ్ ఆసియా కప్లో ఓటమి ఎరుగని యువ భారత్ జట్టు తుది పోరుకు అర్హత సాధించింది. గురువారం సెమీఫైనల్లో 7 వికెట్లతో పాకిస్తాన్పై ఘనవిజయం సాధించింది. ఆల్రౌండ్ ప్రదర్శనతో చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసింది. మొదట బౌలింగ్లో స్పిన్నర్లు మయాంక్ మార్కండే (4/38), జయంత్ (2/29), పేసర్ అంకిత్ రాజ్పుత్ (2/19), తర్వాత బ్యాటింగ్లో హిమ్మత్ సింగ్ (59 నాటౌట్; 3 ఫోర్లు, 5 సిక్సర్లు), నితీశ్ రాణా (60 నాటౌట్; 6 ఫోర్లు, 3 సిక్సర్లు) పాక్ పనిపట్టారు. భారత బౌలర్ల ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ 44.4 ఓవర్లలో 172 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రిజ్వాన్ (67; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), షకీల్ (62; 7 ఫోర్లు) రాణించారు. మిగతా బ్యాట్స్మెన్ చేతులెత్తేశారు. తర్వాత స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ కూడా తడబడింది. రుతురాజ్ గైక్వాడ్ (20; 2 ఫోర్లు, 1 సిక్స్), అంకుశ్ బెయిన్స్ (9), ములాని (19; 2 ఫోర్లు) స్వల్ప వ్యవధిలో ఔటయ్యారు. 52 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన దశలో హిమ్మత్, రాణా అబేధ్యమైన నాలుగో వికెట్కు 126 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. రెండో సెమీస్ లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో బంగ్లాదేశ్పై గెలి చింది. శనివారం ఇక్కడే జరిగే టైటిల్ పోరులో భారత్, లంక అమీతుమీ తేల్చుకుంటాయి. -
ప్రభాస్ రేంజ్ హీరో అవుతాడు
‘ఇండస్ట్రీలో ఇప్పుడు కాంబినేషన్కి తప్ప కథకి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. నాకు కథ ముఖ్యం. అది ఉంటే ఎవరితోనైనా సినిమా చెయ్యొచ్చు. ‘ఈశ్వర్’తో ప్రభాస్ని హీరోగా చేశాం. తను ఇప్పుడు పెద్ద రేంజ్ హీరో అయినందుకు గర్వంగా ఉంది. గంటా రవి కూడా ప్రభాస్ రేంజ్ హీరో అవుతాడు’’ అని జయంత్ సి. పరాన్జీ అన్నారు. గంటా రవి, మాళవికా రాజ్ జంటగా కె.అశోక్కుమార్ తెరకెక్కించిన ‘జయదేవ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జయంత్ సి. పరాన్జీ చెప్పిన విశేషాలు..కెమెరామేన్ జవహార్రెడ్డి గంటా రవిని పరిచయం చేశాడు.రవిని చూడగానే ఇతనితో సినిమా తీయొచ్చు అనిపించింది. కృషి, పట్టుదల, దీక్షతో ఈ చిత్రంలో ప్యాషన్తో నటించాడు. తమిళ ‘సేతుపతి’ చిత్రంలోని మెయిన్ ఎస్సెన్స్ తీసుకుని తెలుగు నేటివిటీకి తగ్గట్లు మార్పులు చేసి ‘జయదేవ్’ తీశా. పరుచూరి బ్రదర్స్ కథని బాగా డెవలప్ చేశారు. ∙సిన్సియర్ పోలీసాఫీసర్ కథ ఇది. రెగ్యులర్ పోలీస్ చిత్రాల్లా ఉండదు. రవి, మాళవికలకు లాంగ్ రన్ ఉంటుంది. ఇందులో వినోద్కుమార్ విలన్గా చేశారు. నా ‘అల్లరి పిడుగు, తీన్మార్’ చిత్రాలు సరిగ్గా ఆడలేదు. గ్యాప్ తీసుకుని రైట్ టైమ్లో చేసిన చిత్రం ‘జయదేవ్’. మళ్లీ నన్ను నేను ప్రూవ్ చేసుకునే చిత్రమవుతుంది. మణిశర్మ మంచి పాటలిచ్చారు. ‘ప్రేమంటే ఇదేరా, ఈశ్వర్’ తర్వాత అశోక్కుమార్గారితో చేసిన ‘జయదేవ్’ మా కాంబినేషన్లో హ్యాట్రిక్ సాధిస్తుంది. -
బస్ మిస్సింగ్..!
కొత్త జీవితాలను ప్రారంభించాలనుకున్న ప్రేమికులు, మరదలి కోసం వెతుకుతున్న బావ, ఎంజాయ్ చేసేందుకు టూర్కు వెళ్తున్న దంపతులు ఇలా ప్రతి ఒక్కరిది ఒక్కో కథ. ఈ అందరూ సువర్ణసుందరి టూర్ బస్లో ప్రయాణం చేస్తుంటారు. సడన్గా ఆ బస్సు మాయమౌతుంది. ప్రయాణికులను కిడ్నాప్ చేసింది ఎవరు? కిడ్నాపర్ల డిమాండ్స్ ఏంటి? ప్రయాణికులు ఈ ఆపద నుంచి ఎలా గట్టెక్కారు..? అనే కథాంశంతో రూపొందిన చిత్రం ‘మిక్సర్ పొట్లం’. శ్వేతాబసు ప్రసాద్ కీలక పాత్రలో ఎంవి సతీష్కుమార్ దర్శకత్వంలో భానుచందర్ తనయుడు జయంత్ హీరోగా గోదావరి సినీటోన్ పతాకంపై కలపటపు శ్రీ లక్ష్మీప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకపల్లి శ్రీనివాసరావు, సంయుక్తంగా నిర్మించారు. గీతాంజలి కథానాయిక. సుమన్, భానుచందర్ నటించారు. మే నెలలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రముఖ నిర్మాత సురేష్బాబు మా చిత్రాన్ని రెండు ఏరియాల్లో రిలీజ్ చేస్తుండటం చాలా ఆనందంగా ఉంది. దర్శకుడు సతీష్ చెప్పిన కథ నచ్చడంతో సినిమా రంగంలోకి వచ్చి ‘మిక్చర్ పొట్లం’ సినిమాను నిర్మించాం. మాధవపెద్ది సురేష్ మంచి సంగీతం అందించారు. సినిమా తప్పకుండా హిట్ అవుతుంది’’ అన్నారు. -
భాష తెలిస్తే నటన సులభం
‘‘భానుచందర్కు చాలా పాటలు పాడాను. ఇప్పుడు వాళ్లబ్బాయి జయంత్కి పాటలు పాడటం హ్యాపీగా ఉంది. ఎవరికైనా భాష మీద పట్టుండాలి. భాష బాగా తేలిస్తే నటించడం ఈజీ. యువతను ఆకట్టుకునేలా సంగీత దర్శకుడు మాధవపెద్ది సురేశ్ స్వరాలు సమకూర్చారు’’ అన్నారు ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం. జయంత్, శ్వేతా బసుప్రసాద్, గీతాంజలి ముఖ్యతారలుగా సతీశ్ దర్శకత్వంలో కలపటపు శ్రీలక్ష్మీ ప్రసాద్, కంటె వీరన్న చౌదరి, లంకలపల్లి శ్రీనివాసరావు నిర్మిస్తున్న చిత్రం ‘మిక్చర్ పొట్లం’. మాగంటి మురళీమోహన్ పాటల సీడీలను ఆవిష్కరించారు. ఎస్పీబీ ట్రైలర్ను విడుదల చేశారు. ‘‘సినిమాలన్నీ ఒకటే. చిన్నా పెద్ద తేడా లేదు. హీరో జయంత్ కొత్తవాడైనా బాగా నటించాడు’’ అని శ్వేతా బసు ప్రసాద్ అన్నారు. ఈ వేడుకలో దామోదర ప్రసాద్, సాగర్, చిట్టిబాబు, డాక్టర్ విజయలక్ష్మీ, జాన్బాబు, నవీన్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్
అమెరికా వరల్డ్కప్ జట్టులో ఐదుగురు భారత సంతతి ఆటగాళ్లు..
చావ్లా అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో రెండో బౌలర్గా
గుడిలో సింపుల్గా పెళ్లి చేసుకున్న నటుడి కూతురు (ఫోటోలు)
పార్టీ ఆఫీసులో రాహుల్ గాంధీ పూజలు - వీడియో వైరల్
వెంకటేశ్ అయ్యర్ అద్భుత పోరాటం.. ముంబై టార్గెట్ ఎంతంటే?
సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇలా..
పిల్లల్ని ఎందుకు కనలేదో తొలిసారి చెప్పిన వితికా
ధనుష్తో విడిపోయిన ఐశ్వర్య.. అప్పుడే కొత్తింట్లోకి (ఫోటోలు)
సొంతగూటికి సంజయ్ నిరుపమ్
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement