breaking news
jaggary
-
క్రంచీ..క్రంచీ ఎల్లు చిక్కీ: చాలా సింపుల్గా, చక చకా !
సంక్రాంతి అంటేనే స్వీట్ల పండుగ. అరిసెలు, పూతరేకులు, కొబ్బరి బూరెలు, కరకజ్జ, జంతికలు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ లిస్ట్ చాలా పెద్దదే. అయితే వీటికి సమయంతోపాటు, నైపుణ్యం కూడా కావాలి. అందుకే చాలా తేలిగ్గా, తక్కువ సమయంలో, చాలా తక్కువ పదార్థాలతో చేసుకునే స్వీట్ గురించి తెలుసుకుందాం. ఎల్లు చిక్కీ. అంటే నువ్వులు ( తెల్లవి, నల్లవి) బెల్లంతో కలిపి తయారుచేసుకునే రుచికరమైన , క్రిస్పీ స్వీట్. ఎల్లు అంటే తమిళంలో నువ్వులు అని అర్థం. నువ్వుల చిక్కిని ఎల్లు మిట్టై, నువ్వుల బర్ఫీ,టిల్ చిక్కి అని కూడా అంటారు. ఇందులో జీరో షుగర్ , జీరో ఆయిల్ అన్ని వయసుల వారికి పర్ఫెక్ట్గా హ్యాపీగా తినవచ్చు ముఖ్యంగా నువ్వులు పెరుగుతున్న పిల్లలకు మంచి శక్తిని ఇస్తాయి. వృద్ధులు, మహిళల ఆరోగ్యం కోసం ఎల్లు చిక్కీని నెలకోసారి చేసుకుని రోజూ కనీసం ఒక్క పట్టీ అయినా తినాలి. కావలసిన పదార్థాలు నువ్వులు – పావు కేజీ; బెల్లం – పావు కేజీ; నెయ్యి –కొంచెం ఎలా చేసుకోవాలి? నువ్వులను మందపాటి పెనంలో వేసి సన్నమంట మీద వేయించాలి. చిటపట పేలడం మొదలు పెట్టిన తర్వాత కమ్మటి వాసన వస్తూ ఉంటుంది. అపుడు స్టవ్ ఆపేసి పెనం పక్కన పెట్టి చల్లారనివ్వాలి. మరొక పాత్రలో బెల్లంతోపాటు, కొద్దిగి నీళ్లు వేసుకుని, మరిగేవరకు మీడియం మంట మీద ఉంచాలి. కరిగిన తర్వాత మంట తగ్గించి పాకం వచ్చే వరకు ఉడికించాలి. పాకం వచ్చిన తర్వాత అందులో నువ్వులు, నెయ్యి వేసి కలపాలి. ఒక వెడల్పాటి ప్లేట్కు నెయ్యి రాసి బెల్లం, నువ్వుల మిశ్రమాన్ని వేసి పూరీల కర్రతో అంతటా ఒకేమందం వచ్చేటట్లు వత్తాలి. వేడి తగ్గిన తర్వాత చాకుతో ఇష్టమైన ఆకారంలో కట్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత ప్లేట్ నుంచి వేరు చేసి గాలి దూరని డబ్బాలో నిల్వ చేసుకుంటే నాలుగు వారాల పాటు నిల్వ ఉంటాయి. వేరుశెనగలను కూడా కలుపుకొని కూడా కావాలంటే లడ్డూల్లా కూడా తయారు చేసుకోవచ్చు. వీటిల్లో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి, పెద్దగా నెయ్యి అవసరం పడదు. ఎల్లు చిక్కీ లాభాలు ఫైబర్ కంటెంట్ ఎక్కువ మలబద్దకాన్ని నివారిస్తుంది, వాపులను తగ్గిస్తుంది పొత్తికడుపు కొవ్వును కరిగిస్తుంది. ఎనర్జీ బూస్టర్, జీర్ణ ఆరోగ్యం -
రాష్ట్ర సరిహద్దుల్లో ఎక్సైజ్ అధికారుల దాడులు
వేలేరుపాడు : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల సరిహద్దు ప్రాంతంలో రెండు రాష్ట్రాల ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు శుక్రవారం దాడులు చేశారు. సరిహద్దుల్లో ఉన్న వేలేరుపాడు మండలం మేడేపల్లి గ్రామంలో అక్రమంగా ఓ ఇంట్లో నిల్వఉంచిన 14 క్వింటాళ్ల బెల్లాన్ని పట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అశ్వారావుపేట మండలం గాండ్లగుడెం, అనంతారం, ఆసుపాక, దమ్మపేట మండలం వడ్లగుడెం, రంగువారిగుడెం, మందలపల్లి గ్రామాల్లో తొమ్మిది వందల లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. మూడు కేసులు నమోదు చేశారు. దాడుల్లో ఏలూరు ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నాగేంద్రరావు, తెలంగాణ రాష్ట్రం కొత్తగుడెం అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఎస్.మధు, ఇరు రాష్ట్రాల సీఐలు అజయ్కుమార్సింగ్, రాజశేఖర్, రామ్మూర్తి, సిబ్బంది పాల్గొన్నారు. ææ సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ ఏలూరు అర్బన్ : రాష్ట్ర సరిహద్దుల్లో సారా తయారీ యథేచ్ఛగా జరుగుతోందని ఎక్సైజ్ డెప్యూటీ కమిషనర్ (డీసీ) వై.బి.భాస్కరరావు తెలిపారు. శుక్రవారం రాష్ట్ర సరిహద్దు గ్రామాల్లో సారా తయారీ కేంద్రాలపై జిల్లా ఎౖMð్సజ్ పోలీసులు దాడులు చేశారు. డీసీ భాస్కరరావు మాట్లాడుతూ దాడుల్లో సారా బట్టీ నిర్వహిస్తున్న ఒగెళ్ళ బుడ్డిరెడ్డిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి సారా తయారీకి ఉపయోగించే 10 కేజీల అమ్మోనియా, 350 కేజీల తెల్లబెల్లం, 966 కేజీల నల్లబెల్లం, రెండు కేజీల ఆలం స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు. ఇదే క్రమంలో జిల్లాలో అనధికారికంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై దాడి చేసిన తమ సిబ్బంది రెండు షాపులను గుర్తించి వారిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 19 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారని చెప్పారు. దాడుల్లో ఏలూరు యూనిట్ సూపరింటెండెంట్ వై.శ్రీనివాసచౌదరి, ఎన్ఫోర్స్మెంట్ ఏఈఎస్ పి. సురేష్బాబు, సిబ్బంది పాల్గొన్నారని డీసీ తెలిపారు.