-
Hyderabad: ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని దారుణం.. డెలివరీ బాయ్ వెంటపడి మరీ..
సాక్షి, హైదరాబాద్ : హుమయూన్నర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దుర్మార్గంగా ప్రవర్తించాడు. ఫుడ్ ఆర్డర్ ఆలస్యమైందని డెలివరీ బాయ్పై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. తన అనుచరులు 15 మందితో కలిసి మాసబ్ ట్యాంక్లోని హోటల్ వద్దకు వచ్చాడు. వారితో కలిసి అక్కడ భయానక వాతావరణం సృష్టించాడు. భయంతో సదరు డెలివరీ బాయ్ హోటల్లోకి పరుగుతీశాడు. వారు కూడా అతన్ని వెంబడిస్తూ హోటల్లోకి పరుగెత్తి మరీ డెలివరీ బాయ్పై మూకుమ్మడిగా దాడి చేశారు. హోటల్ లోపలే అతడిని పట్టుకుని చితకబాదారు. హోటల్ సిబ్బంది గొడవను ఆపేందుకు ప్రయత్నించగా ఫలించలేదు. దాడి నుంచి తప్పించుకోవడానికి వంటగదిలోకి వెళ్లగా.. స్టౌమీద ఉన్న మరుగుతున్న నూనె మీద పడింది. దీంతో ఫుడ్ డెలివరీ బాయ్తో పాటు మరో ఇద్దరు హోటల్ సిబ్బందికి సైతం గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ డెలివరీ బాయ్ ఇలియాస్, హోటల్ ఉద్యోగులు సోను, సజ్జన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ ఘటనలో ప్రధాన నిందితుడు, అతని ముగ్గురు కుమారులు సహా ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దాడికి పాల్పడిన మరికొందరిని గుర్తించి అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. -
కార్డన్ సెర్చ్: అదుపులో 9 మంది రౌడీషీటర్లు
హైదరాబాద్: హుమయున్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. శుక్రవారం తెల్లవారుజామున వెస్ట్జోన్ డీసీపీ వెంకటేశ్వర్రావు ఆధ్వర్యంలో సుమారు 400 మంది పోలీసులు ఆ ప్రాంతాన్నంతా జల్లెడ పట్టారు. ఈ సందర్భంగా 9 మంది రౌడీషీటర్లతో పాటు 51 మంది అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తనిఖీల్లో సరైన పత్రాలు లేనటువంటి 55 బైక్లు, 5 ఆటోలు, ఓ కారును పోలీసులు సీజ్ చేశారు. -
గాయని మధుప్రియ తండ్రి అరెస్టు
హైదరాబాద్: వర్ధమాన గాయని మధుప్రియ భర్త శ్రీకాంత్ అని భ్రమపడి మహ్మద్ నయీమ్ అనే వ్యక్తి పై దాడి కేసులో ఆమె తండ్రి పెద్ద మల్లేశ్ ను ఉప్పల్ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం మల్లేశ్ తో పాటు మరో ముగ్గురిని కూడా అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. కాగా గత శనివారం రాత్రి శ్రీకాంత్ అనుకుని రామాంతపూర్ కు చెందిన మహ్మద్ నయీమ్ (30) ని మధుప్రియ తండ్రి, బంధువులు చితకబాదారు. ఈ దాడిలో అతను తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు బాదితుడు ఉప్పల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, విచారణ చేపట్టిన పోలీసులు దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
శ్రీకాంత్ మారితే ఆలోచిస్తా: మధుప్రియ
♦ కొలిక్కిరాని గాయని కేసు వ్యవహారం ♦ ఆరు గంటల పాటు కౌన్సిలింగ్ సాక్షి, హైదరాబాద్: గాయని మధుప్రియ దంపతుల వివాదం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. పెళ్లయిన మూడు నెలల నుంచే తనకు కట్నంగా ఆస్తి తీసుకురావాలంటూ భర్త శ్రీకాంత్ వేధింపులకు గురి చేశాడని మధుప్రియ హుమాయున్నగర్ పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం మధుప్రియతో పాటు ఆమె భర్త శ్రీకాం త్కు మానసిక వైద్యులు ఆరు గంటల పాటు కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రముఖ డాక్టర్ రాధిక, సైకాలజిస్ట్లు వసంత, శాంతితో పాటు ఆసిఫ్నగర్ పోలీస్ డివిజన్ ఏసీపీ గౌస్మొహియుద్దీన్, హుమాయూన్నగర్ ఇన్స్పెక్టర్ ఎస్.రవీందర్ నేతృత్వంలో మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ కౌన్సిలింగ్ జరిగింది. ‘మధుప్రియ, భర్త శ్రీకాంత్కు వైవాహిక జీవితంలో ఎలాంటి విషయాలపై విభేదాలు వస్తున్నాయన్న విషయం తెలుసుకునే ప్రయత్నం చేశాం. మధుప్రియ మనసు కుదుటపడిన అనంతరం రెండోసారి కౌన్సిలింగ్ ఇస్తాం. అప్పటివరకు చట్టపరంగా ఎలాంటి చర్యలూ తీసుకోం’ అని ఆసిఫ్నగర్ ఏసీపీ గౌస్మొహియుద్దీన్ తెలిపారు. శ్రీకాంత్పై ఇప్పుడే చర్యలొద్దు: మధుప్రియ కౌన్సెలింగ్ అనంతరం మధుప్రియ మీడియాతో మాట్లాడుతూ... ‘శ్రీకాంత్ మంచోడే. అతడిపై ఇప్పుడే ఎటువంటి చట్టపరమైన చర్యలు తీసుకోవద్దు. ప్రస్తుతం నా మానసిక పరిస్థితి బాగాలేదు. కౌన్సిలింగ్తో జీవితమంటే నాకో క్లారిటీ వచ్చింది. శ్రీకాంత్ మంచిగా మారితే రెండో కౌన్సిలింగ్కు వస్తా. అప్పటివరకు అమ్మానాన్నతోనే కలసి ఉంటా’ అన్నారు. ‘మధుప్రియను వేధించలేదు. ఎప్పటికైనా ఆమె నాతోనే ఉంటుంది. ఆమెతో ప్రశాంతంగా ఐదు నిమిషాలు కూడా వారి తల్లిదండ్రులు మాట్లాడించ లేదు’ అని శ్రీకాంత్ చెప్పారు. శ్రీకాంత్ నుంచి ప్రాణభయం: గాయని తండ్రి కాగా, ఆదివారం తెల్లవారుజామున శ్రీకాంత్ 15 మంది అనుచరులతో వచ్చి రామంతాపూర్లోని తమ ఇంటిపై ఇటుకలతో దాడి చేశాడని మధుప్రియ తండ్రి పెద్ద మల్లేశ్ ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. శ్రీకాంత్ వల్ల తమ కుటుంబానికి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు ఐపీసీ 147, 148, 506 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. కాగా, మధుప్రియ కుటుంబసభ్యులే ఇంటికి పిలిపించి మరి తనను చితకబాదారని శ్రీకాంత్ సాక్షి టీవీ చర్చలో వెల్లడించారు. ఆమె తల్లి వల్లే ఈ గొడవలన్నీ అని చెప్పారు. ఇదే చర్చలో మధుప్రియ మాట్లాడుతూ... అసభ్య పదజాలంతో దూషించేవాడని, చేయి కూడా చేసుకున్న సందర్భాలు ఉన్నాయని ఆరోపించారు. -
మా ఆయన మంచివాడు: మధుప్రియ
హైదరాబాద్: గాయని మధుప్రియ ప్రేమ పెళ్లి వివాదం డ్రామాకు 24 గంటల తర్వాత తాత్కాలికంగా తెరపడింది. హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్లో మధుప్రియ, శ్రీకాంత్ దంపతులకు పోలీసులు, మానసిక వైద్యుల సమక్షంలో 4 గంటల పాటు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ కౌన్సెలింగ్ అనంతరం ఇద్దరు ప్రస్తుతానికి రాజీకొచ్చినట్లు తెలుస్తోంది. మరో రెండు, మూడు రోజుల తర్వాత సెకండ్ కౌన్సెలింగ్ ఇచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్పారు. శ్రీకాంత్ కు అయిన గాయాల వివాదంపై మాట్లాడుతూ.. ఉప్పల్ పీఎస్ పరిధిలో ఈ కేసు ఉందని పేర్కొన్నారు. మధుప్రియ, శ్రీకాంత్ పూర్తిగా రాజీకొస్తారని భావిస్తున్నారా అని ఓ విలేకరి పోలీసులను ప్రశ్నించగా.. అది వారిద్దరికి సంబంధించిన వ్యవహారమని ఇప్పుడే ఏం చెప్పలేమన్నారు. రెండో కౌన్సెలింగ్ తర్వాత తన నిర్ణయాన్ని వెల్లడిస్తానని సింగర్ మధుప్రియ చెప్పింది. అయితే, తనకు కొద్దిరోజుల సమయం కావాలని కోరినట్లు ఆమె పేర్కొంది. రెండో కౌన్సెలింగ్ పూర్తయ్యే వరకు తన తల్లితండ్రులతోనే ఉండబోతున్నట్లు వివరించింది. ప్రస్తుతం పోలీసులు ఇచ్చిన కౌన్సెలింగ్ తర్వాత శ్రీకాంత్ పై అభిప్రాయం అడగగా... 'హి ఈజ్ గుడ్' అంటూ మధుప్రియ చెప్పింది . మధుప్రియ వస్తానంటే తన ఇంటికి తీసుకెళ్లాడానికి తనకేమాత్రం అభ్యంతరం లేదని శ్రీకాంత్ అంటున్నాడు. అయితే, భవిష్యత్తులో ఆమె తల్లిదండ్రులు అనవసరంగా ఈ విషయంలో జోక్యం చేసుకోకుండా ఉండాలని శ్రీకాంత్ చెప్పాడు. శనివారం అర్ధరాత్రి నుంచి ఒకరు మరొకరిపై కేసులు పెట్టుకున్న విషయం తెలిసిందే. తనను వేధిస్తున్నాడని మధుప్రియ, తనపై దాడి చేశారని శ్రీకాంత్ పరస్పరం ఫిర్యాదులు చేశారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
రాహుల్ తెలంగాణ మహిళలకు క్షమాపణలు చెప్పాలి: హరీశ్రావు
కేకేఆర్తో లక్నో పోరు.. తుది జట్లు ఇవే! స్టార్ బౌలర్ దూరం
జడేజా ఆల్రౌండ్ షో.. పంజాబ్ను చిత్తు చేసిన సీఎస్కే
సీను సీతారైంది సాంబడా
సందడిగా వస్త్ర దుకాణం ప్రారంభోత్సవం (ఫొటోలు)
మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
తప్పక చదవండి
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement