-
లాటరీ మోసగాడి కోసం గాలింపులు
సాక్షి, చిత్తూరు(రొంపిచెర్ల) : తక్కువ వడ్డీకి రుణాలు..డబ్బులు కడితే లాటరీలో స్టీల్ వస్తువులు ఇస్తామంటూ అందిన కాడికి దండుకుని బోర్డు తిప్పేసిన లాటరీ మోసగాడిని పట్టుకునేందుకు పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఐదు రోజుల క్రితం రొంపిచెర్లలో ఎస్ఎస్ ఎంటర్ప్రైజెస్ నిర్వాహకుడు ఎస్ సాఫిక్ బాషా రాత్రి రాత్రికే అదృశ్యమవడం విదితమే. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్రాని చెందిన కొందరు పీలేరు మండల కేంద్రంలో రెండేళ్ల క్రితం ఎస్ఎస్ ఎంటర్ ప్రైజెస్ పేరుతో ఆఫీసు తెరచి, రొంపిచెర్ల, చిన్నగొట్టిగల్లు, కల్లూరు, కలికిరి, కలకడ, మహల్ ప్రాంతాల ప్రజల నుంచి డబ్బులు వసులు చేశారు. 50పైసలకే రుణాలట! వంద రూపాయలకు నెలకు 50పైసలు వడ్డీతో రుణాలు ఇస్తామని మహిళలను బురిడీ కొట్టించినట్లు తేలింది. నిర్వాహకుల మాటలు నమ్మి మహిళలు సంఘాలుగా ఏర్పాటై డబ్బులు కట్టారు. నెలకు రూ1600 కడితే రూ.35వేలు, నెలకు రూ2.500 కడితే రూ50 వేలు రుణంగా ఇస్తామని నమ్మబలకడంతో ఎక్కువ మంది అప్పు చేసి కొందరు, బంగారు నగలు తాకట్టు పెట్టి మరికొందరు రూ8 వేల నుంచి 35 వేల వరకు ఈ నెల 7,8 తేదీలలో చెల్లించారు. వీరందరికీ 9న రుణాలు ఇస్తామన్న నిర్వాహకుడు జంప్ అయ్యాడు. పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. నిందితులు తమిళనాడు వాసులని ప్రాథమికంగా తేలింది. విచారణలో కేవలం 40 మంది దగ్గర మాత్రమే రూ 40 వేలకు రశీదులు ఉన్నాయని ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. మిగిలిన వారి దగ్గర ఎలాంటి రశీదులు లేవని చెప్పారు. సాఫిక్బాషా అనేది నిందితుడి అసలు పేరు కాదని, త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని ఎస్ఐ తెలిపారు. ఇదలా ఉం చితే, మా గ్రూపునకు రూ.5లక్షల రుణం ఇస్తామని చెప్పడంతో రూ.35వేలు కట్టామని ముత్యాలమ్మ గుడి వీధికి చెందిన చోటీ బీ, రూ.50వేల రుణం కోసం నగలు తాకట్టు పెట్టి రూ.12,500 కట్టానని ఇమాన, రూ.1.5లక్షల రుణం కోసం రూ.25వేలు వడ్డీకి తెచ్చి గ్రూపు తరఫున కట్టానని హైస్కూలు వీధికి చెందిన పర్వీన్ తామెలా మోసపోయామో చెప్పుకొచ్చారు. -
పొదుపు పెంచండి..
న్యూఢిల్లీ: దేశీయంగా అంతకంతకూ తగ్గిపోతున్న పొదుపు రేటును మళ్లీ పెంచే దిశగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ వికాస్ పత్రాలను (కేవీపీ) మళ్లీ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మంగళవారం ఈ ఇన్వెస్ట్మెంట్ సాధనాన్ని ఆవిష్కరించారు. పేదలు మోసపూరిత (పోంజీ) స్కీముల బారిన పడకుండా సురక్షితమైన పెట్టుబడి సాధనంగా ఇది తోడ్పడుతుందని ఆయన చెప్పారు. ఎకానమీలో మందగమనం కారణంగా గడిచిన 2-3 సంవత్సరాల్లో దేశంలో పొదుపు రేటు రికార్డు స్థాయి 36.8 శాతం నుంచి 30 శాతం దిగువకు పడిపోయిందని మంత్రి వివరించారు. ఈ నేపథ్యంలో మరింత పొదుపు చేయాల్సిందిగా ప్రజలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. ఈ దిశగా కిసాన్ వికాస్ పత్రాలతో రెండు రకాల ప్రయోజనాలు ఉన్నాయని జైట్లీ తెలిపారు. పొదుపు రేటు పెంచడం ఒకటి కాగా.. అమాయక ఇన్వెస్టర్లు పోంజీ స్కీముల వైపు మళ్లకుండా విశ్వసనీయమైన ప్రభుత్వ పథకంలో తమ పొదుపు మొత్తాలను దాచుకునేందుకు ఉపయోగపడటం రెండోదని ఆయన వివరించారు. ఇన్వెస్టర్లకు వడ్డీ ఆదాయం తో పాటు దేశ నిర్మాణానికి కూడా ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ సాధనం తోడ్పడుతుందని జైట్లీ చెప్పారు. మరోవైపు, పొదుపు చేసేందుకు నమ్మకమైన సాధనం లేకపోవడంతో ప్రజలు డబ్బును తమ దగ్గరే అట్టే పెట్టుకోవడమో లేక బంగారం, వెండి మొదలైనవి కొనుక్కోవడమో చేయాల్సి వస్తోందని ఆర్థిక శాఖ కార్యదర్శి రాజీవ్ మహర్షి తెలిపారు. దేశప్రజలకు కిసాన్ వికాస్ పత్రాలతో ఎనలేని అనుబంధం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. దాదాపు వందేళ్లుగా పోస్టల్ శాఖ వివిధ రకాల చిన్న మొత్తాల పొదుపు పథకాలను నిర్వహిస్తోందని, ప్రస్తుతం 30.8 లక్షల పైచిలుకు ఖాతాదారులు ఉన్నారని ఆయన తెలిపారు. కిసాన్ వికాస్ పత్రాల వివరాలివీ.. కేవీపీల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తం.. 100 నెలల్లో రెట్టింపు అవుతుంది. రూ.1,000, రూ. 5,000, రూ. 10,000, రూ. 50,000 విలువ గల పత్రాలు అందుబాటులో ఉంటాయి. పెట్టుబడికి గరిష్ట పరిమితేమీ ఉండదు. కనీసంగా రెండున్నర సంవత్సరాల లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయితే, దీనిపై పన్నుపరమైన ప్రయోజనాలు ఉండవు. తొలుత వీటిని పోస్టాఫీసుల ద్వారా, ఆ తర్వాత క్రమంగా నిర్దిష్ట బ్యాంకుల శాఖల్లో విక్రయించడం జరుగుతుంది. 1988లో ప్రభుత్వం కేవీపీని ప్రవేశపెట్టింది. ఒక దశలో జాతీయ పొదుపు పథకాల కింద దేశవ్యాప్తంగా జమయిన పొదుపు మొత్తాల్లో కిసాన్ వికాస్ పత్రాల వాటా 29 శాతం దాకా ఉండేది. అయితే దుర్వినియోగం అవుతోందన్న ఆరోపణల నేపథ్యంలో 2011లో ప్రభుత్వం కేవీపీని నిలిపివేసింది. ఆ తర్వాత తాజాగా మళ్లీ ప్రవేశపెట్టింది.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఫాప్, కోహ్లి విధ్వంసం.. గుజరాత్పై ఆర్సీబీ ఘన విజయం
విరాట్ కోహ్లి బుల్లెట్ త్రో.. గుజరాత్ బ్యాటర్ ఫ్యూజ్లు ఔట్! వీడియో
ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
నెల్లూరు: పోటెత్తిన జనం.. ఉప్పొంగిన అభిమానం (ఫొటోలు)
వారికి వాడుకుని వదిలేసే అలవాటు: కాంగ్రెస్పై మండిపడ్డ జ్యోతిరాదిత్య సింధియా
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement