breaking news
Four-year-old baby
-
లడ్డూ ఇప్పిస్తామని చెప్పి..
యాదాద్రి భువనగిరి జిల్లా : మద్యం మత్తులో ఉన్న ఇద్దరు కామాంధులు లడ్డూ ఇస్తానని ఆశ చూపించి నాలుగేళ్ల చిన్నారిని తమ వెంట తీసుకెళ్లి లైంగికదాడికి యత్నించారు. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లింగోజిగూడెం గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని రేవా జిల్లా మహాసువ గ్రామానికి చెందిన దినేష్ కాల్(45), శివరాజ్ కాల్(44) గత మూడు నెలల క్రితం లింగోజిగూడెం గ్రామానికి వచ్చారు. స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమలో కాంట్రాక్టర్ కింద దినసరి కూలీలుగా పనిచేస్తున్నారు. వీరు లింగోజిగూడెం గ్రామంలోని బీసీకాలనీలో (రైస్విుల్ దగ్గర) మరికొంత మంది కూలీలతో కలిసి అద్దె ఇంట్లో ఉంటున్నారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలహాబాద్కు చెందిన బాలిక కుటుంబం సైతం మూడు నెలల క్రితం ఉపాధి నిమిత్తం ఇక్కడికి వచ్చారు. బాలిక తండ్రి అదే పరిశ్రమలో పెయింటింగ్ కాంట్రాక్టర్ వద్ద కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరు.. నిందితులు ఉంటున్న ఇంటి వెనుక భాగంలో ఉన్న అద్దె ఇంట్లో ఉంటున్నారు. లడ్డూ ఇప్పిస్తామని చెప్పి.. చిన్నారి తండ్రి కూలికి వెళ్లగా తల్లి ఇంటి వద్దే ఉంది. శుక్రవారం ఉదయం 11గంటల సమయంలో తల్లి ఇంట్లో దుస్తులు ఉతుకుతండగా చిన్నారులు బయట ఆడుకుంటున్నారు. డ్యూటీకి వెళ్లని దినేష్, శివరాజ్లు పూటుగా మద్యం సేవించారు. మద్యం మత్తులో ఉన్న వారిద్దరు ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న చిన్నారి దగ్గరకు వెళ్లారు. లడ్డూ ఇప్పిస్తానని ఆశ చూపించి తమ వెంట తీసుకెళ్లారు. వారు బాలికపై లైంగిక దాడికి యత్నిస్తుండగా రోదించడంతో బాలిక తల్లి బయటకు వచ్చి వెతకసాగింది. ఇద్దరు వ్యక్తులు మీ కుమార్తెను తీసుకెళ్లారని స్థానికంగా ఉన్న ఓ బాలిక చెప్పింది. దీంతో వెంటనే పక్కింటి వారి సాయంతో తల్లి అక్కడకు వెళ్లి బాలికను తీసుకువచ్చి పోలీసులకు సమాచారమిచి్చంది. పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికులతో మాట్లాడి వివరాలు సేకరించారు. వైద్యచికిత్స నిమిత్తం బాలికను చౌటుప్పల్లోని ప్రభుత్వ ఆస్పత్రికి, మెరుగైన వైద్యం కోసం అక్కడి నుంచి హైదరాబాద్ ఆస్పత్రికి తరలించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ మన్మథకుమార్ తెలిపారు. -
నాలుగేళ్ల చిన్నారిపై క్లాస్మేట్ దాడి
న్యూఢిల్లీ: దేశరాజధానిలో నాలుగేళ్ల చిన్నారిపై అదే తరగతిలోని మరో విద్యార్థి దాడికి పాల్పడ్డ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక్కడి మాక్స్ఫోర్ట్ ప్రైవేటు పాఠశాలలో చదువుతున్న ఓ విద్యార్థి(5) బాలిక మర్మాంగంపై వేలితో, పదునైన పెన్సిల్తో దాడికి పాల్పడ్డాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవంబర్ 17న ఈ ఘటన జరిగిన సమయంలో సీనియర్ విద్యార్థులు, టీచర్లు ఎవ్వరూ సమీపంలో లేకపోవడంతో ఆ విద్యార్థి ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడు. ఆ రోజు రాత్రి చిన్నారి నిద్రపోయేముందు తీవ్రమైన నొప్పితో ఏడుస్తుండటంతో ఆమె తల్లి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ విషయమై బాలిక తల్లి మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ దారుణం చోటుచేసుకుందని ఆరోపించారు. సదరు అబ్బాయిని వేరే సెక్షన్కు మార్చినందున బాలికను తిరిగి పాఠశాలకు పంపాల్సిందిగా పాఠశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రుల్ని కోరింది. -
చిన్నారిని తల్లి ఒడికి చేర్చిన వాట్సప్
చీరాల అర్బన్ : స్కూలుకు వెళ్లి తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారిని వాట్సప్ తల్లి దగ్గరికి చేర్చింది. ఈ ఘటన మంగళవారం చీరాల పట్టణంలో చోటుచేసుకుంది. చీరాల పట్టణంలోని వైకుంఠపురానికి చెందిన నాలుగేళ్ల చిన్నారి టోని శ్రీవాణి స్థానిక ప్రైవేటు పాఠశాలలో చదువుతోంది. స్కూలు నుంచి చెప్పకుండా బయటకు వచ్చిన ఆ చిన్నారి దారి తెలియక ఎంజీసీ మార్కెట్ వద్ద నిలబడింది. అమాయకంగా బేల చూపులు చూస్తున్న బాలికను శృంగారపేటకు చెందిన బెస్లీ అనే కుర్రాడు చూసి, తన బాధ్యతగా వన్టౌన్ పోలీసులకు అప్పగించాడు. చిన్నారి ఫొటోను పోలీసులు వాట్సప్ గ్రూప్లో షేర్ చేశారు. గ్రూప్ మెసేజ్లో వచ్చిన ఫొటో ఆధారంగా చిన్నారిని గుర్తుపట్టిన ఓ వ్యక్తి ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వెంటనే వారు పోలీస్స్టేషన్కు రాగా పోలీసులు పూర్తి వివరాలు తీసుకుని చిన్నారిని తల్లికి అప్పగించారు. తప్పిపోయిన చిన్నారి గంటల వ్యవధిలోనే తల్లి చెంతకు చేరడంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులు కూడా సంతోషం వ్యక్తం చేశారు. -
నాలుగేళ్ల పాప కిడ్నాప్
సాక్షి, రాజమండ్రి :నాలుగేళ్ల పాప కిడ్నాప్ ఘటన బుధవారం రాజమండ్రిలో కలకలం సృష్టించింది. తల్లితండ్రుల్ని బెంబేలెత్తించి, పోలీసులను ఉరుకులు పెట్టించింది. చివరకు కిడ్నాపర్లు పాపను విడిచిపెట్టడంతో కథ సుఖాంతమైంది. పోలీసులు కిడ్నాప్కు దారితీసిన పరిస్థితులపై విచారణ ప్రారంభించారు. సీతానగరం జూనియర్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్న పందిరి సదా సాంబశివరావు, రాజమండ్రి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కాంట్రాక్టు లెక్చరర్గా పనిచేస్తున్న విజయలక్ష్మిల కుమార్తె మేఘన నగరంలోని హర్షవర్ధన ప్లే స్కూల్లో నర్సరీ చదువుతోంది. బుధవారం సాయంత్రం నాలుగున్నరకు ఇద్దరు యువకులు వచ్చి మేఘన తల్లితండ్రులు ఆ పాపను తీసుకురమ్మన్నారని చెప్పడంతో ఆయా సంబంధిత టీచర్ అనుమతి తీసుకుని పాపను వారితో పంపించింది. అలా తీసుకెళ్లిన వాళ్లు సాయంత్రం 5.10 గంటలకు ‘మీ అమ్మాయిని కిడ్నాప్ చేశాం. రూ.రెండు లక్షలు ఇస్తే విడిచి పెడతా’మని తల్లిదండ్రులకు ఫోన్ చేశారు. కలవరపడ్డ వారు రాజమండ్రి క్రైం పోలీసులకు తెలిపారు. మీడియాకు, పోలీసులకు సమాచారమిస్తే పాపను చంపేస్తామని కిడ్నాపర్లు బెదిరించడంతో తల్లడిల్లిన వారు విషయాన్ని ప్రచారం చేయొద్దని మీడియాను వేడుకున్నారు. విజయవాడ రమ్మని... దుండగులు తల్లిదండ్రులకు చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా వారి ఆచూకీ కోసం పోలీసులు ప్రయత్నించారు. రైల్వేస్టేషన్ సమీపంలోని పాఠశాల నుంచి కిడ్నాపర్లు బాలికను జాతీయ రహదారి మీదుగా రావులపాలెం తీసుకువెళ్లినట్టు గుర్తించారు. ముందుగా రూ.రెండు లక్షలు అడిగిన దుండగులు తర్వాత తాడేపల్లిగూడెం నుంచి మరోసారి ఫోన్ చేసి కనీసం రూ.లక్షయినా ఇవ్వాలని, విజయవాడ బెంజ్ సర్కిల్ వద్దకు డబ్బులు తేవాలని కోరారు. పోలీసుల సూచనతో.. తల్లిదండ్రులు వారితో ఒప్పదం కుదుర్చుకుంటున్నట్టు మాట్లాడారు. రాత్రి 7.30 గంటలకు కిడ్నాపర్లు మళ్లీ ఫోన్చేసి పాపను నల్లజర్ల సమీపంలోని ప్రకాశరావుపాలెం వద్ద విడిచి వెళ్లినట్టు చెప్పి ఫోన్ పెట్టేశారు. అదే గ్రామంలో ఉన్న సాంబశివరావు బంధువులకు, అక్కడి పోలీసులకు వివరాలు తెలిపారు. ఈలోగా ఆందోళనలో చిక్కుకున్న పాప రోడ్డుపై వాహన చోదకులను ఆపి తనను అమ్మానాన్నల వద్దకు తీసుకువెళ్లాలని అభ్యర్థించింది. స్థాని కులు పాప వివరాలు తెలుసుకుంటుండగా సాంబశివరావు బంధువు ఓంకార్ అక్కడకు చేరుకుని అనంతపల్లి పోలీస్ స్టేషన్కు తరలించారు. అయినవాళ్ల పనేనా..? పాప కిడ్నాపర్లను ఉద్దేశించి ‘మామయ్య’ అని సంబోధిస్తుండడంతో ఇది కుటుంబంతో దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తులు చేసిన పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. విషయం పోలీసులకు, మీడియాకు తెలిసిపోవడంతో భయపడి, బంధువులు ఉన్న గ్రామంలో వదిలివేసినట్టు భావిస్తున్నారు. అర్బన్ ఎస్పీ హరికృష్ణ పాప ఆచూకీ ప్రయత్నాలను స్వయంగా పరిశీలించారు. క్రైం డీఎస్పీ త్రినాథరావు ఆధ్వర్యంలో సీఐ సత్యనారాయణ కేసు దర్యాప్తు చేపట్టారు. కాగా పాపను ఎవరు ఎందుకు కిడ్నాప్ చేశారో తల్లితండ్రులు కూడా చెప్పలేకపోతున్నారు.


