family counseling
-
‘మా ఆయన సంసారానికి పనికి రాడు సార్’..!
నమస్తే డాక్టరు గారు. నాకు సంవత్సరం క్రితం పెళ్ళయింది. నా భర్త సాఫ్ట్వేర్ ఇంజినీర్. వర్క్ ఫ్రం హోం చేస్తారు. చాలామంచి వ్యక్తి. మా అత్తయ్య వాళ్లకి ఒక్కడే కొడుకు, పెళ్ళికి ముందు ఎలాంటి ప్రేమ వ్యవహారాలు లేవు. ఎలాంటి చెడు అలవాట్లు కూడా లేవు. ఎంతో ఇష్టపడి నన్ను పెళ్ళి చేసుకున్నారు. కానీ ఒకటే సమస్య మా మధ్య ఎలాంటి శారీరక సంబంధం లేదు. మొదట్లో ప్రయత్నం చేశారు. కానీ ఫెయిల్ అయ్యారు. అప్పటి నుండి ఆత్మన్యూనతా భావంతో ఉంటున్నారు. నాతో ఫ్రీగా ఉండరు. సరదాగా మాట్లాడరు. నేను ప్రేమగా దగ్గరికి వెళ్తే ముడుచుకుపోతారు. తాను సంసారానికి పనికిరానని, నన్ను వేరే పెళ్ళి చేసుకోమని అంటున్నారు. మా అత్త మామలకు చేప్తే హైదరాబాద్ వెళ్ళి యూరాలజిస్ట్కి చూపించారు. ఆయన అన్ని పరీక్షలు చేసి అంతా బాగానే ఉంది. మందులు కూడా అవసరం లేదు. సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళమని చెప్తారు. భార్యాభర్తల మధ్య మామూలుగా జరగాల్సిన సంసారానికి కూడా ట్రీట్మెంట్ ఉంటుందంటారా? కౌన్సిలింగ్తో ఇలాంటి సమస్యలు తగ్గించవచ్చా? అసలు మా వారికి ఎలాంటి సమస్య ఉందంటారు? ఆయనంటే నాకు చాలా ఇష్టం. తనని నేను వదులుకోలేను. నన్నేం చేయమంటారో చెప్పండి. – ఓ సోదరి, గుడివాడమీ ఉత్తరాన్ని చదివాక మీ భర్త ఎంతో మంచి వ్యక్తి, కానీ ఒక సున్నితమైన సమస్యను ఎదుర్కొంటున్నారు అని అర్థమైంది. ఇది చాలామంది పురుషుల్లో కనిపించే ఒక సాధారణ సమస్య. దీన్ని ‘సైకోజెనిక్ ఎరెక్టయిల్ డిస్ఫంక్షన్‘ అంటారు. మనస్సులో ఉండే ఒత్తిడి, భయం, ఆత్మవిశ్వాసం లోపించడం వల్ల సమస్య కలగొచ్చు. ఒకటి రెండుసార్లు ఫెయిల్యూర్ జరిగిన తర్వాత, భయంతో... బిడియంతో దూరంగా ఉండటం మొదలవుతుంది. తర్వాత డిప్రెషన్కి గురి అవుతారు. తాము ఇక సంసార జీవితానికి పనికిరామని అనుకుంటారు. యురాలజిస్ట్ చెప్పినట్లు ఒక మంచి సైకియాట్రిస్ట్ని కలవండి. అతని ఒత్తిడికి కారణం కనుక్కుంటారు. ముందు తనలో ఆత్మ విశ్వాసం పెరిగేలా కౌన్సెలింగ్ చేస్తారు. ఆ తర్వాత ‘డ్యూయల్ సెక్స్ థెరపీ’ అనే ఒక మానసిక చికిత్స ద్వారా మీ ఇద్దరి మధ్య మానసిక, శారీరక ఆకర్షణ పెరిగేలా కొన్ని ప్రత్యేకమైన పద్ధతుల్లో చికిత్స చేస్తారు. దీంట్లో అనుభవం ఉన్న మానసిక వైద్యుడు లేదా క్లినికల్ సైకాలజిస్ట్ ద్వారా మాత్రమే ఈ థెరపీ చేయించండి. ఈ చికిత్స కోసం భార్య భర్తలిద్దరూ అటెండ్ కావాల్సి ఉంటుంది.ఈ చికిత్స ఆయనలోని ఒత్తిడిని తగ్గించేందుకు క్రమంగా మానసికంగా దగ్గర అవుతూ, తర్వాత శారీరకంగా దగ్గర అవడానికి సహాయపడుతుంది. అవసరమైతే కోరిక, పటిష్టత పెరిగేందుకు కొన్ని మంచి మందులు కూడా సైకియాట్రిస్టులు మీ వారికి ఇస్తారు. ప్రతిరోజు కొద్దిసేపు వాకింగ్, వ్యాయామం, బ్రీతింగ్ ఎక్సర్ సైజులు, యోగా కూడా చేస్తే మానసిక ఒత్తిడి త్వరగా తగ్గుతుంది. మీరు ప్రేమగా ఓపికగా వేచి ఉండండి. అదే ఆయనకి పెద్ద ఔషధంలా పని చేసి ఆయనకి మానసికంగా ఎంతో బలాన్ని ఇస్తుంది. ఆల్ ది బెస్ట్! - డా. ఇండ్ల విశాల్ రెడ్డి సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడమీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీsakshifamily3@gmail.com -
అమ్మాయే మనకు ముఖ్యం పరువు అనే ఆలోచనే వద్దు
ప్రశ్నః మాది ప్రకాశంజిల్లా. నా చిన్న కూతురు మా వూర్లోనే ఉండే మా బంధువుల అబ్బాయి మాయలోపడి అతనితో కలిసి ఇంట్లోంచి వెళ్లిపోయింది. ఆ దిగులుతో నా భర్త ఇటీవలే అనారోగ్యంతో చనిపోయాడు. మైనర్గా ఉన్నప్పుడే అతనిని పెళ్లిచేసుకుంటానని మా అమ్మాయి మమ్మల్ని అడిగితే... ‘నీదింకా చిన్నవయసు. పెళ్లీడు కూడా రాలేదు. ముందు చదువుకొమ్మ’ని చెప్పాం. అతనికి ఏ ఉద్యోగమూ లేదు. నిన్నెలా పోషిస్తాడంటూ ఆమెను సర్దిచెప్పే ప్రయత్నం చేశాం. ఆ తర్వాత కూడా ఆ అబ్బాయి మా అమ్మాయి వెంటపడటం ఆపలేదు. మా అమ్మాయికి కూడా చదువు మీద శ్రద్ధ పోయింది. ఎంతో కష్టపడి బతికేవాళ్లం. పెద్దమ్మాయిని టెంత్తోనే ఆపేయించాం. కనీసం ఈ అమ్మాయినైనా చదివించాలనుకున్నాం. కానీ మమ్మల్ని కాదని అతని వెంట వెళ్లిపోయింది. సమస్య అది కాదు. అమ్మాయి అతనితో వెళ్లిపోయి 9 నెలలు కావస్తోంది. కానీ ఇంత వరకూ అతను పెళ్లి చేసుకోలేదు. అంతేకాదు వాళ్లింటికి కూడా తీసుకురాకుండా మా వూరికి 15 కి.మీ. దూరంలో ఉన్న టౌన్లో ఉంచాడని విన్నాం. ఈ మధ్య అబ్బాయి వాళ్లమ్మానాన్న అతనికి వేరే సంబంధాలు వెతుకుతున్నారని తెలిసింది. ఇదేంటని అడిగితే ‘ఐదు లక్షలిస్తే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటా’నని రాయబారం పంపాడు. అయితే ఈ మధ్యే మా అమ్మాయికి అబార్షన్ కూడా చేయించాడని తెలిసింది. అమ్మాయి ఆరోగ్యం ఎలావుందోననే బెంగ ఒకవైపు, నా భర్తపోయిన దిగులు మరోవైపు... నాకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. ఒకవైపు లోకం కాకై పొడుస్తోంది. బయటకెళ్లాలంటే నరకంగా ఉంది. కనీసం వాళ్లిద్దరూ కలిసి ఏదో కష్టం చేసుకొని బతుకుతారనుకుంటే వాళ్ల తల్లీదండ్రీ వేరే సంబంధాలు వెతుకుతున్నారు. ఆ అబ్బాయిని నమ్మి వెళ్లినందుకు నా కూతురి జీవితం నా కళ్ల ముందే నాశనం అవుతున్నా ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మా సమస్యకు పరిష్కారం చూపి, నా బిడ్డ జీవితాన్ని కాపాడండి. – ఒక అభాగ్యురాలు జ: వుమన్ ప్రొటెక్షన్ సెల్లో కంప్లెయింట్ చేయాలి. ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఇప్పించాలి. కౌన్సెలింగ్ ద్వారా పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి. కానీ ఇటువంటి కేసుల్లో ఇది అంత తేలిక కాదు. నా అనుభవంలో చాలా కేసులు చూసాను. బలవంతంపైన పెళ్లి చేసుకున్నా, రేపు సరిగ్గా ఉంటాడన్న నమ్మకం లేదు. వద్దు వద్దు అంటే బలవంతంగా పెళ్లి చేయడం అనవసరం. కానీ, చేసిన ద్రోహానికి అతను శిక్ష అనుభవించితీరక తప్పదు. ముందు ఆ అమ్మాయిని అతని కస్టడీలోంచి బయటపడేయాలి. లేదంటే చాలా ప్రమాదం. ఆమెకి అబార్షన్ అయినంత మాత్రాన ఏదో కొంపమునిగిపోయినట్టు భావించాల్సిన పనిలేదు. సామాజిక గౌరవాలూ, పరువూ అంటూ మోరలిస్టిక్గా ఆలోచించడం మానుకొని, ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నం చేయాలి. అంతేగానీ ఒకసారి బయటకు Ðð ళ్లింది కాబట్టి అతడితోటే ఉండాలని అనుకోవద్దు. అమ్మాయి చిన్న పిల్ల. అతనితో వెళ్లాకకానీ అతని స్వభావం తెలియలేదు. యిప్పుడు నీతిబోధల కంటే ఆ అమ్మాయి ప్రాణాలు ముఖ్యం. తక్షణమే ఆ అమ్మాయిని ఇంటికి తెచ్చుకోండి. అందుకే పిల్లలకు మంచి చెడులను గుర్తించే జ్ఞానాన్నివ్వాలి. తమంత తాము నిర్ణయాలు తీసుకునేటప్పుడైనా అది పనికివస్తుంది. – కల్పన కన్నాభిరాన్, డైరెక్టర్, కౌన్సిల్ ఫర్ సోషల్ డెవలప్మెంట్ -
సబ్డివిజన్ స్థాయిలో త్వరలోనే
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ‘‘జిల్లాలో ఇటీవలి కాలంలో కుటుంబ కలహాలతో హత్యలు, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. భార్యాభర్త, తల్లితండ్రి, ప్రేమికులు, బంధువులు, సన్నిహితులు.. ఇలా పలువర్గాల మధ్య మానవసంబంధాలు దెబ్బతిని ఘర్షణలు జరుగుతున్నాయి. వీటి నివారణకుగాను త్వరలోనే ఫ్యామిలీ కౌన్సెలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. సబ్డివిజన్ స్థాయిలో ఈ కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చాం.’’ అని అంటున్నారు జిల్లా ఎస్పీ తాడిపర్తి ప్రభాకర్రావు. ఈ కౌన్సెలింగ్ సెంటర్లలో సమాజంలో గౌరవం ఉన్న వ్యక్తులను కౌన్సెలర్లుగా నియమించి కుటుంబ, మానవసంబంధాలను మెరుగుపర్చేందుకు కృషి చేస్తామని చెబుతున్నారాయన. సోమవారం ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు అంశాలను వెల్లడించారు. జిల్లాలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీస్శాఖ చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా జిల్లాప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తున్నామని, త్వరలోనే ప్రతి పోలీస్స్టేషన్లో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. ఇంకా పలు అంశాలపై ఎస్పీ ప్రభాకరరావు ఏం చెప్పారో ఆయన మాటల్లోనే.... సాక్షి: నూతన సంవత్సరంలో పోలీసింగ్ ఎలా ఉండబోతోంది? జిల్లాలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉంది? ఎస్పీ: జిల్లా ప్రజలందరూ ఎంతో సంతోషంగా కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టారు. వారి శ్రేయస్సే లక్ష్యంగా కొత్త ఏడాది మా పోలీసింగ్ ఉండబోతోంది. జిల్లాలో శాంతిభద్రతలు సక్రమంగానే అమలవుతున్నాయి. నూతన సంవత్సర వేడుకలు కూడా ఎలాంటి ఘటనలు లేకుండానే ముగిశాయి. గత ఏడాది కన్నా జాతీయ రహదారి - 65పై ప్రమాదాలు కూడా తగ్గాయి. అన్ని రకాల నేరాలను అదుపులోనికి తెచ్చేందుకు పోలీసు యంత్రాంగం శ్రమిస్తోంది. జిల్లా ప్రజలంతా ఆనందంగా ఉండేలా శాంతిభద్రతలను పరిరక్షించే కోణంలోనే మా పోలీసింగ్ ఉంటుంది. సాక్షి: ఫ్రెండ్లీ పోలీసింగ్లో భాగంగా మీ కార్యకలాపాల్లో ఏమైనా మార్పులు తెచ్చి ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం జరుగుతోందా? ఎస్పీ: ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలేవీ చేపట్టాలన్న ప్రణాళిక లేకపోయినా ప్రజలకు చేరువయ్యేందుకు మావంతు కృషి చేస్తున్నాం. త్వరలోనే జిల్లాలోని ప్రతి పోలీస్స్టేషన్లలో రిసెప్షన్ కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఈ రిసెప్షన్ కౌంటర్లలో మహిళా కానిస్టేబుళ్లు, హోంగార్డులను ఉంచి స్టేషన్లకు వచ్చే ఫిర్యాదులను మర్యాదపూర్వకంగా పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లేలా పనిచేయదల్చుకున్నాం. జిల్లాలో ఇటీవలి కాలంలో జరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలను పరిశీలిస్తే మానవ సంబంధాలు దెబ్బతింటున్న పరిస్థితి కనిపిస్తోంది. కుటుంబ కలహాలు, ప్రేమ వ్యవహారాలతో ఘర్షణలు జరుగుతున్నాయి. వీటిని నివారించేందుకు గాను సబ్డివిజన్ స్థాయిలో ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్లను మళ్లీ ఏర్పాటు చేయాలని ఆదేశాలిచ్చాం. త్వరలోనే వీటిని పునఃప్రారంభించి కౌన్సెలింగ్ ఇచ్చే కార్యక్రమం చేపడతాం. ఇందుకోసం రిటైర్డ్ టీచర్ల లాంటి గౌరవప్రద వృత్తుల్లో ఉన్న వారిని నియమించుకుంటాం. ఈవ్టీజింగ్, చైన్స్నాచింగ్లతో పాటు మహిళలపై జరిగే నేరాలను అరికట్టేందుకు గాను ప్రత్యేక దృషి పెట్టాం. సాక్షి: మహిళా కానిస్టేబుళ్లకు ప్రత్యేక సౌకర్యాల కోసం జిల్లాలోని పీఎస్లలో పైలట్ ప్రాజెక్టు ఏమైనా చేపట్టారా? ఎస్పీ: అవును. జిల్లావ్యాప్తంగా పది పోలీస్స్టేషన్లలో మహిళా కానిస్టేబుళ్లకు రెస్ట్రూమ్లు ఏర్పాటు చేసే ప్రణాళిక రూపొందించాం. ఇందుకోసం స్టేషన్కు రెండున్నర లక్షల రూపాయలు ఖర్చు పెట్టేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందులో భాగంగా ప్రతి స్టేషన్లో రెస్ట్రూమ్లో విశ్రాంతి తీసుకునేందుకు బెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు టాయిలెట్లు కట్టిస్తాం. మేళ్లచెరువు, నల్లగొండ టూటౌన్, నేరేడుచర్ల, నార్కట్పల్లి, చిట్యాల, మిర్యాలగూడ వన్టౌన్, భువనగిరి టౌన్, సూర్యాపేట, గుడిపల్లి పీఎస్లతో పాటు జిల్లా హెడ్క్వార్టర్లలో ఈ రెస్ట్రూంలు నిర్మిస్తున్నాం. సాక్షి: యాదగిరిగుట్ట అభివృద్ధిలో పోలీసుశాఖ పరంగా ఏం చేస్తున్నారు? ఎస్పీ: యాదగిరిగుట్ట అభివృద్ధి తర్వాత వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్శాఖ ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా గుట్టలో మహిళా భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంది. చైన్స్నాచింగ్, వ్యభిచారాన్ని అరికట్టేలా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఇందుకోసం ప్రత్యేకంగా యాదగిరికొండకు పోలీస్స్టేషన్ ఏర్పాటు చేస్తున్నాం. సర్కిల్ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి నేతృత్వంలో ముగ్గురు లేదానలుగురు ఎస్సైలు, ఇతర సిబ్బందితో ఈ స్టేషన్ పనిచేస్తుంది. ట్రాఫిక్ నియంత్రణకు కూడా తగినంత మంది కావాలని ప్రభుత్వాన్ని కోరతాం. ప్రత్యేకంగా మహిళా పోలీస్స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది. సాక్షి: జాతీయ రహదారిపై ప్రమాదాల పరిస్థితి ఎలా ఉంది? ఎస్పీ: గత ఏడాదితో పోలిస్తే ఎన్హెచ్-65పై ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది కన్నా 18శాతం ప్రమాదాలు తగ్గినట్టు లెక్కలు చెబుతున్నాయి. అయితే, జాతీయరహదారిపై కొన్ని నిర్మాణపరంగా మార్పులు జరగాల్సి ఉం ది. ఫుట్ఓవర్బ్రిడ్జిలు కూడా కొన్ని నిరుపయోగంగా ఉన్నాయి. అయితే, జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు ముఖ్యంగా పబ్లిక్లో మార్పు రావాలి. ప్రాణం చాలా విలువైనదన్న భావన జాతీయ రహదారిపై ప్రయాణించేటప్పుడు గుర్తుపెట్టుకోవాలి. రోడ్డు దాటేవారు, వాహనాలు నడిపేవారు తగు జాగ్రత్తలు తీసుకుంటే ఈ ప్రమాదాలు మరింత తగ్గుతాయి. సాక్షి: ఇటీవలి కాలంలో మావోల పేరిట జిల్లాలో అక్కడక్కడా పోస్టర్లు కనిపిస్తున్నాయి. జిల్లాలో మావోల కార్యకలాపాలే వైనా మీ దృష్టికి వచ్చాయా? ఎస్పీ: పోలీస్శాఖ పరంగా జిల్లాలో మావోయిస్టుల కార్యకలాపాలున్నాయని మేమయితే భావించడం లేదు. అయితే, ఇటీవలి కాలంలో కొన్ని చోట్ల మావోల పేరుతో పోస్టర్లు కనిపిస్తున్నాయి. అయితే, అవి నిజంగా మావోలవా లేక ఆకతాయిలు, బెదిరింపులకు పాల్పడేవారు చేస్తున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నాం. పసిగట్టేందుకు సమయం పట్టవచ్చు. కానీ, నల్లగొండలో ఆర్ఎస్యూ పేరిట ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిపై సమగ్రంగా దర్యాప్తు జరగాల్సి ఉంది. అయితే, దీనిని ఆర్ఎస్యూ సానుభూతిపరులే ఏర్పాటు చేశారా లేక ఇతర విద్యార్థి సంఘాల నేతల పనా అనేది నిఘాలో తేలుతుంది. -
అమ్మానాన్ననుకలిపేద్దాం
కర్నూలు: విడిపోవడమే సమస్యకుపరిష్కార కాదని ఆలోచించి అడుగువేస్తే మంచి భవిష్యత్ ఉంటుందని ఎస్పీఆకే రవికృష్ణ సూచించారు. ఆదివారండీఎస్పీ బంగ్లాలో నిర్వహించిన ఫ్యామిలీకౌన్సిలింగ్కు మొత్తం ఆరు జంటలుహాజరయ్యాయి. ఎస్పీగా బాధ్యతలుచేపట్టిన తర్వాత మొదటిసారిగాఫ్యామిలీ కౌన్సిలింగ్కు హాజరై రెండుజంటలకు ఎస్పీ కౌన్సిలింగ్ ఇచ్చారు. కర్నూలు పట్టణానికి చెందిన సంపత్కుమార్, శిరీష దంపతులకు రెండేళ్ల క్రితంపెళ్లి అయింది. ఆడపడుచు నుంచి సమస్యలు ఎదురవుతుండటంతో వేరుకాపురం పెట్టాలని ఫ్యామిలీ కౌన్సిలింగ్ను ఆశ్రయించింది. వారి ఇరువురివాదనలను విన్న ఎస్పీ విడిపోవడంసమస్యకు పరిష్కారం కాదని అత్తనుపోషించాల్సిన బాధ్యత ఉందని గుర్తుచేశారు. మీరు విడిపోతే ఏడాది పాపభవిష్యత్తు అంధకారమవుతుందంటూపాపను ఎత్తుకుని ముద్దాడారు. చివరికివారికి రాజీ కుదిర్చారు. మొత్తం ఆరుజంటలు హాజరు కాగా, మూడుజంటలు కలసి కాపురముండేందుకుఅంగీకరించగా, మరో మూడు జంటలువిడిపోయేందుకే మొగ్గు చూపడంతోవచ్చే వారం ఫ్యామిలీ కౌన్సిలింగ్కుహాజరుకావాలని సూచించారు. షరీన్నగర్కు చెందిన చంద్రశేఖర్ కూడాఫ్యామిలీ కౌన్సిలింగ్ను ఆశ్రయించాడు.అదే వీధిలోని ముస్లిం యువతినిప్రేమించి ఈ ఏడాది మార్చి 21వ తేదీనదుర్గా భోగేశ్వరస్వామి ఆలయంలో పెళ్లిచేసుకున్నాడు. నెల రోజుల పాటు కలసికాపురం చేశాడు. కూతురిని పుట్టింటివారు తీసుకువెళ్లి కాపురానికి పంపడంలేదంటూ అతను కౌన్సిలింగ్ చైర్మన్కుఫిర్యాదు చేశారు. కర్నూలు డీఎస్పీమనోహర్రావు, మహిళా సీఐ గౌతమి,హెడ్ కానిస్టేబుల్ బాలకృష్ణ, మహిళాహెడ్ కానిస్టేబుల్ సులోచన రాణి,సభ్యులు నాగశేషయ్య, ఇందుమతి,పాపయ్య గుప్త, లెనిన్ బాబు తదితరులు కౌన్సిలింగ్ కార్యక్రమంలోపాల్గొన్నారు.