breaking news
expensive gift
-
4 నెలల మనవడికి రూ.240 కోట్ల బహుమతి
న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణ మూర్తి తన నాలుగు నెలల మనవడు ఏకగ్రాహ్ రోహన్ మూర్తికి ఖరీదైన బహుమతిని ప్రదానం చేశారు. ఇన్ఫోసిస్కు చెందిన 15 లక్షల షేర్లను ఇచ్చారు. ప్రస్తుత మార్కెట్ ధర (రూ. 1,602) ప్రకారం వీటి విలువ రూ. 240 కోట్లుగా ఇన్ఫోసిస్ ఒక ప్రకటనలో వెల్లడించింది. కంపెనీలో తనకుగల ఈక్విటీలో 0.04 శాతం వాటాను కుమారుడు రోహన్ పుత్రుడు ఏకగ్రాహ్కు నారాయణ మూర్తి రిజిస్టర్ చేశారు. దీంతో ఏకగ్రాహ్ రోహన్ ఇన్ఫోసిస్లో బుల్లి బిలియనీర్ వాటాదారుడయ్యారు. నారాయణ మూర్తి కుమార్తె అక్షత, అల్లుడు రిషీ (బ్రిటన్ ప్రధాని)కి ఇద్దరు కుమార్తెలుకాగా.. ఏకగ్రాహ్ మనవడు. -
డబ్బు కోసమే నన్ను వాడుకున్నాడు!!
మూడేళ్ల కిందటి వరకు ఆమె అందరిలా మామూలు అమ్మాయే. కానీ 17 ఏళ్ల వయస్సులో తనకు మిలియన్ పౌండ్ల (రూ. 9.68 కోట్ల) లాటరీ తగలడంతో ఓవర్నైట్ సంపన్నురాలిగా మారిపోయింది. తనకు దాచుకోలేనంత డబ్బు వచ్చాక మార్క్ స్కేల్స్ అనే యువకుడు ఆమెకు పరిచయమయ్యాడు. అతడితో ప్రేమలో పడింది. ప్రణయసల్లాపాల్లో మునిగిపోయింది. 'ట్రు లవ్' (నిజమైన ప్రేమ) తనకు దొరికిందని సంబురపడింది. అతనికి అడిగినంత డబ్బు ఇచ్చింది. బోలేడె కానుకలు ఇచ్చింది. అతడు తనపై ప్రేమతో కాకుండా, తన డబ్బుపై కన్నుతో తన వెంటపడ్డాడని తెలిసి ఇప్పుడు వాపోతున్నది ఇంగ్లండ్లోని ఎడిన్బర్గ్కు చెందిన జేన్ పార్క్ (20). ఆమెకు అదృష్టం కలిసివచ్చి మూడేళ్ల కిందట హిబ్స్ ఫ్యాన్ మార్క్ లాటరీ తగిలింది. లాటరీ తగలడంతోపాటు మార్క్ స్కేల్స్ అనే బాయ్ఫ్రెండ్ కూడా ఆమెను తగులుకున్నాడు. తన డబ్బుతో అతడు జల్సా చేసేవాడని, తనను కాకుండా తన డబ్బును మాత్రమే అతను ప్రేమించాడని ఆమె తాజాగా వాపోతున్నది. తాను ఎంతో ప్రేమగా ఇచ్చిన ఏడువేల పౌండ్ల రోలెక్స్ వాచ్ గిఫ్ట్ను మార్క్స్ అమ్మేశాడని, దీంతో అతని నిజస్వరూపం తెలిసి.. అతడ్ని విసిరికొట్టానని, తమ ప్రేమ పెటాకులైందని తాజాగా 'సన్' మ్యాగజీన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ లాటరీ మిలియనీర్ తెలిపింది. తాను డబ్బుతో అతడి ప్రేమను కొనాలని భావించిన మాట వాస్తవమేనని, కానీ అతడు తనను ప్రేమించకుండా వాడుకోవడం మొదలుపెట్టాడని, అదే బాధ కలిగించిందని జేన్ పార్క్ చెప్పుకొచ్చింది. 'అతడు వట్టి పాములాంటి వాడు. మేం ఎప్పుడూ వాదించుకుంటూ ఉండేవాళ్లం. గత నెలలోనే అతన్ని వదిలించుకున్నా' అని జేన్ సన్ మ్యాగజీన్కు తెలిపింది. 'డబ్బు కోసమే నిన్ను వాడుకుంటున్నాడని నాకు అందరూ చెప్పారు. కానీ ఎవరి మాట వినలేదు. నేను ప్రేమలో ఉన్నట్టు భావించాను. గుడ్డిగా మసలుకున్నాను. డబ్బు కోసం తప్ప నన్ను ఏమాత్రం గౌరవించని ఇంతటి మూర్ఖుడిని ఎలా ప్రేమించానో తెలియడం లేదు. ఎంతో బాధగా ఉంది' అంటూ జేన్ పార్క్ ట్విట్టర్లో తెలిపింది. తన కారును అతనే వాడుకుంటున్నాడని, తిరిగి ఇవ్వడానికి నిరాకరిస్తున్నాడని ఆమె పేర్కొంది. -
సమంతకు కారు గిప్ట్ ఇచ్చిందెవరు?