breaking news
Ex Student
-
స్కూల్లో టీచర్ అవమానించిందని.. 30 ఏళ్ల తర్వాత.. 101 సార్లు పొడిచి..
బ్రస్సెల్స్: చిన్నప్పుడు స్కూల్లో అవమానించిందని ఓ వ్యక్తి టీచర్పై కక్ష్య పెంచుకున్నాడు. ఏడేళ్ల వయసులో జరిగిన అవమానానికి దాదాపు 30 ఏళ్ల తర్వాత ప్రతీకారం తీర్చుకున్నాడు. గుంటెర్ ఉవెంట్స్ అనే 37 ఏళ్ల వ్యక్తి 2020లో టీచర్ను హత్య చేశాడు. ఏకంగా 101 సార్లు కత్తితో పొడిచి చంపాడు. ఈ ఘోర ఘటన బెల్జియంలో చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను బెల్జియం పోలీసులు గురువారం మీడియాకు వెల్లడించారు. కాగా 2020లో ఆంట్వెర్ప్ సమీపంలో మారియా వెర్లిండెన్ అనే 59 ఏళ్ల టీచర్ను హత్య చేశారు. 101 సార్లు పొడిచి చంపారు. ఈ కేసులో నిందితులను పట్టుకునేందుకు బెల్జియం పోలీసులు దాదాపు 100 మంది అనుమానితుల డీఎన్ఏలను పరీక్షించారు. అయినా కేసును చేధించలేకపోయారు. అయితే మహిళ మృతదేహం పక్కనే ఉన్న డైనింగ్ టేబుల్పై ఉన్న నగదు అలాగే ఉండటంతో ఆమెను డబ్బుల కోసం హత్య చేయలేదనే నిర్ధారణకు వచ్చారు. చదవండి: భార్యను వదిలేసి స్వాతి టీచర్తో నాయ్యవాది.. చిత్ర హింసలు.. కాదు కిడ్నాప్! అయితే హత్య జరిగిన 16 నెలల తర్వాత, ఉవెంట్స్ టీచర్ను హత్య చేసిన విషయం తన స్నేహితుడి దగ్గర చర్చించాడు. దీంతో అతను పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం ఉవెంట్స్ను ఆదివారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్య జరిగిన ప్రదేశంలో లభించిన క్లూతో నిందితుడి డీఎన్ఏను పరీక్షించగా అతనే నేరం చేసినట్లు తేలింది. అంతేగాక నిందితుడు హతురాలి పూర్వ విద్యార్ధి అని తేలింది. తనను అవమానించినందుకే టీచర్ను హత్య చేసినట్లు పోలీసుల ఎదుట అంగీకరించాడు. 1990లో తన ఏడేళ్ల వయస్సులో పాఠశాల విద్యార్థిగా ఉన్న సమయంలో టీచర్ మారియా వెర్లిండెన్ తన గురించి చేసిన వ్యాఖ్యలను ఇప్పటి వరకు మరిచిపోలేదని చెప్పాడు. చదవండి: ఎవరినీ లెక్కచేయని పుతిన్.. బైడెన్ తీవ్ర వ్యాఖ్యలు.. రష్యా అభ్యంతరం -
రెగ్యులర్ విద్యార్థికి ఓల్డ్ పేపర్
కేయూ డిగ్రీ పరీక్షలో ఘటన హాల్టికెట్లో ఎక్స్ స్టూడెంట్ అని తప్పు దొర్లడమే కారణం కేయూ క్యాంపస్ : కేయూ పరీక్షల విభాగం తప్పు ఓ డిగ్రీ విద్యార్థిని ఇరకాటంలో పడేసింది. హాల్టికెట్లో ఎక్స్స్టూడెంట్గా తప్పు దొర్లడంతో రెగ్యులర్ ప్రశ్నపత్రం ఇవ్వకుండా.. ఓల్డ్పేపర్ ఇవ్వడమే ఇందుకు కారణం. విద్యార్థి కథనం ప్రకారం... హన్మకొండలోని న్యూసైన్స్ డిగ్రీ కాలేజీలో కె.సందీప్ డిగ్రీ బీకాం కంప్యూటర్స్ కోర్సు సెకండియర్ చదువుతున్నాడు. హన్మకొండలోని కాకతీయ మ హిళా డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రం కేటాయించారు. ఈ నెల 19న ఇంగ్లిష్ సబ్జెక్టు పేపర్తో పరీక్షలు ప్రారంభమయ్యాయి. సందీప్ పరీక్ష రాసేందుకు కాకతీయ మహిళా డిగ్రీ కళాశాలకు వెళ్లగా అక్కడ ఇన్విజిలేటర్ ఇంగ్లిష్ ఎక్స్స్టూడెంట్కు ఇచ్చే ఓల్డ్ ప్రశ్నపత్రం ఇచ్చారు. తాను రెగ్యులర్ స్టూడెంట్నని, ఈ మేరకు ప్రశ్నపత్రం ఇవ్వాలని కోరారు. అందుకు ఇన్విజిలేటర్ హాల్టికెట్పై ఎక్స్ స్టూడెంట్ అని ఉందని.. తామే ఏం చేయలేమని చెప్పా డు. దీంతో అతడు పరీక్ష సరిగ్గా రాయలేకపోయూడు. శుక్రవారం యూనివర్సిటీలోని సం బంధిత అధికారులను సంప్రదించగా... మీరు చది విన కాలేజీకి వెళ్లి సరిచేయించుకోవాలని సూచిం చారు. దీంతో అతడు న్యూసైన్స్ డిగ్రీకాలేజికి వెళ్లి సరిచేరుుంచుకున్నాడు.పరీక్షల విభాగం నుంచి వచ్చి న హాల్టికెట్లో తప్పు దొర్లడం వల్ల తాను ఇంగ్లిష్ పరీక్ష సరిగా రాయలేకపోయూనని ఆవేదన వ్యక్తం చేశాడు. తనకు న్యాయం చేయూలని వేడుకున్నాడు.