breaking news
DPO office
-
సర్వీస్ రెగ్యులైజేషన్కు సమాచారం పంపుకోవాలి
ఒంగోలు టూటౌన్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్–2014 ద్వారా గ్రామ కార్యదర్శిలుగా నియామకం అయిన వారు రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రొబేషనరీ డిక్లరేషన్, సర్వీస్ రెగ్యులైజషన్ చేయించుకొనుటకు కార్యదర్శిలు డీపీవో కార్యాలయానికి త్వరితిగతిన సమాచారం పంపుకోవాలని పంచాయితీ కార్యదర్శిల సంఘం అధ్యక్షుడు పి.శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 95 మంది గ్రామ కార్యదర్శిలు ఏపీపీఎస్సీ ద్వారా రెండేళ్ల క్రితం నియామకం అయ్యారన్నారు. -
ఆల్ ఇన్ వన్
► అన్నీ ఆయనే.. ► సగం ఫైళ్లు అతడి ఇంట్లోనే.. ఆరోపణలున్నా... అందలం ► అక్రమాలకు కేరాఫ్డీపీవో కార్యాలయంలో ఒకే ఒక్కడు కరీంనగర్ సిటీ : నగరంలోని మంకమ్మతోటలో తెల్లవారడం లేటు... ఓ ఇంటి ముందు పదుల సంఖ్యలో కార్యదర్శులు, ఈవోలు, కారోబార్లు పడిగాపులు కాస్తుంటారు... ఆ ఇల్లేమైనా ఎమ్మెల్యేదా... ఇంతమంది వస్తుంటారేంటి? అని ఆ ప్రాంతంలో కొత్తగా వచ్చిన ఓ ఇంటి యజమాని ఆరా తీశారు. డీపీవో కార్యాలయంలో పనిచేసే జూనియర్ అసిస్టెంట్ ఇల్లు అది... ఆయనను దర్శించుకుంటేనే జిల్లాలో ఏ పనైనా జరిగేది. అందుకే ఇంటి ముందు జాతర అని పొరుగింటాయన చెబితే నోరెళ్లబెట్టాడు. ⇒ తిమ్మాపూర్ మండలం రామకృష్ణాకాలనీలో ఒక కళాశాల భవన నిర్మాణ అనుమతి కోసం సదరు యజమాని దరఖాస్తు చేసుకొన్నాడు. నిబంధనల ప్రకారం అయితే భవన నిర్మాణానికి అనుమతి దొరకదు. కొంతమంది సలహా మేరకు డీపీవో కార్యాలయంలో పనిచేసే ఓ ఉద్యోగిని కలవడం ఆలస్యం... ఆ భవన నిర్మాణానికి ఎన్వోసీ క్షణాల్లో వచ్చింది. దీని కోసం రూ.5 లక్షలు చేతులు మారినట్లు ఆరోపణలున్నాయి. ⇒ జిల్లాలో ఓ గ్రామసర్పంచ్ మరణించారు. సాధారణంగా అయితే సర్పంచ్ చనిపోయిన సమాచారాన్ని ఎన్నికల సంఘానికి 15 రోజుల్లోగా నివేదిక అందించాలి. సమాచారం ఆధారంగా ఆరు నెలల్లో ఉప ఎన్నికల పెట్టాల్సి ఉంటుంది. కాని ఇన్చార్జి సర్పంచ్గా ఉన్న ఉప సర్పంచ్కు ఒక చిక్కొచ్చి పడింది. ఎన్నికలు పెడితే తన సర్పంచ్ ఇన్చార్జి పోతుంది కాబట్టి, ఎన్నికలను వాయిదా వేయాలనుకున్నాడు. ఇంకేం... సదరు డీపీవో కార్యాలయ ఉద్యోగిని సంప్రదించి ‘ఫీజు’ ముట్టచెప్పాడు. ఇప్పటివరకు సర్పంచ్ చనిపోయిన సమాచారం ఎన్నికల సంఘానికి అందలేదు.’ ⇒ జిల్లా పంచాయతీ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న సీనియర్ ఉద్యోగి లీలల్లో మచ్చుకు కొన్ని ఇవి. సుదీర్ఘ కాలంగా కార్యాలయంలో తిష్ట వేసిన ఈయన, ‘అన్నీ తెలుసు’ అనే పేరుతో అక్రమాల పరంపరను సంవత్సరాలుగా కొనసాగిస్తున్నాడు. అవడానికి జూనియర్ అసిస్టెంట్ అయినా డీపీవో కార్యాలయంలో ఆయనే బాస్. కార్యాలయం మొత్తం ఆయన చెప్పుచేతల్లో ఉందంటే అతిశయోక్తి కాదు. ఇది కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, పంచాయతీ కార్యదర్శులు, సందర్శకులు ఎవరిని అడిగినా చెప్పే వాస్తవ విషయం. అవినీతి ఆరోపణలపై గత డీపీవోను జిల్లా కలెక్టర్ సరెండర్ చేసి, జిల్లా నుంచి పంపించడం తెలిసిందే. ఏ ఆరోపణల మీదనైతే డీపీవో సరెండర్ అయ్యారో, వాటికి కారణం సదరు ఉద్యోగి అనేది జగమెరిగిన సత్యం. కానీ, ఎక్కడా కాగితాలపై సంతకాలు ఉండవు కనుక, ఆయనకు పలుకుబడి అధికం కాబట్టి శిక్ష నుంచి తప్పించుకున్నాడు. విపరీతమైన ఆరోపణలు రావడంతో గతంలో ఆయనను ఓ డీఎల్పీవో కార్యాలయానికి పంపించారు. పంపించిన 15 రోజుల్లో తిరిగివస్తానని సహచరుల వద్ద చాలెంజ్ చేసిన సదరు ఉద్యోగి అన్నట్లుగానే 10 రోజుల్లోనే మళ్లీ డీపీవో కార్యాలయానికి వచ్చాడు. దీనికోసం ‘ఉన్నత’ స్థాయిలో ఆయన పైరవీలు చేసుకోగా, ‘పని వచ్చినోడు అతనే’ అనే సాకుతో ఉన్నతాధికారులు సైతం ఆయనకే వంత పాడారు. ‘ఆల్ ఇన్ వన్’గా ఉన్నతాధికారులు ముద్దుగా పిలుచుకునే ఉద్యోగి అక్రమాల జాతర మళ్లీ కొనసాగుతోంది. సదరు ఉద్యోగిపై వందల సంఖ్యలో ఆరోపణలున్నా, ఆయన ‘పరపతి’ని మాత్రం ఉన్నతాధికారులు ఇసుమంతైనా ‘తగ్గించడానికి’ ఇష్టపడరు. డీపీవో కార్యాలయంలో ఏ సెక్షన్కు సంబంధించిన ఫైల్ అయినా సరే ఈయన చూడంది ఒక్క ఇంచు కూడా కదలదు. ఆయనను ‘కలిస్తే’ తప్ప ఆ ఫైల్కు పరిష్కారం దొరకదు. ఆ మాట కొస్తే సగం ఫైళ్లు ఆయన ఇంట్లోనే ఉంటాయి. అవసరమైతే అవి ‘బార్’లకు కూడా వెళుతాయి. ఫైళ్లు రాయడం అతనికే తెలుసు కాబట్టి తప్పడం లేదంటూ ఉన్నతాధికారులు చెబుతున్నా, ఒకవేళ అదే నిజమైతే ఇతర ఉద్యోగులను కూర్చోబెట్టి జీతాలు ఇవ్వడం ఎందుకనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికైనా సదరు ఉద్యోగి అక్రమాలపై సమగ్ర విచారణ నిర్వహించి చర్యకు పూనుకొంటే... డీపీవో కార్యాలయంలో పారదర్శకత మచ్చుకైనా క నిపించే అవకాశం ఉంది. -
నేను రైతు బిడ్డను..
* సామాన్యుల సమస్యలకు సత్వరమే పరిష్కారం * శాంతిభద్రతల పరిరక్షణే ధ్యేయం * సరిహద్దు ప్రాంతాల్లో గట్టి నిఘా * జిల్లా ఎస్పీగా సుమతి బాధ్యతల స్వీకరణ సంగారెడ్డి క్రైం: జిల్లా ఎస్పీగా బి.సుమతి శుక్రవారం ఉదయం బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డిలోని డీపీఓ కార్యాలయంలో శెముషీ బాజ్పాయ్ నుంచి బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ సుమతి మాట్లాడారు. ‘నేను రైతు బిడ్డను, సామాన్యుల కష్టా లు నాకు తెలుసు. వారి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తాన’ని చెప్పారు. ఇందుకోసం అన్ని పోలీస్స్టేషన్లలో వచ్చిన దరఖాస్తులకు సత్వరమే పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటానన్నారు. సీఎం సొంత జిల్లాగా ప్రాముఖ్యత ఉన్నం దున కానిస్టేబుల్ నుంచి ఎస్పీ వరకు ప్రజలతో పోలీసులు మమేకమయ్యేలా చూస్తామని చెప్పారు. ముఖ్యంగా నేరాల అదుపు కోసం పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. పోలీసులంతా ఓ కుటుంబంలా పనిచేస్తూ జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు పాటుపడతామని చెప్పారు. పోలీసుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటానన్నారు. జిల్లాలో ప్రజలు ఏ సమస్య ఎదుర్కొంటున్నా వాటిని నిర్భయంగా పోలీస్స్టేషన్ల్లో ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. పోలీస్స్టేషన్కు వచ్చే ప్రతి ఫిర్యాదు ను తప్పకుండా పరిష్కారమయ్యేలా చూస్తానని ఆమె హామీ ఇచ్చారు. ముఖ్యంగా పోలీసులకు వారానికి ఒకరోజు సెలవు దినం కేటాయింపు విషయంలో సిబ్బంది కొరత వుందని, సిబ్బంది పూర్తిస్థాయిలో నియామకమైన వెంటనే సెలవు దినాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపడతామన్నారు. జిల్లాలో నక్సల్స్ సమస్య ఏమాత్రం లేదని ఆమె ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఇదిలా ఉంటే జిల్లాలోని పోలీసు ఉన్నతాధికారులతో సమావేశమై జిల్లా పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఎస్పీ సుమతిని ఏఎస్పీ పి.రవీందర్రెడ్డితో పాటు డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు కలిసి అభినందించారు. గణేష్ ఆలయంలో ఎస్పీ సుమతి పూజలు సంగారెడ్డి క్రైం: జిల్లాకు నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించడానికి వచ్చిన బి.సుమతి పటాన్చెరు మండలం రుద్రారంలోని గణేష్ ఆలయంలో శుక్రవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు ఆమెకు స్వాగతం పలికారు. జిల్లా ప్రణాళిక కమిటీ సభ్యులు, కౌన్సిలర్ జి.వి. వీణా శ్రీనివాస్రావు దంపతులు ఎస్పీకి స్వాగతం పలికి అభినందనలు తెలియజేశారు.