breaking news
dinner on board scheme
-
టికెట్తో పాటే మెనూ
సాక్షి, హైదరాబాద్: దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ ప్రవేశపెట్టిన ‘డిన్నర్ ఆన్ బోర్డ్’ను మరిన్ని బస్సులకు విస్తరించనున్నారు. అలాగే రైల్వే తరహాలో టికెట్ బుకింగ్తో పాటే తమకు కావలసిన ఆహార పదార్థాలను కూడా బుక్ చేసుకొనే సదుపాయం త్వరలోనే అందుబాటులోకి రానుంది. గత నెలలో ప్రవేశపెట్టిన ఈ పథకానికి ప్రయాణికుల నుంచి ఆదరణ లభించడంతో మరింత సమర్థంగా అమలు చేసేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టికెట్ బుకింగ్ సమయంలోనే మెనూ కూడా బుక్ చేసుకొనేలా సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తున్నామని ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ ఎ.కోటేశ్వరరావు ‘సాక్షి’తో చెప్పారు. దీంతో భోజనం కోసం మరోసారి ప్రత్యేకంగా ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వాల్సిన అవసరం ఉండదన్నారు. రైల్వేలో బుకింగ్ సమయంలోనే ప్రయాణికులు వెజ్/నాన్వెజ్ అనే కాలమ్లో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. అయితే, ఆర్టీసీ ప్రయాణికులు తమకు ఇష్టమైన బిర్యానీ, పెరుగన్నం, రోటీ, స్వీట్లు, తదితర ఆహార పదార్థాలలో నచ్చిన వాటిని ఎంపిక చేసుకొనేలా మెనూలోని పదార్థాలన్నింటినీ విడివిడిగా రాసి ఉంచుతారు. కాగా ఈ పథకాన్ని మరిన్ని బస్సులకు విస్తరించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
రేపటి నుంచి ఆర్టీసీలో 'డిన్నర్ ఆన్ బోర్డ్'
హైదరాబాద్: దూరప్రాంత ప్రయాణికుల కోసం ఆర్టీసీ ‘డిన్నర్ ఆన్ బోర్డు’ సదుపాయానికి శ్రీకారం చుట్టింది. మహాత్మాగాంధీ బస్స్టేషన్ నుంచి బయలుదేరే వెన్నెల,గరుడ ప్లస్ బస్సుల్లో ప్రయాణికులకు బస్స్టేషన్లోనే వారు కోరుకున్న ఆహారపదార్ధాలను ఆర్డర్ పై అందజేస్తారు.ఈ సదుపాయం ఈ నెల 28వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది. మొదట 15 ఏసీ బస్సుల్లో ప్రవేశపెడుతారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు రూట్లో 5 బస్సుల్లో, పూనే రూట్లో 2 బస్సుల్లో, షిర్డీ రూట్లో మరో 2 సర్వీసుల్లో,చెన్నై ఒక సర్వీసు, కాకినాడ రూట్లో ఒక సర్వీసులో, విశాఖపట్టణం వెళ్లే 2 బస్సుల్లో, తిరుపతి రూట్లో మరో రెండింటిలో ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనున్నట్లు ఆర్టీసీ రంగారెడ్డి రీజనల్ మేనేజర్ సి.వినోద్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆరు నెలల పాటు ఈ పథకాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయనున్నట్లు పేర్కొన్నారు.ప్రయాణికులు కోరుకొనే రోటీ, బిర్యానీ,మీల్స్, సాండ్విచ్,కరాచి బేకరీ ఐటమ్స్, పుల్లారెడ్డి స్వీట్లు,తదితర ఆహారపదార్ధాలను ఎంజీబీఎస్లో అందజేస్తారు.ఇందుకోసం ప్రయాణికులు తమ ప్రయాణానికి 3 నుంచి 4 గంటలు ముందుగా ఫోన్ : 8688931666 నెంబర్కు ఫోన్ చేసి ఆర్డర్ ఇవ్వాల్సి ఉంటుంది. బస్సు బయలుదేరే ముందు ప్రయాణికులు ఆర్డర్ చేసిన పదార్ధాలు వారి చేతికి అందుతాయి. 28వ తేదీ సాయంత్రం 6 గంటలకు ఈ పథకాన్ని ప్రారంభించనున్నట్లు ఆర్ఎం తెలిపారు.