breaking news
Design changes
-
Fashion: కొన్ని మార్పులే.. కొత్తగా!
‘మనం ఎలా ఉంటున్నామో మన వార్డ్రోబ్ మనకే పరిచయం చేస్తుంది అందుకే, పర్ఫెక్ట్ ప్లాన్ కంపల్సరీగా ఉండాల్సిందే. అలాగని ఎప్పుడూ షాపింగ్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్న వాటినే కొద్దిపాటి మార్పులతో మనదైన బడ్జెట్లో స్టయిలిష్ లుక్తో మార్కులు కొట్టేసేలా డిజైన్ చేసుకోవాలి. సందర్భానుసారమే కాదు సీజన్ని బట్టి కూడా ఎంపిక ఉండాలి..’ అంటూ తన వార్డ్రోబ్ ముచ్చట్లను మనతో పంచుకుంటున్నారు హైదరాబాద్ గచ్చిబౌలిలో ఉంటున్న సుమిత కందిమళ్ల.కొన్ని మార్పులే.. కొత్తగా!ఓల్డ్ శారీస్తో న్యూ లుక్ ఈ రోజుల్లో ఒక మంచి డిజైన్ ఘాగ్రా కొనాలంటే చాలా ఖర్చు. అందుకని, అదే మోడల్స్లో అంతే లుక్తో ఉండే తక్కువ రేట్ లెహంగాలు ఆన్లైన్ వేదికలపై వెతికి తీసుకుంటాను. పాతికేళ్ల క్రితం ఉన్న చీరలను రీయూజ్ చేయాలనే ఆలోచనతో చుడీదార్స్, లెహంగాలను డిజైన్ చేయిస్తుంటాను. చేనేతలకు పేరొందిన ్రపాంతాలకు వెళ్లినప్పుడు అక్కడి స్థానిక మార్కెట్లో షాపింగ్ చేస్తాను. దీని వల్ల తక్కువ బడ్జెట్లో అనుకున్నవి లభిస్తాయి.డిజైన్స్కి ముందుగా డ్రాయింగ్..శారీస్ను బట్టి బ్లౌజ్ డిజైన్స్ నాకేవి బాగుంటాయో ఒక పేపర్ మీద డ్రా చేసుకుంటాను. ఆ తర్వాత ఎప్పుడూ కుట్టించే టైలర్ దగ్గర ఇస్తాను. మనం ఉండే ప్లేస్, వాతావరణాన్ని బట్టి కూడా స్టైల్ మార్చుకోవాల్సి ఉంటుంది. నైట్ పార్టీ అయితే షిమ్మర్, గ్లిట్టర్ లైట్ వెయిట్ డ్రెస్సులను ఎంపిక చేసుకుంటాను. వేసవిలో కంచిపట్టు కాకుండా బెనారస్, షిఫాన్స్ని ఎంపిక చేసుకుంటాను. పూజలు అంటే పట్టు చీరలు సహజమే. పెళ్లి, రిసెప్షన్ వంటివాటికి చీరలు కట్టినా హెయిర్స్టైల్స్లో మార్పులు చేసుకుంటాను. జ్యువెలరీని కూడా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తుంటాను. వీటికి తగినట్లుగా డిజైనర్ బ్యాగ్స్, సన్గ్లాసెస్, వాచీ కలెక్షన్స్ యూజ్ చేస్తాను.కలర్స్.. కాంట్రాస్ట్..ఎప్పుడూ ఒకే తరహా వేస్తే డ్రెస్సింగ్ అయినా, కలర్ కాంబినేషన్స్ అయినా బోర్గా అనిపిస్తుంది. కొన్నిసార్లు గ్రీన్ షేడ్స్లో కావాలనుకుంటే మోనోక్రోమ్ లుక్లో ప్లాన్ చేసుకుంటాను. ఒక్కోసారి పూర్తిగా కాంట్రాస్ట్ వేసుకుంటాను. నా డ్రెస్సింగ్ లేదా మేకప్లో ఏమైనా చేంజెస్ కోసం మా అమ్మాయిల సూచనలూ తీసుకుంటాను. బర్త్ డే పార్టీలకు పూర్తిగా వెస్ట్రన్ వేర్, డే టైమ్ అయితే నీ లెంగ్త్, ఈవెనింగ్ అయితే షార్ట్స్ కూడా ప్లాన్ చేసుకుంటాను. కొన్నింటిని డెనిమ్, లెదర్ జాకెట్స్తో కవర్ చేసేవీ ఉంటాయి.ముగ్గురం... డిఫరెంట్గా!నాకు ఇద్దరూ అమ్మాయిలే కాబట్టి నాతోపాటు వారికీ అన్నీ సెట్ చేయాల్సిందే. చాలావరకు ఫ్యామిలీ కాంబినేషన్ సేమ్ కలర్ థీమ్ అంటుంటారు. కానీ, ఒక్కొక్కరు ఒక్కో స్కిన్ టోన్లో ఉంటారు. వారికి నచ్చిన కలర్ కాంబినేషన్స్ తీసుకొని ప్లాన్ చేస్తాను. ఒకరిని ట్రెడిషనల్గా, మరొకరిని ఫ్యాన్సీగా తయారు చేస్తాను. నేను వారికి భిన్నంగా ఉండేలా ప్లాన్ చేసుకుంటాను.ఒకరికి బ్రేస్లెట్స్ ఇష్టం, మరొకరికి రింగ్స్ ఇష్టం. నాకు గాజులు బాగా ఇష్టం. ఒకరు బ్రేస్లెట్ ధరిస్తే, మరొకరు పది, పదకొండు రింగ్స్ పెట్టుకుంటారు. ఇంకొకరు బ్యాంగిల్స్ ఎక్కువగా వేసుకుంటారు.తిరుపతికి వెళితే అక్కడి నుంచి రకరకాల గాజులు కొనుక్కొస్తాను. డ్రెస్కు తగినట్టు గాజులు అలా సెట్ చేస్తాను. ప్రతి ఫంక్షన్స్కి 2–3 రోజుల ముందే ప్రతిదీ సెట్ చేసి ఉంచుతాను.ఆల్టైమ్ ఫేవరెట్..మగ్గం వర్క్లో థ్రెడ్ వర్క్ కన్నా జర్దోసి వర్క్ చాలా ఇష్టం. అందుకే, వెల్వెట్ మీద హెవీ వర్క్ చేయించాను. ఇది ఎప్పటికీ ట్రెండ్లో ఉంటుంది. వెల్వెట్ లెహంగాకి ఎంబ్రాయిడరీ చేయించాను. దానికి బ్లౌజ్ మారుస్తుంటాను. మగ్గం వర్క్లో క్వాలిటీ మాత్రం మిస్ కాకూడదు.పాతదైనా ప్రత్యేకమే..మా అమ్మమ్మ చీరల్లో నుంచి నా దగ్గరకు ఒక గద్వాల కాటన్ శారీ వచ్చింది. అప్పటి నేత ఇప్పటికీ బాగుంటుంది. దానిని కూడా డిజైనర్ బ్లౌజ్తో ఫంక్షన్స్కి కట్టుకుంటాను. ఏ చీర కొన్నా నా తర్వాత నా పిల్లలకు ఆ చీరలు వెళ్లేలా ప్లాన్ చేసుకుంటాను. నా పెళ్లప్పుడు కొన్న కోటా చీర ఇప్పటికీ కట్టుకుంటాను. -
ప్రస్తుతం ఇంట్లో గోడలకు.. ట్రెండ్గా మారిన వాల్పేపర్ డిజైన్స్..!
భారతీయ కళా సంస్కృతుల నుంచి ప్రేరణ పొందిన వాల్పేపర్ డిజైన్స్, అలనాటి ఐశ్వర్యాన్ని నేడు కళ్ల ముందు నిలిపినట్లు అనిపించకమానదు. ఈ వాల్పేపర్స్లోని ప్రతి డిజైన్ ఒక కళాఖండంలా ఉంటుంది. ఈ వాల్పేపర్లు ఇంటి ఆకర్షణను ఇనుమడింపజేస్తాయి.ఒకప్పటి మొఘల్ రాజభవనాల వైభవాలు, రాజస్థానీ ప్రకృతి దృశ్యాలతో కూడిన వాల్పేపర్లు; వాటికి తోడుగా రోమన్ థీమ్, యురోపియన్ శైలితో ఉండే వాల్పేపర్లను ప్రజలు ఇష్టపడుతున్నట్టు చెబుతున్నారు ‘లైఫ్ ఎన్ కలర్’ నిర్వాహకురాలు అపూర్వ శర్మ.పరిశోధనతో ప్రారంభం..‘మధ్యయుగ కాలంలో భారతీయ కళారూపాలు, భారతీయ పురాణ గాథల చిత్రాలతో çకూడిన డిజైన్లు ఇటీవలి కాలంలో ట్రెండ్గా మారాయి. జనాల అభిరుచిలోని మార్పులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఈ డిజైన్లను వీలైనంత కొత్తగా రూపొందిస్తుంటాం’ అని చెబుతారామె.పెయింటింగ్స్ మరిపించేలా..భారతీయ పురాణాల చిత్రాలతో పాటు ఆధునిక అలంకరణలను అనుసరించి పేస్టల్ కలర్స్తో సృష్టించిన డిజైన్లను ఎంచుకోవచ్చు. ఆకర్షణీయమైన కథలను వివరించే డిజైన్లను ఎంచుకోవచ్చు. గోడలపైన సాధారణంగా పురాణాలు, ఇతిహాసాలు, చారిత్రక డిజైన్లను పెయింటింగ్స్లో చూస్తుంటాం. అయితే, ఈ డిజైన్లతో కూడిన వాల్పేపర్లు ఇంటిగోడలకు మరింతగా వన్నె తేగలవని ఇంటీరియర్ డెకరేషన్ నిపుణులు చెబుతున్నారు.ఇవి చదవండి: గర్భవతులు మరింత బరువు పెరిగితే..? -
డిజైన్ మారితే విద్యుత్ పిడుగు
ప్రాణహితపై ‘వ్యాప్కోస్’ హెచ్చరిక హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్లో మార్పులు చేయాల్సి వస్తే విద్యుత్ అవసరాలు మరింత పెరిగే అవకాశముందని సర్వే సంస్థ వ్యాప్కోస్ అంచనా వేసింది. ఇప్పటికే ఉన్న విద్యుత్ అవసరాలకు తోడు అదనంగా 400 మెగావాట్ల విద్యుత్ అవసరమయ్యే అవకాశాలుంటాయని సంస్థ తేల్చినట్లు తెలుస్తోంది. అదే జరిగితే ప్రాజెక్టు అంచనా వ్యయం గణనీయంగా పెరుగుతుందని సంస్థ గుర్తించినట్లు తెలుస్తోంది. విద్యుత్ అవసరాలు ఎలా ఉన్నా డిజైన్ మార్పుపై ముందుకే వెళ్లాలని, కాళేశ్వరం దిగువ నుంచే నీటిని తీసుకోవాలని కృతనిశ్చయంతో ఉన్న సీఎం ఆ మేరకే ప్రాణహిత పేరును కాళేశ్వరంగా మార్చాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. ఇప్పటికే గణనీయం: ప్రాణహిత ప్రాజెక్టులో భాగంగా తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తును 152 మీటర్లుగా నిర్ణయించడంతో తమ భూభాగంలోని 4,500 ఎకరాల మేర ఆయకట్టు ముంపునకు గురవుతుందని, ఈ దృష్ట్యా బ్యారేజీ ఎత్తును తగ్గించాలని మహారాష్ట్ర ఇటీవల రాష్ట్రాన్ని కోరింది. కానీ గోదావరి నుంచి 160 టీఎంసీల నీటిని తీసుకునే క్రమంలో బ్యారేజీ ఎత్తును ఒక్క మీటర్ మేర తగ్గించినా బ్యారేజీ సామర్ధ్యం తగ్గుతుందని, అదే జరిగితే నిర్ణీత నీటి మళ్లింపు సాధ్యం కాదని అధికారులు ఓ అంచనాకు వచ్చారు. అయితే మహారాష్ట్ర విజ్ఞప్తి నేపథ్యంలో డిజైన్ మార్చాలని భావిస్తున్న ప్రభుత్వం దీని బాధ్యతను వ్యాప్కోస్కు కట్టబెట్టింది. ప్రాథమిక సర్వే చేసిన ఆ సంస్థ ప్రస్తుతప్రణాళిక ప్రకారం కాకుండా కాళేశ్వరం దిగువ నుంచి నీటి మళ్లింపు అంశాన్ని తెరపైకి తెచ్చింది. తుమ్మిడిహెట్టి బ్యారేజీ ఎత్తుతో పోలిస్తే ఇక్కడ 50 మీటర్ల మేర ఎత్తు తక్కువగా ఉండటంతో విద్యుత్ అవసరాలు గణనీయంగా పెరగనున్నాయి. ప్రాజెక్టుకు 3,159 మెగావాట్ల విద్యుత్ అవసరాలు ఉంటాయని ఇదివరకే ప్రభుత్వం అంచనా వేయగా అది మరో సుమారు 400 మెగావాట్ల మేర పెరిగే అవకాశముందని వ్యాప్కోస్ తేల్చినట్లు తెలుస్తోంది. విద్యుత్ సంక్షోభంలో ఉన్న రాష్ట్రం ఈ స్థాయి విద్యుత్ను ఎక్కడి నుంచి తెస్తుందని కేంద్ర జల సంఘంతోపాటు రాష్ట్ర సాగునీటిరంగ నిపుణులు ప్రశ్నిస్తున్నారు.