breaking news
debris spotted
-
ఇండోనేషియాలో విమానం అదృశ్యం : శకలాలు లభ్యం
ఇండోనేషియాలోని మకాస్సర్ సమీపంలో అదృశ్యమైన ATR42-500 విమానం కూలిపోయిందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. సమీపంలోని పర్వతంపై ఈ విమాన శకలాలను గుర్తించినట్టు విమాన ట్రాకింగ్ డేటా, స్థానిక మీడియా రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.ఇండోనేషియా సముద్ర వ్యవహారాలు, మత్స్య మంత్రిత్వ శాఖ నిర్వహించే ATR 42-500 సముద్రంపై తక్కువ ఎత్తులో ఎగురుతున్నప్పుడు రాడార్ నుండి అదృశ్యమైందని FlightRadar24 తెలిపింది. విమానం కనిపించకుండా పోయిందని, దానిచివరి సిగ్నల్ మకాస్సర్ విమానాశ్రయానికి ఈశాన్యంగా దాదాపు 20 కి.మీ (12 మైళ్ళు) దూరంలో 04:20UTC వద్ద రికార్డ్ అయిందని, రాడార్ కవరేజ్ కూడా మిస్ అయిందని ఎక్స్లో పోస్ట్ ద్వారా వెల్లడించింది.😔 A government ATR 42-500 (PK-THT) on surveillance duty for Marine & Fisheries apparently went down in South Sulawesi today. Was flying Yogyakarta to Makassar, lost contact around 1:17pm over Maros, 11 souls on board. Search teams are out there now.Thoughts and prayers for… pic.twitter.com/W8FwlRiOcA— Fahad Naim (@Fahadnaimb) January 17, 2026 We are following reports in local media that an ATR 42-500, registration PK-THT, is missing in Indonesia.The aircraft was flying over the ocean at low altitude, so our coverage was limited. We received the last signal at 04:20 UTC, about 20 km northeast of Makassar Airport.… pic.twitter.com/7qSroxEXfT— Flightradar24 (@flightradar24) January 17, 2026స్థానిక మీడియా కవరేజ్ ప్రకారం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ నుండి రూటింగ్ సూచనలు అందిన తర్వాత మకాస్సర్ విమానాశ్రయాన్ని సమీపిస్తున్నప్పుడు ATR 42‑500 రాడార్ నుండి అదృశ్యమైంది. విమానంలో ఎనిమిది మంది సిబ్బంది, ముగ్గురు ప్రయాణికులు సహా 11 మంది ఉన్నారు. అయితే ఇండోనేషియా అధికారులు ఈ ప్రమాద విషయాన్నిఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. మకాస్సర్లోని ఇండోనేషియా శోధన మరియు రెస్క్యూ ఏజెన్సీ ఆపరేషన్స్ హెడ్ ఆండి సుల్తాన్ స్థానిక మీడియాతో మాట్లాడుతూ, ఆ ప్రాంతానికి రెస్క్యూ బృందాలను పంపుతున్నట్లు చెప్పారు. విమానంలో ఉన్నవారి పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం లేదు. -
Viral Video: భూమిపైకి దూసుకొచ్చిన చైనా రాకెట్ శకలాలు
వాషింగ్టన్: చైనా కొద్ది రోజుల క్రితం ప్రయోగించిన లాంగ్మార్చ్ 5బీ రాకెట్కు సంబంధించిన భారీ శకలాలు భూకక్ష్యలోకి ప్రవేశించాయి. రాత్రి వేళ వివిధ రంగుల్లో మిరిమిట్లు గొలుపుతూ రాకెట్ శిథిలాలు భూమివైపు దూసుకొచ్చాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రజలు వీటిని ఉల్కాపాతంగా భావించి వీడియోలు తీశారు. శనివారం రాత్రి హిందూ మహాసముద్రంపై 10.45 గంటల సమయంలో భూవాతావరణంలోకి రాకెట్ శకలాలు ప్రవేశించినట్లు అమెరికా అంతరిక్ష కమాండ్ సైతం నిర్ధరించింది. తూర్పు, దక్షిణాసియాలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఈ శకలాలు మండుతూ భూకక్ష్యలోకి రావటాన్ని వీక్షించారు. మలేసియా మీదుగా ఇవి ప్రయాణిస్తోన్న వీడియోను నాసా ఆస్ట్రోనాట్ క్రిస్ హాడ్ఫీల్డ్ ట్విట్టర్లో షేర్ చేశారు. అయితే.. అందులో ఎన్ని భూమిని తాకి ఉంటాయనేదానిపై సమాచారం లేదు. మరోవైపు.. చైనా స్పేస్ ఏజెన్సీ పనితీరును నాసా ప్రతినిధి బిల్ నిల్సన్ తప్పుపట్టారు. తన రాకెట్ల శిథిలాలు భూవాతావరణంలోకి రాకుండా అడ్డుకోలేకపోతోందని పేర్కొన్నారు. లాంగ్మార్చ్ 5బీ వంటి రాకెట్ల శిథిలాలు ఆస్తి, ప్రాణ నష్టాన్ని కలుగజేసే ప్రమాంద ఉందన్నారు. జులై 24న చైనా ఈ రాకెట్ను ప్రయోగించింది. Looks like that Chinese rocket just burned up over Malaysia. Now wait to hear what big pieces splashed/thumped to Earth. https://t.co/SVh2UXVIyG — Chris Hadfield (@Cmdr_Hadfield) July 30, 2022 ఇదీ చదవండి: ల్యాబ్ మాడ్యూల్లోకి ప్రవేశించిన చైనా వ్యోమగాములు -
వీడిన మలేషియా విమానం మిస్టరీ
-
వీడిన మలేషియా విమానం మిస్టరీ
కౌలాలంపూర్ : గత కొన్నిరోజులుగా ఉత్కంఠం రేపిన మలేషియన్ విమానం అదృశ్యం మిస్టరీ వీడింది. గాల్లో ప్రయాణించిన కొద్ది సేపటికే ఆ విమానం కూలినట్లు తాజాగా మలేషియన్ ప్రధాని నజీబ్ రజాక్ ప్రకటించారు. హిందూ మహా సముద్రానికి నైరుతి దిశగా 2500 కిలోమీటర్లు దూరంలో శకలాలు లభించడంతో విమానం కూలినట్లు నిర్దారించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన నజీబ్.. విమాన ఘటనకు సంబంధించిన వివరాలను రేపు ప్రకటిస్తామన్నారు. అత్యధునిక సాంకేతిక పరిజ్ఞానం కల్గిన బ్రిటన్ ఉపగ్రహం అందజేసిన ఛాయాచిత్రాల ఆధారంగా చర్యలు చేపట్టిన ఆస్ట్రేలియా ఆ విమాన శకలాలను కనుగొంది. దక్షిణ హిందూ మహాసముద్రంలో తాము ఓ చెక్క కార్గో ప్యాలెట్ను గుర్తించిన అనంతరం విమాన ఘటనపై తుది నిర్దారణకు వచ్చారు. ఉపగ్రహం గుర్తించిన శిథిలాల వద్దకు ఆస్ట్రేలియన్ షిప్ వెళ్లడంతో ఈ విషాదాంత ఉదంతానికి తెరపడింది. ఇప్పటి వరకూ మలేషియా విమానం అదృశ్యంపై రోజుకో కొత్త విషయం వెలుగు చూస్తూనే ఉన్నాయి. 16 రోజుల క్రితం కౌలాంపూర్ నుంచి బీజింగ్ కు 239 మంది ప్రయాణికులతో బయలుదేరిన మలేషియన్ విమానం దక్షిణ చైనా సముద్రం మీదుగా మలుపు తీసుకుందని సైనిక రాడార్ సిగ్నళ్ల ద్వారా తెలిసింది. అదృశ్యం అయిపోవడానికి ముందు సముద్ర మట్టానికి కేవలం 12వేల అడుగుల ఎత్తున మాత్రమే అది పయనించిందని, విమానం ఆ మలుపు తీసుకోడానికి సుమారు రెండు నిమిషాల సమయం పట్టి ఉండొచ్చని భావిస్తున్నారు. అప్పుడే ప్రమాదం సంభవించి, పైలట్ లేదా కో పైలట్ ప్రమాద సంకేతాలు పంపి ఉండొచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే విమానం కూలిపోయి ఉంటుందని భావిస్తున్నారు. -
హిందూ మహాసముద్రంలో విమాన శకలాలు?
దక్షిణ హిందూ మహాసముద్రంలో మలేషియన్ విమానానికి సంబంధించిన శకలాల్లాంటి వస్తువులను చైనా విమానాలు గుర్తించాయి. దాంతో ఒక్కసారిగా మళ్లీ దాని గాలింపు చర్యలు ముమ్మరమయ్యాయి. తెల్లగా, నలుచదరంగా ఉన్న కొన్ని శకలాలను చైనాకు చెందిన ఇల్యుషిన్-76 గాలింపు విమానం గుర్తించింది. ఇవి బహుశా మలేషియా విమానం ఎంహెచ్ 370కి చెందినవేనని భావిస్తున్నారు. 95.1113 డిగ్రీల తూర్పు, 42.5453 దక్షిణంగా ఈ విమాన శకలాలు ఉన్నట్లు చైనాకు చెందిన ఐస్ బ్రేకర్ జుయెలాంగ్ నుంచి సమాచారం అందినట్లు చైనా అధికారిక వార్తా సంస్థ సిన్హువా తెలిపింది. ఎంహెచ్ 370 విమానం గాలింపు చర్యల్లో పది విమానాలు ఉన్నట్లు ఆస్ట్రేలియన్ మారిటైం సేఫ్టీ అథారిటీ తెలిపింది. (విమానం ఆచూకీపై మరిన్ని ఆధారాలు) ఉదయం 8.45, 9.20 గంటల సమయంలో రెండు చైనా సైనిక విమానాలు బయల్దేరాయి. విమాన శకలాలు ఇవేనంటూ ఫ్రాన్సు కొత్తగా ఉపగ్రహ ఛాయాచిత్రాలు అందించడంతో ఆ దిశగా కూడా ప్రయత్నాలు చేశారు. దక్షిణ హిందూ మహాసముద్రంలో తాము ఓ చెక్క కార్గో ప్యాలెట్ను గుర్తించినట్లు ఆస్ట్రేలియా చెప్పింది. (మలుపు తర్వాతే పడిపోయిన మలేషియా విమానం) దీంతో ఫ్రెంచి ఉపగ్రహం ఇచ్చినది ఈ విమానానికి సంబంధించిన సమాచారం కాదని స్పష్టమైంది. ప్రస్తుతం విమానం కోసం గాలిస్తున్న ప్రదేశానికి అది 850 కిలోమీటర్ల దూరంలో ఉందని ఆస్ట్రేలియా ఉప ప్రధాని వారెన్ ట్రస్ చెప్పారు. ఏ చిన్న సమాచారం దొరికినా వెంటనే అందులో నిజానిజాలను పూర్తిగా నిర్ధారించుకుంటున్నామని, దానివల్ల తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేస్తామని ఆయన అన్నారు.


