ఆర్కాం, ఎయిర్ సెల్ విలీనానికి రంగం సిద్ధం
ముంబై: అనిల్ అంబానీ నాయకత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ తో మరో టెలీకాం సంస్థ ఎయిర్సెల్ సంస్థ విలీన ప్రక్రియకు రంగం సిద్ధమైంది. టెలికాం ఆపరేటర్ ఎయిర్ సెల్ తో ప్రతిపాదిత ఒప్పందం తొందర్లోనే పూర్తి కానుందని గురువారం ప్రకటించింది. ఈ విలీనాన్ని త్వరలో ప్రకటిస్తామని రిలయన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో విలీనంపై ఎయిర్ సెల్ తో ఆర్కామ్ యాజమాన్యం చర్చలు జరుపుతోందని తెలిపింది. కంపెనీ అందించిన సమాచారం ప్రకారం ఎయిర్ సెల్ వాటాదారులైన మాక్సిస్ కమ్యూనికేషన్స్ బెర్హాడ్ అండ్ సింధ్య సెక్యూరిటీస్ , ఇన్వెస్ట్మెంట్స్ ప్రైవేట్ తో చర్చలు జరుగుతున్నాయి. ఇండియన్ వైర్ లెస్ వ్యాపారంలో ఉమ్మడి వ్యాపారానికి ఒప్పందం కుదురుతుందనే ధీమాను వ్యక్తం చేసింది. డీల్ పూర్తి అయిన తర్వాత దీనికి సంబంధించిన లావాదేవీలను ప్రకటిస్తామని పేర్కొంది.
కాగా ఈ వార్తలతో మార్కెట్ల ఆర్ కాం షేర్ 6 శాతం లాభాలను నమోదు చేసింది.