breaking news
darshan singh
-
మేం ఎన్నికల్లో పాల్గొనడం లేదు
చండీగఢ్: పంజాబ్ ఎన్నికల్లో తాము పోటీ చేయడం లేదని రైతు సంఘాల ఐక్య వేదిక సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) స్పష్టం చేసింది. అదేవిధంగా, రాజకీయాల్లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్న పంజాబ్లోని 22 సంఘాల కూటమి ‘సంయుక్త సమాజ్ మోర్చా’ఎస్కేఎం పేరు వాడుకోరాదని పేర్కొంది. కేవలం రైతు సమస్యల సాధన కోసం దేశవ్యాప్తంగా ఉన్న 475 వేర్వేరు సంస్థలతో ఏర్పడిన వేదిక ఎస్కేఎం కాగా, పంజాబ్లోని 32 రైతు సంఘాలు అందులో ఒక భాగమని పేర్కొంటూ ఎస్కేఎం నేతలు దర్శన్ సింగ్ పాల్, జగ్జీత్ సింగ్ దల్లేవాల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక వేళ ఎస్కేఎం పేరును ఎవరైనా వాడుకుంటే చట్టపరంగా ముందుకు వెళతామన్నారు. ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత ఉద్యమాన్ని వాయిదా వేసినట్లు వారు చెప్పారు. రైతుల ఇతర డిమాండ్లపై తదుపరి కార్యాచరణను జనవరి 15న ఖరారు చేస్తామన్నారు. పంజాబ్లో రైతు సంఘాల రాజకీయ వేదిక వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు నిరసనలు సాగించిన పంజాబ్లోని 22 రైతు సంఘాలు రాజకీయ కూటమిగా ఏర్పడ్డాయి. రాజకీయ మార్పే లక్ష్యంగా రాష్ట్రంలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని శనివారం ప్రకటించాయి. పంజాబ్లోని మొత్తం 32 రైతు సంఘాలకు గాను 22 రైతు సంఘాల ప్రతినిధులు శనివారం ఇక్కడ సమావేశమయ్యారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో సంయుక్త సమాజ్ మోర్చా పేరుతో పోటీ చేస్తామని భేటీ అనంతరం రైతు నేత హర్మీత్ సింగ్ కడియన్ మీడియాకు తెలిపారు. భారతీయ కిసాన్ యూనియన్(రాజేవాల్) నేత బల్బీర్ సింగ్ సింగ్ రాజేవాల్ తమ మోర్చాకు నేతగా ఉంటారన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీతో జట్టుకట్టే విషయంలో ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ఎన్నికల్లో ఎస్కేఎం పేరును మాత్రం వాడుకోబోమన్నారు. -
అమెరికాలో సిక్కు వృద్ధుడిపై జాతివివక్ష
అమెరికాలో భారతీయుల పట్ల వివక్ష కొనసాగుతూనే ఉంది. విమానంలో ప్రయాణిస్తూ నిద్రపోతున్న ఓ సిక్కు వృద్ధుడిని సహ ప్రయాణికుడు ఒకరు వీడియో తీసి, దాన్ని ఆన్లైన్లో పోస్ట్ చేసి, తాను బిన్ లాడెన్తో ప్రయాణిస్తున్నానని, ఇలాంటప్పుడు మీరు సురక్షితంగా ఉండగలరా అని దానికి టైటిల్ పెట్టాడు. జెట్బ్లూ విమానంలో న్యూయార్క్ నుంచి కాలిఫోర్నియాకు వెళ్తున్న దర్శన్ సింగ్కు ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ ఘటన నవంబర్లో జరిగింది. దీనిపై ఆ ప్రయాణికుడితో దర్శన్ సింగ్ అసలు ఏమీ మాట్లాడలేదు. కానీ తర్వాత వీడియోను యూట్యూబ్లో చూసి ఆశ్చర్యపోయారు. 39 సెకన్ల పాటు ఉన్న ఆ వీడియోను 83 వేల మంది చూశారు. ఈ విషయాన్ని దర్శన్ సింగ్ కుమార్తె (20) యునైటడ్ సిఖ్స్ అనే సంఘం డైరెక్టర్ మన్వీందర్ సింగ్కు ఫిర్యాదుచేసింది. ఇటీవలి కాలంలో సిక్కులకు వ్యతిరేకంగా ఇలాంటి వ్యవహారాలు ఎక్కువవుతున్నాయని ఆయన అన్నారు. ఇంతకుముందు ఈనెల 6వ తేదీన ఐఎస్ఐఎస్ వ్యతిరేక బృందం వాళ్లు ఓ గురుద్వారాను తగలబెట్టారు. అదేరోజు నలుగురు సిక్కు యువకులను తలపాగా ఉందన్న కారణంగా పుట్బాల్ గేమ్ వద్దకు రానివ్వకుండా అడ్డుకున్నారు. ఇక దర్శన్ సింగ్ వీడియోను చూసినవాళ్లలో వందలాదిమంది ఆ వీడియో తీసిన వ్యక్తి చేష్టలను ఖండిస్తూ కామెంట్లు పెట్టారు. దానికి 1170 డిస్లైక్లు వచ్చాయి. ఆ వీడియోను యూట్యూబ్ నుంచి తీయించడానికి యునైటెడ్ సిఖ్స్ సంస్థ ప్రయత్నిస్తోంది.