breaking news
commission based
-
తమిళనాట ‘20% కమీషన్ల’ పాలన
పుదుకొట్టై: తమిళనాడులో డీఎంకే పాలనలో అవినీతి విచ్చలవిడిగా రాజ్యమేలుతోందని కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా మండిపడ్డారు. రాష్ట్రంలో ‘20 శాతం కమీషన్ల’ పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రతి పనిలో 20 శాతం కమీషన్లు నొక్కేస్తున్నారని, ఇదొక నిబంధనగా మారిపోయిందని షా దుయ్యబట్టారు. తమిళనాడుతోపాటు పశ్చిమ బెంగాల్లో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే విజయం సాధించడం తథ్యమని ధీమా వ్యక్తంచేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నయనార్ నాగరత్నన్ చేపట్టిన యాత్ర ముగింపు సందర్భంగా ఆదివారం పుదుకొట్టైతో నిర్వహించిన భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తమిళనాడులో ఉందన్నారు. తమిళ భాషను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ చేస్తున్న ఆరోపణలను కొట్టిపారేశారు. తమిళాన్ని మరింత ప్రోత్సహించడానికి పలు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో హిందుమతాన్ని, హిందువులను డీఎంకే తరచుగా కించపరుస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరియాణా, ఢిల్లీ, బిహార్ తరితర రాష్ట్రాల్లో ఎన్డీయే ఘన విజయం సాధించిందని, తమిళనాడు, పశ్చిమ బెంగాల్లోనూ అదే ఫలితం పునరావృతం కాబోతోందని స్పష్టంచేశారు. కుటుంబ రాజకీయాలకు ఇక చరమగీతం తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ దారుణంగా విఫలమైందని అమిత్ షా మండిపడ్డారు. ఆ పార్టీ అవినీతికి మారుపేరుగా మారిందన్నారు. క్యాష్ ఫర్ జాబ్స్తోపాటు మనీ లాండరింగ్ కేసుల్లో డీఎంకే నాయకుల పేర్లు తెరపైకి వచ్చాయని గుర్తుచేశారు. అవినీతి నేతలుండగా రాష్ట్రం ప్రగతి సాధించడం సాధ్యం కాదని అన్నారు. అప్పులు, మద్యం ఆదాయంతోనే ప్రభుత్వం నడిచే పరిస్థితి ఏర్పడిందన్నారు. కుమారుడు ఉదయనిధి స్టాలిన్ను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని సీఎం స్టాలిన్ ఆరాటపడుతున్నారని, ఆయన ఆశ నెరవేరే ప్రసక్తే లేదని అమిత్ షా పేర్కొన్నారు. కుటుంబ రాజకీయాలకు చరమగీతం పాడే సమయం వచ్చిందన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించని స్టాలిన్ ప్రభుత్వాన్ని చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. డీఎంకే నాయకులు సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూతో పోలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హిందువుల పండుగలకు సైతం అనుమతి ఇవ్వడం లేదన్నారు. హిందువులపై దాడులు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి స్టాలిన్ రాజ్యాంగ విలువలను ఉల్లంఘిస్తున్నారని అమిత్ షా ధ్వజమెత్తారు. -
ఏలూరులో నోట్ల మార్పిడి ముఠా అరెస్టు
ఏలూరు : నోట్ల మార్పిడికి పాల్పడుతున్న ముఠాను పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు వన్టౌన్ పోలీసులు పట్టుకున్నారు. పాత రూ.500, రూ.1000 నోట్లను తీసుకుని కొత్త రూ.2000 నోట్లను కమీషన్ పద్ధతిపై ఇస్తున్న నలుగురు వ్యక్తులను పోలీసులు గురువారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.20 లక్షల కొత్త రూ.2000 నోట్లను సీజ్ చేశారు. కొత్త నోట్లు వారికి ఎక్కడి నుంచి వచ్చాయన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. -
30 శాతం కమీషన్తో పాతనోట్ల మార్పిడి
ముంబై: కేంద్ర ప్రభుత్వం పాత పెద్ద నోట్లను రద్దు చేయడంతో నల్ల ధనాన్ని వైట్గా మార్చుకునేందుకు పుణే నగరంలోని పలువురు బిల్డర్లు, వ్యాపారులు నానా తంటాలు పడుతున్నారు. పాతనోట్లు తీసుకుని కొత్త నోట్లు ఇచ్చే వారికి 30శాతం దాకా కమీషన్ ఇచ్చేందుకు సైతం వారు వెనుకాడటం లేదు. అందుకు తాజా ఉదాహరణ ఇది. బుధవారం పుణే క్రైం బ్రాంచ్ పోలీసులు అంకేష్ ఆనంద్ అగర్వాల్ అనే బిల్డర్ను పట్టుకున్నారు. ఈయన తన వద్ద ఉన్న రూ.1.11 కోట్ల నల్లధనాన్ని వైట్గా మార్చుకునే క్రమంలో పట్టుబడ్డాడు. అగర్వాల్ పుణే నగంలో ప్రముఖ బిల్డర్. తన వద్ద ఉన పాత నోట్లను 30 శాతం కమీషన్తో కొత్త నోట్లుగా మరో వ్యాపారి వద్ద మార్చుకునే క్రమంలో పుణే కార్పొరేషన్ వద్ద ఉన్న నాకోడా కోర్ట్ బిల్డింగ్లోని కిషోర్ పోర్వాల కార్యాలయంలో దొరికి పోయాడు. అగర్వాల్ను పోలీసులు అదుపులోకి తీసుకుని, ఇన్కం టాక్స్ అధికారులకు అప్పగించారు. ఆదాయ పన్ను శాఖ అధికారులు ఆయన్ను విచారిస్తున్నారు.


