-
ప్రమాదంలో 10 కోట్ల మంది మొబైల్ యూజర్ల డేటా
స్మార్ట్ఫోన్ల వాడకం రోజు రోజుకి విపరీతంగా పెరుగుతూ పోతుంది. దీని వల్ల మంచి కంటే కీడే ఎక్కువ జరుగుతుంది. ఈ స్మార్ట్ఫోన్తో పనులు ఈజీగా మారాయని సంతోషించే లోపే సైబర్ నేరగాళ్ల దాడితో భద్రత కరువై పోతోంది. కరోనా కాలంలో సైబర్ దాడులు ఎక్కువ అయ్యాయి. తాజాగా చెక్ పాయింట్ రీసెర్చ్ అనే సంస్థకు చెందిన పరిశోధకులు కొన్ని ఆండ్రాయిడ్ యాప్లు స్మార్ట్ ఫోన్ యూజర్ల డేటాను కాజేస్తున్నట్లు వెల్లడించారు. చెక్పాయింట్ రీసెర్చ్ పరిశోధకులు ఈ యాప్ల జాబితాను విడుదల చేశారు. భారీగా డౌన్లోడ్ చేసిన కొన్ని ప్రసిద్ధ యాప్లు కూడా ఇందులో ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటి పలు యాప్లను 10 కోట్ల మంది తమ స్మార్ట్ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నట్లు గుర్తించారు. ఈ యాప్ల్లో కొన్ని ఆస్ట్రాలజీ, ఫ్యాక్స్, ట్యాక్సీ సర్వీసెస్, స్క్రీన్ రికార్డింగ్ కు సంబంధించినవి ఉన్నాయని చెక్పాయింట్ రీసెర్చ్ నివేదిస్తుంది. వీటిలో ముఖ్యంగా ఆస్ట్రోగురు, టీలావా (ట్యాక్సీ యాప్), యాప్ లోగో మేకర్ వంటి యాప్లున్నాయి. ఈ యాప్ల్లోని లోపాల కారణంగా వినియోగదారుల వ్యక్తిగత సమాచారం ప్రమాదంలో ఉంది. ఈ-మెయిల్, పాస్వర్డ్, పేరు, పుట్టిన తేదీ, లింగ సమాచారం, ప్రైవేట్ చాట్, పరికర స్థానం, వినియోగదారు ఐడెంటిఫైయర్లు వంటి సమాచారం ఇందులో ఉంది. ఆ మాల్వేర్ యాప్లు వినియోగదారు సమాచారం, డేటాను సేకరిస్తున్నాయి కాబట్టి ఈ యాప్స్ ను వెంటనే డిలీట్ చేయాలని సైబర్ భద్రత నిపుణులు సూచిస్తున్నారు. చదవండి: కొత్త డిజిటల్ నిబంధనలను వ్యతిరేకిస్తున్న వాట్సాప్ -
భారీగా పెరిగిన మొబైల్ మాల్వేర్ దాడులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్లో మొబైల్ ఫోన్లపై మాల్వేర్ దాడులు పెరిగినట్టు సైబర్ భద్రతా సంస్థ చెక్ పాయింట్ టెక్నాలజీస్ తెలిపింది. 2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి మధ్య కాలంలో మాల్వేర్ దాడులు తొమ్మిది రెట్లు పెరిగినట్టు ఈ సంస్థ పేర్కొంది. 2020 అక్టోబర్లో 1,345 దాడులు జరగ్గా.. 2021 మార్చిలో 12,719 మాల్వేర్ దాడులను గుర్తించినట్టు ఈ సంస్థ వివరించింది. ఈ మేరకు 2021 మొబైల్ సెక్యూరిటీ నివేదికను విడుదల చేసింది. 97 శాతం సంస్థలు 2020లో మొబైల్ ముప్పులను ఎదుర్కొన్నాయని.. అంతర్జాతీయంగా 46 శాతం సంస్థల్లో కనీసం ఒక ఉద్యోగి అయినా హానికారక మొబైల్ అప్లికేషన్ను డౌన్లోడ్ చేసుకున్నట్టు తెలిపింది. -
‘ఎంట్రీ’ మామూలే!
అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన చెక్పాయింట్లు అవినీతికి అడ్డాలుగా మారాయి. నిబంధనలు పాటించని వాహనాల యజమానుల నుంచి పన్నులు వసూలు చేసి రవాణా శాఖ ఖజానాలో జమ చేయాల్సిన సిబ్బంది.. సరుకులు రవాణా చేసే వాహనాలను పరిశీలించకుండానే డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారన్న ఆరోపణలు మామూలయ్యాయి. గతంలో రవాణా శాఖ చెక్పోస్టులు, చెక్పాయింట్లపై ఏసీబీ దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. అయినా సిబ్బంది తీరులో ఎలాంటి మార్పూ రావడం లేదు. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలో 44వ నంబ రు (బెంగుళూరు–నాగ్పూర్) జాతీయ రహదారి తో పాటు 161 వ నంబరు (సంగారెడ్డి–నాందే డ్–అకోలా) జాతీయ రహదారులపై రవాణా శాఖ చెక్పాయింట్, చెక్పోస్టులు ఉన్నాయి. ఆ యా రహదారుల మీదుగా నిత్యం వేలాది వాహనాల రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాష్ట్రంలోని వివిధ జిల్లాలతో పాటు ఉత్తర, దక్షిణ భారత దేశాల్లోని వివిధ రాష్ట్రాలకు సరకుల రవాణాకు సంబంధించిన వాహనాలు తిరుగుతుంటాయి. కామారెడ్డి పట్టణానికి సమీపంలోని పొందుర్తి సమీపంలో ఆర్టీఏ చెక్పాయింట్ ఉంది. దీని మీదుగా నిత్యం వందలాది లారీలు, ఇతర రవాణా వాహనాలు వెళ్తుంటాయి. ప్రతి రవాణా వాహనం ఆగాల్సిందే.. అక్కడి సిబ్బంది అడిగినంత ముట్టజెప్పాల్సిందే.. ఇది బహిరంగ రహస్యం. రవాణా చెక్పాయింట్లతో పాటు చెక్పోస్టుల వద్ద వాహనాలకు సంబంధించిన పత్రాలు, రవాణా అవుతున్న సామగ్రికి సంబంధించిన పత్రాలు, లోడ్, పన్నులు చెల్లించిన పత్రాలతో పాటు వివిధ అంశాలను పరిశీలించాల్సి ఉంటుంది. అయితే డ్రైవర్లు లారీని ఆపడం, అక్కడి సిబ్బందికి డబ్బులు ఇచ్చి తిరిగి వెళ్లడం పరిపాటిగా మారింది. 161వ నంబరు జాతీయ రహదారిపై రాష్ట్ర సరిహద్దుల్లోని సలాబత్పూర్ ఆర్టీఏ అంతర్రాష్ట్ర చెక్పోస్టు వద్ద కూడా అడ్డగోలుగా వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ప్రవేశం పేరుతో ‘ఎంట్రీ’ అంటూ డబ్బులు వసూలు చేయడం వివాదాస్పదంగా మారుతోంది. నిబంధనలు పాటించని వాహనాల యజమానుల నుంచి పన్నులు వసూలు చేసి రవాణా శాఖ ఖజానాలో జమ చేయాల్సి ఉంటుంది. అయితే చెక్పోస్టులు, చెక్పాయింట్ల వద్ద పనిచేసే ఉద్యోగులు ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలో రవాణా శాఖ చెక్పోస్టులు, చెక్పాయింట్లపై ఏసీబీ దాడులు జరిగిన సంఘటనలూ ఉన్నాయి. అప్పుడు లెక్కకు మించిన డబ్బులు ఉన్నాయన్న ఆరోపణలతో పలువురిపై చర్యలు తీసుకున్నారు. దానికితోడు చెక్పోస్టులు, పాయింట్ల వద్ద రవాణా శాఖ ఉద్యోగుల కంటే ప్రైవేటు వ్యక్తులే ఎక్కువ హల్చల్ చేస్తుంటారు. జాతీయ రహదారులపై రవాణా శాఖ వసూళ్లపై లారీ డ్రైవర్ ఆవేదన వ్యక్తం చేస్తూ పోస్ట్ చేసిన వీడియో సంచలనం రేపింది. మూడు రోజుల్లో వేలాది మంది ఆ వీడియోను వీక్షించారు. ఆర్టీఏ వసూళ్లపై సోషల్ మీడియాలో ఎన్నో కామెంట్లు వస్తున్నారు. ఇప్పటికైనా రవాణా శాఖ ఉన్నతాధికారులు స్పందించి, అక్రమ వసూళ్లపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. -
భారత్ పై చైనా సైబర్ అటాక్
ప్రపంచవ్యాప్తంగా సునామి సృష్టించిన వన్నాక్రై సైబర్ ఎటాక్ ఉదంతం ఇంకా మరువకముందే, ఆండ్రాయిడ్ లోకి జుడీ అనే మాల్వేర్ చొచ్చుకుని వచ్చి స్మార్ట్ ఫోన్ యూజర్లను గడగడలాడించింది. తాజాగా చైనాకు చెందిన ఓ మాల్వేర్ భూతం భారత్ పై అటాక్ చేసింది. భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా 25 కోట్ల కంప్యూటర్లను ''ఫైర్ బాల్'' అనే మాల్వేర్ అటాక్ చేసిందని సెక్యురిటీ సంస్థ చెక్ పాయింట్ రిపోర్టు చేసింది. ఫైర్ బాల్ రూపంలో వచ్చిన ఈ కొత్త సైబర్ అటాక్ తో, హైజాకర్లు యూజర్ల డీఫాల్డ్ సెర్చ్ ఇంజిన్ ను మారుస్తున్నారని చెప్పింది. అయితే ఈ అటాక్ ఎక్కువగా భారత్ పై ప్రభావం చూపినట్టు చెక్ పాయింట్ పేర్కొంది. అమెరికాలో 55 లక్షల పీసీలు దీని ప్రభావితం కాగ, ఇండియా, బ్రెజిట్ లో చెరో 2.5 కోట్ల మిషన్ల చొప్పున ఫైర్ బాల్ మాల్వేర్ ప్రమాదం బారినపడినట్టు తెలిపింది. తమ నెట్ వర్క్ క్లయింట్స్ అనాలిసిస్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి ఐదు కంప్యూటర్ నెట్ వర్క్స్ లో కనీసం ఒకటి దీని ప్రభావానికి గురైనట్టు చెక్ పాయింట్ అంచనావేస్తోంది. బీజింగ్ కు చెందిన డిజిటల్ మార్కెటింగ్ సంస్థ రాఫోటెక్, వైర్డ్.కామ్ తరఫును వెబ్ ట్రాఫిక్ ను ట్రాక్ చేస్తారని చెక్ పాయింట్ రిపోర్టు చేసింది. బాధితుల మిషన్లలో ఎలాంటి కోడ్ నైనా రన్ చేసే సామర్థ్యం ఈ మాల్వేర్ కు ఉందని వెల్లడించింది. లేదా కొత్త కొత్త హానికరమైన ఫైల్స్ ను సిస్టమ్స్ లోకి డౌన్ లోడ్ చేస్తాయని పేర్కొంది. వాస్తవానికి ఈ మాల్వేర్ ఒక యాడ్వేర్. అంటే అవసరం ఉన్నా లేకున్నా.. ప్రకటనలు గుప్పిస్తుందని చెక్ పాయింట్ పేర్కొంది. -
ఏసీబీ దాడి
భిక్కనూరు, న్యూస్లైన్: నిజామాబాద్ జిల్లా భిక్కనూరు మండలం పొందూర్తి గ్రామశివారులో జాతీయరహదారి పక్కన ఉన్న ఆర్టీఏ చెక్ పాయింట్పై శనివారం వేకువ జామున ఏసీబీ అధికారులు దాడి చేశారు. వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులైన హైదరాబాద్లోని ఉప్పల్కు చెందిన మల్లికార్జున్, నర్సన్నపల్లికి చెందిన చందాని శ్రీధర్, నందవెంకట్రాజం, నిజామాబాద్ జిల్లా కామారెడ్డిలోని అశోక్నగర్ కాలనీకి చెందిన బెజ్జం చందులతో పాటు విధులు నిర్వహిస్తున్న ఏఎంవీఐ సురేందర్రెడ్డిపై కేసులు నమోదు చేశారు. నిందితుల నుంచి రూ. 58 వేల 320 నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సంజీవ్రావు ఆధ్వర్యంలో ఈ దాడి జరిగింది.పొందూర్తి చెక్పోస్టుపై ఏసీబీ అధికారులు 8 నెలల కాలంలో రెండుసార్లు దాడులు నిర్వహించారు. గతేడాది జూన్లో దాడులు నిర్వహించి అప్పటి ఏఎంవీఐ అశోక్కుమార్తో పాటు మరో ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement