breaking news
Buddhudu
-
Vaishakh Purnima 2025 మానవాళికి మహాబోధకుడు
వైశాఖ పౌర్ణమి వైష్ణవులకు, శైవులకూ కూడా ఎంతో పర్వదినం. విష్ణుమూర్తి రెండవ అవతారమైన కూర్మావతారం ఈ రోజునే ఉద్భవించడం, పన్నిద్దరు ఆళ్వారులలో ముఖ్యుడైన నమ్మాళ్వార్ జన్మించినది కూడా వైశాఖ పున్నమినాడే కావడం విష్ణుభక్తులకు ఉల్లాసభరితమైతే, ఎనిమిది పాదాలతో, సువర్ణ సదృశమైన రెక్కలతో, సింహపుదేహంతో ఉన్న శివుని రూపమైన శరభేశ్వరుడి అవతరించినది ఈరోజే కావడం శైవులకు సంతోషకారణం. దక్షిణాదిన పురాతనమైన ఆలయాలలో ఈ శరభ రూపం తప్పకుండా కనిపిస్తుంది. కాబట్టి శైవారాధకులకు కూడా ఈ రోజు విశిష్టమే! సంప్రదాయపరంగా కూడా వైశాఖ పౌర్ణమి అపూర్వమైనది. ఈ రోజును మహావైశాఖిగా పిలుచుకుంటారు. ఈనాడు సముద్రస్నానం చేస్తే విశేషమైన ఫలితం వస్తుందని చెబుతారు. ఎండ ఉధృతంగా ఉండే ఈ సమయంలో దధ్యోజనం (పెరుగన్నం), గొడుగు, ఉదకుంభం లాంటివి దానం చేయడం పుణ్యప్రదం. (నేడు వైశాఖ పున్నమి) ఎల్లప్పుడూ రాగద్వేషాలతో, కామక్రోధాలతో, హింసతో, సతమతమవుతున్న మానవాళిని జాగృత పరచటానికి ఉద్భవించిన మహాపురుషుడు గౌతవుబుద్ధుడు. ఆయన అసలు పేరు సిద్ధార్థ గౌతవుుడు. కపిలవస్తును ఏలే శుద్ధోధన చక్రవర్తికి, ఆయన పట్టపురాణి వుహావూయాదేవికి ౖవైశాఖ శుద్ధపూర్ణివునాడు జన్మించాడు. అతడు పుట్టిన ఏడోరోజునే తల్లి వురణించడంతో పినతల్లి గౌతమి, తానే తల్లి అయి పెంచింది.కొడుకు పుట్టగానే తండ్రి శుద్ధోధనుడు జాతకం చూపించాడు. జాతకం ప్రకారం అతడు వుహాచక్రవర్తి కాని, వుహాప్రవక్త కాని అవుతాడని పండితులు చెప్పారు. తన పుత్రుడు చక్రవర్తి కావాలని ఆశించిన తండ్రి, అతనికి కష్టాలు, బాధలు అంటే ఏమిటో తెలియకుండా పెంచాడు. అంతేకాదు, అతనికి పదహారవ ఏటనే అంతే ఈడుగల యశోధరతో వివాహం జరిపించాడు.కొంతకాలం గడిచిందిఒకనాడు నగర వ్యాహ్యాళికి రథంపై వెళ్లిన సిద్ధార్థునికి దారిలో నాలుగు దృశ్యాలు ఎదురయ్యాయి. అవి ఒక వుుసలివాడు, ఒక రోగి, ఒక శవం, ఒక శవుణుడు. అసలే ఆలోచనాపరుడైన అతని వునసులో ఇవి పెద్ద అలజడినే రేపాయి. వూనవ#లు ఎదుర్కొనే ఈ దుఃఖాన్ని ఎలాగైనా పరిష్కరించి తీరాలనుకున్నాడు. నాలుగో దృశ్యం సన్యాసి – అతనికి వూర్గాన్ని స్ఫురింపజేసింది. అప్పటికప్పుడే సన్యసించాలని, తపస్సు చేయాలని నిర్ణయం తీసుకున్నాడు.గౌతముడు బుద్ధుడయిన వేళ...అప్పుడాయన వయసు 29 సంవత్సరాలు. అప్పుడే ఆయనకు రాహులుడనే పుత్రుడు జన్మించాడు. ఆ రాత్రే అడవికి పయనవుయ్యాడు. ప్రపంచం అంతా మెుద్దు నిద్దరోతోంది. వూయనిద్రలో నుంచి సిద్ధార్థుడొక్కడే మేల్కొన్నాడు, ప్రపంచాన్ని నిద్ర లేపటానికి. అడవికి వెళ్లి ఆరు సంవత్సరాలు వూనవాళి దుఃఖం గురించి ఆలోచించాడు. చివరకు జ్ఞానోదయమైంది. అప్పటికాయన వయస్సు 35 సంవత్సరాలు.ఇదీ చదవండి: ఆధ్యాత్మికథ దేని విలువ దానిదే!జననం మరణం ఒకే రోజుతనకు జ్ఞానోదయం అయిన తరవాత తాను కనుగొన్న ధర్మాన్ని రాజు, పేద, ఉన్నత, దళిత, కుల, వర్గ, వుతభేదాలను పట్టించుకోకుండా 45 సంవత్సరాల పాటు నిరంత రాయంగా బోధించాడు ఆయన జన్మించినది, జ్ఞానోదయం కలిగింది. నిర్వాణం చెందిందీ కూడా వైశాఖ పున్నమినాడే. అందుకే ఈ పున్నమిని బుద్ధపున్నమి అని అంటారు.ప్రపంచాన్ని మేల్కొలిపిన ఆ బోధలు ఏమిటి?ప్రపంచాన్ని పరివర్తన దిశగా నడిపేందుకు బుద్ధుడు నాలుగు సత్యాలను బోధించాడు. వీటిని ఆర్యసత్యాలంటారు. వీటిల్లో మెుదటిది... దుఃఖం. అంటే ఈ ప్రపంచంలో దుఃఖం ఉంది. రెండో సత్యం... దీనికి కారణం తృష్ణ. వుూడో సత్యం... దుఃఖాన్ని తొలగించే వీలుంది. నాలుగో సత్యం... దుఃఖాన్ని తొలగించే వూర్గం ఉంది. ఆ వూర్గమే ఆర్య అష్టాంగవూర్గం. ఈ నాలుగు సత్యాలను చెప్పడంలో బుద్ధుడు ఒక శాస్త్రీయ విధానాన్ని అనుసరించాడు. అదే కార్యకారణ సిద్ధాంతం. బుద్ధునికి వుుందే ఈ సిద్ధాంతం ఉన్నా దానికి ఒక శాస్త్రీయ ప్రాపదికను ఏర్పాటు చేసినది మాత్రం ఆయనే. బుద్ధుడు ప్రపంచానికి అందించిన ఆలోచనా విధానం పూర్తిగా శాస్త్రీయమైనది. హేతుబద్ధమైనది.దుఃఖం అంటే ఏమిటి? బుద్ధుడు ప్రపంచంలో దుఃఖం ఉందన్నాడు. ఆ దుఃఖ భావనను చాలావుంది అపార్థం చేసుకున్నారు. దుఃఖం అంటే వునం వూవుూలుగా శోకం, ఏడుపు, పెడబొబ్బలు అనుకుంటాం. శోకం దుఃఖంలో భాగమే అయినా, దుఃఖం అర్థం అది కాదు. ‘దుఃఖం’ అంటే తొలగించాల్సిన ఖాళీ. అంటే ప్రతి వునిషిలోనూ తొలగించవలసిన అసంతృప్తి ఉంటుంది. అసంతృప్తి లేని వూనవ#డు ఉండడు. ఇలా ఎప్పుడూ అసంతృప్తి ఉంటుంది. ఈ విధమైన ఆ ‘ఖాళీ’నే ఆధునికులు దురవస్థ అంటున్నారు. దీనిని పరిష్కరించటానికి తృష్ణను తొలగించాలన్నాడు. ఆ తృష్ణ పోవాలంటే ‘స్వార్థం’ లేకుండా ఉండాలి. స్వార్థం లేకుండా ఉండాలంటే ‘నేను’ అనే భావన ఉండకూడదు. ‘నేను’ లేకుండా ఉండాలంటే, ‘ఆత్మ’ లేకుండా ఉండాలి. అందుకే ఆయన ‘అనాత్మ’వాదాన్ని ప్రవేశపెట్టాడు. ఇది బుద్ధుడు మానవాళికి చేసిన వుహోపదేశం.మతాతీతమైన సత్యాలుమానవుడు మానవుడు మనగలగాలంటే ఏం చేయాలో బోధించాడు బుద్ధుడు. వాటికే పంచశీలాలని పేరు. 1)ప్రాణం తీయకు 2) దొంగతనం చేయకు 3) అబద్ధాలాడకు 4) కావుంతో చరించకు 5) వుద్యం సేవించకు– వీటిని ఏ వుతం కూడా కాదనలేదు. ఈ సత్యాలు వుతాతీతాలు. సవూజం సజావ#గా, కందెన వేసిన బండిచక్రంలా సాఫీగా సాగాలంటే పంచశీలాలను పాటించడం ఎంతో అవసరం. బుద్ధుడు తాత్విక చింతనలోనూ, వునోవిజ్ఞానశాస్త్రంలోనూ, సవూజ సంక్షేవుంలోనూ, వుూలాలకు వెళ్లి, అంతకువుుందు ఎవరూ చూడని, ఆలోచించని ఎన్నో విషయాలను వూనవ కల్యాణం కోసం అందించిన మహనీయుడు. వునిషికే మహనీయుడిగా పట్టంకట్టిన ఆ మానవతావాది ప్రతిపాదించిన మార్గాన్ని అనుసరించడమే ఆయనకు అర్పించే అసలైన నివాళి. బుద్ధం శరణం గచ్ఛామి ధర్మం శరణం గచ్ఛామి సంఘం శరణం గచ్ఛామి– డి.వి.ఆర్. భాస్కర్ -
మార్గమే నాది.. నడవాల్సింది మీరే!
కపిలవస్తు నగరాన్ని రాజధానిగా చేసుకుని శాక్యగణాన్ని పాలించే రాజు శుద్ధోధనుడు. ఇతని అర్ధాంగి మహామాయ లేదా మాయాదేవి. చాలాకాలం పాటు వీళ్ళకు సంతు లేదు. చివరికి మాయాదేవి గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండాయి. పురిటికి పుట్టింటికి బయలుదేరింది. కానీ దారిలోనే లుంబినీ వనంలో ఆమె ప్రసవించింది. ఆ రోజు వైశాఖ పున్నమి. మిట్ట మధ్యాహ్నం సిద్ధార్థుడు జన్మించాడు. అయితే సిద్ధార్థునిగా భౌతిక జననమే గానీ బుద్ధునిగా జన్మదినం కాదు. సిద్ధార్థుడు ఒక వ్యక్తి. రాకుమారుడు. ఆయనకు నా అనే వాళ్లు ఉంటారు. ‘నావి’ అనేవి ఉంటాయి. నా భార్య నా బిడ్డ, నా తల్లి, నా తండ్రి నా సోదరుడు, నా బంధువులు, నా మిత్రుడు, నా రాజ్యం నా సంపద... ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది ఉన్నంత వరకూ సిద్ధార్థుడు ఒక వ్యక్తే. ఒక రాకుమారుడో, రాజో, ఒక బిడ్డ, ఒక తండ్రి, ఒక భర్త. సంసార బంధాల మధ్యే ఉంటాడు. కాబట్టి అతని పనులన్నీ ఆ బంధాల చుట్టూనే ఉంటాయి. కానీ ఈ బంధనాల నుండి బైటకు వచ్చేశాడు సిద్ధార్థుడు. తన 29వ ఏట అన్నింటినీ త్యజించి బైటకు వచ్చాడు. ఇక ఆ రోజు నుండి ధర్మం కోసం అన్వేషణ మొదలు పెట్టాడు. బుద్ధత్వం పొందాలనుకున్నాడు. ఆ అన్వేషణ సాధన ఆరేళ్లు సాగింది. ఆరేళ్ళ తర్వాత బుద్ధగయలో నిరంజనా నదీ తీరంలో బోధివృక్షం రావిచెట్టు క్రింద ధ్యాన సాధన చేశాడు. భవచక్రాన్నుండి బైట పడ్డాడు. పరిపూర్ణ ప్రజ్ఞ సాధించాడు. దుఃఖానికి కారణమైన ఈ భవ చక్రాన్నుండి బయటపడే మార్గాన్ని కనుగొన్నాడు. అదే జ్ఞానోదయం బుద్ధత్వం, బుద్ధునిగా జననం ఇది సిద్ధార్ధుడు బుద్ధునిగా మారిన (పుట్టినరోజు) ఆరోజు కూడా విశాఖ పున్నమే! అలా సిద్ధార్థుడు బుద్ధునిగా జన్మించడానికి ఆరేళ్ళు ధర్మగర్భంలో ఉన్నాడు. భౌతికంగా శారీరకంగా .... బుద్ధునిగా తొలి ఏడు. ఇలా... సిద్ధార్థుడు పుట్టిందీ, బుద్ధత్వం పొంది సంబుద్ధుడయ్యిందీ వైశాఖ పున్నమి రోజే. బుద్ధత్వం పొందాక అతనికి ఎలాంటి భవ బంధాలు ఉండవు. తల్లీ, తండ్రీ, భార్య, బిడ్డలు, బంధువులు, మిత్రులు అనేవారు ఉండరు. ‘నా’ అనేది పూర్తిగా నశిస్తుంది. ‘నాది’ ‘నా వారు’ అనే బంధాలు నశిస్తాయి. జనాలందరూ బుద్ధునికి సమానులే. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు. వ్యక్తి నశించి వ్యక్తిత్వం మాత్రమే మిగిలి ఉంటుంది. కాబట్టి స్వార్థం, ద్వేషం, ఈర్ష్య, మోహం అనేవి బుద్ధత్వంలో అదృశ్యమైపోతాయి. ఆ సంబుద్ధుడు జ్ఞాననేత్రం అవుతాడు. ధర్మనేత్రం అవుతాడు. అందరిలో తనుండడు. తనలోనే అందర్నీ ఇముడ్చుకుంటాడు. తన దుఃఖాన్ని అందరికీ పంచడు. అందరి దుఃఖాన్ని తన దుఃఖంగా భావిస్తాడు. దాన్ని తొలగించడానికే ప్రయత్నిస్తాడు. అదే బుద్ధత్వం అంటే. తన దుఃఖాన్ని తాను తీర్చుకోవడం కాదు. అందరి దుఃఖాన్ని తీర్చడం. అంటే అందరికీ దుఃఖ నివారణ చెప్పడం. ఆ మార్గంలో ఎదుటివారు తమ దుఃఖాన్ని తామే తీర్చుకోవాలి. బుద్ధుడు అలా మార్గదాత మాత్రమే! బుద్ధుని జీవితంలో మరో విశేషం ఏమంటే... బుద్ధుడు తన 80వ ఏట కుసీనగర్లో మహాపరి నిర్వాణం పొందింది కూడా వైశాఖ పున్నమి రోజునే! ఆయన నోటి నుండి వెలువడిన ఆఖరి మాటలు– ‘‘మీకు మీరే దీపం కండి. మార్గమే నాది. ఆ మార్గంలో నడవాల్సింది మీరే’’ అనేది బుద్ధుని అంతిమ సందేశం. ఇలా పుట్టుక, బుద్ధత్వం పొందడం, మహాపరి నిర్వాణం... ఈ మూడూ వైశాఖ పున్నమి రోజే. కాబట్టి బౌద్ధులు ఈ పున్నమి రోజును ‘బుద్ధ జయంతి’ అని అనకుండా ‘బుద్ధ పున్నమి’ గానే పిలుచుకుంటారు. జరుపుకుంటారు. – బొర్రా గోవర్ధన్ -
బుద్ధుని ఎరుకకు... సులువైన గ్రంథం....
బౌద్ధం గురించి రాసేవారు సాధారణంగా బౌద్ధంలోని పారిభాషిక పదాలను ఎధేచ్ఛగా ఉపయోగిస్తారు. బౌద్ధం గురించి ఏం రాసినా తమకు అర్థమైంది కనుక ఎదుటివారికి కూడా అర్థమైపోతుంది అన్నట్టుగా రాసుకుంటూ పోతారు. దీని వల్ల చాలా గ్రంథాలు పఠనీయతను కోల్పోతాయి. కాని పండితుల కంటే కూడా ఒక్కోసారి సామాన్యులు రాసే పుస్తకాలు ఎక్కువ మేలు చేస్తాయనడానికి ‘బుద్ధుడు-బౌద్ధధర్మం’ ఒక ఉదాహరణ. రచయిత పొనుగోటి కృష్ణారెడ్డి ఒక సీనియర్ జర్నలిస్టు కనుక బుద్ధుడి గురించి పాఠకుడు ఎంత చెప్పాలి ఎలా చెప్పాలి ఎంత సులువుగా చేరవేయాలి తెలుసుకొని మరీ ఈ గ్రంథం రాయడం వల్ల ఆబాల గోపాలం అతి సులువుగా బుద్ధుడి గురించి బౌద్ధధర్మం గురించి తెలుసుకోవడానికి వీలయ్యే పుస్తకంగా రూపు దాల్చింది. బుద్ధుని పుట్టుక, ప్రయాణం, జ్ఞానోదయం, ప్రచారం, నిర్వాణం... ఇవన్నీ ఈ గ్రంథంలో ఉన్నాయి. శీలం, నిష్కామం, దానం, ఉపేక్ష, వీర్యం, క్షాంతి, సత్యం, అధిష్టానం, కరుణ, మైత్రి... ఈ పది ఉత్తమ గుణాలను మానవులు ఆచరించాలి. పంచశీల, చతురార్య సత్యాలు, అష్టాంగ మార్గం... ఇవన్నీ మనిషి అనునిత్య క్షోభ నుంచి విముక్తం చేసే బోధకాలు. వీటిని వివరంగా సులభంగా తెలియ చేసే పుస్తకం ఇది. పాఠకుల కోసం బౌద్ధాన్ని పరిశోధించి ఈ పుస్తకాన్ని రాసినందుకు కృష్ణారెడ్డికి అభినందనలు తెలియచేయాలి. బుద్ధుడు - బౌద్ధధర్మం; డాక్టర్ పొనుగోటి కృష్ణారెడ్డి; వెల: రూ.75 ప్రతులకు: 9440974788 డైరీ: 13వ ఆటా మహాసభల ప్రత్యేక సంచిక కోసం రచనలు ఆహ్వానిస్తున్నారు. కథ, కవిత్వం, వ్యాసం... ఏదైనా పంపవచ్చు. ఉత్తమమైన వాటికి బహుమతిగా 116 డాలర్ల బహుమతి కూడా ఉంటుంది. గడువు మార్చి 30. వివరాలుకు: http://www. ataconference.org మార్చి 9 ఆదివారం సాయంత్రం నెల్లూరు టౌన్హాల్లో చిన్ని నారాయణరావు కవితాసంపుటి ‘గుండె దీపం’ ఆవిష్కరణ. మార్చి 9 ఆదివారం ఉదయం 10 గంటలకు మోహన్రుషి కవితా సంపుటి ‘జీరో డిగ్రీ’ ఆవిష్కరణ. వేదిక: హైదరాబాద్ స్టడీ సర్కిల్, ఇందిరా పార్క్ దగ్గర.