breaking news
Blue Team
-
బ్లూ టీమ్ కెప్టెన్గా చైతన్య
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ క్రికెట్ సంఘం అండర్-23 ప్రాబబుల్స్ ప్రాక్టీస్ మ్యాచ్ల్లో తలపడే జట్లను శుక్రవారం ఎంపిక చేసింది. బ్లూ టీమ్, రెడ్ టీమ్, ఎల్లో టీమ్, గ్రీన్ టీమ్లుగా ఆటగాళ్లను విభజించింది. బ్లూ టీమ్ కెప్టెన్గా వై. చైతన్య కృష్ణ, రెడ్ టీమ్ కెప్టెన్గా బి. యతిన్ రెడ్డి, ఎల్లో టీమ్ కెప్టెన్గా పి.ఎస్.చైతన్య రెడ్డి, గ్రీన్ టీమ్ కెప్టెన్గా తనయ్ త్యాగరాజన్ వ్యవహరిస్తారు. బ్లూ టీమ్: వై. చైతన్య కృష్ణ, కె. రోహిత్, డి. అరుణ్, ఎ. వంశీ వర్ధన్, రాకేశ్, కేఎస్కే చైతన్య, మోహిత్ సోని, రజనీశ్ యాదవ్, సయ్యద్ చాంద్పాషా, అనిరుధ్, రాధకృష్ణ, బరణ్ కుమార్, త్రినాథ్ (వికెట్కీపర్), అకాశ్, సందీప్ మనోహర్, టి. దిలీప్ (కోచ్). రెడ్ టీమ్: బి. యతిన్ రెడ్డి, ఎస్. విక్రమ్, జె. మల్లికార్జున్, బి. చంద్రశేఖర్, అకేందర్, పి.రోహిత్, విష్ణు, సారుు అనూప్, టి.వి. కృష్ణ చరిత్, పి. ప్రణీత్, యశ్వంత్, శ్రావణ్ కుమార్, సాత్విక్, ఫైజల్ (వికెట్ కీపర్), రిషబ్ శర్మ. ఎల్లో టీమ్: చైతన్య రెడ్డి, సమర్థ్ సింగ్, అభిరథ్, రోహన్, బెనిటో, వివేక్, సుఖేన్ జైన్, సయ్యద్ అహ్మద్, కార్తీకేయ, రవితేజ, అజారుద్దీన్, మనీశ్ కుమార్, సారుు శ్రవణ్, రాజేశ్, ప్రతీక్ పవార్, గణేశ్ (కోచ్). గ్రీన్ టీమ్: తనయ్, డి.లోహిత్, శశిధర్, అంకుర్, ఆశిష్, హర్ష్, రవీందర్, ప్రశాంత్, జి. విదత్, శ్రీధరహాస్ రెడ్డి, షేక్ ఇబ్రహీం, సారుుతేజ, భిక్షపతి సంకేత్, ప్రణవ్ (వికెట్కీపర్). -
పుజారా సెంచరీ
గ్రేటర్ నోయిడా: దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఇండియా ‘బ్లూ’ జట్టు భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఇండియా ‘రెడ్’ జట్టుతో శనివారం మొదలైన ఈ ఐదు రోజుల మ్యాచ్లో తొలి రోజు ఆటముగిసే సమయానికి ఇండి యా ‘బ్లూ’ జట్టు 90 ఓవర్లలో మూడు వికెట్లకు 362 పరుగులు సాధించింది. మయాంక్ అగర్వాల్ (7 ఫోర్లతో 57), గౌతమ్ గంభీర్ (8 ఫోర్లతో 94) తొలి వికెట్కు 144 పరుగులు జోడించారు. అజేయ శతకం సాధించిన చతేశ్వర్ పుజారా (15 ఫోర్లతో 111 బ్యాటింగ్)తో కలిసి దినేశ్ కార్తీక్ (8 ఫోర్లతో 55 బ్యాటింగ్) క్రీజ్లో ఉన్నాడు. ‘రెడ్’ జట్టు బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ, అమిత్ మిశ్రా, కుల్దీప్ యాదవ్ ఒక్కో వికెట్ తీశారు.