Balotsav shows
-
నవంబర్ 10, 11న ‘బాలోత్సవ్’
సాక్షి, హైదరాబాద్: వివిధ ఉపాధ్యాయ సంఘాలు, ఉత్తమ ఉపాధ్యాయుల సంఘం సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘ఆట బాలోత్సవ్’కార్యక్రమ బ్రోచర్ను మినిస్టర్స్ క్వార్టర్స్లో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బుధవారం ఆవిష్కరించారు. పిల్లలకు చదువుతో పాటు వివిధ కళల పట్ల అవగాహన కల్పించడానికి బాలోత్సవ్ ఉత్సవాలు ఉపయోగపడుతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయి ఉత్సవాల్లో పాల్గొనడం పిల్లలకు మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుందని చెప్పారు. ఈ ఉత్సవాల్లో దేశంలోని 10 రాష్ట్రాల పిల్లలు, కళాకారులు పాల్గొంటున్నట్లు ఉత్తమ ఉపాధ్యాయుల అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు తెలిపారు. నవంబర్ 10, 11 తేదీల్లో రెండ్రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో 24 అంశాలు, 54 విభాగాల్లో వివిధ కార్యక్రమాలను రూపొందించామని వివరించారు. ఉత్సవాల్లో పాల్గొనే ప్రతి ఒక్కరికీ ప్రశంసాపత్రం అందజేస్తామని, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కళాకారులు, పిల్లలకు భోజన వసతి కల్పిస్తామని శ్రీనివాసరావు వెల్లడించారు. -
ముగిసిన భద్రాద్రి బాలోత్సవ్
-
ముగిసిన బాలోత్సవ్
భద్రాచలం: భద్రాచలంలో 6వ జాతీయ స్థాయి భద్రాద్రి బాలోత్సవ్ ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. వివిధ వేషధారణలో చిన్నారులు, కూచిపూడి, భరత నాట్యం, గిరిజన, జానపద, వివిధ రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలను ప్రతిబింబింపజేశారు. రెండు రోజులపాటు నిర్వహించిన ఈ వేడుకలు సోమవారం ముగిశాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిషా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పోటీల్లో పాల్గొన్నారు. కోల్కతా ఖరగ్పూర్ నుంచి వచ్చిన చిన్నారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముగింపు సభలో పాల్గొన్న మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ఇలాంటి ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమ తులు అందించారు. కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చేకూరి కాశయ్య, బాలోత్సవ్ చైర్మన్ తాళ్లూరి పంచాక్షరయ్య, వైస్ చైర్మన్ బూసిరెడ్డి శంకర్రెడ్డి, తానా ట్రస్టు చైర్మన్ తాళ్లూరి రాజాశ్రీకృష్ణ, డైరెక్టర్ జయశేఖర్ తదితరులు పాల్గొన్నారు.