-
మంత్రాలయంలో సచివాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి
-
మత్రాలయం వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి బాలనాగిరెడ్డి రోడ్ షో
-
ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అరెస్ట్పై హైకోర్టు స్టే
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి కుటుంబానికి హైకోర్టులో ఊరట లభించింది. మంత్రాలయం నియోజకవర్గంలో ఇటీవల చోటుచేసుకున్న ఘటనపై టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తిక్కారెడ్డి ఫిర్యాదుతో నాగిరెడ్డిపై మాదవరం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దీంతో తన తప్పేమీ లేకున్నా పోలీసులు అక్రమంగా కేసు నమోదు చేశారంటూ నాగిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. అతని పిటిషన్పై విచారించిన ధర్మాసనం నాగిరెడ్డిని అరెస్ట్ చేయ్యవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. (మంత్రాలయంలో ‘‘తిక్క’’ చేష్టలు) ప్రచారంలో భాగంగా మంత్రాలయం మండలం కగ్గల్లలో తిక్కారెడ్డిని గ్రామస్తులు అడ్డుకుంటారనే అనుమానంతో ఆయన గన్మెన్ గాల్లోకి కాల్పులు జరిపిన విషయం తెలిసిందే . దాదాపు 10 రౌండ్ల కాల్పులు జరిపినట్టుగా స్థానికుల సమాచారం. గన్మెన్ జరిపిన కాల్పుల్లో తిక్కారెడ్డితోపాటు, అక్కడే ఉన్న ఏఎస్సై గాయపడ్డారు. ప్రశాంతంగా ఉన్న గ్రామంలో టీడీపీ అభ్యర్థి తిక్కారెడ్డి కుట్ర పూరితంగా వ్యవహరించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని బాలనాగిరెడ్డి అన్నారు. -
ప్రత్యేక హోదా మన హక్కు
కర్నూలు, పెద్దకడబూరు: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీని సాధనకు పార్టీలకు అతీతంగా పోరాటాలు సాగించాలని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన పెద్దకడబూరు మండలం గంగులపాడు గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. ఐదు కోట్ల ఆంధ్రుల మనోభావాలను సీఎం చంద్రబాబు తాకట్టు పెట్టారన్నారు. ఓటుకు కోట్లు కేసు, అవినీతిపై విచారణ చేస్తారన్న భయంతోనే ప్రత్యేక హోదాపై చంద్రబాబు నోరు మెదపడం లేదన్నారు. ఆర్థికంగా ఆంధ్రప్రదేశ్ పేదరాష్ట్రమైనా చంద్రబాబు మాత్రం సీఎంల్లో అందరికంటే ధనికుడిగా ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక పేర్కొందని గుర్తు చేశారు. రాజధాని భజన చేస్తూ రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించడం శోచనీయమన్నారు. ప్రత్యేక హోదా సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందన్నారు. వామపక్ష నాయకులు సైతం ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్నారని, టీడీపీ మాత్రం పక్కనపెట్టిందని విమర్శించారు. రాష్ట్రంలో ఉనికి కోసమే టీడీపీ ఎంపీలు పార్లమెంట్లో ఫ్లకార్డులు ప్రదర్శిస్తూ డ్రామా ఆడారని విమర్శించారు. రాష్ట్రప్రయోజనాలపై ఏమాత్రం పట్టింపు ఉన్నా వెంటనే టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మార్చి ఒకటిన చేపట్టే కలెక్టరేట్ల ముట్టడి, 5న ఢిల్లీ జంతర్మంతర్ వద్ద జరిగే ధర్నాకు మద్దతుగా నిలిచేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రత్యేక హోదా వస్తే జననేత జగన్మోహన్రెడ్డికి పేరు వస్తుందన్న భయంతోనే చంద్రబాబు నోరెత్తడం లేదన్నారు. స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక ప్యాకేజీపై మోజు చూపుతున్నారని విమర్శించారు. భవిష్యత్తులో టీడీపీ నాయకులకు ప్రజలు తప్పక బుద్ధి చెబుతారని హెచ్చరించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర యూత్ కమిటీ సభ్యులు వై.ప్రదీప్కుమార్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తంరెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్రెడ్డి, ఎంపీపీ రఘురాం, నాయకులు చంద్రశేఖర్రెడ్డి, వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. -
అబద్ధాల బాబును నమ్మకండి
కౌతాళం, న్యూస్లైన్ : ఎలాగైనా అధికారంలోకి రావడమే లక్ష్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ అభ్యర్థులు ఆచరణ సాధ్యంకానీ హామీలతోపాటు లేనిపోని మాటలు చెబుతున్నారని, వారిని మోసపోవద్దని మాజీ ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ప్రజలకు సూచించారు. వైఎస్సార్ ఆశయ సాధనకు పాటుపడుతున్న వైఎస్సార్సీపీకి ఆదరించి అండగా నిలవాలని విజ్ఞప్తిచేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఉరుకుందలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. చంద్రబాబు పుట్టుకతోనే అబద్ధాలు నేర్చుకున్నాడని, అలాంటి వ్యక్తిపట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మామ ఎన్టీఆర్కే వెన్నుపోటు పొడిచిన మహా ఘనుడని విమర్శించారు. ఇప్పటి వరకు హామీలు ఇస్తున్నారు తప్పితే మొదటి సంతకం ఫలానా ఫైలుపై పెడతానని కచ్చితంగా చెప్పలేని అయోమయ స్థితిలో ఆయన ఉన్నారన్నారు. నియోజకవర్గంలో ఆ పార్టీ టికెట్ ఎవరికి వస్తుందో ఇప్పటికీ తెలియని పరిస్థితి ఉందని, అలాంటిది తిక్కారెడ్డి మొన్న ఆ పార్టీలో చేరి అప్పుడే తమపై విమర్శలు చేయడం బాధాకరమన్నారు. రేడియో మెకానిక్గా కాలం వెళ్లదీసిన ఆయన నేడు రూ.50 లక్షల కారులో తిరుగుతున్నాడంటే ప్రజలను ఏ స్థాయిలో మోసం చేశాడో అర్థం చేసుకోవచ్చన్నారు. సారా, లిక్కర్ సంపాదన, నిధులు తీస్తానంటూ ప్రజల్ని మోసం చేసిన సంఘటనలను జనం మరిచిపోలేదన్నారు. తమకు పూర్వీకుల నుంచి ఆస్తులున్నాయని, ప్రజలకు ఇవ్వడం తప్ప దోచుకోవడం తమ కుటుంబానికి తెలియదన్నారు. ప్రజల పక్షాన నిలిచి నాలుగేళ్లుగా రాష్ట్రవ్యాప్తంగా తిరిగి సమస్యలు తెలుసుకున్న రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా పెట్టుకున్న వైఎస్ జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాల్సిన బాధ్య త ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. వరుసగా అన్ని ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండా మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఆయన గురువారం ఉరుకుంద, ఓబుళాపురం, చిరుతపల్లి, మల్లనహట్టి, కరిణి, తిప్పలదొడ్డి, చూడి, వల్లూరు, గుడికంబాలి, హాల్విలో ప్రచారం నిర్వహిం చారు. జిల్లా అడహక్ కమిటీ సభ్యుడు అత్రితనయగౌడు, మండల క న్వీనరు నాగరాజ్గౌడు, పలువురు నాయకలుపాల్గొన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Today Telugu Horoscope: ఈ రాశివారికి పేరుప్రతిష్ఠలు పెరుగుతాయి
బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్..
10న జిల్లాకు ప్రియాంక గాంధీ రాక
కాంగ్రెస్తోనే కుల వృత్తులకు మహర్దశ
అంతటా యజ్ఞ సహిత యోగా నిర్వహించాలి
ముగిసిన హోం ఓటింగ్
జిల్లా రద్దు అంశంపై ఫోకస్..
మల్లారంలో నేరడిగొండవాసి హత్య
ఎల్లారెడ్డి డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్కు నోటీసులు?
హైదరాబాద్పై కుట్ర
తప్పక చదవండి
- ఉద్యమం అయిపోలే.. మిగిలే ఉంది
- హైదరాబాద్పై కుట్ర
- ల్యాండ్ టైట్లింగ్ బిల్లు ఆశయాలు గొప్పవి
- పోస్టల్ ఓటింగ్లోనూ..టీడీపీ కుట్ర రాజకీయాలు
- 47 డిగ్రీలూ దాటేసింది! రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఎండలు
- కుట్రలెన్ని చేసినా పదేళ్లు మేమే..: సీఎం రేవంత్రెడ్డి
- ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి?: జి.కిషన్రెడ్డి
- ఇంగ్లిష్ మీడియంపై ఇంతలేసి మాటలా?
- మహిళకు ఏటా రూ. లక్ష: రాహుల్ గాంధీ
- టీడీపీ కార్యకర్త దాష్టీకం
Advertisement