breaking news
AUCET
-
ఆసెట్, ఆఈట్ ఫలితాలు విడుదల
ఏయూక్యాంపస్ (విశాఖ తూర్పు): ఆంధ్రవిశ్వవిద్యాలయం, అనుబంధ కళాశాలల్లో పీజీ కోర్సులు, సమీకృత ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, ఆఈట్ ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. గురువారం ఉదయం 11.30 గంటలకు వీసీ ఆచార్య జి.నాగేశ్వరరావు ఫలితాలను విడుదల చేశారు. 14 కోర్సుల్లో ఆంధ్రవిశ్వవిద్యాలయం పరీక్షలు నిర్వహించింది. సైన్స్ కోర్సులో జియాలజీలో 91 మార్కులతో అబ్దుల్ లతీఫ్ టాపర్గా నిలిచాడు. ఆర్ట్స్ కోర్సుల్లో 86 మార్కులతో వాసాగణపతిరావు టాపర్గా నిలిచాడు. ఆరేళ్ల డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్లో తంగిరాల జయశ్రీలక్ష్మీ సావిత్రి టాపర్గా నిలిచారు. ఐదురోజుల్లోనే రికార్డు స్ధాయిలో ఫలితాలు విడుదల చేశామని జి.నాగేశ్వరరావు తెలిపారు. -
ఆసెట్ ఫలితాలు విడుదల
విశాఖపట్నం, న్యూస్లైన్: ఆంధ్ర విశ్వవిద్యాలయం, పీజీ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించిన ఆసెట్, సమీకృత ఇంజనీరింగ్ ఏయూ ఈఈటీ 2014 కోర్సుల ప్రవేశ పరీక్ష ఫలితాలను గురువారం ఏయూ అకడమిక్ సెనేట్ మందిరంలో వీసీ ఆచార్య జి.ఎస్.ఎన్.రాజు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం నుంచి పరీక్షల విధానాన్ని సరళం చేశామన్నారు. దరఖాస్తులను ఆన్లైన్లో స్వీకరించి, పరీక్షలను కుదించి తొమ్మిది విభాగాలుగా మాత్రమే నిర్వహించామని చెప్పారు. జూన్ 7వ తేదీ నుంచి ఆన్లైన్ కౌన్సెలింగ్ జరగనుందని తెలిపారు. ర్యాంక్ కార్డులు, కౌన్సెలింగ్ విధానం, తేదీలు తదితర వివరాలను www.andnrauniversity.edu.in, www.audoa.in వెబ్సైట్లో చూడాలని సూచించారు.