breaking news
the arts
-
యువ నాటక తరంగం...
ఆదరణ తగ్గుతున్న కళకు అండగా సామాజిక రుగ్మతలే ఇతివృత్తాలుగా... ‘ఉయ్ మూవ్ థియేటర్’తో {పజల ముందుకు వెండితెర, బుల్లితెరల మధ్య నాటక రంగం నలిగిపోయింది. కోట్ల రూపాయల సెట్టింగుల తళుకుల ముందు నాటకాలనే నమ్ముకున్న కళాకారులు కనిపించకుండా పోయారు. పబ్లు, డిస్కోలు, నైట్పార్టీలు వీటన్నింటితో గజి‘బిజీ’గా తయారైన నేటి యువతకు ఈనాటి కళలన్నింటికి ఆ నాటక రంగమే ఆసరాగా నిలిచిందన్న నిజం తెలియకుండా పోయింది. అందుకే ప్రస్తుతం ఎక్కడో, ఏ పండక్కో పబ్బానికో తప్ప నాటకాలు కనిపించడం లేదు. ఇక బెంగళూరు లాంటి మెట్రో నగరాల్లో వీ టి ఊసేలేదు. అయితే కళ తగ్గుతున్న నాటకరంగానికి సరికొత్త మెరుగులద్దడానికి నగరంలోని కొంత మంది యువకులు ఉద్యమించారు. వృత్తి పరంగా సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, డాక్టర్లుగా స్ధిరపడ్డా ప్రవృత్తిగా నాటకాలను ఎంచుకున్నారు. ఆదరణ తగ్గుతున్న నాటకాలకు ఆసరాగా నిలబడి ‘ఉయ్ మూవ్థియేటర్’ సంస్ధను స్ధాపించారు. ఏడేళ్లుగా నాటక రంగానికి తమ సేవలందిస్తున్న ‘ఉయ్ మూవ్ థియేటర్’ గురించి... - సాక్షి, బెంగళూరు కళారంగంపై అభిమానంతో.... బెంగళూరులోని ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న అభిషేక్ నరేన్కి చిన్నప్పటి నుంచి స్టేజి మీద నటించడం ఇష్టంగా ఉండేది. ఆ ఇష్టం ఆయనతో పాటే పెరిగింది. కాలేజీలో కూడా అనేక నాటకాలు ప్రదర్శించిన అనంతరం సాఫ్ట్వే ర్ ఇంజినీర్గా స్ధిరపడ్డారు. అయితే నాటకాలపై ఉన్న మమకా రం తగ్గకపోవడంతో ఏడేళ్ల క్రితం ‘ఉయ్ మూవ్ థియేటర్’ సంస్ధను ప్రారంభించాడు. నాటకాలంటే ఇష్టం ఉన్న అతని స్నే హితులు రంగరాజ్, డాక్టర్ సోహన్ జత కలిశారు. అప్పటి నుంచి వీరు కలిసి సొంతంగా నాటకాలు రాయడం, వాటికి ద ర్శకత్వం వహించడం వంటివి చేస్తూ వస్తున్నారు. వీరి ప్రయత్నం మెచ్చిన యువతీ యువకులు ‘ఉయ్ మూవ్ థియేటర్’ లో చేరారు. ప్రస్తుతం ఈ సంస్థలో 200 మందికి పైగా కళాకారులు నాటక రంగాన్ని నిలబెట్టడం కోసం శ్రమిస్తున్నారు. స్ఫూర్తిని కలిగించే నాటకాలకే తొలి ప్రాధాన్యం.... ఉయ్ మూవ్ థియేటర్ను స్ధాపించిన ఈ ఏడేళ్లలో మొత్తం 50 నాటకాలను ప్రదర్శించారు. వీటన్నింటిలో సామాజిక రుగ్మతలపై ప్రజల్లో అవగాహనను పెంచే నాటకాలకే సంస్ధ సభ్యులు మొదటి ప్రాధాన్యాన్ని కల్పించారు. పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలు, భూగర్భ జలాలను పెంపొందించడం, వరకట్న దురాచారం వంటి వాటన్నింటి పై ఉయ్ మూవ్ థియేటర్ సభ్యులు నాటకాలను ప్రదర్శిం చారు. వీరు ప్రదర్శించిన నాటకాల్లో ‘మాల్గుడి డేస్’కి ఎక్కువ జనాదరణ లభించింది. అంతేకాదు నగర జీవితంలోని ఆధునిక పోకడలు, తద్వారా కలుగుతున్న నష్టాలను వివరించేలా వీరు రూపొందించిన ‘నమ్మ మెట్రో ఫేజ్-2’ నాటిక సైతం ఎంతో ప్రజాదరణను పొందింది. ఇక మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వరకట్న దురాచారానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చేందుకు గాను వీధి నాటికలను (స్ట్రీట్ప్లే) సైతం ‘ఉయ్ మూవ్ థియేటర్’ సభ్యులు ప్రదర్శిస్తున్నారు. ఇదిలాఉండగా ఇప్పుడిప్పుడే కాఫీడే వంటి కార్పొరేట్ సంస్థలు వీకెండ్లో ఈ సంస్థ ద్వారా ప్రదర్శనలు ఇప్పి స్తూ తమ వినియోగదారులకు మనోరంజకాన్ని కలిగిస్తున్నాయి. అవార్డులు వెతుక్కుంటూ వచ్చాయి... ఓ మహాయజ్ఞంలా నాటకాలను ప్రదర్శిస్తున్న ‘ఉయ్ మూవ్ థియేటర్’ సభ్యులను ఎన్నో అవార్డులు, రివార్డులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇటీవల ఆస్ట్రేలియాకు చెందిన ఓ నాటక రంగ సంస్థ ‘షార్ట్, స్వీట్ థియేటర్ ఫెస్టివల్’ పేరుతో నిర్వహించిన నాటకాల పోటీల్లో ‘బెస్ట్ ఇండిపెండెంట్ థియేటర్ కంపెనీ’ అవార్డును ఈ సంస్ధ సొంతం చేసుకుంది. ఇంగ్లీష్ నవల ఆధారంగా రూపొందిన ‘మిర్రర్ మిర్రర్’ నాటకాన్ని సైతం భారతదేశంలో మొట్టమొదటి సారిగా ప్రదర్శించిన ఘనత ఈ సంస్థకే దక్కుతుంది. మనలోని మంచి చెడులను అద్దం మనకు తెలియజెబితే ఎలా ఉంటుంది అన్న ఊహ తో రూపకల్పన చేసినదే మిర్రర్ మిర్రర్. ఈ నాటకానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి అవార్డులెన్నో లభించాయి. ప్రొడక్షన్ ఖర్చుకు మాత్రమే వసూలు ‘నాటక రంగంపై ఉన్న మక్కువతోనే ఈ సంస్ధను ప్రారంభిం చాను తప్ప వాణిజ్య పరంగా ఏదో లాభపడాలని కాదు. అం దుకే మా నాటకాలకు అయ్యే ప్రొడక్షన్ ఖర్చుకు సరిపోయేం త మొత్తాన్ని మాత్రమే టికెట్ల రూపంలో వసూలు చేస్తాం. ఒక్కొసారి మా టీం సభ్యులమే కాక కొంతమంది ఫుల్టైమ్ నటులను కూడా మా ప్రదర్శనల కోసం పిలుస్తుంటాం. వారి కి అవసరమైన ఖర్చులను కూడా ప్రొడక్షన్ మొత్తం నుంచే భరి స్తాం. అందుకే మేం ప్రదర్శించే నాటకాలకు సంబంధించిన టికెట్ ధర నామమాత్రంగా ఉంటుంది. ఆనాటి కళ ఎన్నటికీ మరుగుపడిపోకూడదన్నదే మా ఆశయం.’ - రంగరాజ్, ‘ఉయ్ మూవ్ థియేటర్’ వ్యవస్థాపకృబంద సభ్యుడు నాటక రంగంపై ఆసక్తి ఉండి ‘ఉయ్ మూవ్ థియేటర్’లో సభ్యులుగా చేరాలనుకునే వారు www.wemovetheatre.in, register@-wemovetheatre.in లలో లాగిన్ అయి వివరాలను తెలుసుకోవచ్చు. -
‘నామినేటెడ్’ జాబితాపై గవర్నర్ అభ్యంతరం!
అభ్యర్థుల రాజకీయ నేపథ్యమే కారణం కొత్త జాబితా ఇవ్వాలని సూచన సాక్షి ప్రతినిధి, బెంగళూరు : శాసన మండలికి ఐదుగురు సభ్యులను నామినేట్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన సిఫార్సులపై గవర్నర్ హెచ్ఆర్. భరద్వాజ్ అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. జాబితాను పునఃపరిశీలించాల్సిందిగా సలహా ఇచ్చినట్లు సమాచారం. కళలు, సాహిత్యం, సామాజిక సేవ, విద్య, వైద్య, క్రీడలు తదితర రంగాలకు చెందిన వారిని ఎగువ సభకు నామినేట్ చేయడం ఆనవాయితీ కాగా ప్రభుత్వం సమర్పించిన జాబితాలో నలుగురు రాజకీయ నాయకులు ఉండడంపై గవర్నర్ ఆక్షేపణ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. నటి జయమాల మినహా ఉగ్రప్ప, ఇక్బాల్ అహ్మద్ సరడగి, శాంత కుమార్, అబ్దుల్ జబ్బార్లకు కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష సంబంధాలున్నాయి. దీనిపై బీజేపీ రాష్ర్ట శాఖ కేంద్ర హోం మంత్రికి ఫిర్యాదు చేయగా, ఈ విషయంలో నింపాదిగా వ్యవహరించాలని గవర్నర్కు అక్కడి నుంచి సలహాలు అందినట్లు తెలిసింది. ఈ నెల 29న రిటైర్ కానున్న గవర్నర్, ఆఖరి నిముషాల్లో ఆత్రుతగా వ్యవహరించారనే అపవాదును మూట కట్టుకోకూడదనే ఉద్దేశంతో ఉన్నారు. జాబితాను ఆమోదింపజేసుకోవడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఎంతగా ప్రయత్నించినా, ఆయన సమ్మతించ లేదని సమాచారం. వేరే పేర్లతో కొత్త జాబితాను పంపించాలని సూచించినట్లు తెలిసింది. కాగా నెల కిందట ఏర్పడిన ఖాళీలో అబ్దుల్ జబ్బార్ నామినేటెడ్ సభ్యుడుగా నియమితులయ్యారు. ఆయనను తిరిగి నామినేట్ చేయాలని సిఫార్సు చేయడం కూడా వివాదాస్పదమవుతోంది. హోం మంత్రితో గవర్నర్ భేటీ రాష్ట్ర గవర్నర్ బుధవారం ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ తాను ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. మంగళవారం ఆయన రాజీనామా చేశారని వదంతులు వ్యాపించిన సంగతి తెలిసిందే. -
‘ఎన్టీఆర్ కళారత్న’ అవార్డు స్థాపన
కళారంగంలో విశేష కృషి చేసిన వారికి అందజేయనున్న అఖిల కర్నాటక కమ్మవారి సంఘం వచ్చే విద్యా ఏడాది నుండి ఫైన్ ఆర్ట్స్ చదివే పేదవిద్యార్థులకు స్కాలర్షిప్లు 23న ఎన్టీఆర్ క్యాలండర్ విడుదల, అక్కినేనికి శ్రద్ధాంజలి సాక్షి, బెంగళూరు : కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో కళారంగంలో విశేష కృషి చేసిన వారికి ‘ఎన్టీఆర్ కళారత్న’ అవార్డుకు ఎంపిక చేసి సత్కరించనున్నట్లు అఖిల కర్ణాటక కమ్మవారి సంఘం వెల్లడించింది. ఈ ఏడాది నుంచే ఈ అవార్డును అందించనున్నట్లు తెలిపింది. శుక్రవారమిక్కడ నిర్వహించిన విలేకరుల సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి డి.వి.శేఖర్ మాట్లాడుతూ...పేద కళాకారులకు చేయూతనందించేందుకు, కళామతల్లికి విశేష సేవ చేసిన నందమూరి తారక రామారావు పేరిట ఈ అవార్డును నెలకొల్పినట్లు చెప్పారు. అవార్డులో భాగంగా రూ.10వేల నగదు పురస్కారాన్ని అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఫైన్ ఆర్ట్స్ చదివే పది మంది నిరుపేద విద్యార్థులకు వచ్చే విద్యా సంవత్సరం నుండి స్కాలర్షిప్లు అందజేయనున్నట్లు తెలిపారు. వారి చదువుకు అయ్యే పూర్తి ఖర్చును సంస్థ తరఫున భరించనున్నట్లు చెప్పారు. అనంతరం సంఘం అధ్యక్షుడు గారపాటి రామకృష్ణ మాట్లాడుతూ... ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా తమ సంఘం తరఫున ఎన్.టి.ఆర్ చిత్రాలతో కూడిన ప్రత్యేక క్యాలండర్ను ఈ నెల 23న ఔటర్రింగ్ రోడ్లోని నందన హోటల్లో ఎమ్మెల్యే మునిరత్నం నాయుడు ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. విలేకరుల సమావేశంలో సంఘం ఉపాధ్యక్షుడు కె.సురేష్బాబు, యువజన అధ్యక్షుడు జి.జగన్మోహన్ పాల్గొన్నారు.