breaking news
Anantnag Attack
-
తీవ్ర ఉద్వేగానికి లోనైన గంభీర్
► జోలపాటతో ఆమెను నిద్రపుచ్చలేను న్యూఢిల్లీ: టీమిండియా ఓపెనింగ్ బ్యాట్స్మెన్ గౌతమ్ గంభీర్ మరోసారి తన ఔనత్యాన్ని చాటుకున్నారు. మైదానంలో ఎంత దూకుడుగా వ్యవహరిస్తారో, వ్యక్తిగా తాను చేసే పనుల్లో ఎప్పుడూ ఓ మెట్టు ఎదుగుతుంటారు గంభీర్. తాజాగా ఆయన ప్రకటించిన ఓ నిర్ణయమే ఇందుకు కారణం. ఉగ్రదాడిలో మృతిచెందిన అధికారి అబ్దుల్ రషీద్. తండ్రి కోసం ఏడుస్తున్న కూతురు జోహ్రా ఫొటోపై స్పందిస్తూ మనస్సుకు హత్తుకునే పోస్ట్ చేశారు గంభీర్. 'జోహ్రా, జోలపాట పాడి నేను నిన్ను నిద్రపుచ్చలేను. కానీ నువ్వు నీ జీవిత లక్ష్యాలను సాధించుకునేందుకు మాత్రం చేతనైన సాయం చేయగలను. నీ చదువు బాధ్యతలను జీవితాంతం చూసుకుంటానని' గంభీర్ ఓ ట్వీట్లో రాసుకొచ్చారు. 'నీ కన్నీటి బొట్టును నేలకు రాలనివ్వకు. నీ కన్నీటిబొట్టు తాకగానే భూమాత గుండె బరువెక్కుతోంది. ఉగ్రవాదులతో పోరాడి అమరుడైన నీ తండ్రి అబ్దుల్ రషీద్కు ఇదే నా సెల్యూట్' అంటూ అందరిని కదిలించే విధంగా ట్విట్ చేశారు గంభీర్. గత ఆగస్ట్లో జమ్ముకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో ఏఎస్ఐ అబ్దుల్ రషీద్ మృతిచెందిన విషయం తెలిసిందే. గత ఏప్రిల్లో ఐపీఎల్ లో తన జట్టు కోల్కతా నైట్ రైడర్స్ ద్వారా అందుకున్న పారితోషికాన్ని సుక్మా ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్పీఎఫ్ జవాన్ల కుటుంబాలకు అందజేసిన విషయం తెలిసిందే. థ్యాంక్యూ గౌతమ్ సార్ తనకు సాయం చేస్తానని చెప్పిన క్రికెటర్ గౌతమ్ గంభీర్కు జవాను కూతురు జోహ్రా థన్యవాదాలు తెలిపింది. 'మీ ప్రకటనపై నాతో పాటు మా కుటుంబం ఎంతో సంతోషంగా ఉంది. డాక్టర్ కావాలన్నదే నా ధ్యేయమని' జోహ్రా చెప్పింది. Zohra,I can't put u 2 sleep wid a lullaby but I'll help u 2 wake up 2 live ur dreams. Will support ur education 4 lifetime #daughterofIndia pic.twitter.com/XKINUKLD6x — Gautam Gambhir (@GautamGambhir) 5 September 2017 Zohra,plz don't let those tears fall as i doubt even Mother Earth can take d weight of ur pain. Salutes to ur martyred dad ASI,Abdul Rashid. pic.twitter.com/rHTIH1XbLS — Gautam Gambhir (@GautamGambhir) 5 September 2017 -
కరుడుగట్టిన ఉగ్రవాది ఖతం!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్ ముగిసింది. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతిచెందిన ఉగ్రవాదుల్లో లష్కర్ కమాండర్ బషీర్ లష్కరీ ఉండటం భద్రతా దళాలకు పెద్ద విజయమని చెప్పవచ్చు. ఇటీవల ఆరుగురు పోలీసులను పొట్టనబెట్టుకున్న ఉగ్రవాద దాడి వెనుక ప్రధాన సూత్రధారి బషీరే! అనంత్నాగ్ జిల్లాలోని బాట్పూర గ్రామంలో ఇద్దరు ఉగ్రవాదులు నక్కారన్న సమాచారంతో భద్రతా దళాలు రంగంలోకి దిగాయి. దీంతో సుదీర్ఘంగా కొనసాగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు పౌరులు కూడా మృతిచెందారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఓ ఇంట్లో నక్కిన ఉగ్రవాదులు స్థానికులను మానవ కవచంగా వాడుకొని తప్పించుకోవాలని చూశారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు చాకచక్యంగా ఆ ఇంటినుంచి 17మందిని సురక్షితంగా కాపాడారు. అయితే, ఈ ఆపరేషన్లో ఓ 44 ఏళ్ల మహిళ (తాహిర్ బేగం), ఓ 21 ఏళ్ల యువకుడు (షాదాబ్ అహ్మద్ చోపన్) ప్రాణాలు విడిచారు. ఇక ఈ ఆపరేషన్లో చనిపోయిన బషీర్ లష్కరీ లష్కరే తోయిబాకు చెందిన టాప్ ఉగ్రవాది. పోలీసు అధికారి ఫీరోజ్ దార్, మరో ఐదుగురు పోలీసులపై దాడి చేసి చంపిన ఘటన వెనుక బషీర్ ప్రధాన సూత్రధారి అని భావిస్తున్నారు. బషీర్ ఎన్కౌంటర్ విజయవంతంగా పూర్తిచేయడంపై జమ్మూకశ్మీర్ డీజీపీ ఎస్పీ వైద్ పోలీసులు, భద్రతా దళాలకు అభినందనలు తెలిపారు.