-
వేదికపైనే కన్నీరు పెట్టుకున్న హీరో సూర్య
-
వేదికపైనే కన్నీరు పెట్టుకున్న హీరో సూర్య
చెన్నై : స్టార్ హీరో సూర్య కేవలం నటుడిగానే కాకుండా.. ఇతరులకు సాయం చేయడంలో ముందుంటారనే సంగతి తెలిసిందే. అగరం ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు చదువు చెప్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. గత పదేళ్లుగా ఆయన ఈ ఫౌండేషన్ను నిర్వహిస్తున్నారు. ఇటీవల చెన్నైలో అగరం ఫౌండేషన్ తరఫున రెండు పుస్తకాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా గాయత్రి అనే అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను.. తన చదువుకు అగరం ఫౌండేషన్ ఎలా సహాయం చేసిందో వివరించారు. ‘మాది తంజావూరులోని ఓ చిన్న పల్లెటూరు. పదో తరగతి వరకు ఊర్లోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాను. అమ్మ దినసరి కూలీగా పనిచేసేది. నాన్న క్యాన్సర్తో బాధపడుతుండేవారు. అయితే పదో తరగతి పూర్తయ్యాక.. ఇంట్లో పరిస్థితుల దృష్ట్యా కూలీ పనికి పోతానని అమ్మకు చెప్పాను. కానీ అమ్మ మాత్రం మా లాగా నువ్వు కష్టపడకూడదు.. బిచ్చమెత్తుకోని అయిన నిన్ను చదివిస్తానని చెప్పింది. ఆ తర్వాత నేను అగరం ఫౌండేషన్లో చేరాను. కానీ ఆ తర్వాత కొద్ది రోజులకే నాన్న చనిపోయారు. అప్పుడు చదువు మానేద్దామని అనుకున్నాను. కానీ అమ్మ నీ కోసం నువ్వు చదవాలని చెప్పింది. చాలా మంది ఇక్కడ నన్ను ఎగతాళి చేశారు. అగరం సాయంతో కాలేజీ విద్యను పూర్తిచేశాను. ఆ తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్లో ఉద్యోగం వచ్చింది. నా జీవితంలో వెలుగులు నింపిన అగరానికి, సూర్య అన్నకు కృతజ్ఞత తెలుపుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను’ అని గాయత్రి తెలిపారు. అయితే గాయత్రి తన కథ చెబుతున్న సమయంలో వేదికపైనే ఉన్న సూర్య భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటిని ఆపుకోలేకపోయారు. గాయత్రి వద్దకు వచ్చి అప్యాయంగా పలకరించడంతో పాటు ఆమెను ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీంతో అభిమానులు సూర్యపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సూర్య మాట్లాడుతూ.. అగరం ఫౌండేషన్కు తోడుగా నిలుస్తున్న వాలంటీర్లకు, దాతలకు, పలు విద్యాసంస్థలకు ధన్యవాదాలు తెలిపారు. -
50, 60 కథలు విన్నాను కానీ..
తమిళసినిమా: తన అగరం ఫౌండేషన్ ద్వారా పలువురికి విద్యాదానం చేస్తున్న నటుడు సూర్య. హీరోగా ప్రముఖ స్థానంలో కొనసాగుతున్న ఈయన ఇప్పుడు నిర్మాతగానూ రాణించాలన్న నిర్ణయంతో 2డి ఎంటర్టెయిన్మెంట్స్ సంస్థను ప్రారంభించారు. తొలి ప్రయత్నంగా తన భార్య ప్రధాన పాత్రలో నటించిన 36 వయదినిలే చిత్రాన్ని నిర్మించి విజయం సాధించారు. తాజాగా పాండిరాజ్ దర్శకత్వంలో పసంగ-2 చిత్రం, తాను హీరోగా మలయాళ దర్శకుడు విక్రమన్ దర్శకత్వంలో 24 చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీటిలో పసంగ-2 చిత్రం ఈనెల 27న తెరపైకి రానుంది. ఈ చిత్రం గురించి సూర్య మాట్లాడుతూ విద్య, బాలల ఇతివృత్తాలతో మంచి చిత్రాలు నిర్మించాలన్న ఉద్దేశంతో తన పిల్లలు దియా, దేవ్ పేర్లు కలిసే విధంగా 2డి ఎంటర్టెయిన్మెంట్ అనే చిత్ర నిర్మాణ సంస్థను ప్రారంభించానన్నారు. ఈ సంస్థలో చిత్రం చేయడానికి సుమారు 50, 60 కథలు విన్నా మంచి కథ అమరలేదన్నారు. అలాంటి సమయంలో దర్శకుడు పాండిరాజ్ ఒక సీడీ ఇచ్చి ఇలాంటి కథతో మీ సంస్థలో చిత్రం చేస్తే బాగుంటుందని అన్నారన్నారు. బాలల గురించి ఆయన రెండేళ్ళు పరిశోధన చేసి తయారు చేసిన కథ అదని తెలిపారు. ఇలాంటి కథతో చిత్రం చేయాలన్నది తన ఉద్దేశం కావడంతో పసంగ-2 చిత్రాన్ని నిర్మించినట్లు వెల్లడించారు. ఇందులో పలువురు బాలబాలికలు ప్రధాన పాత్రలు పోషించారని చెప్పారు.తాను ఒక సాధారణ వ్యక్తిగా నటించినట్లు తెలిపారు. చిత్రం చూసిన ప్రేక్షకులు ఒక మంచి ప్రయోజనకరమైన అంశాన్ని గ్రహిస్తారని సూర్య పేర్కొన్నారు. అమలాపాల్, బింధుమాదవి ముఖ్యపాత్రల్ని పోషించిన పసంగ-2 చిత్రం ఈ నెల 27 తెరపైకి రానుంది. సూర్య హీరోగా నటిస్తున్న 24 చిత్రం ఫస్ట్లుక్ పోస్టర్లను ఈ నెల 24న విడుదల చేయనున్నారు.
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
మే 19కల్లా అండమాన్కు రుతుపవనాలు
నాన్నను బతికుండగానే కాలం చేయమని కోరా!: నటుడు
ఓటు హక్కు వినియోగించుకున్న యాంకర్ శ్యామల కుటుంబ సభ్యులు
పోలింగ్ బూతును పరిశీలించిన వైఎస్సార్సీపీ అభ్యర్థులు
తెలంగాణలో పోలింగ్ శాతం పెరిగింది: సీఈవో వికాస్రాజ్
ఓటు హక్కు వినియోగించుకున్న వల్లభనేని వంశీ ఫ్యామిలీ
ఎమ్మెల్యే రాజాసింగ్పై కేసు నమోదు
నార్వే కంపెనీతో హైదరాబాద్ సంస్థ ఒప్పందం
కుటుంబ సభ్యులతో తన ఓటు హక్కు వినియోగించుకున్న కొడాలి నాని
ఈసీ అధికారిక ప్రకటన ఇప్పటి వరకు నమోదైన పోలింగ్ శాతం
తప్పక చదవండి
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- నాలుగో దశ ఎలక్షన్స్.. ప్రధాని మోదీ సందేశం
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement