
ఎడ్జ్బాస్టన్ టెస్ట్లో టీమిండియా చారిత్రక విజయం సాధించింది.

చివరి రోజు వరకు సాగిన ఈ మ్యాచ్లో భారత్ 336 పరుగుల తేడాతో ఇంగ్లండ్ను చిత్తు చేసింది.

ఎడ్జ్బాస్టన్లో భారత్కు ఇదే తొలి విజయం. ఈ వేదికపై భారత్ ఈ మ్యాచ్కు ముందు వరకు ఒక్క విజయం కూడా సాధించలేదు.

8 మ్యాచ్ల్లో ఏడింట ఓడి, ఓ మ్యాచ్ డ్రా చేసుకుంది.

రెండో ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్ 6 వికెట్లు తీసి ఇంగ్లండ్ ఇన్నింగ్స్ను కుప్పకూల్చాడు.

తొలి ఇన్నింగ్స్ 4 వికెట్లు తీసిన ఆకాశ్దీప్ మ్యాచ్లో 10 వికెట్ల ఘనత కూడా సాధించాడు.

ఆకాశ్కు కెరీర్లో ఇదే తొలి 5, 10 వికెట్ల ప్రదర్శన

అంతకుముందు శుభ్మన్ గిల్ బ్యాటింగ్లో చెలరేగి తొలి ఇన్నింగ్స్లో డబుల్ సెంచరీ, సెకెండ్ ఇన్నింగ్స్లో సెంచరీ చేశాడు.

టీమిండియా కెప్టెన్గా గిల్కు ఇదే తొలి విజయం.

తొలి ఇన్నింగ్స్లో సిరాజ్ కూడా ఆరు వికెట్ల ప్రదర్శన నమోదు చేశాడు.




