కార్లో కళ్లు చెదిరే బంగారం.. 2.85 కోట్ల డబ్బులు | Rs 2.85 crore, 15 kg gold seized | Sakshi
Sakshi News home page

కార్లో కళ్లు చెదిరే బంగారం.. 2.85 కోట్ల డబ్బులు

Aug 25 2015 5:19 PM | Updated on Sep 3 2017 8:07 AM

కార్లో కళ్లు చెదిరే బంగారం.. 2.85 కోట్ల డబ్బులు

కార్లో కళ్లు చెదిరే బంగారం.. 2.85 కోట్ల డబ్బులు

రోజువారి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు భారీ మొత్తంలో సొమ్మును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

మలప్పురం(కేరళ): రోజువారి తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు భారీ మొత్తంలో సొమ్మును, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒకే కారులో దాదాపు రెండున్నర కోట్ల రూపాయలు, 15 కేజీల బంగారం చూసి ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ ఘటన కేరళలోని పెరింతల్ మన్నా అనే ప్రాంతంలో చోటుచేసుకుంది.

ఈ వివరాలు పోలీసులు తెలియజేస్తూ తాము ప్రతి రోజు వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఐదుగురు వ్యక్తులతో అనుమానంగా వస్తున్న ఓ కారు తమ కంట పడిందని, దానిని ఆపి తనిఖీలు చేయగా కళ్లు చెదిరే రీతిలో బంగారం, డబ్బులు కనిపించాయని తెలిపారు. దాని గురించిన వివరాలు సంబంధిత వ్యక్తులు తెలియజేయలేకపోయినందున వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement