'ఢిల్లీ పోలీసులు ప్రజల కోసం పనిచేయటం లేదు' | Arvind Kejriwal slams Delhi Police, sits on dharna | Sakshi
Sakshi News home page

'ఢిల్లీ పోలీసులు ప్రజల కోసం పనిచేయటం లేదు'

Jan 20 2014 2:31 PM | Updated on Sep 2 2017 2:49 AM

'ఢిల్లీ పోలీసులు ప్రజల కోసం పనిచేయటం లేదు'

'ఢిల్లీ పోలీసులు ప్రజల కోసం పనిచేయటం లేదు'

ఢిల్లీ పోలీసులపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ధ్వజమెత్తారు. సామాన్య ప్రజల కోసం ఢిల్లీ పోలీసులు పనిచేయటం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

న్యూఢిల్లీ : ఢిల్లీ పోలీసులపై ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి ధ్వజమెత్తారు. సామాన్య ప్రజల కోసం ఢిల్లీ పోలీసులు పనిచేయటం లేదని ఆయన వ్యాఖ్యానించారు. విధి నిర్వహణలో అలసత్వం వహించడంతో పాటు, మంత్రులను కూడా ధిక్కరించినందుకు ఢిల్లీ పోలీసులపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కేజ్రీవాల్ కేంద్ర హోంశాఖ కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఢిల్లీలో మహిళలు అభద్రతకు గురువుతుంటే తాను మౌనంగా ఉండలేనన్నారు. రిపబ్లిక్ దినోత్సవానికి అవాంతరాలు ఏర్పడితే దానికి కేంద్రానిదే బాధ్యత అని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement